Geethanjali
-
"దుర్మార్గులు ట్రోల్ చేసి చంపేశారు" సీఎం జగన్ ఎమోషనల్..!
-
పెళ్లి వార్తలపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా ఐదుసార్లు!
టాలీవుడ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గీతాంజలి. హారర్ థ్రిల్లర్గా వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రీలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. పెళ్లి రూమర్స్పై అంజలి స్పందిస్తూ.. ' ఇప్పటికే నాకు తెలియకుండా నాలుగుసార్లు పెళ్లి చేశారు. మళ్లీ ఐదోసారి కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేను కూడా చూశా. ఏకంగా పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని ఏంటంటే.. నేను అవుట్ డోర్ షూటింగ్స్లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. కానీ నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. అది ఇప్పుడైతే కాదు. దానికి ఇంకా టైముంది' అని చెప్పుకొచ్చింది. కాగా.. గీతాంజలి మళ్లీ ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. గీతాంజలి.. విశ్వన్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ కనిపించనుంది. అంతే కాకుండా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టితో ఓ చిత్రం నటించనుంది. వీటితో పాటు మరో 6 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. -
గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు చేయమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్తో చంపేశారని అన్నారు. సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినేనని అన్నారు కోన వెంకట్. ఈ వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్త చట్టాలను తేవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారని, జనాన్ని భయపెడుతున్నారని అన్నారు. కాగా తనకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరిందంటూ తెనాలికి చెందిన గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూపై.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలు అసభ్య పదజాలంతో దూషించారు. గీతాంజలి వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనలకు గురైన ఆమె రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. చదవండి: ‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’ -
గీతాంజలి కేసు వేగవంతం...రహస్య ప్రాంతంలో నిందితులు
-
టిడిపి- జనసేన సోషల్ మీడియా సైకో మూకల కిరాతక క్రీడ
-
బోండా ఉమా అనుచరుడే !..గీతాంజలి కేసులో తొలి అరెస్ట్
-
గీతాంజలి కేసులో ఇద్దరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తోంది. దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. ఏపీ పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి.. పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేశారు. గీతాంజలిపై రాంబాబు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్కు తరలించారు. దుర్గారావు అనే మరో వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. చాలామంది పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. స్క్రీన్ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని.. అలాగే పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. -
గీతాంజలి కేసులో దర్యాప్తు ముమ్మరం
-
గీతాంజలి ఘటన పై డాక్టర్ నూరి పర్వీన్ సంచలన కామెంట్స్
-
గీతాంజలి ఘటనపై..విజయసాయి రెడ్డి సీరియస్
-
గీతాంజలి ట్రోల్స్.. తప్పు ఒప్పుకున్న టీడీపీ
-
గీతాంజలి ట్రైన్ వీడియో..అడ్డంగా దొరికిన టీడీపీ
-
గీతాంజలి చివరి వీడియో
-
గీతాంజలి మృతికి సంతాపం క్యాండిల్ ర్యాలీ
-
గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల సాయం ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
వాన్ని వదలొద్దు గీతాంజలి భర్త ఆవేదన
-
గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ తో కట్టుకథ అల్లారు: పూనమ్ కౌర్
టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలను చదించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించారని, ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీయే గెలుస్తుదని ఆమె చెప్పిన మాటలు వైరల్ కావడంతో.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు గీతాజంలిపై అసత్యాలను ప్రచారం చేశారు. ఆమెను ట్రోల్ చేస్తూ మానసికంగా హింసించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషాదాకర ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేసింది. అలాగే ‘జల్సా’ సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించింది. గీతాంజలికి న్యాయం జరగాలి ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు. దయచేసి వారిని శిక్షించండి. ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అవన్నీ పుకార్లు మాత్రమే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులర్ అయ్యారు పూనమ్ కౌర్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్లపై ఆమె చేసే ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి బాగోతాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక నటి పూనమ్ మాత్రమే. అందుకే పవన్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు ఆమెపై ఓ కట్టుకథను కూడా అల్లారు. జల్సా సినిమాలో అవకాశం అడిగే ఇవ్వలేదని.. అందుకే ఆమె వారిద్దరిని టార్గెట్ చేసిందని ప్రచారం చేశారు. (చదవండి: సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?) తాజాగా దీనిపై స్పందించింది పూనమ్ కౌర్. అవన్నీ పూకార్లు మాత్రమేనని.. తాను ఇంత వరకు ఎవ్వరినీ కూడా అవకాశాలు అడుక్కోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన మీద మాత్రమే ఆదారపడకుండా ఎప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతుంటానని చెప్పింది. తాను నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువని, దయచేసి అలాంటి రూమర్స్ నమ్మకండి అని మరోసారి తన అభిమానులను కోరింది పూనమ్. #JusticeForGeetanjali , I was confused about who led her to committing suicide , whether it’s online trollers of a particular party who are truly capable of physiologically abusing a woman or a volunteer who seems to go invisible. Please punish . Young girl kids deserve justice. — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 12, 2024 -
టీడీపీ చేసిన హత్యే ఇది..!
-
మీ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయి: పోతుల సునీత
-
ఆ వీడియో చూసి అ అమ్మ చాలా ఏడ్చింది
-
గీతాంజలి ఆత్మహత్యపై సీఎం జగన్ తీవ్ర విచారం
-
ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: వరుదు కళ్యాణి
-
ప్రధాన కారణం ఆ ఇద్దరే..!
-
అదే గీతాంజలి చేసిన తప్పా? ఎమోషనల్ అయిన రోజా
-
గీతాంజలి ఉదంతం: సీఎం జగన్ విచారం.. రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, అమరావతి: తెనాలి మహిళ గీతాంజలి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన
-
గీతాంజలి పై ట్రోల్ల్స్.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
-
గీతాంజలి పిల్లల బాధ్యత ఎవరిది? కొండా రాజీవ్ ఎమోషనల్
-
AP Police: ‘దిగులొద్దు.. భయపడొద్దు.. భరతం పడతాం’
టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల వేధింపులు కొన్నాళ్లుగా వెర్రి తలలు వేస్తున్నాయి. సొంత వ్యక్తిత్వం, తమవైన అభిప్రాయాలు కలిగి ఉండటం మహానేరం అన్నట్లు కిరాయి మూకలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. పచ్చ మూకల కిరాతకానికి తెనాలి మహిళ గీతాంజలి దారుణంగా బలైపోయింది. అయితే ‘సోషల్ మాఫియా’ దాడులపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.. తాము అండగా నిలబడతామని ఏపీ పోలీసులు భరోసా ఇస్తున్నారు. టీడీపీ-జనసేన సోషల్ మీడియా బ్యాచ్ గత కొంతకాలంగా మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. బెండపూడి స్టూడెంట్ మేఘన, కుమారీ ఆంటీ.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టలు చేశాయి. తాజాగా తెనాలి గృహిణి గీతాంజలి లక్ష్యంగా చేసుకుని తప్పుడు కామెంట్లు చేశాయి. దీంతో ఆమె ప్రాణం తీసుకుంది. అయితే.. ఆన్లైన్లో ఇలాంటి వేధింపులను ఉపేక్షించొద్దని ఏపీ పోలీసులు అంటున్నారు. వీటికి జంకితే మరింత దారుణంగా తెగబడటం ఖాయమని చెబుతున్నారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించడం, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన చట్టాల్ని ప్రస్తావిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని.. బాధితులు నేరుగానే కాకుండా తమ సన్నిహితులు, స్నేహితుల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. ఫిర్యాదు చేయడం ఇలా... ► ట్రోలింగ్కు గురయ్యేవారు, బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు ద్వారా కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. ► సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన వేదికలు.. సైబర్ క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 గీతాంజలి కేసులో నిందితుల గుర్తింపు వైఎస్సార్సీపీ సంక్షేమంతో తనకు చేకూరిన లబ్ధి గురించి సంతోషంగా చెప్పి.. ఆనక టీడీపీ-జనసేనల చేతిలో దారుణంగా ట్రోలింగ్కు గురైంది గీతాంజలి. అతి జుగుప్సాకరమైన పోస్టులు చేశారు ఆమె మీద. అయితే సున్నిత మనస్కురాలైన గీతాంజలి.. ఆ పోస్టులను భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున కన్నుమూసింది. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఆన్లైన్ వేధింపుల కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీడీపీ, పలువురు జనసేన నేతల అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని.. పోస్టులు చేసిన కొందరు పరారీలో ఉన్నారని.. వాళ్లందరినీ పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు. -
భార్యతో తిట్లు తిన్న ప్రముఖ డైరెక్టర్.. వీడియో వైరల్!
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో సెల్వరాఘవన్ ఒకరు. స్టార్ హీరోలందరితో ఆయన పలు సినిమాలు చేశారు. కాదల్ కొండేన్ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే అప్పట్లో సూపర్ హిట్గా నిలిచిన 7/జీ బృందావన కాలనీ హీరోయిన్ను 2006లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఏడాది తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గీతాంజలిని 2011లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజాగా డైరెక్టర్ సెల్వ రాఘవన్ తన భార్యతో గొడవ పడిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన భార్య తిడుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెల్వరాఘవన్ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ సతీమణితో గొడవ పడిన విషయాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో ఎంతటి వారైనా భార్య చేతిలో తిట్లు తప్పవని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో సెల్వ రాఘవన్ కూడా నేనేం చేశాను.. నన్ను ఎందుకు తిట్టావు.. అంటూ ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరలవుతోంది. కాగా.. సెల్వ రాఘవన్ ప్రస్తుతం ధనుష్ చిత్రంలో 'రాయాన్' ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Selvaraghavan (@selvaraghavan) -
'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా!
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్నడు లేని విధంగా ఆడియన్స్కు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఈనెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో శ్మశాన వాటికలో టీజర్ లాంఛ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻 Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju… pic.twitter.com/dAqb09Vddh — Telugu FilmNagar (@telugufilmnagar) February 22, 2024 -
ముద్దు సన్నివేశాల్లో నటించడంపై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం టాలీవుడ్లో కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ..బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సహజంగా వస్తాయని, అందులో నటించక తప్పదన్నారు. అయితే అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుందని, కానీ కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదన్నారు. (చదవండి: రియల్ లైఫ్లో ఒక్కటి కానున్న రీల్ జంట!) ‘ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది..ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాను నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని అంజలి చెప్పారు. (చదవండి: తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్ రాకపోవచ్చు: మహేశ్ బాబు) ఇక తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి స్పందిస్తూ.. ‘కొందరు నా పర్సనల్ విషయాల గురించి ఇష్టానుసారంగా రాసేస్తున్నారు. గతంలో జర్నీ నటుడు జైతో ప్రేమలో ఉన్నానని రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి అయిందని వార్తలు రాశారు. అవన్నీ రూమర్స్ మాత్రమే. వాటిని చూసి నవ్వుకుంటాను తప్ప సీరియస్గా తీసుకొను’అని అంజని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్లో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. 2014లో ఆమె నటించిన గీతాంజలి సీక్వెల్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. వీటితో పాటు పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. -
దేవుడితో సమానంగా ఎన్టీఆర్ ని మొక్కుతా..!
-
పెళ్లి కాకముందే మా ఆయన చిలిపి పనులు చేసేవాడు నాతో..!
-
శోభన్ బాబు నా మీద మనసు పడ్డాడు..!
-
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ప్రముఖ సింగర్ కూతురు..
ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా? తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోయినా బీటౌన్ ప్రేక్షకులకు మాత్రం ఈమె సుపరిచితమే. సడెన్గా చూస్తే.. ఈమె కంగనా రనౌత్, రాధికా ఆప్టేల పోలికలతో ఉన్నట్లు కనిపిస్తుంది. మరో యాంగిల్లో చూస్తుంటే.. హ్యాపీడేస్ ఫేమ్ స్రవంతి లాగానూ అనిపిస్తుంది. తన టాలెంట్ కన్నా గ్లామర్ ట్రీట్తో జనాలకు బాగా పరిచయమున్న ఈ బ్యూటీ పేరు అంజలి శివరామన్. తన యూనిక్ స్టైల్తో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అంజలి శివరామన్ చక్కని గాయని కూడా. ‘నా నటనకు గానం అనేది ఎంతో ఉపయోగపడింది. క్రమశిక్షణతో ఉండడానికి కారణం అయింది. నన్ను నేను వ్యక్తీకరించుకునే సాధనం అయింది’ అంటుంది అంజలి. సింగర్ చిత్ర అయ్యర్ కూతురైన అంజలికి చిన్నప్పటి నుంచే స్వరాలతో స్నేహం ఏర్పడింది. స్కూల్ ఫంక్షన్ల నుంచి ఫ్యామిలీ ఫంక్షన్ల వరకు అంజలి పాట వినిపించాల్సిందే. పాటలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ మ్యూజిక్ క్లాస్కు తరచుగా బంక్ కొట్టేది. ఆ తరువాత మాత్రం సంగీత శిక్షణ ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతిరోజూ క్లాస్కు తప్పకుండా హాజరయ్యేది. ‘సంగీతం నా రక్తంలోనే ఉంది’ అంటుంది అంజలి, అంజలి నోట పాట విన్న వారు...‘అమేజింగ్ వాయిస్’ అనకుండా ఉండలేరు. ‘జాజ్ బ్లూస్ తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్’గా చెబుతుంది అంజలి. View this post on Instagram A post shared by 𑁍 𝔸 ℕ 𝕁 𝔸 𝕃 𝕀 𑁍 (@anjalisivaraman) ముంబైలోని ఒక మ్యూజిక్ స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న అంజలి యాదృచ్ఛికంగా నటనరంగంలోకి వచ్చింది. మోడలింగ్, టీవీ కమర్షియల్స్ ద్వారా గుర్తింపు పొందిన అంజలి క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ‘క్లాస్’లో లీడ్రోల్ పోషించింది. సుహాని అహుజా పాత్రతో మంచి మార్కులు కొట్టేసింది. View this post on Instagram A post shared by 𑁍 𝔸 ℕ 𝕁 𝔸 𝕃 𝕀 𑁍 (@anjalisivaraman) -
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ఆరంభమైంది. తొలి సీన్కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
శోభన్ బాబు తో చాలా చనువుగా ఉండేదాన్ని..!
-
ఎంతోమందికి జీవితం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్
-
నేను అంటే చచ్చే అంత ప్రేమ తనకి..!
-
పద్మనాభం నన్ను తీసుకుపోదామని చూశాడు..!
-
మా నాన్న నాతో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు
-
కృష్ణంరాజు గారు నాకు నరకం చూపించారు..!
-
పద్మనాభం గారికి నేనంటే చాలా ఇష్టం..!
-
సాయంత్రం అయితే చాలు మల్లె పూలు తీసుకొచ్చేవాడు
-
English Idiom: ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ.. అర్థం తెలుసా?
తనకు బుకర్ప్రైజ్ వచ్చిన సందర్భంగా రచయిత్రి గీతాంజలి శ్రీ తొలి స్పందనగా ఇలా అన్నారు... ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ! అనుకోని సంఘటన, ఊహించని ఫలితం...మొదలైన సందర్భాలలో ఉపయోగించే ఇడియమ్ ఇది. ఇక దీని మూలాల విషయానికి వస్తే... ప్రశాంతమైన ఆకాశం ఉన్నట్టుండి ఉరుముతుంది. ఎక్కడో పిడుగుపడుతుంది...ఇదంతా ఊహకు అందనిది. మరొకటి ఏమిటంటే... మధ్యయుగాల కాలంలో యుద్ధాలలో ‘క్రాస్బో’(అడ్డవిల్లు)ను ఉపయోగించేవారు. సాధారణ విల్లుతో పోల్చితే ఇందులో నుంచి ప్రయోగించే ‘బోల్ట్’ ఎక్కువ దూరం దూసుకువెళుతుంది. టార్గెట్పర్సన్కు షూటర్ కనిపించడు. ఇది ఊహించనిది. ‘బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ’ థామస్ కార్లైల్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ (1857) పుస్తకంలో మొదటిసారిగా కనిపిస్తుంది. చదవండి: Brain Gym: భర్తను షూట్ చేసిన తర్వాత అతడితో కలిసి భోజనం చేసిన భార్య.. ఇదెలా సాధ్యం? -
బడిలో అమ్మ భాష లేదు
గీతాంజలి సామాజిక కార్యకర్త, ఎంటర్ప్రెన్యూర్, విద్యావేత్త, ఒడిస్సీ నాట్యకారిణి, రష్యన్ బాలే నర్తకి. వీటితోపాటు కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించారామె. లధాక్లో విద్యా సంస్కరణ బాధ్యతను తలకెత్తుకున్నారు.దాంతోపాటు ఆమె దేశంలోని ప్రతి అమ్మాయికీ కరాటే నేర్పించాలని కంకణం కట్టుకున్నారు. ‘స్త్రీ సాధికారత సాధన అనేది ఒక కలగా మిగలకూడదు. ఆ కల సాకారం కావాలంటే స్త్రీ... తన మీద జరిగే దాడులను తనకు తానుగానే సమర్థంగా ఎదుర్కోగలగాలి’ అంటారు గీతాంజలి. ఫెయిలవుతున్నది పిల్లలు కాదు కశ్మీర్లోని లధాక్లో పిల్లల మీద... ‘బడికి రార’నే అపవాదు ఉండేది. నూటికి 95 మంది పిల్లలు మధ్యలోనే బడి మానేసేవాళ్లు. ఏడాదంతా బడికి వెళ్లిన పిల్లల్లో కూడా పై తరగతికి పాస్ అయ్యే వాళ్లకంటే ఫెయిల్ అయ్యే వాళ్లే ఎక్కువ. నిజానికి ఇక్కడ ఫెయిల్ అయింది పిల్లలు కాదు, ప్రభుత్వ విద్యావిధానం. ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యావిధానం లధాక్ వాసుల భాషకు, స్థానిక సంస్కృతికి పూర్తిగా భిన్నంగా ఉండడమే. దాంతో లధాక్లో విద్యాసంస్కరణకు, ప్రత్యామ్నాయ విద్యావిధానానికి బీజం పడింది. పిల్లలు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో భాగస్వాములయ్యారు. మంచు స్థూపాలను కడుతున్నారు, కృత్రిమమైన హిమానీనదాలను సృష్టిస్తున్నారు. పిల్లలు ఇష్టపడే ఇలాంటి కార్యకలాపాలే పిల్లల్ని స్కూలుకు దారి వెతుక్కుంటూ పరుగులు తీయించాయి. చిన్న పిల్లలు నీటి కొరతను తీర్చడంలో నిమగ్నమవుతుంటే, పెద్ద పిల్లలు సోలార్ హీటెడ్ మడ్ బిల్డింగ్స్ నిర్మాణంలో నిష్ణాతులవుతున్నారు. దాంతో ఓ యూనివర్సిటీ క్యాంపస్ ఎకో విలేజ్గా మారింది. గీతాంజలి కార్పొరేట్ రంగాన్ని వదిలి లధాక్ దారి పట్టింది ఇలాంటి విద్యాసంస్కరణ కోసమే. లాహోర్ టూ లధాక్ వయా పాండిచ్చేరి ఒరిస్సాలోని బాలాసోర్లో పుట్టిన గీతాంజలి మూలాలు లాహోర్లో ఉన్నాయి. దేశ విభజన సమయంలో గీతాంజలి తాతగారు లాహోర్ నుంచి పంజాబ్కి వచ్చి స్థిరపడ్డారు. ఆమె క్రిస్టియన్ మిషనరీ కాన్వెంట్, కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నారు. పదహారేళ్ల వయసులో పాండిచ్చేరి పర్యటన ఆమె దృక్పథాన్ని మార్చేసింది. పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమంలో భారతీయ ఆధ్యాత్మికత సారాన్ని ఒంటపట్టించుకున్నారు. తత్వం, వేదం, ఉపనిషత్తులను చదివారు. ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ తర్వాత భువనేశ్వర్లోని గ్జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబిఏ చేశారు. చదువు పూర్తయిన తర్వాత డెన్మార్క్లో మార్కెటింగ్ విభాగంలో పనిచేశారామె. ఉద్యోగ జీవితం నుంచి మెల్లగా ఎంటర్ప్రెన్యూర్గా మారారు గీతాంజలి. పుషన్ ప్రాజెక్ట్స్ పేరుతో ఇంజనీరింగ్ ఫర్మ్ స్థాపించారు. చెన్నై కేంద్రంగా హీలియోస్ పుస్తక ప్రచురణ సంస్థ కూడా ఆమె మానస పుత్రికే. పాండిచ్చేరిలో ఏయుఎమ్ హాస్పిటల్స్ను సమర్థంగా నిర్వహించారు. ఇన్నింటిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక్కసారిగా వాటన్నింటికీ దూరంగా వెళ్లి పోయారు. ‘ఇప్పుడు లధాక్ పిల్లల కోసం మంచి భవిష్యత్తుని డిజైన్ చేస్తున్నానని, అందులో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండబోద’’ని అంటున్నారామె తన నిర్ణయం పట్ల సంతోషంగా. అవసరాలే ఆలోచనలు గీతాంజలి ఇప్పుడు లధాక్లో ‘హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్’(హియల్) విద్యాసంస్థ సీఈవో. ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్తోపాటు ఆమె విద్యాసంస్థను నిర్వహిస్తున్నారు. లధాక్లోని పైయాంగ్ గ్రామంలో స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్లో విద్యావిధానాన్ని లధాక్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ‘‘మనదేశంలో మైదాన ప్రాంతంలో భవన నిర్మాణానికీ, లధాక్లో భవన నిర్మాణానికి ఒకటే ఫార్ములా పని చేయదు. మైదాన ప్రదేశాల్లో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా భౌగోళిక సమతుల్యత లేని నేలలకు అనువైన నిర్మాణ విధానాన్ని కరికులమ్లో చేర్చుకోవడం లేదు. అందుకే భౌగోళిక స్థితికి అనుగుణంగా భవన నిర్మాణం చేయడంతోపాటు స్థానిక వనరులే పెట్టుబడిగా చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి అనువైన కోర్సులను కూడా ప్రవేశ పెట్టాం’’ అన్నారు గీతాంజలి. అక్కడ ఇప్పుడు ఎకో రెస్పాన్సివ్ హోమ్స్ కడుతున్నారు. అంటే... లధాక్లోని విపరీతమైన చల్లదనం దృష్ట్యా ప్లస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునేటట్లు ఇళ్లను నిర్మించడం అన్నమాట. వరదలు, కొండ చరియలు విరిగి పడకుండా నివారించే ఉపాయాలను కూడా సమ్మిళితం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ను పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. ‘‘ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిషింగ్, హెల్త్కేర్ రంగాల్లో అనేక సంస్థల వ్యవస్థాపకురాలిగా, నిర్వహకురాలిగా ఇరవై ఏళ్ల కాలంలో పొందిన సంతోషంకంటే లధాక్లో చేస్తున్న సర్వీస్తో పొందుతున్న ఆనందమే ఎక్కువ’’ అన్నారామె. గీతాంజలి లధాక్ పిల్లలతో ఎంతగా కలిసిపోయారంటే... స్కూలుకి వెళ్లేటప్పుడు తరచుగా లధాక్ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. దీనివల్ల పిల్లలు తనను తమలో ఒకరిగా చూస్తారని చెప్పారామె. ‘‘పిల్లలు టీచర్ను, విద్యాసంస్థల నిర్వహకులను సొంత మనుషులుగా స్వీకరించడం చాలా అవసరం. అప్పుడే టీచర్ చెప్పిన మంచిని అనుసరిస్తారు, ఆ విద్యాసంస్థ నియమాలను గౌరవిస్తారు’’ అన్నారు గీతాంజలి. చెన్నై నేర్పిన పాఠాలు గీతాంజలి 2015లో చెన్నైలోని కేంబ్రిడ్జి స్కూల్ సీఈవోగా పనిచేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు స్కూలు బాధ్యతలు చూసేవారు. శని, ఆదివారాలు పాండిచ్చేరిలోని హాస్పిటల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘‘నేను స్కూల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తొలి వారంలో ఆ స్కూల్లో పని చేస్తున్న గణితం, ఫిజిక్స్ టీచర్లు ఉద్యోగం మానేశారు. వాళ్లిచ్చిన నోటీస్ పీరియడ్ అప్పటికి అయిపోయింది, కానీ ఆ లోపు కొత్త టీచర్ల నియామకం జరగలేదు. దాంతో స్కూలు యాజమాన్యం ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా నన్ను కోరింది. కొత్తవాళ్లను రిక్రూట్ చేసుకునే వరకు పాఠాలు చెప్పకుండా పిల్లల్ని ఖాళీగా ఉంచకూడదు. పిల్లలు నేర్చుకోవాల్సిన సమయాన్ని వృథా చేయడం పెద్ద నేరం. అలాగని ఏదో ఒక టీచర్కి అడిషనల్ డ్యూటీ వేయడం కూడా అన్ని వేళలా సమర్థనీయం కాదు. అందుకే ఆ పాఠాలను బాగా చదువుకుని, ఒక స్టూడెంట్లాగ ప్రిపేరయ్యి టీచర్గా క్లాస్ రూమ్లో అడుగుపెట్టాను. చెన్నై స్కూల్లో పాఠాలు చెప్పినన్ని రోజులు మా అబ్బాయి ఆర్యన్తో పాటు నేను కూడా హోమ్ వర్క్ చేసేదాన్ని. నిజానికి అప్పుడు వేసిన ఆ అడుగే ఇప్పుడు నన్ను లధాక్కు చేర్చింది. స్కూలు నిర్వహణ నన్ను నేను నిరూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పాఠాలు చెప్పడం... అలా కాదు. ఏదో మానసిక సంతృప్తి, మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని కలకాలం నిలుపుకోవాలనుకున్నాను. లధాక్లో పరిస్థితులు తెలిసిన తర్వాత నా చదువు, నా ఇష్టాలు, నైపుణ్యాలన్నింటినీ ఏకకాలంలో సద్వినియోగం చేసుకోవచ్చనిపించింది’’ అన్నారామె. బడిలో అమ్మ భాష లేదు లధాక్... పేరుకి మనదేశంలో భాగమే కానీ జీవనశైలి, సంస్కృతి టిబెట్కు దగ్గరగా ఉంటుంది. భాష వేరు, ఆహారం వేరు, ఆహార్యం వేరు. అక్కడి వాళ్లు లధాకీ భాష మాట్లాడతారు. ఈ నేపథ్యంలో ఇల్లు దాటి బడిలో కాలు పెట్టిన చిన్ని మెదళ్లను ఒక్కసారిగా అయోమయం ఆవరిస్తుంది. ఇంటి గుమ్మం వరకు మాట్లాడిన లధాకీ భాషకు తాళం పెట్టి రాష్ట్ర అధికార భాష ఉర్దూలో పెదవి విప్పాల్సిందే. అదే లధాక్ వాసుల జీవితాలను తరాలకు తరాలు వెనక్కు నెట్టేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు వేలు సంవత్సరం వరకు అక్కడ మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వాళ్ల సంఖ్య ఐదు శాతానికి లోపే. అమ్మానాన్నల బహుమతి మా అమ్మానాన్నలు నాకు ‘నమ్మకం, స్వేచ్ఛ’ అనే రెండు బహుమతులనిచ్చారు. ఏ పిల్లలకైనా అంతకంటే పెద్ద వరాలు మరేవీ ఉండవు. ఉన్నది ఒక్కటే జీవితం, అందులోనే మన ఆలోచనలను, ఆశయాలను నెరవేర్చుకోవాలి. మనల్ని మనం ఎన్నో కోణాల్లో ఆవిష్కరించుకున్నప్పుడే మనలో కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకు లియోనార్డో డా విన్సీనే పెద్ద ఉదాహరణ. ఆ చిత్రకారుడిలో... ఓ గణిత మేధావి, వృక్ష శాస్త్రజ్ఞుడు, ఇంకా గొప్ప తత్వవేత్త కూడా ఉన్నారు. ఒక మెదడులో ఇన్ని రకాల జ్ఞాన సంపద ఉన్నప్పుడు... అవన్నీ ఊరికే ఉండవు. అనుక్షణం ఒకదానితో ఒకటి ప్రేరేపితమవుతూనే ఉంటాయి. కొత్త ఆవిష్కరణలకు బీజం పడేది కూడా అలాంటప్పుడే. హియల్ (హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్) పుట్టుక కూడా అలాంటిదే. ఇందులో మేము అనుసరిస్తున్న విధానం ‘లెర్నింగ్ బై డూయింగ్’. పిల్లలు తామేం నేర్చుకోవాలో దానిని అక్షరాలలో చదువుతూ నేర్చుకోవడంతో సరిపెట్టరు. ఆ పని చేస్తూ నేర్చుకుంటారు. ఇలా చదువుకోవడం వల్ల వాళ్లు పెద్దయిన తర్వాత ఒకరి దగ్గర ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కాలం గడపరు, ఎంటర్ప్రెన్యూర్ మారి సొంతంగా సంస్థను స్థాపించి నిర్వహించుకోగలుగుతారు.– గీతాంజలి,హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్విద్యాసంస్థ సహస్థాపకురాలు శాంతి యోధులు గీతాంజలి హియల్లో అమ్మాయిలకు కరాటే క్లాసులు కూడా తీసుకుంటారు. తాను తయారు చేసిన కరాటే యోధులకు ‘పీస్ఫుల్ వారియర్స్’ అని పేరు పెట్టారు. ఆమె శిక్షణలో తొలి బృందం సర్టిఫికేట్లు అందుకున్నది. వీరి సహకారంతో లధాక్ రీజియన్లోని ప్రతి మహిళకూ కరాటే నేర్పించాలనేది గీతాంజలి ఆలోచన. ‘‘కరాటే ప్రాక్టీస్ అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఎక్కువ అవసరం. రాబోయే పదేళ్లలో దేశంలోని విద్యార్థినులందరూ కరాటే బ్లాక్బెల్ట్ సాధించేటట్లు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరతాను. నలభై ఆరేళ్ల జీవితంలో అనేక ప్రయోగాలు చేశాను, అంతే స్థాయిలో విజయాలనూ సాధించాను. హియల్ విద్యాసంస్కరణ తర్వాత పీస్ వారియర్స్ను దేశమంతటా విస్తరించడం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాను’’ అన్నారు గీతాంజలి. – వాకా మంజులారెడ్డి -
‘గీతాంజలి’లో ఆ సీన్ తీసేస్తారనుకున్నా : నాగ్
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన గీతాంజలి చిత్రం నాగార్జునకు మంచి క్రేజ్ను తెచ్చిపెట్టింది. టాలీవుడ్లో మూసపద్ధతిలో వస్తున్న చిత్రాలకు విరుద్ధంగా గీతాంజలి తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరూ చనిపోతారు. సాధారణంగా ఇలాంటి విషాద ముగింపు ఉన్న సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ గీతాంజలి అందుకు భిన్నంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ సినిమాలో పతాక సన్నివేశంలో వచ్చే ముద్దు సీన్.. ఈ చిత్రానికి గుండెకాయ లాంటిది. అలాంటి ఈ సన్నివేశాన్ని ఎక్కడ తీసేస్తారో అని మన్మథుడు తెగ కంగార పడ్డారట. ఈ విషయాన్ని నేరుగా నాగార్జునే వెల్లడించాడు. ఇటీవలె ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఎక్కువ నిడివితో ఉన్న ముద్దు సన్నివేశమే సినిమకు ప్రాణం. దాన్ని సెన్సార్ బోర్డు తీసివేస్తుందేమోనని భయపడ్డాను. నా తండ్రితో కూడా ఈ విషయాన్ని చెప్పాను. సినిమా చూసిన తర్వాత ఈ చిత్రం మొత్తానికి ఇదే హైలెట్ అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సన్నివేశాన్ని వాళ్లు తొలగించరని భరోసా ఇచ్చారు. నాన్న చెప్పినట్టుగానే వారు ముద్దు సన్నివేశాన్ని తొలగించలేదు’ అంటూ గీతాంజలిని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం నాగ్ ‘మన్మథుడు-2’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది. -
వెనిస్ వాకిట్లో బాంబే రోజ్
బాంబే రోజ్... గులాబీల్లో వెరైటీ కాదు. కాని ముంబైలో పూసిందే! సిల్వర్స్క్రీన్ మీద.. గీతాంజలి రావు ఆలోచనల్లోంచి! ఆ సినిమానే రేపు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరగనున్న వెనిస్ ఫిల్మ్ఫెస్టివల్కు ఎంపికైంది! ఇక్కడ ప్రస్తావించుకోవడానికి సందర్భాన్ని తెచ్చింది! ముందు సినిమా గురించి చెప్పుకుందాం.. తర్వాత గీతాంజలి రావును పరిచయం చేసుకుందాం.‘‘బాంబే రోజ్’’ యానిమేటెడ్ మూవీ. ముంబైలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందింది. కమల, సలీమ్ .. రెండూ ముఖ్యమైన పాత్రలు. బాల్య వివాహం నుంచి తప్పించుకొని ముంబై చేరుతుంది కమల. కశ్మీర్ రాజకీయాలకు బలైన యువకుడు సలీమ్. కొత్త జీవితం అన్వేషణలో అతనూ ముంబై చేరుతాడు. రోడ్డుకు ఇవతలివైపు పూలు అల్లుకుంటూ కమల, అవతలివైపు పూలమాలలు అమ్ముకుంటూ సలీమ్. బాలీవుడ్ డ్రాప్గా ఆ ఇద్దరి మధ్య నడిచన కథే బాంబే రోజ్. యానిమేషన్ సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ ప్రధానం. రఫ్గా తీసిందే బ్లూ ప్రింట్ అవుతుంది. ‘‘బాంబే రోజ్’’ బ్లూ ప్రింట్కి రెండేళ్లు పట్టిందట. . మొత్తం చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాల పైనే పట్టిందిట. ఈ సినిమాకు వాడిన సంగీతం ఎనభై శాతం పాత సినిమాల్లోంచి తీసుకున్నదే. కమల పాత్రకు శైలీ ఖారే, సలీమ్ పాత్రకు అమిత్ డియోండీ, విలన్ పాత్రకు మకరంద్ దేశ్పాండే, బాలీవుడ్ స్టార్కు అనురాగ్ కశ్యప్, కమల తాత పాత్రకు వీరేంద్ర సక్సేనా గళాన్ని అందించారు. గీతాంజలి పరిచయం.. షూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ‘‘అక్టోబర్’’సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అందులో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడిన యువతి తల్లిగా నటించిన నటే గీతాంజలి రావు. జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో కమర్షియల్ ఆర్ట్ కోర్సు చేశారు ఆమె. అక్కడున్నప్పుడే ప్రఖ్యాత యానిమేటర్ రామ్ మోహన్ దగ్గర యానిమేషన్ నేర్చుకున్నారు. అలా ఆమె 2006లో ‘‘ప్రింటెడ్ రెయిన్బో ’’ అనే తన ఫస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్కి రూపమిచ్చారు. దీనికి 28 అవార్డులు వచ్చాయి. ఫిల్మ్ స్కూల్స్లో సబ్జెక్ట్ కూడా అయ్యిందీ సినిమా. ఆ తర్వాత పదేయేళ్లకు ‘‘విష్ ఫుల్ఫిల్మెంట్ సెల్ఫీ’’ అనే షార్ట్ ఫిల్మ్ తయారు చేశారు. ఆమె తన సెల్ఫీలను రాజకీయనాయకులు, కళాకారులతో కలిసి తీసుకున్నట్టుగా ఫోటోషాప్ చేసి తీసిన సినిమానే అది. చాలామంది ఆసక్తిగా చూశారు. 46 యేళ్ల గీతాంజలి పూర్తిస్థాయి సినిమా తీయడానికి చాలా యేళ్లే నిరీక్షించాల్సి వచ్చింది. ఫైనాన్సియర్లు ముందుకు రాకపోవడమే కారణం. ఈ ప్రాజెక్ట్ కోసం టీవీ కమర్షియల్స్లో నటించారు. ‘‘ చాలా యేళ్లుగా నటిస్తూనే ఉన్నాను. యానిమేషన్లో తలమునకలై ఉండడంతో అనురాగ్ కశ్యప్ ‘‘పాంచ్’’ లో నటించే అవకాశం వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించాను. బాంబే రోజ్’ మేకింగ్లో బిజీ అవడంతో ఇంకొన్ని అవకాశాలకూ నో చెప్పాల్సి వచ్చింది. ఆరు సంవత్సరాల కిందటే బాంబే రోజ్ కథ ఆలోచించాను. తీయడానికే నిర్మాతలు దొరకలేదు. మంచి భవిష్యత్ కోసం ముంబైకి వలస వచ్చిన వారి జీవితమే ఈ చిత్రం. నేను కూడా ఇక్కడకు వలస వచ్చినదానినే. ముంబైకి సంబంధించిన ఎన్నో అంశాలు నిత్యం నన్ను పలకరిస్తూనే ఉంటాయి. అందువల్లే ఈ చిత్రం టైటిల్లో బాంబే పేరు ఉంచాను. నాకు పూల పట్ల ఉన్న ప్రేమను ప్రదర్శించాను. నేను ట్రైన్లో చూసిన పూలమ్ముకునే అమ్మాయి జీవితం ఆధారంగా వచ్చినదే కమల పాత్ర. నిత్యం నా తలలో మల్లెపూలు పెట్టుకుంటాను. చెమటలు కక్కే బొంబాయి మహానగరంలో వీటి వల్లే సువాసనలు పీల్చుకోగలం. దాదర్ ఫ్లవర్ మార్కెట్, జుహు బీచ్ల మధ్య తిరుగుతుండే పూలవారికి సంబంధించిన దృశ్యాలను యానిమేట్ చేయడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది. ఒక సూట్కేసులో బట్టలన్నీ నిండుగా ఉన్నట్లే, నా మదిలో కూడా ఆలోచనలు అలాగే ఉన్నాయి. అంతకుముందు.. ముంబైకి వలస వచ్చిన ముగ్గురి కథ ఆధారంగా తీసిన గిర్గీత్ చిత్రం.. ఆరు నెలల పాటు నిర్మాణం జరిగాక ఆగిపోయింది. ఆ అనుభవంతో ‘ట్రూ లవ్ స్టోరీ’ అనే షార్ట్ఫిల్మ్ తీశాను. అది 2014లో జరిగిన కేన్స్ ఉత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. నేను ప్రారంభించి ఆపేసిన చాలా సినిమాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ’’ అంటారు గీతాంజలి రావు. వెనిస్ ఫిల్మ్ఫెస్టివల్లో ‘‘బాంబే రోజ్’’ తోపాటు వి. బి. సమంత తీసిన హనుమాన్ (2005), అర్నబ్ చౌదరి తీసిన అర్జున్ – ద వారియర్ ప్రిన్స్ (2012), శిల్పా రనాడే తీసిన గోపీ గవయ్యా బాజా బజయ్యా, చోటాభీమ్ పాత్రల ఆధారంగా రూపొందినవి మరికొన్నీ ప్రదర్శనకు ఎంపికయ్యాయి.– వైజయంతి -
మహిళపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు
-
వైరల్ వీడియో ఆధారంగా మహిళపై రౌడీషీట్
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ముట్టూరుకి చెందిన గీతాంజలి అనే మహిళపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. సాదిక్ అనే మైనర్ బాలుడిని గీతాంజలి, ఆమె కొడుకు కలిసి దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా పోలీసులు గీతాంజలిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే సాదిక్ అనే మైనర్ బాలుడు ఓ అమ్మాయికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, దీంతో ఆ అమ్మాయికి వరుసకు చిన్నమ్మ అయిన గీతాంజలి సాదిక్పై దాడి చేసినట్టు సమాచారం. గీతాంజలితో పాటు ఆమె కుమారుడు కూడా సాదిక్ను చితకబాదాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గీతాంజలిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. -
ఇష్టం లేని ఫొటో
ఇష్టం లేని ఫొటోను దాచేస్తాం. దాచడం కూడా ఇష్టం లేని ఫొటోను? చింపేస్తాం. పెళ్లి ఫొటోలో తనతో పాటు తన చదువూ ఉండాలనుకుంది గీతాంజలి. వీలవలేదు. పెళ్లయ్యాక తన ఫ్యామిలీ ఫొటోలోనైనా తన చదువు ఉండాలనుకుంది. కుదరలేదు. మొత్తం ఫొటోను చింపేయలేదు కదా. అందుకని భర్త, పిల్లల మధ్యలోంచి తనను మాత్రం తొలగించుకుంది. చావులోనైనా చదువుతో కలిసి ఉండాలనుకుందేమో ఫొటోలోంచి వెళ్లిపోయింది! పెద్ద చదువులు, పెద్ద డిగ్రీలు అందరికీ కుదరవు. ఆడపిల్లకు అసలే కుదరవు. ఎంత సంపన్నుల పిల్లకైనా.. డిగ్రీలోనో, ఇంటర్లోనో, దురదృష్టం పెళ్లి పెద్దలా నెత్తిమీద కూర్చుంటే మరీ టెన్త్కే.. పెళ్లడ్డు పడుతుంది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలా! మళ్లొచ్చి చదవడానికి ఉండదు. ఆలీబాబా నలభై దొంగల రాతి గుహకు ఉండే మాయాద్వారం మూతపడినట్లుగా క్లాస్ బుక్స్ అన్నీ మూతపడి ఉంటాయి, తెల్లారే లేచి చూస్తే. వాటిని తెరవడానికి పాస్వర్డ్ కావాలి. ఇంకెక్కడ ఉంటుంది! పెళ్లి రోజే వేళ్లతో నీళ్ల బిందెలోని ఉంగరాన్ని వెతుకుతున్నప్పుడే పెళ్లికొడుకు ఉదారంగా బిందె లోపలి ఉంగరాన్ని పెళ్లికూతురు చేతికి చిక్కనిచ్చి, ఆమె వేలికి కలిపించకుండా ఉండే మహిమ గల చదువు ఉంగరాన్ని ఒడుపుగా లాగేసుకుంటాడు. అప్పట్నుంచీ ఆమె వేళ్లకు, చేతులకు ఇంటి పనే అలంకరణ! చదువు పూర్తి చేయకపోయినా చేతికి వచ్చిన ‘గృహిణి’ అనే డిగ్రీ సర్టిఫికెట్తోనే ఆమె జీవితం నడుస్తుంది, గడుస్తుంది. జీవితాంతం వరకు. అది ఆమె కోరుకోని డిగ్రీ. కోరుకోనిదైనా కాన్వొకేషన్ కోటు, హ్యాటూ పెట్టుకుని, పట్టలేని సంతోషంతో గాలిలోకి కాళ్లు ఒకవైపుకు లేపి ఎగురుతున్నట్లుగా పెళ్లి పీటలపై బలవంతపు ఫొటో తీయించుకోవలసిందే. వెడ్డింగ్ విషెస్ తలంబ్రాల్లా వచ్చి తలపైన, ముఖం మీద, కంట్లో పడుతుంటాయి. ‘పెళ్లొద్దు నాన్నా.. చదువుకుంటాను నాన్నా’ అని ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆ కళ్లు ఎవరికి కనిపిస్తాయి.. పక్కనే కూర్చొని కళ్లలోకే చూస్తున్న పెళ్లికొడుక్కే కనిపించకపోతే! ‘పెళ్లొద్దు నాన్నా, చదువుకుంటాను నాన్నా’అని పదేళ్ల క్రితం గీతాంజలి కూడా ఏడ్చింది. లైఫ్లో చాలా ఎత్తుకు ఎదగాలనుకుంది తను. ఐపీఎస్ చేయాలనుకుంది. పదహారేళ్లు తనకి. తల్లి ఒడిలో కూర్చొని అప్పటి వరకు టెన్త్ హోమ్ వర్క్ చేసుకున్న ఆ చిన్నారి.. ఇంటర్లో చేరగానే ఒక్కసారిగా ఎదిగిన పిల్లలా కనిపించింది తండ్రికి. భయపడిపోయాడు. పెళ్లి చేసేయాలని తొందరపడ్డాడు. చేసేశాడు. గీతాంజలికి ఇప్పుడు ఇరవై ఆరేళ్లు. ఇద్దరు పిల్లలు. పెళ్లవకుండా ఉంటే ఇప్పటికీ తనూ ఒక పిల్లే. పెద్ద పిల్ల. ఐపీఎస్గా సెలక్టయ్యో, ఐపీఎస్కీ ప్రిపేర్ అవుతూనో ఉండేది. ఇప్పుడు కూడా ఎస్సై ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూనే ఉంది. శనివారం ఆత్మహత్య చేసుకుంది! భర్త మహారాష్ట్రలో లెక్చరర్. వచ్చిపోతుంటాడు. తను, పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. సంక్రాంతి పండక్కి అమ్మావాళ్లింటికి ఆదిలాబాద్ వెళ్లొచ్చింది. శుక్రవారం వచ్చింది. శనివారం ఉరేసుకుంది. పిల్లల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయింది. పిల్లల్నేనా? తను కన్న కలల్ని, తను అల్లుకున్న ఆశల్ని, తను ఏర్పరచుకున్న ఆశయాల్ని.. అన్నిటినీ అనాథల్ని చేసింది. ఇంట్లో ఫ్యాన్కి వేలాడుతున్న ఆమె కాళ్లను.. పెళ్లి, పిల్లలు, సంసారం కన్నా ఎక్కువ అనుకున్న ఆమె కలలు, ఆశలు, ఆశయాలు.. ‘అమ్మా.. అమ్మా..’ అని చుట్టేసుకుని రోదిస్తున్న దృశ్యాన్ని ఊహించండి. ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసింది గీతాంజలి. అది చదివి ఆమె తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోయి ఉంటాయి. పదేళ్ల క్రితం పెళ్లి రోజు కూతురు చదువుతూ చదువుతూ పుట్టింట్లో వదిలేసి వెళ్లిన ఆఖరి టెక్స్ బుక్ వాళ్లకు గుర్తొచ్చే ఉంటుంది. గీతాంజలి మృతదేహాన్ని చూసి గీతాంజలి భర్త అపరాధభావంతో కుమిలిపోతూ ఉండుంటాడు. ‘కాస్త పిల్లల్ని పట్టుకోండి, ఈ ఇంపార్టెంట్ క్వొశ్చన్ ఒక్కటీ పూర్తి చేసేస్తాను’ అన్నప్పుడు.. ‘అవసరమా గీతా.. నేను చేయకపోతే కదా నీకు ఉద్యోగం’ అని తను విసుక్కుని ఉంటే అది అతడికి గుర్తుకు వచ్చే ఉంటుంది. ‘ఏడ్వని రోజు లేదు. అందుకే వెళ్లిపోతున్నా’ అని సూసైడ్ నోట్లో రాసింది గీతాంజలి. ‘ఆడపిల్లల మనసు అర్థం చేసుకోండి’ అని రాసింది. ‘పెళ్లొద్దంటే చేయకండి’, ‘వద్దన్న పెళ్లి చెయ్యకండి’ అని రాసింది.‘కలామ్ మాటల్ని ఆదర్శంగా తీసుకుని ఎన్నో కలలు కన్నాను. నా కలలు కలలుగానే ఉండిపోయాయి’ అని రాసింది. ‘పెద్ద చదువులు చదవాలనుకున్నాను. పెద్ద ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. అంత పెద్ద చదువుతో, అంత పెద్ద ఉద్యోగంతో.. నా భర్త పక్కన తిరగాలనుకున్నాను. కానీ నాన్న, నా పెళ్లి చేసి పంపించేశాడు. ఇంటర్తోనే నా చదువు ఆగిపోయింది. కోరుకున్న జీవితం దక్కలేదు. ఇంతకుమించి జీవితంలో కోల్పోడానికి ఏముంటుంది?’ అని రాసింది. ‘తల్లిదండ్రులూ.. చిన్నప్పుడే మీ పిల్లలకు పెళ్లిళ్లు చెయ్యకండి’ అని రాసింది. ‘మామయ్యా.. నా పిల్లల్ని బాగా చదివించండి’ అని రాసింది. ‘బిట్టు, సాయి.. బాగా చదువుకోండి’ అని రాసింది. ఉత్తరంపై ఎన్ని కన్నీటి చుక్కల మరకలు ఉన్నాయో తెలియదు కానీ, ఉత్తరం చివర్న గీతాంజలి తన పేరును ఎలా రాసుకుందీ చదివితే ఎంతటివారికైనా దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ‘గీతాంజలి, ఐపీఎస్’ అని రాసుకుంది గీతాంజలి!! కష్టపడి చదివి సాధించుకున్న డిగ్రీని పేరు పక్కన పెట్టుకుంటే పేరుకు వాల్యూ ఉంటుంది. గొప్పగా, గౌరవంగా ఉంటుంది. ఏ రంగంలోని ప్రసిద్ధతనైనా పరిపూర్ణం చేసే ‘తగిలింపు’.. చదువు టైటిల్! కేవీరెడ్డి బి.ఎ., కిరణ్ బేడీ ఐపీఎస్. ఒక కంప్లీట్నెస్! అందుకేనేమో గీతాంజలి కనీసం చావులోనైనా చదువుతో కలిసి ఉండాలని కోరుకున్నట్లుంది. ఉన్న కుటుంబంతో కలిసి జీవించాలన్న కోరిక కన్నా, లేని చదువుతో కలిసి మరణించాలని అనుకున్నట్లుంది. పెట్టుకోడానికి తన పేరు పక్కన ‘ఐపీఎస్’ అని పెట్టుకున్నా.. ఐపీఎస్కే తన పేరును టైటిల్గా పెట్టి వెళ్లిపోయింది. అందుకే ఆమె గీతాంజలి, ఐపీఎస్ కాదు. ఐపీఎస్, గీతాంజలి. ఎంత గౌరవం తెచ్చిపెట్టింది చదువుకు ఈ అమ్మాయి! కానీ.. చేసింది ఏం మంచి పని! చదివితే వచ్చే క్వాలిఫికేషన్కు, ఉద్యోగం చేస్తే వచ్చే శాటిస్ఫాక్షన్కు ‘గృహిణి’ అనే డిగ్రీ, ‘గృహిణి’ అనే జాబ్.. సమానం కాకపోవచ్చు. అసలది డిగ్రీ, అసలది జాబ్ ఎలా అవుతుందనీ అనిపించవచ్చు. కష్టపడి చదివి సంపాదించిన డిగ్రీకి ఎంత విలువ ఉంటుందో, చదవాలని ఆశ ఉండీ చదివే అవకాశం లేకపోయిన డిగ్రీకీ అంతే విలువ ఉంటుంది. అయినా ప్రాణ సమానంగా ప్రేమించిన చదువు కోసం ప్రాణాన్నే తీసేసు కుంటే చదువుకు ఏం విలువ ఇచ్చినట్లనే ఆలోచన ఆఖరి నిముషంలోనైనా గీతాంజలిలో కలిగి ఉంటే ఎంత బాగుండేది! ∙మాధవ్ శింగరాజు -
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో యువతి వీరంగం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురికి పోలీసులు జరిమానా విధించారు. టీఎస్ 09 ఈటీ 2000 పేరుతో ఉన్న కారు నడుపుతూ గీతాంజలి అనే యువతి పట్టుబడింది. ఆమెను శ్వాసపరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించగా ససేమిరా అంది. దీంతో చాలాసేపు పోలీసులకు, సదరు యువతికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు గంటల పాటు ఆమె శ్వాసపరీక్షలకు నిరాకరించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ప్లేట్పై ‘జిల్లా రెవెన్యూ అధికారి, అడిషినల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్’ అని రాసి ఉండటంతో పోలీసులు ఆమె గురించి వాకబు చేశారు. తాను ఐఏఎస్ అధికారి కూతురినంటూ బెదిరించింది. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెను స్టేషన్కు తరలించారు. ఆరా తీయగా ఆమె తండ్రి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి పెంచలయ్యగా తేలింది. శ్వాసపరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. బీఏసీ కౌంట్ 141గా నమోదైంది. కారును సీజ్ చేశారు. కాగా గీతాంజలి నగరంలో ఉంటూ ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. తండ్రి కారునే ఉపయోగిస్తోందని పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 123 మందిపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశారు. -
గీతాదేవి
-
‘గీతాంజలి’ కి చెక్
సాక్షి, హైదరాబాద్: రుణ ఎగవేతదారు నీరవ్ మోదీకి చెందిన సంస్థ గీతాంజలి జెమ్స్కు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మొత్తంగా గీతాంజలి జెమ్స్కు 190 ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్రంలో కట్టబెట్టారని, అందులో 95 ఎకరాలకు సేల్ డీడ్ అయిందని, మరో 95 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి 1,035 ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యులు ఎంఎస్ ప్రభాకర్, కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో 16 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయనున్నామని, ఇందులో ఇప్పటికే 8 వేల ఎకరాల సేకరణ పూర్తయిందని చెప్పారు. 2005–06 తర్వాత రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక పార్కు లు రాలేదని గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద జౌళి పార్కును సీఎం కేసీఆర్ చేతుల మీ దుగా ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రైపోర్టు ఏర్పాటుపై దుబాయ్ పోర్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, డ్రైపోర్టును ఎక్క డ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. చందన్వెల్లిలో టెక్స్టైల్స్ కంపె నీలు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రం నలువైపులా ఐటీని విస్తరించాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. రహేజా మైండ్ స్పేస్లోనే 1.10 లక్షల మందికి ఐటీ ద్వారా ఉపాధి లభిస్తుందని పేర్కొ న్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. -
వెరీ స్పెషల్
‘‘ఇది నాకు 250వ సినిమా. మంచి పాత్ర చేశా. తర్వాతి సీన్ ఏంటి? అనేది నాక్కూడా తెలియకుండా డైరెక్టర్ స్క్రీన్ప్లే రాశారు. కథకు న్యాయం జరగాలని నిర్మాతలు రాజీపడకుండా తీశారు. ఇది నాకు వెరీ స్పెషల్ మూవీ’’ అన్నారు షకీలా. ‘జి’ స్టూడియోస్ సమర్పణలో షకీలా ముఖ్య తారగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టి నిర్మించిన చిత్రం ‘శీలవతి.’ కేరళలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘షకీలాగారితో ఇది నా రెండవ చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది’’ అని గీతాంజలి (ఫ్రూటీ) అన్నారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు గణేష్. మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా... సంతృప్తినిచ్చిన సినిమా మాత్రం ‘శీలవతి’. నాకు, షకీలాగారికి మధ్య ఒక నిర్మాత, ఆర్టిస్ట్లా మొదలైన జర్నీ.. అక్కా.. తమ్ముడు అనుకునేంతగా బంధం ఏర్పడింది. ఆమె చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘ఇంతకు ముందు షకీలా వేరు.. ఈ సినిమా తరువాత షకీలా వేరు అనేట్లుగా ఈ సినిమా ఉంటుంది. మంచి సైకలాజికల్ థ్రిల్లర్. హారర్, కామెడీ ఉంటుంది’’ అన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
గుంటూరు ఈస్ట్: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన స్థానిక కొత్తపేట పరిధిలోని గణేష్ రావు వీధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం చిన పలకలూరుకు చెందిన తెలగపల్లి ఉమామహేశ్వరరావు, సుజాత దంపతుల రెండో కుమార్తె గీతాంజలి జేకేసీ కళాశాలలో బీఎస్సీ చదివింది. తల్లిదండ్రులు 2017 ఆగస్టులో కొత్తపేట గణేష్ రావు వీధికి చెందిన చదలవాడ సీత కుమారుడు రవికి ఇచ్చి వివాహం చేశారు. రవి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి భార్యతో నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేవాడు. అత్త సుజాత కట్నకానుకలు సరిపోలేదంటూ కోడలిని నిత్యం వేధించేది. నెల కిందట గీతాంజలికి టైఫాయిడ్ రావడంతో తండ్రి పుట్టింటికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఈ నెల 22న అత్తవారింటికి తిరిగి వచ్చింది. ఈ సమయంలో రవి మామతో గొడవపడ్డాడు. సోమవారం రాత్రి రవి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి గదిలో తన భార్య ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న కొత్తపేట ఎస్హెచ్ఓ వంశీధర్, క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
మరోసారి ‘జంబలకిడి పంబ’
‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి వైవిధ్యమైన కథలతో కథానాయకుడిగా రెండు విజయాలు అందుకున్న ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘జంబలకిడి పంబ’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు మా చిత్రం రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెడుతున్నాం. మార్చి 10 వరకు నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, వైజాగ్, అరకు, కేరళలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. పోసానిది ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర. వెన్నెలకిశోర్ పాత్ర కూడా హైలైట్ గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించే సినిమా అవుతుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘జంబలకిడి పంబ’ ఎంత సూపర్హిట్ టైటిలో అందరికీ తెలిసిందే. మా చిత్ర కథకు కూడా చక్కగా సరిపోయే టైటిల్ అది. టైటిల్ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కథ, స్క్రీన్ప్లే చాలా బాగా కుదిరాయి. శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఒక వైపు వినోదాన్ని పండిస్తూనే, మరో వైపు భావోద్వేగాలు ఉండే పాత్రలో ఆయన కనిపిస్తారు. శ్రీనివాసరెడ్డి కెరీర్లో మరో కీలక చిత్రమవుతుంది’ అని అన్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. -
భారత సంతతి బాలికకు య్ంగ్ సైంటిస్ట్ అవార్డు
-
మరోసారి హీరోగా..!
కమెడియన్ గా, సహాయ పాత్రల్లో బిజీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి హీరోగానూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. గీతాంజలి సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ రెడ్డి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో కథానాయకుడిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తరువాత కమెడియన్ గా బిజీ అవ్వటంతో హీరో పాత్రలకు కొద్ది రోజులు దూరంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి మరోసారిర హీరో అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నాడు. సుమంత్ అశ్విన్ హీరోగా రైట్ రైట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మను డైరెక్షన్ లో శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడనుంది. హీరోగా అవకాశాలు వస్తున్నా... సహాయపాత్రల్లోనూ కొనసాగుతూ సత్తా చాటుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి. -
ఫైనల్లో గీతాంజలి, బీవీబీ జట్లు
స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బాలికల టీమ్ విభాగంలో గీతాంజలి దేవర్షల, బీవీబీ జట్లు ఫైనల్కు చేరాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో గీతాంజలి దేవర్షల జట్టు 3-0తో గీతాంజలి జట్టుపై విజయం సాధించగా... బీవీబీ జట్టు 3-2తో ఎస్పీహెచ్ఎస్ జట్టును ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాయి. సబ్ జూనియర్ బాలుర రెండో రౌండ్ ఫలితాలు వంశీ 3-0తో రిత్విక్పై, అద్వైత్ 3-0తో కమల్పై, విశాల్ 3-1తో ప్రణవ్పై, సాయి ధనుష్ 3-1తో రఘుపై, కార్తీక్ 3-0తో రిత్విక్ ఉప్పులూరిపై, సాయినాథ్ 3-2తో కేశవన్ కన్నన్పై, రితేశ్ 3-0తో యశ్ చంద్రపై గెలుపొందారు. క్యాడెట్ బాలుర రెండో రౌండ్ ఫలితాలు క్రిష్ 11-4,11-5, 13-11తో పార్థ్పై, త్రిశూల్ 11-6, 11-7, 13-11తో క్రిష్పై, శ్రేష్ట్ 11-6, 11-7, 11-9తో ఆయూష్పై, అథరిక్ 11-6, 11-8, 11-4తో తరుణ్పై, వేణుమాధవ్ 11-4, 11-6, 11-9పై, కుష్ 11-4, 13-11, 11-5తో రోనక్పై, రిత్విక్ 11-3, 11-7, 11-2తో వివేక్పై విజయం సాధించారు. -
కోలీవుడ్ లో 'గీతాంజలి'
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది. నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. -
కోలీవుడ్ గీతాంజలిలో జీవి
ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది. నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. -
తమిళంలో రీమేక్గా గీతాంజలి
ప్రస్తుతం సినిమా రీమేక్ల మయం అయిపోయిందని చెప్పవచ్చు. ఒక భాషలో విజయవంతమైన చిత్రం ఇతర భాషల్లో రీమేక్ ఖాయం అవుతోంది. కారణం నమ్మకం.అక్కడ హిట్ అవడంతో ఇక్కడా ఆ సక్సెస్ను క్యాష్ చేసుకోవచ్చుననే ఆలోచనా కావచ్చు. అలా తాజాగా తెలుగులో నటి అంజలి టైటిల్ పాత్ర పోషించిన హారర్ కామెడీ కథా చిత్రం గీతాంజలి తమిళంలో రీమేక్ కానుందన్నది తాజా సమాచారం. హాస్యన టుడు శ్రీనివాసరెడ్డి అంజలికి జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంజలి ద్విపాత్రాభినం మంచి ప్రశంసలు అందుకుంది. రాజ్కిరణ్ దర్శకత్వం వహించిన గీతాంజలి 2014లో విడుదలైంది. ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ కానుందని కోలీవుడ్ సమాచారం. అంతే కాదు ఇందులో యువ సంగీతదర్శకుడు, సక్సెస్పుల్ హీరో జీవీ.ప్రకాశ్కుమార్ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హలో నాన్ పేయ్ పేసురేన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై తొలి విజయాన్ని అందుకున్న ప్రసాద్ ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్నట్లు సమాచారం. దీన్ని ఇంతకు ముందు పొల్లాదవన్, జిగర్తండా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఫైవ్స్టార్ కథారేశన్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా అంజలి నటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
రాజు గారి గదిలోకి అంజలి
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన మూవీ రాజుగారి గది. జీనియస్ ఫెయిల్యూర్ తరువాత విరామం తీసుకున్న ఓంకార్, రాజు గారి గది సినిమాతో మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం రెండున్నర కోట్లతో రూపొంది 7 కోట్లకు పైగా వసూళు చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వల్ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు ఓంకార్. ఇప్పటికే కథాకథనాలను కూడా రెడీ చేసిన ఓంకార్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. అయితే తొలి భాగాన్ని తక్కువ బడ్జెట్లో కొత్త వారితో తెరకెక్కించినా.. రెండో భాగాన్ని మాత్రం భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా హీరోయిన్ అంజలిని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గీతాంజలి సినిమాతో హర్రర్ సినిమా చేసిన అంజలి మరోసారి అదే తరహా పాత్రలో నటించడానికి అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. మరి రాజుగారి గది సీక్వల్కు అంజలి గ్లామర్ ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
గీతాంజలి
-
‘త్రిపుర’ సమస్య ఏంటి?
‘త్రిపుర’ అనే అమ్మాయి జీవితం చుట్టూ అంతు చిక్కని ప్రశ్నలు మబ్బుల్లా కమ్ముకున్నాయి. ఆ ప్రశ్నలేంటి? అసలు త్రిపుర సమస్య ఏంటి? అనే కథాంశంతో ‘గీతాంజలి’ ఫేం రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘త్రిపుర’. టైటిల్ రోల్లో స్వాతి నాయికగా క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం.రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ చిత్రానికి ‘తిరుపుర సుందరి’ అనే టైటిల్ని ఖరారు చేశారు. టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో పాటలను చిత్రీకరించనున్నారు. ‘‘హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. స్వాతి నటన ఈ చిత్రానికి హైలైట్. పాటల చిత్రీకరణను బెంగళూరులోని హంపి, బదామీలో జరపనున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. పూర్తయినంతవరకు రషెస్ చూశామని, అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, ఛాయాగ్రహణం: రవికుమార్ సానా, సమర్పణ: జె.రామాంజనేయులు. -
భార్యే నిర్మాతగా..
ఇరండాం ఉలగం చిత్రం ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్ను చాలా విమర్శలకు గురి చేసింది. ఆ ఎఫెక్ట్ ఆయన్ని చాలా కాలం సినిమాకు దూరం చేసింది. ఎట్టకేలకు మళ్లీ చిత్రం చేయడానికి సెల్వరాఘవన్ సిద్ధం అయ్యారు. సంచలన నటుడు శింబు హీరోగా నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే నటి త్రిష హీరోయిన్గా నటిస్తానని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. ఏదైమైనా చిత్రం నుంచి త్రిష వైదొగలగడం సెల్వరాఘవన్కు షాకే. అందులో నుంచి తేరుకుని మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. అలా క్యాథరిన్ త్రెసా హీరోయిన్గా ఓకే అయ్యారు. అంతా బాగుందనుకున్న సమయంలో చిత్రానికి నిర్మాత లేకపోయారు. అందుకు వేరే కథ ఉంది లెండి. ఇలాంటి పరిస్థితిలో సెల్వరాఘవన్ తన భార్య గీతాంజలిని నిర్మాతగా చేసి గ్లో స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం నిరాడంబరంగా ప్రారంభించారు. చిత్రంలో మరో హీరోయిన్గా నటి తాప్సీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. దీంతో ముఖ్య పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు జగపతిబాబును నటింప చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
ఇక ‘గీతాంజలి’కి సీక్వెల్
అంజలి కథానాయికగా రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన హారర్, కామెడీ చిత్రం ‘గీతాంజలి’కి సీక్వెల్ రానుంది. రాజ కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చినబాబు నిర్మించనున్నారు.త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి చినబాబు మాట్లాడుతూ -‘‘రాజ కిరణ్ ప్రతిభ గల దర్శకుడు. ఈ మధ్యకాలంలో ‘గీతాంజలి’ నాకు బాగా నచ్చిన సినిమా. అందుకని ఆయన దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ నిర్మించాలనుకున్నాను. వర్కింగ్ టైటిల్గా ‘సీక్వెల్ ఆఫ్ గీతాంజలి’ అని పెట్టాం. ఓ ప్రముఖ కథానాయిక నటించనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తారు’’ అన్నారు. -
దర్శకురాలిగా సెల్వరాఘవన్ భార్య
కాదల్ కొండాన్ చిత్రంతో కోలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్కు నాంది పలికిన దర్శకుడు సెల్వరాఘవన్. ఆ తరువాత కడా 7/జి రెయిన్ బో కాలనీ, వంటి వైవిధ్య ప్రేమ కథా చిత్రాలతో అనూహ్య విజయాలను సాధించిన సెల్వరాఘవన్ ఇటీవల కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. ఆయ న ఇటీవల తెరకెక్కించిన ఇరండామ్ ఉలగం. ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో చాలా నిరాశ చెందాలనే చెప్పాలి. అయితే ఇప్పుడాయన దర్శకత్వం బాధ్యతలను భార్య గీతాంజలి చేపట్టారన్నది తాజా వార్త. నటి సోనియా అగర్వాల్ నుంచి విడాకులు పొందిన తరువాత సెల్వరాఘవన్ తన వద్ద సహాయ దర్శకురాలిగా పని చేసిన గీంతాం జలిని పెళ్లి చేసుకున్నారు. తాను మెగాఫోన్ పట్టనున్న విషయం గురించి సెల్వరాఘవన్ భార్య గీతాంజలి వివరిస్తూ తన భర్త దర్శకత్వం వహించిన మయక్కం ఎన్న, ఇరండాం ఉలగం చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానన్నారు. సెల్వరాఘవన్ ప్రోత్సహించడంతో ఇప్పుడు మాలై నెరత్తు మయక్కం పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి తన భర్త సెల్వరాఘవన్ కథ, కథనం మాటలు సమకూర్చినట్లు వెల్లడించారు. ఇది ఈ తరం యువత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నూతన తారాగణం నటించనున్న ఈ చిత్రానికి కెమెరామెన్ రంజి సహాయకుడు శ్రీధర్. చాయాగ్రహణ అందిస్తున్నారని తెలిపారు. షూటింగ్ను మూడు వారాల క్రితం చెన్నైలో ప్రారంభించి నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు నవ మహిళా దర్శకురాలు గీతాంజలి వెల్లడించారు. -
ప్లీజ్ అంజలి.. ప్లీజ్ !
-
దెయ్యాలు.. డెమోలివ్వవు.. డెరైక్ట్గా పైకి పంపేస్తాయ్
రాజమండ్రిసిటీ : దెయ్యాలు డెమోలివ్వవు.. డెరైక్ట్గా పైకి పంపేస్తాయ్.. అంటూ ‘గీతాంజలి ’ సినిమా హీరోయిన్ అంజలి సినిమా యూనిట్తో స్థానిక స్వామి థియేటర్లో హల్చల్ చేసింది. ‘గీతాంజలి’ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం రాజమండ్రి చేరుకుంది. చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్ తొలుత షెల్టాన్ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ హిట్,..ఫ్లాప్ తప్ప చిన్నసినిమా, పెద్ద సినిమా అనేది ఉండదన్నారు. తమ చిన్నప్రయత్నానికి పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘గీతాంజలి’ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 కోట్ల వ్యాపారం చేసిందన్నారు. అనంతరం స్వామి థియేటర్కు వెళ్లిన యూనిట్కు ఘన స్వాగతం లభించింది. హీరోయిన్ అంజలి తనకు వేసిన పూలమాలలు ప్రేక్షకులపైకి విసిరి సినిమా విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన తాను ‘గీతాంజలి’ విజయం పంచుకునేందుకు ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెరైక్టర్ రాజ్కిరణ్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, కెమెరామెన్ సాయిశ్రీ రమణ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాకినాడలో... కల్చరల్(కాకినాడ) : గీతాంజలి చిత్ర యూనిట్ విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కాకినాడ మల్టిప్లెక్స్ థియేటర్కు విచ్చేసింది. యూనిట్ సభ్యులకు కవిత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ చౌదరి, రాజు స్వాగతం పలికారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర సమర్పకుడు కోన వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. నటి అంజలి, డెరైక్టర్ రాజ్కిరణ్ చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నటులు శ్రీనివాస్రెడ్డి, రాజేష్, మధు ప్రేక్షకులను అలరింపజేశారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, మల్టిప్లెక్స్ థియేటర్ రెడ్డి పాల్గొన్నారు. -
గీతాంజలి మూవీ సక్సెస్ మీట్
-
గీతాంజలి వచ్చింది
-
గీతాంజలి టీంతో చిట్ చాట్ -2
-
గీతాంజలి టీంతో చిట్ చాట్ -1
-
అంజలి.. న్యూస్ చదివితే..!
-
గీతాంజలి దర్శకుడికి గుండెపోటు
-
'గీతాంజలి' దర్శకుడు రాజ్కిరణ్ కి గుండెపోటు
హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన 'గీతాంజలి' చిత్ర దర్శకుడు రాజ్కిరణ్ గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మెహదీపట్నంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తుండటంతో ఒత్తిడికి గురైన రాజ్కిరణ్ ఈరోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. కాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో హీరోగా మారారు. రాజ కిరణ్ దర్శకత్వంలో సినీ రచయిత కోన వెంకట్ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. గీతాంజలి సినిమా ఈ నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే. -
‘దిల్’ రాజు యాక్టింగ్!
నిర్మాతలు అప్పుడప్పుడూ తెరపై కనిపించడం సర్వసాధారణం. రామానాయుడు తను నిర్మించిన చాలా సినిమాల్లో కొన్ని పాత్రలు పోషించారు. అలాగే, ఎమ్మెస్ రాజు కూడా కొన్ని సిని మాల్లో కనిపించారు. ఇలా చాలామంది నిర్మాతలు అప్పుడప్పుడూ తెరపై అతిథి పాత్రలు పోషించారు. ఇప్పుడా జాబితాలో ‘దిల్’ రాజు కూడా చేరారు. అయితే, ఆయన సొంత సినిమాలో కాకుండా బయటి సినిమాలో నటించడం విశేషం. అంజలి ప్రధాన పాత్రలో కోన వెంకట్ సమర్పణలో రూపొందిన ‘గీతాంజలి’ చిత్రంలో ఓ సన్నివేశంలో ఆయన పాత్ర ఆయనే చేశారు. నిర్మాత ‘దిల్’ రాజుగానే ఆయన ఇందులో కనిపిస్తారు.