'గీతాంజలి' దర్శకుడు రాజ్కిరణ్ కి గుండెపోటు
హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన 'గీతాంజలి' చిత్ర దర్శకుడు రాజ్కిరణ్ గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మెహదీపట్నంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తుండటంతో ఒత్తిడికి గురైన రాజ్కిరణ్ ఈరోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. కాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో హీరోగా మారారు. రాజ కిరణ్ దర్శకత్వంలో సినీ రచయిత కోన వెంకట్ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. గీతాంజలి సినిమా ఈ నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే.