
మాధవన్
‘సఖి’ సినిమాతో లవర్బాయ్లా యూత్ సెన్సేషన్ అయ్యారు హీరో మాధవన్. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ తన ట్రాక్ మార్చుకున్నారు. డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు మాధవన్. అయితే ఇప్పుడు మళ్లీ ఓ లవ్ స్టోరీలో యాక్ట్ చేయనున్నారు మ్యాడీ. కొత్త దర్శకుడు దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘మారా’ చిత్రంలో రొమాంటిక్ హీరోగా దర్శనం ఇవ్వనున్నారట. ‘విక్రమ్ వేదా’లో మాధవన్ సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులోనూ జోడీగా కనిపించనున్నారు.