
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన గీతాంజలి చిత్రం నాగార్జునకు మంచి క్రేజ్ను తెచ్చిపెట్టింది. టాలీవుడ్లో మూసపద్ధతిలో వస్తున్న చిత్రాలకు విరుద్ధంగా గీతాంజలి తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు. సాధారణంగా ఇలాంటి విషాద ముగింపు ఉన్న సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ గీతాంజలి అందుకు భిన్నంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ సినిమాలో పతాక సన్నివేశంలో వచ్చే ముద్దు సీన్.. ఈ చిత్రానికి గుండెకాయ లాంటిది. అలాంటి ఈ సన్నివేశాన్ని ఎక్కడ తీసేస్తారో అని మన్మథుడు తెగ కంగార పడ్డారట. ఈ విషయాన్ని నేరుగా నాగార్జునే వెల్లడించాడు.
ఇటీవలె ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఎక్కువ నిడివితో ఉన్న ముద్దు సన్నివేశమే సినిమకు ప్రాణం. దాన్ని సెన్సార్ బోర్డు తీసివేస్తుందేమోనని భయపడ్డాను. నా తండ్రితో కూడా ఈ విషయాన్ని చెప్పాను. సినిమా చూసిన తర్వాత ఈ చిత్రం మొత్తానికి ఇదే హైలెట్ అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సన్నివేశాన్ని వాళ్లు తొలగించరని భరోసా ఇచ్చారు. నాన్న చెప్పినట్టుగానే వారు ముద్దు సన్నివేశాన్ని తొలగించలేదు’ అంటూ గీతాంజలిని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం నాగ్ ‘మన్మథుడు-2’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment