నాలో వసంతరాగం | Naalo Vasantha Raagam is an upcoming Telugu film | Sakshi
Sakshi News home page

నాలో వసంతరాగం

Aug 6 2013 1:35 AM | Updated on Sep 1 2017 9:40 PM

నాలో వసంతరాగం

నాలో వసంతరాగం

ఆదిత్య ఓం, మధుశర్మ, ప్రశాంతి హీరో హీరోయిన్లుగా కోట నరసింహమూర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో వసంతరాగం’. కీ.శే. అల్లేపల్లి ప్రభాకర్ ఆశీస్సులతో అల్లేపల్లి రోజారాణి నిర్మించారు.

ఆదిత్య ఓం, మధుశర్మ, ప్రశాంతి హీరో హీరోయిన్లుగా కోట నరసింహమూర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో వసంతరాగం’. కీ.శే. అల్లేపల్లి ప్రభాకర్ ఆశీస్సులతో అల్లేపల్లి రోజారాణి నిర్మించారు. మరో వారంలో ఈ చిత్రం పాటలను విడుదల చేయనున్నారు.
 
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మనసు, మమతల ఆరాటం, ప్రేమా పెళ్లి మధ్య  పోరాటం నేపథ్యంలో రెండు హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. 
 
 ఇందులో ఉన్న ఐదు పాటలకు జయసూర్య మంచి స్వరాలిచ్చారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పా రు. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్రనిర్మాణ సారథి అల్లేపల్లి విక్రమ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement