శ్రీదేవి సంస్మరణ సభకి రజనీ గైర్హాజర్‌ | Sridevis Condolence Meet Will Be Held In Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో శ్రీదేవి సంస్మరణ సభ

Mar 10 2018 2:23 PM | Updated on Apr 3 2019 9:16 PM

Sridevis Condolence Meet Will Be Held In Chennai - Sakshi

సాక్షి, చెన్నై:  అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న లెజండరీ నటి శ్రీదేవి సంస్మరణ సభను కోలీవుడ్‌ ఇండస్ట్రీ నిర్వహించనుంది. ఆదివారం చెన్నైలోని  క్రౌన్‌ ప్లాజాలో  నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి  బోనీకపూర్‌ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి హాజరవనున్నారు. చెన్నై సినీ ప్రముఖులు హజరై..  శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోనున్నారు.

ఈ కార్యక్రమానికి  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హాజరు కాలేకపోతున్నారు. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం హిమాలయాలకు వెళ్లనుండటంతో ఈ సభకి రావటంలేదు. ఈ కార్యక్రమానికి  కమల్‌ హాసన్‌, అజిత్‌,భారతీరాజా ఇతర ప్రముఖులు హాజరవనున్నారు. చివరి వారం శ్రీదేవి సంస్మరణ సభ టాలీవుడ్‌ ఇండస్ట్రీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement