తొలి అడుగు పూర్తి | nithin bheeshma released on august 16 | Sakshi
Sakshi News home page

తొలి అడుగు పూర్తి

Published Sun, Jul 28 2019 6:20 AM | Last Updated on Sun, Jul 28 2019 6:20 AM

nithin bheeshma released on august 16 - Sakshi

వెండితెర ‘భీష్మ’ తొలి అడుగు విజయవంతంగా ముగిసింది. ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ శుక్రవారంతో ముగిసింది. ఈ షెడ్యూల్‌ 25 రోజుల పాటు సాగింది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాని తెలిసింది. అలాగే ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ ఆగస్టు 16న ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement