Boney Kapoor
-
జాన్వీ కపూర్ ఫాదర్తో ఎవరైనా పెట్టుకుంటారా?.. నిర్మాత నాగవంశీ కామెంట్స్
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ మూవీని 2023లో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే వచ్చార్రోయ్.. మళ్లొచ్చార్రోయ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రనిర్మాత సూర్య దేవర నాగవంశీ, డైరెక్టర్ కల్యాణ్ శంకర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరిని సంగీత్ శోభన్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. వీరి మధ్య జరిదిన సరదా సంభాషణలో బోనీకపూర్ అంశం తెరపైకి వచ్చింది. బోనీ కపూర్తో జరిగిన డిబేట్లో ఆయనను కొంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇంతకీ అక్కడ అసలేం జరిగిందని సంగీత్ శోభన్ ప్రశ్నించారు.దీనిపై నాగవంశీ స్పందిస్తూ..'అసలు అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే.. జాన్వీ కపూర్ లాంటి అమ్మాయికి ఫాదర్ ఆయన. అలాంటి వ్యక్తితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా డిస్రెస్పెర్ట్ చేస్తారా? అది కూడా ఆలోచించకుండా నేను బోనీ కపూర్ను గౌరవించలేదని అంటున్నారు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు.కాగా.. ముంబయిలో జరిగిన నిర్మాతల డిబేట్లో బాలీవుడ్, దక్షిణాది సినిమాల విషయంలో గతంలో నాగవంశీ మాట్లాడారు. నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. అయితే నాగవంశీ వ్యాఖ్యలను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఖండించారు. -
శ్రీదేవి చివరి చిత్రానికి సీక్వెల్.. ఖుషీ కపూర్పై నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ అగ్రనిర్మాత, డైరెక్టర్ బోనీ కపూర్ తాజాగా ఓ సినిమాను ప్రకటించారు. తన భార్య, దివంగత నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించునున్నట్లు వెల్లడించారు. 2017లో వచ్చిన మామ్ మూవీకి కొనసాగింపుగా తాజాగా ఉండనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో తన చిన్న కూతురైన ఖుషీ కపూర్ సైతం నటిస్తున్నట్లు తెలిపారు. ఐఐఎఫ్ఏ-2025 అవార్డుల వేడుకకు హాజరైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.అయితే శ్రీదేవి సీక్వెల్ మూవీలో ఖుషీ కపూర్ను ఎంపిక చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి స్థానంలో ఖుషీ చేయడమేంటి? ఇది చూస్తుంటే పెద్ద జోక్గా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదే నిజమైతే డిజాస్టర్ ఖాయమని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దయచేసి ఈ సినిమాకు జాన్వీ కపూర్ను తీసుకోవాలని ఓ నెటిజన్ కోరాడు. వీలైతే యామీ గౌతమ్, కంగనా రనౌత్, బిపాసా బసుని తీసుకోండి కానీ.. ఖుషీ కపూర్కు నటనా నైపుణ్యాలు లేవని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.నటన విషయానికొస్తే ఖుషీ కపూర్ చివరిసారిగా ఇబ్రహీం అలీ ఖాన్తో నాదానియన్లో కనిపించింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా బోనీ కపూర్ చేసిన ప్రకటనతో నెటిజన్స్ తీవ్ర నిరాశకు గురువుతున్నారు. శ్రీదేవీ మూవీ సీక్వెల్లో మాత్రం ఖుషీ కపూర్ వద్దని తెగేసి చెబుతున్నారు. మామ్ సీక్వెల్ కోసం ఖుషీని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. 2018లో ఆమె మరణానికి ముందు నటించిన చివరి చిత్రమిదే. శ్రీదేవి కెరీర్లో 300వ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, పాకిస్థానీ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీదేవి మరణానంతరం 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మామ్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. -
అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!
సెలబ్రిటీల లైష్స్టైల్, వారుండే విలాసవంతమైన భవనాలు, వాడే కార్లపై ఉండే అసక్తి ఇంతా అంతా కాదు. అతిలోకి సుందరి వారసురాలు, టాలీవుడ్లో దేవర మూవీతో దుమ్మురేపిన బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ఇల్లు అంటే క్రేజ్ మామూలుగా ఉండదుగా. సోదరి ఖుషీ కపూర్తో కలిసి ముంబైలోని విలాసవంతమైన డూప్లెక్స్లో నివసిస్తుంది. పాలి హిల్లోని విలాసవంతమైన ఈ భవనం విలువ రూ. 65 కోట్లు. తెలుపు రంగు థీమ్తో నిర్మించిన లేటెస్ట్, క్లాసిక్ ఇంటీరియర్కు నిదర్శనంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొరియోగ్రాఫర్ , ఫిల్మ్ మేకర్, ఫరా ఖాన్ ఇటీవల తన తాజా వ్లాగ్లో బోనీ కపూర్ అద్భుతమైన ముంబై భవనాన్ని సందర్శించింది. ఈ సందర్బంగా ఈ ఇంటి విశేషాలు సందడిగామారాయి పదండి అంత అదమైన భవనం, సౌకర్యాల గురించితెలుసుకుందాం. ఫరాఖాన్ అందించిన వివరాల ప్రకారం తొలి చూపులోనే పాలి హిల్లోని కుబెలిస్క్ భవనం(Kubelisque Building) పాలరాయితో, లగ్జరీ లుక్తో ఆకట్టుకుంటుంది. పెయింటింగ్లు, ఫోటోలు, ఇతర కళాఖండాలతో అలంకరించడం మరో ప్రత్యేకత. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని ఈ అపార్ట్మెంట్ను 2022లో కొనుగోలు చేసిందట జాన్వి. తన జుహు అపార్ట్మెంట్ని రాజ్కుమార్ రావ్కి విక్రయించి మరీ ఆ ఇల్లును ఇంటిని 65 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా,సంజయ్ దత్ లాంటి స్టార్లు జాన్వీ ఇంటికి పక్కనే నివస్తుండటం విశేషం. ఇల్లు మొత్తం 8,669 చదరపు అడుగులతో నిర్మించారు. రెండు అంతస్తుల్లో అంతస్తులలో నిర్మించిన ఈ గృహంలో ఓపెన్ కిచెన్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్,పెద్ద ఓపెన్ గార్డెన్ ఉన్నాయి. బార్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ కపూర్ పార్టీలు జరుగుతాయట.ఐదు కార్ల పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.శ్రీదేవి పెయింటింగ్ అలనాటి అందాల తారు శ్రీదేవి వేసిన పెయింటింగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు ఇంట్లో బెడ్రూమ్లు ,ఇతర లివింగ్ రూంకు దారతీసే మెట్లు , పక్కనే భారీ అద్దం అందంగా అమర్చారు. అలాగే మరొక గోడ కుటుంబ ఫ్రేమ్ , దివంగత భార్య శ్రీదేవికి బోనీ కపూర్ కుమార్తెలు ఖుషీ . జాన్వీ నివాళులర్పించే ఫోటో, ఇతర మెమరీస్ ఫోటోలుగా అమరాయి. పొడవైన చెక్క డైనింగ్ టేబుల్పై వేలాడుతున్న భారీ క్రిస్టల్ షాన్డిలియర్తో డైనింగ్ మరింత సొగసుగా ఉంటుంది. అలాగే ఈ ఇంట్లోని ఆర్ట్వర్క్ అంతా తన తల్లి శ్రీదేవే సెలెక్ట్ చేసినట్టు గతంలో ఒక సందర్బంగా స్వయగా జాన్వీనే తెలిపింది. తన తల్లి ఎంచుకున్న ఈ పెయింటింగ్స్, ఆర్ట్వర్క్లేనని ఆమె గుర్తు చేసుకుంది. అందుకే ఈ ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నటే, అమ్మ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుందని చెప్పింది. -
తప్పు అల్లు అర్జున్ది కాదు, వాళ్లది! : బోనీ కపూర్
సంధ్య థియేటర్ ఘటనకు హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను బాధ్యుడిని చేయడం తప్పని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) అన్నారు. ఆ ఘటనలో అల్లు అర్జున్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. హీరోల సినిమాను ఫస్ట్ డే చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతుంటారు. ఒకసారేమైందంటే హీరో అజిత్ సినిమా తెల్లవారుజామున ఒంటి గంటకు థియేటర్లో ప్రదర్శించారు. ఆ సమయంలో కూడా థియేటర్ బయట దాదాపు 25 వేల మంది ఉన్నారు.థియేటర్ బయట వేలమంది జనంసినిమా చూసి బయటకు వచ్చేసరికి 3.30 నుంచి నాలుగైంది. అప్పుడు కూడా జనాలు అలాగే అక్కడే నిల్చున్నారు. అజిత్ సినిమా అనే కాదు, రజనీకాంత్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్బాబు.. ఇలా స్టార్స్ సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఆరోజు సంధ్య థియేటర్ వద్ద అభిమాని మృతి చెందిన ఘటనకు అల్లు అర్జున్ను బాధ్యుడిని చేయడం సరికాదు. సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనాల వల్లే ఆ విషాదం జరిగింది అని బోనీ కపూర్ పేర్కొన్నారు.తొక్కిసలాట.. మహిళ మృతికాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లాడు. అయితే బన్నీ రాకతో జనం అతడిని చూసేందుకు ఎగబడగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెలలో అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిలుతో బన్నీ మరునాడే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో పుష్ప నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాన్ని సైతం పోలీసులు విచారిస్తున్నారు.పుష్ప 2 సినిమా..పుష్ప 2 సినిమా విషయానికి వస్తే 2021లో వచ్చిన పుష్ప మూవీకి ఇది సీక్వెల్గా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1760 కోట్లమేర రాబట్టింది.చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ అర్మాన్ మాలిక్ -
ఎలా గౌరవించాలో మీరు నేర్పించనక్కర్లేదు.. బాలీవుడ్కు నాగవంశీ కౌంటర్
బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా.. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ! తాజాగా ఇదే అంశంపై నిర్మాతల రౌండ్ టేబుల్లో తెలుగు నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi), హిందీ ప్రొడ్యూసర్ బోనీకపూర్ (Boney Kapoor) మాట్లాడారు. దక్షిణాది ఇండస్ట్రీ బాలీవుడ్పై ప్రభావం చూపించిందని, కానీ హిందీ చిత్ర పరిశ్రమ మాత్రం ముంబైకే పరిమితమైందని సెటైర్లు వేశాడు. అది బోనీకపూర్ ఒప్పుకోలేదు. 'రష్యాలో ఇప్పటికీ రాజ్కపూర్ను గుర్తు చేసుకుంటారు. ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ గురించి మాత్రమే మాట్లాడతారు. ఎగతాళి చేస్తున్నారేంటి?షారూఖ్, బిగ్బీకి 'ద కింగ్ ఆఫ్ మొరాకో' అన్న బిరుదు ఇచ్చారు'.. అని బోనీ చెప్పుకుంటూ పోతుండగా కూడా మధ్యలో నాగవంశీ కలగజేసుకున్నాడు. అతడిని పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో దూరడంపై బాలీవుడ్ (Bollywood) డైరెక్టర్ సంజయ్ గుప్తా మండిపడ్డాడు. బోనీగారిని ఎగతాళి చేస్తున్న ఈ అసహ్యకరమైన వ్యక్తి ఎవరు? అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఫైర్ అయ్యాడు. అల్లు అరవింద్, సురేశ్ బాబు వంటి సీనియర్ నిర్మాతల ముందు ఇలా దర్జాగా కూర్చుని ముఖానికి వేళ్లు చూపిస్తూ మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించాడు.బాలీవుడ్ అక్కడే ఆగిపోయిందిబాలీవుడ్ సినీ విశ్లేషకులు సుమిత్ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ నాగవంశీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగు చిత్రపరిశ్రమ పాన్ ఇండియా ట్రెండ్ను పరిచయం చేసిందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ ఇంకా మసాలా సినిమాల్నే నమ్ముకుంటూ ఎక్కడో ఆగిపోయింది. కానీ ఇక్కడ బోనీకపూర్ గారిని అగౌరవపర్చడం అనవసరం. చెప్పాలనుకున్నదేదో మర్యాదగా చెప్పుంటే అయిపోయేది. ఎంతోమంది దక్షిణాది ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు, హీరోలు హిందీ సినిమాపై ఎనలేని ప్రేమ చూపిస్తారు.విమర్శ తప్పు కాదు, కానీ!అమితాబ్, ప్రకాశ్ మెహ్రా, యష్ చోప్రా, మన్మోహన్ దేశాయ్ వంటి గొప్పవాళ్ల సినిమాలను ఆదర్శంగా తీసుకునే కమర్షియల్ సినిమాలు తీస్తున్నామని చెప్తుంటారు. సౌత్ సినిమాల కలెక్షన్స్లో హిందీ బాక్సాఫీస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మర్చిపోవచ్చు. విమర్శ తప్పనడం లేదు, కానీ అవమానించడం మాత్రం తప్పే! ఇలా యాటిట్యూడ్ చూపిస్తే పాతాళంలోకి వెళ్లిపోతారు జాగ్రత్త! ఇది ప్రతిఒక్కరికీ వర్తిస్తుంది అని ట్వీట్ చేశాడు.మీరు నేర్పించనక్కర్లేదుదీనికి నిర్మాత నాగవంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పెద్దవారిని ఎలా గౌరవించాలనేది నువ్వు నేర్పించనక్కర్లేదు. బోనీగారిని మీకంటే ఎక్కువే గౌరవిస్తాం. ఆ చర్చలో ఎక్కడా బోనీని అగౌరవపర్చలేదు. మేమంతా ఎంతో బాగా మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం. ఇంటర్వ్యూ అయ్యాక ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకున్నాం. కాబట్టి నువ్వు చూసినదాన్ని బట్టి అదే నిజమని డిసైడ్ అయిపోకండి అని రాసుకొచ్చాడు. You don’t need to teach us how to respect elders, we respect boney ji more than u guys do and there was no disrespect towards boney ji in that conversation it was a healthy discussion, me and boney ji had a nice laugh and hugged each other after the interview… So please dont…— Naga Vamsi (@vamsi84) December 31, 2024 చదవండి: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..? -
బాలీవుడ్పై నాగవంశీ అలాంటి కామెంట్స్.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాజాగా నిర్వహించిన నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. దక్షిణాది ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలను చూసే విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, యానిమల్, జవాన్ చిత్రాలతో ఆ మార్పును చూశామని అన్నారు.అయితే నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్పై బాలీవుడ్ డైరెక్టర్ బోనీకపూర్ స్పందించారు. దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉందన్నారు. అలాగే తెలుగు సినిమాలకు యూఎస్లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.. అంతేకాకుండా తమిళ చిత్రాలకు సింగపూర్, మలేషియాలో డిమాండ్ ఉందని తెలిపారు. గల్ఫ్ దేశాలతో పోలిస్తే యూఎస్ పెద్ద మార్కెట్ అని బోనీ కపూర్ అన్నారు. అయితే మలయాళ సినిమాకు గల్ఫ్లో భారీ మార్కెట్ ఉందని నాగవంశీ అన్నారు.అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైందన్న నాగవంశీ కామెంట్స్ను బోనీ కపూర్ వ్యతిరేకించారు. పుష్ప- 2 హీరో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్కి పెద్ద అభిమానిని అని చెప్పిన విషయాన్ని బోనీకపూర్ గుర్తు చేశారు. అంతేకాకుండా తాను సీనియర్ ఎన్టీఆర్కు బిగ్ ఫ్యాన్ అని అన్నారు. దీనికి స్పందిస్తూ.. తాను షారూఖ్, అల్లు అర్జున్, చిరంజీవికి పెద్ద అభిమానినని నాగవంశీ అన్నారు.ఇటీవల మీడియాతో అమితాబ్ బచ్చన్ మాట్లాడిన విషయాన్ని బోనీ కపూర్ గుర్తు చేశారు. సినిమాకు భాష అడ్డంకి కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఈరోజు మరాఠీ సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయని బోనీకపూర్ తెలిపారు. మరాఠీ సినిమా ఈ తరహా బిజినెస్ చేస్తుందని ఎవరూ ఊహిందలేదన్నారు. -
శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్
ఇప్పటికీ నా భార్య నాతోనే ఉన్నట్లుంది అంటున్నాడు నిర్మాత బోనీ కపూర్. బరువు తగ్గడమే పనిగా పెట్టుకున్న ఆయన దాదాపు 14 కిలోలు తగ్గిపోయాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మొదట్లో నాకు తెలియకుండానే కొంత బరువు తగ్గాను. దాదాపు 13-14 కిలోల మేర తగ్గానని తెలుసుకున్నప్పుడు మరింత బరువు తగ్గాలనిపించింది. పైగా కాస్త సన్నబడ్డాక నా శరీరాకృతి కూడా మారింది. అలా అధిక బరువు ఉన్న నేను 95 కిలోలకు వచ్చాను. నాకు నేనే నచ్చలేదునా ఎత్తూపొడుగుకు 87-88 ఉండాలట! అంటే ఇంకా కనీసం ఎనిమిది కిలోలైనా తగ్గాల్సి ఉంది. తు ఝూటి మే మక్కర్ సినిమా సమయంలో అయితే బొద్దుగా ఎప్పటిలాగే ఉన్నాను. ఎప్పుడైతే నన్ను నేను స్క్రీన్పై చూసుకున్నానో నాకు నేనే నచ్చలేదు. అందుకే ఆ సినిమా తర్వాత నేను సన్నబడాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా భార్య శ్రీదేవి ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపించేది. తనతో కలిసి వాకింగ్కు వెళ్లేవాడిని, జిమ్కు వెళ్లేవాడిని.నా వల్ల కాలేదుఎప్పుడు, ఏం తినాలనే విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించేది. నేనూ ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. కానీ గత రెండేళ్లుగా నన్ను నేను చూసుకున్నప్పుడు మార్పు అవసరం అనిపించింది. ఈ ప్రయాణంలో శ్రీదేవి నావెంటే ఉన్నట్లుగా ఉంది. బరువు తగ్గడానికి తను నన్ను ప్రేరేపిస్తున్నట్లనిపిస్తోంది. ఇప్పుడు నా లుక్ చూసి పై లోకంలో ఉన్న నా భార్య కచ్చితంగా గర్వపడుతుంది అంటున్నాడు. కాగా శ్రీదేవి- బోనీకపూర్ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ, ఖుషి కపూర్ సంతానం. 2018లో శ్రీదేవి మరణించింది.చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ రెండో సీజన్ -
శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటేనే వింతగా చూసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా నిర్మాత బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయనకు అప్పటికే పెళ్లయి కొడుకు కూతురు ఉన్నారు. ఆ కుర్రాడే అర్జున్ కపూర్. హిందీలో హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తండ్రి రెండో పెళ్లి, తల్లితో బాండింగ్ గురించి బయటపెట్టాడు.'నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్నఅమ్మ విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకునేప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావుడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయటవాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది'(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'ఓ వయసొచ్చాక తొలి సినిమా చేశా. కానీ అది రిలీజ్ కావడానికి ముందే అమ్మ చనిపోయింది. జీవితంలో ఇలా ఎదురుదెబ్బలు తగిలేసరికి నన్ను నేను చాలా మార్చుకున్నా. బాగా ఆలోచించడం నేర్చుకున్నా. దీంతో రానురాను నాన్నతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన సంతోషంగా ఉన్నంత కాలం నేను దాన్ని తప్పు అనుకోను' అని అర్జున్ కపూర్ చెప్పాడు.1983లో బోనీకపూర్ - మోనా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు (అర్జున్, అన్షుల) పిల్లలు. 1996లో ఈ జంట విడిపోయింది. అదే ఏడాది బోనీకపూర్.. నటి శ్రీదేవిని వివాహమాడాడు. ఆ సమయంలో ఇది బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక) -
జూనియర్ ఎన్టీఆర్కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఉత్తరాది, దక్షిణాది వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి ఆహార శైలి, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. దివంగత నటి శ్రీదేవిది సౌత్ అయితే ఆమె భర్త బోనీకపూర్ది నార్త్. దీనివల్ల ఉదయం అల్పాహారం చేసేటప్పుడు అమ్మ ఎప్పుడూ నాన్నతో గొడవపడేదని చెప్తోంది హీరోయిన్ జాన్వీ కపూర్.టిఫిన్ దగ్గర గొడవదేవర ప్రమోషన్స్లో భాగంగా జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. ఉదయం ఆలూ పరాటా తినే నాన్న... అమ్మ వల్ల ఇడ్లీ సాంబార్ అలవాటు చేసుకున్నాడు. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ నార్త్ ఇండియన్లా గొడవపడేది అని పేర్కొంది. నార్త్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు తారక్.. శ్రీదేవి అని టక్కున సమాధానమిచ్చాడు. ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే!అలాగే జాన్వీ గురించి ఓ చాడీ చెప్పాడు. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి భోజనం తినిపించాను. నేను ముంబై వచ్చినప్పుడు మాత్రం ఆమె ఒక్కసారి కూడా ఇంటి భోజనం లేదా హోటల్ ఫుడో పంపించలేదని తారక్ అనడంతో జాన్వీ పగలబడి నవ్వేసింది. అటు సైఫ్.. సౌత్లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు శ్రీదేవి అని బదులిద్దామని రెడీగా ఉన్నానన్నాడు. ఈ ఫన్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్గా మారింది. పూర్తి ఎపిసోడ్ నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 28న ప్రసారం కానుంది. -
ఫేమస్ కావడానికే టార్గెట్ చేశాడు: అర్షద్ వార్సీపై బోనీ కపూర్ ఆగ్రహం
బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో ప్రస్తుతం ఆ పేరు ఒక్కటే వినిపిస్తోంది. ప్రభాస్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమ్లోకి వచ్చేశాడు నటుడు అర్షద్ వార్సీ. అతను చేసిన కామెంట్స్ ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర జోకర్ లా ఉందంటూ అవమానకర రీతిలో మాట్లాడారు. అయితే అర్షద్ కేవలం ప్రభాస్ను మాత్రమే కాదు.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్పై సైతం విమర్శలు చేశారు. అతని సినిమా కోసం పని చేశానని.. కానీ సరైన పారితోషికం చెల్లించలేదని అర్షద్ వార్సీ ఆరోపణలు చేశారు.అయితే తాజాగా తనపై చేసిన కామెంట్స్పై బోనీ కపూర్ రియాక్ట్ అయ్యారు. అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వింటే కామెడీగా ఉందని అన్నారు. ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని.. ఇప్పుడు అతనికి నేను దొరికానని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. శ్రీదేవి, అనిల్ కపూర్ జంటగా 1993లో వచ్చిన చిత్రం రూప్ కి రాణి చోరోన్ కా రాజా. ఈ సినిమాలోని ఒక పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు బోనీ కపూర్ ప్రొడక్షన్ హౌస్ తనకు రూ. 25 వేలు తక్కువగా చెల్లించిందని అర్షద్ వార్సీ ఇటీవల ఆరోపించాడు. తాజాగా వార్సీ ఆరోపణలపై బోనీ కపూర్ కౌంటరిచ్చారు.బోనీ మాట్లాడుతూ..'అర్షద్ స్టేట్మెంట్ చదివి నవ్వుకున్నా. 1992లో సినిమా పాటను షూట్ చేశాం. ఆ సమయంలో అతను పెద్ద స్టార్ కాదు. అతనికి అంత పెద్ద మొత్తం ఎవరు చెల్లించారు?. షూటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పడుతుందని అనుకున్నాం. కానీ మూడు రోజుల్లోనే పూర్తయింది. అర్షద్కు రోజుకు రూ.25 వేలు చెల్లించారు. మూడు రోజులకు కలిపి రూ.75,000 ఇచ్చారు. అసలు పారితోషికం విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కానీ ఆయన ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నేళ్లు ఎందుకు మాట్లాడలేదు' అని ప్రశ్నించారు. అంతకుముందు ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ మాట్లాడుతూ..'ఆ సినిమా వర్క్ కోసం నన్ను సంప్రదిస్తే కొరియోగ్రఫీ చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని రూ.లక్ష పారితోషికం అడిగా. అప్పుడు ఓకే అన్నారు. కానీ పాటను త్వరగా పూర్తి చేయమని నన్ను అడిగారు. నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పా. మూడు రోజుల్లోనే పని పూర్తి చేశా. చెక్కు తీసుకోవడానికి వెళ్తే రూ.75 వేలే ఇచ్చారు. అదేంటని అడిగితే నాలుగు రోజులకు రూ.లక్ష కదా.. మూడు రోజుల్లోనే పూర్తయినందుకు అంతే అన్నారని' తెలిపారు. -
తనే ఆదర్శం.. 14 కిలోలు తగ్గా.. ఇంకా..: బోనీ కపూర్
దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ తన శరీరంపై దృష్టి పెట్టాడు. బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఈపాటికే 14 కిలోల దాకా బరువు తగ్గాడు. తాజాగా తన ట్రాన్స్ఫర్మేషన్ను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో కూడా షేర్ చేశాడు. సోమవారం (ఆగస్టు 19న) ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలో బోనీ బక్కచిక్కి కనిపించాడు.నా జుట్టు ఒత్తుగా కనిపిస్తోంది. ఇప్పుడు మరింత బెటర్గా కనిపిస్తున్నాను. ఇప్పటివరకు 14 కిలోలు తగ్గాను.. ఇంకా 8 కిలోల దాకా తగ్గాల్సి ఉంది. నా జాన్ (శ్రీదేవి)ను ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గే పని మొదలుపెట్టాను. ఆమె ఆలోచనలు ఎప్పుడూ నా వెంటే ఉంటాయి. తను నిత్యం నాతోనే ఉంటుంది అని క్యాప్షన్లో రాసుకొచ్చాడు. బోనీని ఇలా సన్నగా చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు అతడిని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.ఎప్పుడూ బట్టతలతో కనిపించే బోనీ కపూర్ ఇప్పుడు ఒత్తైన జుట్టుతో కనిపించడంతో పలువురూ షాక్కు గురవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. అందుకే బోనీకి బట్టతల కనిపించకుండా పోయింది. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
అమ్మ బ్లాక్బస్టర్ చిత్రంలో జాన్వీకపూర్.. ఆమె ఏమన్నారంటే?
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 1987లో వచ్చి శ్రీదేవి బ్లాక్బస్టర్ మూవీ మిస్టర్ ఇండియాకు సీక్వెల్ తీస్తే అందులో నటిస్తారా? అని ఆమెను అడిగారు. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానమిచ్చింది. మిస్టర్ ఇండియా చ్తిరంలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించారు.జాన్వీ మాట్లాడుతూ.. "ఇండియన్ సినిమాల్లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో మిస్టర్ ఇండియా ఒకటి. అలాంటి సినిమా మళ్లీ రీమేక్ చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. దాని కోసం నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. ఆ సినిమా చేయాలా? వద్దా? అనేది నిర్మాతలకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. ఈ విషయం డైరెక్టర్ ఎవరో వారికే బాగా తెలుస్తుంది' అని తెలిపింది.తన తండ్రి బోనీ కపూర్ గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ ఆయన సినిమాలో ఇష్టం లేదని చెప్పలేదు. ఆయన తీర్పును ఎక్కువగా విశ్వసిస్తా. నేను దానిని తిరస్కరించలేను. నన్ను తన సినిమాలో తీసుకోమని నేనేప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఆయన కుమార్తెగా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాన్నకు నచ్చిన విధంగా పనిచేయాలని నేను కోరుకుంటా. అంతేకానీ దయచేసి నన్ను మీ సినిమాలోకి తీసుకోండి అని వేడుకోను' అని పేర్కొంది.సీక్వెల్పై బోనీ కపూర్కాగా.. గతేడాది అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన మిస్టర్ ఇండియా చిత్రానికి సంబంధించిన సీక్వెల్పై హింట్ ఇచ్చాడు. దీనికోసం వర్క్ జరుగుతోంది.. త్వరలోనే ప్రకటిస్తాం అని పోస్ట్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కాగా..1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాకు శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. నర్సింహా ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై బోనీ కపూర్, సురీందర్ కపూర్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అన్నూ కపూర్, అజిత్ వచాని, హరీష్ పటేల్, దివంగత సతీష్ కౌశిక్, అహ్మద్ ఖాన్, అఫ్తాబ్ శివదాసాని తదితరులు నటించారు. -
గాంధీ-అంబేడ్కర్ అప్పుడేం మాట్లాడుకున్నారో వినాలనుకుంటున్నా : జాన్వీ కపూర్
ఒక టైమ్ మెషీన్లో మీకు చరిత్రలోకి వెళ్లే అవకాశం కల్పిస్తే మీరేం చేస్తారు? చరిత్రలో ఎక్కడికి వెళ్లాలనుకుంటారు? ఎవరిని చూడాలనుకుంటారు? ఎలాంటి చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలనుకుంటారు? ఇదే ప్రశ్న ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ని ఓ రిపోర్టర్ అడిగాడు. ఆమె సమాధానం విన్న తరువాత ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అంతేకాదు ఆలోచనలో పడ్డారు. ఓ మనిషి ముఖం చూసి ఎప్పుడూ వారిని అంచా వేయొద్దని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె కొత్త సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' ప్రమోషన్లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. టైమ్ మెషీన్లో ప్రయాణం చేసే ఛాన్స్ వస్తే ఎక్కడకు వెళ్తారని యాంకర్ అడగ్గా... తన తల్లి శ్రీదేవిని చూడటానికి వెళ్తాననే సమాధానం ఇస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ జాన్వీ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. తాను చరిత్రలో గాంధీ, అంబేద్కర్ పూనా ఒడంబడికకి ముందు మాట్లాడుకున్న సంభాషణ వినాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పింది. చరిత్రలో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో గాంధీ-అంబేద్కర్లు రెండు విభిన్న అభిప్రాయాలతో చేసిన చర్చ తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నో చర్చల తర్వాత ఇద్దరు ఓ నిర్ణయానికి రావడం, అది దేశ భవిష్యత్తులో కీలకంగా మారడం తనను ఎంతగానో ప్రభావం చేసిందని జాహ్నవి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)నిజంగానే ఒక హీరోయిన్ అదీ స్టార్ హీరోయిన్ కూతురు, చరిత్రకు సంబంధించి ఇంతటి జ్ఞానం కలిగి ఉంటుందా అని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాదు రిజర్వేషన్లు, భారత సమాజం మీద జాన్వీకి ఉన్న అవగాహన చాలామందిని ఆలోచింపజేసింది. ముంబైలాంటి కాస్మోపాలిటన్ సిటీలో పెరిగిన జాన్వీ.. దేశ సామాజిక పరిస్థితుల గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా లోతుగా మాట్లాడింది. తాను హిస్టరీ క్లాసులు బంక్ కొట్టి, యుద్ధ సినిమాలు చూసి పరీక్షలు రాసిందో కూడా చెప్పుకొచ్చింది.నెపోటిజమ్ గురించి కూడా జాహ్నవి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. తాను శ్రీదేవీ, బోనీకపూర్ కూతురు అయినందుకే చాలా ఈజీగా అవకాశాలు వచ్చాయని అయితే వాటిని నిలబెట్టుకునేందుకు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డానని చెప్పింది. తన తండ్రి బోనీకపూర్ శ్రీదేవీని ఎంతలా ప్రేమించారో జాన్వీ చాలా అందంగా వివరించింది. పెళ్లికి ముందు శ్రీదేవీతో బోనీకపూర్ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవారని, చాలాసార్లు శ్రీదేవిని దొంగచాటుగా కలిసేందుకు బాల్కనీ ఎక్కి మరీ వెళ్లేవారని చెప్పుకొచ్చింది.-ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ(ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!) -
అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!
ఎవరైనా దేని గురించైనా ఆరా తీస్తే చాలు.. కొందరు ఏదీ దాచుకోకుండా ఉన్నదంతా కక్కేస్తారు. దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ కూడా అంతే! మీడియా అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా బదులిస్తుంటాడు. ఇంటి విషయాలను కూడా పూసగుచ్చినట్లు చెప్తుంటాడు. ఈ వైఖరి వల్ల పిల్లలు ఇబ్బందిపడుతున్నారట! ఈ విషయాన్ని బోనీ కపూరే వెల్లడించాడు.నా కుటుంబం గురించి అడగొద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్కు.. పబ్లిక్గా కుటుంబం గురించి పొరపాటున ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా? దీనివల్ల ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చాయా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకతడు 'ఇది చాలాసార్లు జరిగింది. అందుకే ఇంటర్వ్యూకి కూర్చునే ముందు అక్కడున్నవారికి కేవలం నా గురించి మాత్రమే అడగండి, నా కుటుంబం గురించి అడగొద్దు అని మరీ మరీ చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటాను. వాళ్లకు నచ్చదుఅది నా పిల్లలకు అస్సలు నచ్చదు. ఎందుకలా ప్రతీది చెప్తావని కోప్పడతారు. ముఖ్యంగా యాక్టింగ్కు సంబంధించిన విషయాలను జనాలే తెలుసుకోవాలి తప్ప తమంతట తాముగా చెప్పకూడదంటారు. నేనేమో అవన్నీ ముందే లీక్ చేస్తుంటాను. వారు హర్ట్ అయ్యారని అర్థమవగానే తప్పయిపోయిందంటూ సారీ చెప్పేస్తాను' అని బదులిచ్చాడు.అందరం ఏడ్చేశాంఈ మధ్య అలాంటిదేమైనా జరిగిందా? అన్న ప్రశ్నకు.. 'ఇప్పట్లో ఏమీ జరగలేదు కానీ గతంలో నేను మీడియా ముందు ఉన్నదంతా మాట్లాడటం వల్ల వాళ్లు చాలా అప్సెట్ అయ్యారు. నన్ను తిట్టారు. నేను బాధపడేసరికి ఏడ్చేశారు. నేనూ ఏడ్చేశాను. సారీ చెప్తుంటే అలా మాట్లాడొద్దని వాళ్లే బుజ్జగించారు' అని బోనీకపూర్ చెప్పుకొచ్చాడు.చదవండి: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది! -
స్టార్ హీరోయిన్తో అసభ్య ప్రవర్తన.. బోనీ కపూర్పై నెటిజన్స్ ఫైర్!
అజయ్ దేవగణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మైదాన్. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమిత్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. భారత ఫుట్బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే తాజాగా ఈ సినిమా చూసేందుకు మైదాన్ నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ థియేటర్కు వచ్చారు. అదే సమయంలో హీరోయిన్ ప్రియమణితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే బోనీ కపూర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రియమణి నడుముపై చేతులు వేస్తూ కనిపించారు. అంతే కాకుండా ఎలా పడితే అలా తాకుతూ ప్రియమణిని ఇబ్బందికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ ఫైరవుతున్నారు. 68 ఏళ్ల వయసులో ఉన్న ప్రముఖ నిర్మాత అసభ్యకరంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. "ప్రియమణి లాంటి అందరికీ బాగా తెలిసిన హీరోయిన్తో అసహ్యంగా ప్రవర్తించడం బాగాలేదు. ఇక రాబోయే నటీమణులతో బోనీ ఎలా ప్రవర్తిస్తాడో నేను ఊహించలేకపోతున్నా"అంటూ రాసుకొచ్చారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ..' మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని గుర్తుంచుకోండి. ఇలా ప్రవర్తించడం చాలా అవమానకరంగా ఉంది' అని పోస్ట్ చేశారు. బోనీ కపూర్ జీ మీరేమైనా ఇండియాలో హార్వే వైన్స్టెయిన్ అనుకుంటున్నారా? లేదా ఆ బహుమతిని తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. కాగా.. బోనీ కపూర్ మహిళలతో ఇలా అనుచితంగా ప్రవర్తించడం మొదటిసారి కాదని నెటిజన్లు అంటున్నారు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రనిర్మాత జిగి హడిద్ బేర్ నడుముపై చేతులు వేసి ఫోటోలకు పోజులిచ్చారు. అప్పుడు కూడా నెటిజన్లు విమర్శలు చేశారు. అంతే కాదు ఓ కార్యక్రమంలో ఊర్వశి రౌతేలాతోనూ అలాగే ప్రవర్తించారు -
శ్రీదేవి బయోపిక్కు అనుమతి ఇవ్వను
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్లో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాతో బోనీ కపూర్ మాట్లాడినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’కు బోనీ కపూర్ ఓ నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు బోనీ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్లో మరణించిన సంగతి తెలిసిందే. -
స్టైయిలిష్ లుక్లో స్లిమ్గా కనిపిస్తున్న బోనీ కపూర్! ఎలా తగ్గారంటే..?
చిత్ర నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోని కపూరు స్లిమ్గా కనిపిస్తున్నారు. చాలా బరువు ఉండే ఆయన మంచి ఫిట్నెస్ లుక్లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. తాను బరువుత తగ్గేందుకు ఎలాంటి కసరత్తులు చేశారో వెల్లడించారు. అంతేగాదు తనలా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇంతకీ బోనీ కపూర్ వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే.. గతంలో 2004లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోల్లో బోనీ కపూర్ చాలా లావుగా, ఏజ్డ్ పర్సన్లా కనిపించారు. ఆ తర్వాత కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత పలు సందర్భాల్లో కెమరాకు చిక్కిన పోటోల్లో కూడా లావుగానే ఉన్నారు. అలాంటి ఆయాన అనూహ్యంగా 12 కిలోలలకు పైగా బరువు తగ్గడమే గాక న్యూలుక్లో కనిపిస్తున్నారు. బోనీ కపూరేనా అనిపించలా కొత్త స్టయిలిష్ లుక్లో దర్శనమిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఉన్న బోనీకపూర్కి ఈ న్యూలుక్లో ఉన్న బోనీ కపూర్కి ఎంత తేడా అని షాకయ్యేలా విజయవంతంగా బరువుతగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు బోనీకపూర్ మాట్లాడుతూ.."బరువు తగ్గేందుకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అలాగే తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారే తొందరగా బరువు తగ్గగలరని అన్నారు. అందుకోసం క్రమశిక్షణతో కూడిని జీవనశైలిని అవలంభించాల్సి ఉంటుందన్నారు. తాను బరువు తగ్గే క్రమంలో నటి జాన్వీ కపూర్ ఉత్సహాపరిచేలా ప్రోత్సహించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. జాన్వీ సోషల్ మీడియాలో "నా పాపా బరువు తగ్గడంలో విజంయ సాధించినందుకు గర్వంగా ఉంది." అని పోస్ట్ చేసింది. ఇలా తన పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహమే తనను తొందరగా బరువు తగ్గేలా చేసేందుకు దోహదపడిందన్నారు. అలాగే తన మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్ కూడా బరువు తగ్గే ప్రయత్నంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆమెకి ప్రేరణ కలిగించేలా తాను బరువు తగ్గేందుకు ఉపక్రమించినట్లు తెలిపారు. అయితే తన కూతురు కూడా చక్కగా బరువు తగ్గి న్యూలుక్ మంచి ఫిట్నెస్తో అందంగా ఉందని చెప్పడమే గాకా ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. తనలా బరువు తగ్గాలనుకునేవారు తగ్గలేకపోతున్నాననే నిరాశకు లోనవ్వకూడదు. చివరి నిమిషం వరకు ఆశను కోల్పోకుండా ఉత్సాహభరితంగా కసరత్తులు చేస్తే దెబ్బకు బరువు తగ్గడం ఖాయ అని అన్నారు. అందుకు తానే నిదర్శనమని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు." బోనీ కపూర్. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) (చదవండి: సెలబ్రెటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!) -
శ్రీదేవిపై ఫీలింగ్స్.. అమ్మకు తెలిసి రాఖీ తీసుకొచ్చింది: నిర్మాత
దివంగత నటి శ్రీదేవి.. ఈమె అందాన్ని ఆరాధించినవాళ్లెందరో! నిర్మాత బోనీ కపూర్ సైతం శ్రీదేవిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. మనసులో తన పేరు లిఖించుకున్నాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయింది. అతడి భార్య పేరు మోనా షౌరీ. ఈ జంటకు అర్జున్, అన్షులా కపూర్ సంతానం. బోనీ ప్రేమ విషయం భార్యకు కూడా తెలుసు. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవిని ఐదారేళ్లపాటు ఆరాధించాను. నా ప్రేమ విషయం నా భార్యకు సైతం తెలుసు. అబద్ధాలు చెప్పి తనను మోసం చేయాలనుకోలేదు. శ్రీదేవిని పెళ్లాడటానికి ముందు కూడా ఆమెను నా భార్య ఇంట్లోనే ఉంచాను. రాఖీ కట్టించాలని చూసింది శ్రీదేవిపై నాకున్న ఫీలింగ్స్ మా అమ్మ పసిగట్టేసింది. రాఖీ పండుగ రోజు పెద్ద పళ్లెంలో అక్షింతలు, రాఖీ పెట్టి తీసుకొచ్చి శ్రీదేవికి ఇచ్చి నాకు రాఖీ కట్టమని చెప్పింది. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్లింది. నువ్వేం బాధపడకు, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆ ప్లేటు నీ గదిలోనే ఉంచమని చెప్పాను. అసలు నాకు రాఖీ ఎందుకు కట్టమని చెప్పిందో తనకేం అర్థం కాలేదు' అని నవ్వేశాడు. కాగా బోనీ తన మొదటి భార్య మోనాకు 1996లో విడాకులిచ్చాడు. అదే ఏడాది జూన్ 2న శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
'ఉప్పెన' రీమేక్.. స్టార్ హీరోయిన్ చెల్లెలుకు ఛాన్స్
తెలుగు చిత్రం 'ఉప్పెన' పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంతోనే కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్ల కొత్త ప్రాజెక్ట్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు డైరెక్టర్గా ఉన్నారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారట. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో హీరోయిన్గా ఖుషి కపూర్ను సెట్ చేయాలని ఆయన ప్లాన్లో ఉన్నారట. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్గా సెట్ అవుతుందని బోనీకపూర్ ప్లాన్లో ఉన్నారట. మరీ ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే బోనీ కపూర్నే క్లారిటీ ఇవ్వాలి. (అక్క జాన్వీ కపూర్తో ఖుషి కపూర్) మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్లో కూడా రీమేక్ చేయాలనే ప్లాన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుందట. విజయ్ వారసుడు సంజయ్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్లో ఉప్పెన రీమేక్ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్లో కృతి శెట్టి బిజీగా ఉంది. ఉప్పెన రీమేక్ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో రూమర్స్ భారీగానే కొనసాగుతున్నాయి. -
తనకు అంత పిచ్చి ఉంటుందనుకోలేదు
‘‘డైరెక్టర్ సుకుమార్గారి టీమ్లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ను యూనిట్కి అందించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు. మా కాంబినేషన్ ‘ఆర్సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్చరణ్గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
68 ఏళ్ల వయసులో శ్రీదేవి భర్త హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్
ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య జుట్టు ఊడటం. ఎన్నిరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా జుట్టు కాపాడుకోవడం గగనమైపోతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇదే పరిస్థితి. ఇక వయసు పైబడినవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బట్టతలతోనే నెట్టుకువస్తున్నారు. చాలామంది జుట్టు ఊడటాన్ని ఆపలేక హెయిర్ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. బట్టతలను కప్పిపుచ్చుకోవడానికి ఇది చక్కటి మార్గం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తాజాగా దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఇటీవల హైదరాబాద్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ఓపెనింగ్కు ముఖ్య అతిథిగా వచ్చిన బోనీ కపూర్ అదే క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంకేముంది, అతడి బట్టతలను కాస్తా నిండైన ఒత్తైన వెంట్రుకలతో నింపేశారు. నా తలపై వెంట్రుకలు వచ్చాయ్.. ఇది చూసిన బోనీ కపూర్.. నా తలపై వెంట్రుకలు వచ్చాయ్. ఇది నా లుక్కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి అని చెప్పుకొచ్చాడు. 68 ఏళ్ల వయసులో జుట్టు కోసం ఆరాటపడుతుండటం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా నిర్మాతగా బ్లాక్బస్టర్ సినిమాలు తీసిన బోనీ కపూర్ గతేడాది 'తు జూటీ మై మక్కర్' సినిమాతో నటుడిగా మారాడు. ఇందులో రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. చదవండి: షణ్ముఖ్ అన్న ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో.. -
రామ్ చరణ్తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన 'దేవర' బ్యూటీ
రామ్ చరణ్తో జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం త్వరలో ఆరంభం కానుందని కొద్దిరోజుల క్రితం బోనీకపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవర చిత్రం తర్వాత టాలీవుడ్లో మరొక ఛాన్స్ జాన్వీకి దక్కిందని పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా జాన్వీ కపూర్ ఇలా స్పందించారు. ' నా సినిమాల అప్డేట్స్ గురించి మా నాన్న (బోనీ కపూర్) పలు విషయాలు పంచుకున్నారు. నన్ను సంప్రదించకుండానే నాన్నగారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటించబోతున్నానని ఆయన చెప్పారో వాటి గురించి ఇప్పట్లో మాట్లాడలేను. ప్రస్తుతం నేను తెలుగులో 'దేవర' మాత్రమే చేస్తున్నాను.' అని చెప్పారు. ‘ఉప్పెన’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ద్వితీయ చిత్రంగా రామ్చరణ్ హీరోగా ఓ సినిమా (‘RC 16’ వర్కింగ్ టైటిల్) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్కి జోడీగా ఎవరు నటిస్తారు? అంటూ తెరపైకి వచ్చిన హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా ఉంది. దీంతో ఈ విషయం గురించి బోనీకపూర్ను ప్రశ్నించగా.. రామ్ చరణ్తో జాన్వీ సినిమా చేస్తుందని ప్రకటించారు. ఆపై కోలీవుడ్ హీరో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు. కానీ, బోనీకపూర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో గత కొద్దిరోజులగా వైరల్గా మారింది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ‘ఆర్సీ 16’ ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్లనుందని టాక్. -
చరణ్ సినిమాలో జాన్వీ కన్ఫర్మ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ చాలామందికి తెలుసు. చిన్నప్పటి నుంచి ఈమెని అభిమానులు చూస్తూ వచ్చారు. అయితే బాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ అయితే లేవు. కానీ 2024లో మాత్రం ఈమె దశ మారిపోయినట్లు కనిపిస్తుంది. తాజాగా రామ్ చరణ్ సినిమాలోనూ ఈమెనే హీరోయిన్గా ఖరారైందని ఈమె తండ్రి బోనీ కపూర్ చెప్పేశారు. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) హిందీ సినిమాల వల్ల జాన్వీకి అంతంత మాత్రంగానే పేరు వచ్చింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ 'దేవర'లో ఈమెనే హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందో ఈమె లక్ కాస్త మారిందని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదలైతే ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ దీనికంటే ముందే రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో జాన్వీనే హీరోయిన్గా చేయబోతుంది. తాజాగా ఈమె తండ్రి బోనీ కపూర్.. ఈ విషయాన్ని ఖరారు చేశారు. అయితే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడమే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్తో సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ కొన్ని కండీషన్స్ పెడుతోందట. దాదాపు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. తెలుగులో స్టార్ హీరోయిన్ లకు ఇచ్చే రెమ్యునరేషన్ ఇది. ఇక్కడ ఒక్క మూవీ చేయకుండానే ఇంత డిమాండ్ చేస్తోంది. అలానే తెలుగులో స్టార్ హీరోలవి తప్పితే మిగతా చిత్రాల్లో నటించకూడదని కూడా ఫిక్సయిందట. ఇప్పుడు ఈ విషయాలే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయాయి. (ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన) #JanhviKapoor Roped in for #RC16 as Female Lead - Confirms @BoneyKapoor !!@AlwaysRamCharan @BuchiBabuSana @arrahman pic.twitter.com/aotWNH9tOT — Trends RamCharan ™ (@TweetRamCharan) February 18, 2024 -
ఆస్తులు అమ్మేస్తున్న శ్రీదేవి భర్త!
సీనియర్ సినీ నిర్మాత బోనీ కపూర్, అతని కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ముంబైలోని అంధేరి శివారులో ఉన్న తమ నాలుగు అపార్ట్మెంట్లను విక్రయించినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైలోని అంధేరీ వెస్ట్లో రెండు ఫ్లాట్లను రూ. 6.02 కోట్లకు విక్రయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్ 2 నమోదైనట్లు తెలుస్తోంది. రెండు అపార్ట్మెంట్లు లోఖండ్వాలా కాంప్లెక్స్లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. రెండు ఫ్లాట్ల విస్తీర్ణం 1870.57 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్లు ఒక ఓపెన్ కార్ పార్కింగ్తో వస్తాయి. ఈ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు సిద్ధార్థ్ నారాయణ్, అంజు నారాయణ్గా చెబుతున్నారు. అదే కాంప్లెక్స్లో ఉన్న మరో రెండు అపార్ట్మెంట్లను వారు మరో రూ. 6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2023 అక్టోబర్ 12 న జరిగినట్లు సమాచారం. 1614.59 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు రెండు కార్ పార్కింగ్లతో వస్తాయి. వీటిని ముస్కాన్ బహిర్వానీ, లలిత్ బహిర్వానీలకు విక్రయించినట్లు సమాచారం. 2022లో బోనీ, జాన్వీ, ఖుషీలు 65 కోట్ల రూపాయల విలువైన బాంద్రాలో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ని కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 6421 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇందులో ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే.. గతంలో ఆస్తులు విక్రయించిన సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఖరీదైన ప్లాట్లను కొనుగోలు చేయడం, విక్రయించడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం నటుడు 'రణవీర్ సింగ్' ముంబైలోని ఒక లగ్జరీ టవర్లోని రెండు ఫ్లాట్లను రూ.15.24 కోట్లకు విక్రయించాడు. నవంబర్లో నటి 'ప్రియాంక చోప్రా' ఓషివారాలోని లోఖండ్వాలా కాంప్లెక్స్లో 2,292 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో ఉన్న రెండు పెంట్హౌస్లను రూ. 6 కోట్లకు విక్రయించింది. -
హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!
శ్రీదేవి ఆ పేరు వింటే చాలు. తనదైన అందంతో వెండితెరపై అలరించింది. అటు బాలీవుడ్.. ఇటు దక్షిణాది సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడిన శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అప్పట్లోనే తన స్టార్ డమ్తో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. కేవలం ఆమెను తెరపై చూడటానికి మాత్రమే అభిమానులు థియేటర్లకు వచ్చేవారట. నటిగా అత్యంత అభిమానుల ఆదరణ దక్కించుకున్న నటి అనూహ్యంగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్లోని ఓ హోటల్ గదిలో మరణించింది. (ఇది చదవండి: ప్రభాస్ బర్త్డే నాడు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా..?) హీరోల కంటే ఎక్కువ పారితోషికం శ్రీదేవి నటించే రోజుల్లో బాలీవుడ్లో మహిళా నటీనటుల పారితోషికం.. పురుషుడి కంటే చాలా తక్కువ ఉండేది. కానీ శ్రీదేవి మాత్రం చాలా మంది స్టార్ నటుల కంటే ఎక్కువ రుసుము వసూలు చేసే నటిగా నిలిచింది. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే ఒక చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి నటిగా పేరు సంపాదించింది. అప్పట్లో కొంతమంది మేల్ ఆర్టిస్టులు కూడా అంత డబ్బు సంపాదించేవారు కాదట. అప్పట్లో శ్రీదేవిని ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని కూడా పిలిచేవారట. అంతే కాదు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలకు ఆమె సంతకం ఇంటి వద్దే వరుసలో ఉండేవారట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్స్టార్ కూడా శ్రీదేవితో పనిచేయడానికి భయపడేవారని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్, శ్రీదేవి జంటగా 'చంద్రముఖి', 'చంద్ కా తుక్డా' అనే రెండు చిత్రాలలో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్లో శ్రీదేవి అలాంటి ఎన్నో పాత్రలు పోషించారు. కాగా.. ఆమె చివరిసారిగా 'మామ్' చిత్రంలో తెరపై కనిపించింది. (ఇది చదవండి: బూతులు బిగ్ బాస్లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ) -
కోట్ల బడ్జెట్.. రిలీజ్కు నోచుకొని స్టార్ హీరో సినిమా!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల రిలీజ్కు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయితే... కావాల్సినన్ని థియేటర్స్ లభించవు. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రారు..వచ్చినా తక్కువకే అడుగుతుంటారు. ఇలా చిన్న సినిమాల కష్టాలు చాలా ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్కే నోచుకోవు. కానీ పెద్ద సినిమాలకు అలాంటి కష్టాలు ఉండవని అంటారు. ఎప్పుడు అంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. ముందస్తు వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. రిలీజ్ తర్వాత అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే తప్ప.. బడా సినిమాల మేకర్స్కు పెద్ద కష్టాలేమి ఉండవని అనుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించిన చిత్రాలు కూడా అప్పుడప్పుడు విడుదలకు నోచుకోవు. దానికి ‘మైదానం’ చిత్రమే అతి పెద్ద ఉదాహారణ అని చెప్పొచ్చు. మూడేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి.. ఆర్ఆర్ఆర్తో పోటీ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా, బోనికపూర్ నిర్మించిన చిత్రమే ఈ ‘మైదానం’. భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్. కరోనా కంటే ముందే అంటే 2019లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2020లో ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. 2021లో రిలీజ్కు ప్లాన్ చేశారు కానీ కుదరలేదు. ఇక 2022లో ఆర్ఆర్ఆర్తో పోటీగా బరిలోకి దిగబోతున్నామని ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు కానీ మళ్లీ అనూహ్యంగా వాయిదా వేసుకున్నారు. రిలీజ్ కష్టమేనా బోనీ కపూర్ భారీ బడ్జెట్తో మైదాన్ చిత్రాన్ని నిర్మించాడు. కరోనా కారణంగా ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఈ చిత్రానికి ఖర్చు చేశారట. ఈ చిత్రం కోసం ఒక పెద్ద గ్రౌండ్ ని అద్దెకు తీసుకుని దాంట్లో నిజమైన గడ్డిని పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారట. రోజుకు దాదాపు 500 మందితో షూటింగ్ చేశారట. గ్యాలరీలు, స్టాండ్లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేశారు. అయితే లాక్డౌన్తో పాటు 2021లో వచ్చి తుపాను కారణంగా దాదాపు రూ.30 కోట్లతో నిర్మించిన సెట్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయట. ఇన్సురెన్స్ సొమ్ము కూడా రాకపోవడంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పటికే సినిమాకు కోట్ల ఖర్చు పెట్టారు. రెండేళ్ల క్రితమే రిలీజ్ అయితే భారీగా నష్టాలు వచ్చే కావు. కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి నిర్మాత కూడా ఇష్టపడడం లేదు. ఈ చిత్రం గురించి బోనీ కపూర్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జీవితంలో మొదటిసారి పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక సినిమా విషయంలో ఇంతగా ఎదురు దెబ్బ తింటానని ఊహించలేదు’అని అన్నారు. దీన్ని బట్టి ‘మైదానం’ సినిమా థియేటర్స్లోకి రావడం కష్టమే. -
పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టిందా?.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
అలనాటి అందాల నటి శ్రీదేవి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 2018లో దుబాయ్లోని ఓ హోటల్లో మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినిమాలతో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి భర్త బోనీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జాన్వీ కపూర్ పుట్టిన రోజుపై వస్తోన్న రూమర్స్పై ఆయన స్పందించారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?) గతంలో కూడా జాన్వీకపూర్ కూడా వారికి పెళ్లికి ముందే పుట్టారని వార్తలొచ్చాయి. అయితే బోనీ కపూర్ తాజాగా ఇంటర్వ్యూలో ఆ వార్తలపై నోరు విప్పారు. ఆ రూమర్స్ ఎలా వచ్చాయో స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే శ్రీదేవి-బోనీ కపూర్ వివాహంపై ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ మాట్లాడుతూ..'నేనూ శ్రీదేవి 1996లో షిర్డిలో రహస్య వివాహం చేసుకున్నాం. కొద్ది నెలలకే మా పెళ్లి విషయాన్ని బయటికి చెప్పాం. ఆ తర్వాత 1997లో జనవరిలో మరోసారి అందరి సమక్షంలో పెళ్లిచేసుకున్నాం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాం కూడా. మాకు జాన్వీ కపూర్ 1997 మార్చిలో పుట్టింది. అయితే జాన్వీ మా పెళ్లికి ముందే పుట్టిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అవీ ఇప్పటీకీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. తన పుట్టినరోజు గురించి స్వయంగా నేను చెప్పినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు' అంటూ వెల్లడించారు. అలాగే శ్రీదేవికి దైవభక్తి ఎక్కువని అన్నారు. తన పుట్టినరోజున కచ్చితంగా తిరుమల వెళ్లేవారని తెలిపారు. (ఇది చదవండి: 'వీళ్లలో చదువుకునే ఫేస్ ఒక్కటైనా ఉందా?'.. ఆసక్తిగా మ్యాడ్ ట్రైలర్!) -
శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!
అతిలోక సుందరి అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు శ్రీదేవి. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ.. కొన్ని దశాబ్దాల పాటు మన దేశవ్యాప్తంగా సినిమాలకు మకుటం లేని మహారాణిగా పేరు సంపాదించింది. పెళ్లి-ఫ్యామిలీ కోసం కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి.. రెండో ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. కానీ 2018లో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో అభిమానులకు లెక్కలేనన్ని అనుమానాలు. ఇప్పుడు ఆ సంఘటన గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఏం జరిగింది? 2018 ఫిబ్రవరిలో ఫ్రెండ్ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి, తన ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లింది. అయితే బాత్టబ్లో జారిపడి చనిపోయిందన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమె ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్ని అనుమానించారు. కానీ ఇన్నాళ్లుగా ఆ సంఘటన గురించి పెద్దగా తలుచుకోని ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) బోనీ ఏం చెప్పారు? 'స్క్రీన్పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుండేది. మా పెళ్లి తర్వాత ఈ విషయం నాకు తెలిసింది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దీంతో చాలాసార్లు నీరసించి కింద పడిపోయేది. లో-బీపీ సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండమని ఆమెని డాక్టర్స్ ఎంతగానే చెప్పారు. కానీ అస్సలు సీరియస్గా తీసుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు చనిపోయింది' 'దీంతో దుబాయి పోలీసులు నన్ను ఓ రోజంతా విచారించారు. లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా నన్ను అన్ని విధాల పరీక్షిస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి చనిపోయిన కొన్నిరోజులు తర్వాత నాగార్జున ఓసారి కలిశారు. డైట్ కారణంగా ఓసారి సెట్లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు' అని బోనీ కపూర్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో రతిక రెమ్యునరేషన్ ఎన్ని లక్షలో తెలుసా?) -
కోలీవుడ్ కబురు?
దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్కు కోలీవుడ్ నుంచి కబురు వెళ్లిందట. తమిళ నటుడు అథర్వ హీరోగా ఆకాష్ అనే కొత్త దర్శకుడు ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఖుషీ కపూర్ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఖుషీకి ఈ కథ నచ్చిందని, ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఖుషీ కపూర్ నటించే తొలి తమిళ సినిమా ఇదే అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘పయ్యా (‘ఆవారా’)’ సినిమాకు సీక్వెల్గా ‘పయ్యా 2’ రానుందని, ఇందులో ఆర్య హీరోగా నటిస్తారని, ఖుషీ కపూర్ హీరోయిన్గా ఎంపికయ్యారనే టాక్ గతంలో కోలీవుడ్లో వినిపించింది. అయితే ‘పయ్యా 2’ సీక్వెల్లో ఖుషీ కపూర్ నటిస్తుందనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక హిందీలో ‘ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్లో ఖుషీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. -
జాన్వీ కపూర్కు కండీషన్ పెట్టిన తండ్రి.. ఆ స్టార్ హీరోతో నటించొద్దట!
నటిగా తన పరిధిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అలనాటి నటి శ్రీదేవి కూతురు అయిన ఈమె ధడక్ అనే హిందీ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను రాబట్టుకుంటోంది. అయితే తన తల్లి శ్రీదేవి 1980 – 90 ప్రాంతంలో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించారు. సౌత్లో రాణించాలని జాన్వీ ప్లాన్ దీంతో జాన్వీ కపూర్ కూడా దక్షిణాది చిత్రాల్లో నటించాలని చాలాకాలం నుంచి బలంగా కోరుకుంటోందట. అదేవిధంగా దక్షిణాది దర్శక నిర్మాతలు కూడా ఆమెను తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది జాన్వీ. అలాగే ఈ బ్యూటీ తమిళ చిత్రాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అందులో భాగంగా తమిళ చిత్రాలు ఎక్కువగా చూస్తున్నారట. ఆ ఇద్దరు హీరోలతో ఓకే, కానీ.. ఈ క్రమంలో ఆమె తండ్రి ఒక కండీషన్ పెట్టాడంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హీరో ధనుష్కు జంటగా నటించరాదన్నదే ఆ కండిషన్ అంట. హీరో విజయ్ లేదా అజిత్ సినిమాల ద్వారా తన కూతురిని కోలీవుడ్లో పరిచయం చేయాలని బోనీకపూర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంతుందో కానీ, కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగిన ధనుష్ సరసన నటించరాదని తన కూతురికి బోనీకపూర్ ఎందుకు కండీషన్ పెడుతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి -
నీకు ఇంకా 35 ఏళ్లే.. అమ్మను తలుచుకుంటూ జాన్వీ ఎమోషనల్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకుంటోంది. అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో దఢక్ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన జాన్వీ.. కొద్ది కాలంలోనే తనదైన నటనతో మెప్పించింది. అంతేకాకుండా గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ.. ఇటీవల వరుణ్ ధావన్ సరసన బవాల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే బవాల్ నేరుగా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ శ్రీదేవి 60 జయంతి కావడంతో తన తల్లిని గుర్తు చేసుకుంది జాన్వీ కపూర్. ఈ సందర్భంగా అమ్మను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు. (ఇది చదవండి: ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: స్టార్ డైెరెక్టర్ ) జాన్వీ కపూర్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నానమ్మతో సినిమా సెట్లో దిగిన ఈ ఫోటో మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి అని నాకు తెలుసు. ఈ రోజు నేను కూడా సినిమా సెట్లో ఉన్నా. మీరు నాతో ఇలాగే ఉండాలని నేను గతంలో కంటే ఎక్కువగా కోరుకున్నా. వాస్తవానికి మీ 35వ పుట్టినరోజని మేము అందరినీ ఒప్పించగలము. నేను నిన్ను చూసి గర్విస్తున్నా. ఈ ప్రపంచాన్ని నీ కళ్లతో చూడగలుగతున్నా. మమ్మల్ని చూసి మీరు కూడా సంతోషిస్తారని నాకు తెలుసు. ప్రతి రోజు నిన్ను ప్రేమిస్తునే ఉంటా అమ్మా. మీరు ఈ భూమి మీద అత్యంత ప్రత్యేకమైన మహిళ. మీరు ఇప్పటికీ మాతో ఉన్నారని నాకు తెలుసు. మేము జీవితంలో ఎదగడానికి కారణం నువ్వే. ఈ రోజు నీకిష్టమైన పాయసం, ఐస్ క్రీములు తింటావని ఆశిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్టే చేశారు. కాగా.. అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోని స్టార్ హీరోలతో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ దర్శకుడు బోనీ కపూర్ను పెళ్లి చేసుకున్న శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా.. 2018లో దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఓ హోటల్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఇవాళ ఆమె 60వ జయంతి కావడంతో గూగుల్ సైతం ప్రత్యేక డూడుల్తో ఆమెకు ఘన నివాళి అర్పించింది. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
వారికి ఇష్టమైన ఫోటోలతో శ్రీదేవిని గుర్తు చేసుకున్న జాన్వీ,బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన అమ్మగారిని గుర్తు చేసుకుంది. బోనీ కపూర్ తన భార్యతో కలిసి తీసుకున్న పాత ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. అక్కడ 'హ్యాపీ బర్త్డే' అని తెలుపుతూ హార్ట్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చారు. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా పలు పాత ఫోటోలను షేర్ చేసి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. పలు లవ్ ఎమోజీలతో పాటు 'హ్యాపీ బర్త్డే మామా' అని రాసింది. (ఇదీ చదవండి: భార్య వల్లే ఆ హీరో కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) తాజాగ విడుదలైన 'బవాల్' చిత్రంలో కనిపించిన జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ కథనాలలో తన తండ్రి సందేశాన్ని మళ్లీ పోస్ట్ చేసింది. కొద్దిసేపటి క్రితమే తన కొత్త సినిమా ప్రమోషన్ సందర్భంగా జాన్వీ కపూర్ శ్రీదేవి గురించి మాట్లాడింది. తన తల్లి మరణం తనకు చాలా కఠినమైన సమస్య అని, శ్రీదేవిని రోల్ మోడల్గా చూస్తున్నానని చెప్పింది. ఆమె మరణం తర్వాత తన కెరీర్ను కూడా శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటున్నానని జాన్వీ తెలిపింది. 40 ఏళ్లపాటు శ్రీదేవి ట్రెండ్ 1963 ఆగస్టు 13న తమిళనాడులో శ్రీదేవి జన్మించారు. శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్ అనేది శ్రీదేవి అసలు పేరు. సినిమాల కోసం శ్రీదేవిగా పేరు మార్చుకుని 40 ఏళ్లపాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం,మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సుమారు 250 సినిమాల్లో నటించారు. తెలుగులో 'పదహారేళ్ల వయసు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ చేసిన శ్రీదేవి.. అతిలోక సుందరిగా తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ని వివాహం చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 54 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
మోడల్ నడుముపై చేతులేసిన బోని కపూర్.. నెటిజన్స్ ట్రోల్
సినీ ప్రముఖులకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏం చేసినా..అది వార్తే అవుతుంది. వారు చేసే ప్రతి పనిని అభిమానులు గమనిస్తారు. మంచి పని చేస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. తప్పు చేస్తే అంతే దారుణంగా ట్రోల్ చేస్తారు. అయితే ఒక్కోసారి అనుకోకుండా జరిగిన తప్పుకు, అసలు వాళ్ల దృష్టిలో అది తప్పే కాకపోయినా.. నెటిజన్స్ సదరు సినీ ప్రముఖులను ట్రోల్ చేస్తుంటారు. అలాంటి ట్రోలింగే ఇప్పుడు ప్రముఖ నిర్మాత బోని కపూర్కు ఎదురైంది. ఓ బాలీవుడ్ మోడల్ నడుముపై చేతులు వేశాడంటూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే... రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC)’ ప్రారంభోత్సవం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, వరుణ్ ధావన్తో పాటు ప్రముఖ నిర్మాత బోని కపూర్ కూడా హాజరయ్యాడు. అలాగే హాలీవుడ్కు చెందిన ప్రముఖ మోడల్ జిగి హడిద్ కూడా ఈ లాంచింగ్ ఈవెంట్కి అతిథిగా విచ్చేసింది. అక్కడ బోని కపూర్ కనిపించడంతో దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరిం. అనంతరం ఇద్దరు కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అదే ఇప్పుడు ట్రోలింగ్కు కారణమైంది. ఫోటో దిగే క్రమంలో బోని కపూర్ జిగి హడిద్ నడుముపై చేతులు వేశారు. అయితే ఆయన మాత్రం క్యాజువల్గానే చేతులు వేసి ఫోటో దిగారు. జిగి సైతం అలానే భావించి లైట్ తీసుకుంది. కానీ నెటిజన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఫోటోని షేర్ చేసూ బోనీ కపూర్ని దూషిస్తున్నారు. Patli kamariya tori haaye haaye haaye pic.twitter.com/u0DBdwZfE8 — SwatKat💃 (@swatic12) April 3, 2023 The way #BoneyKapoor Holds Gigi Hadid's Thin Waist in this pic, Is it real or just my Hallucination 😂 pic.twitter.com/ucQn46vEGv — 💫 Arthur (@irrk_k) April 3, 2023 Arey boney ji 😭 pic.twitter.com/WJnbWJ9eJL — celina ❦ (@bollyvfx1) April 3, 2023 Gigi ji, aapko tairna aata hai? pic.twitter.com/MlVV2KKUoG — Robin (@Bisleri_maymer) April 3, 2023 Close enough#BoneyKapoor #GigiHadid #NMACC pic.twitter.com/B9W0VSl8It — Himalaya Kankariya (@himalayahere) April 4, 2023 -
ప్రియుడితో స్విమ్మింగ్ పూల్లో స్టార్ హీరో చెల్లెలు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కూతురు, హీరో అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్ ప్రేమలో పడింది. స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా బీటౌన్లో జోరుగా వినిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని అన్షులా అధికారికంగా ప్రకటించింది. ప్రియుడితో స్విమ్మింగ్ పూల్లో దిగిన ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ..హార్ట్ ఎమోజితో 366 అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్నట్లు లొకేషన్ ట్యాగ్ని కూడా యాడ్ చేసింది. ఈ పోస్టు చేసి జాన్వీ, ఖుషీ కపూర్లతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేశారు. తమ ప్రేమను అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో త్వరలోనే అన్షులా కపూర్ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. కాగా గతంలో అధిక బరువుతో ఇబ్బంది పడిన అన్షులా ఇటీవలి కాలంలో బరువు తగ్గి నాజుగ్గా మారిపోయింది. ఇదిలా ఉంటే బోనీకపూర్కు తొలుత మోనా కపూర్తో వివాహమైంది. బోనీకపూర్ శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆయనకు మోనా కపూర్తో వివాహమైంది. మొదటి భార్య సంతానమే అర్జున్ కపూర్, అన్షులా కపూర్. ఇరు కుటుంబాలకు వివాదాలు ఉన్నా శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ కపూర్.. జాన్వీ, ఖుషీలను దగ్గరకు తీసుకున్నారు. అప్పట్నుంచి పలు పార్టీలు, ఫంక్షన్లకు కలిసే హాజరవుతుంటారు. -
మీనా 40 ఏళ్ల సినీ ప్రయాణం.. స్టార్స్ గ్యాదరింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
శ్రీదేవిపై ఉన్న ఫీలింగ్స్ నా భార్యకు చెప్పాను: బోనీ కపూర్
భారతీయ సినీపరిశ్రమను ఏలిన అతి కొద్దిమంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. తన అందాన్ని, నటనాప్రతిభను చూసి ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం విస్తుపోయేవారు. శ్రీదేవి అందం, అభినయం చూసి బోనీ కపూర్ కూడా మంత్రముగ్ధుడయ్యాడు. అందుకే ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమెకు నటుడు మిథున్ చక్రవర్తితో పెళ్లైందంటూ వార్తలు వచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోలేదు. తనతో జీవితం కొనసాగించాలని కలలు కన్నాడు. చివరకు ఆ కల నిజం చేసుకున్నాడు. కానీ కలకాలం తనతో కలిసి ఉండాలనుకున్న కోరిక మాత్రం తీరలేదు. 2018 ఫిబ్రవరి 24న బోనీ కపూర్ను ఒంటరి చేస్తూ శ్రీదేవి మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఈరోజు శ్రీదేవి వర్ధంతి కావడంతో బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన ప్రేమ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నాడు. 'శ్రీదేవిని ఓ తమిళ సినిమాలో చూడగానే తనతో వెంటనే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా. సోల్వా సావన్లో శ్రీదేవి గ్లామర్ రోల్ చేయనప్పటికీ తన పాత్ర నన్ను ఇంప్రెస్ చేసింది. తర్వాత తనను ఎలాగోలా కలిశాను. ఆమెతో మాట్లాడాక నాకు తెగ నచ్చేసింది. ఒక ఈవెంట్లో శ్రీదేవి తల్లిని కలిశా. అప్పుడు శ్రీదేవి రెమ్యునరేషన్ దాదాపు రూ.8 లక్షలు ఉండి ఉంటుంది. ఆమెతో సినిమా చేయాలని చెప్తే శ్రీదేవి తల్లి మాత్రం రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. నేను వెంటనే కుదరదని షాకిచ్చి ఆ వెంటనే రూ.11 లక్షలిచ్చి సర్ప్రైజ్ చేశాను. షూటింగ్స్కు తన వెంట వెళ్లేవాడిని. అలా తనకు మరింత దగ్గరయ్యాను. అప్పటికే నాకు ఓసారి పెళ్లైంది. భార్య మోనా శౌరీకి తనతో ప్రేమలో పడ్డానని, నా ఫీలింగ్స్ చెప్పాను. తనను వదులుకోలేనన్నాను. ఇకపోతే శ్రీదేవిపై ఎంతో కేర్ తీసుకునేవాడిని. అదే ఆమెను తిరిగి ప్రేమించేలా చేసింది' అని చెప్పుకొచ్చాడు బోనీ కపూర్. కాగా బోనీ కపూర్.. నిర్మాత మోనా శౌరీని మొదటగా వివాహం చేసుకున్నాడు. 1996లో ఆమెకు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లాడాడు. వీరికి జాన్వీ, ఖుషీ కపూర్ జన్మించారు. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
చనిపోవడానికి ముందు శ్రీదేవి దిగిన చివరి ఫోటో ఇదే!
అప్పటిదాకా ఓ వెలుగు వెలిగిన తారలు అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అందులో స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణం కూడా ఒకటి. దుబాయ్లో బంధువుల ఫంక్షన్కు వెళ్లిన ఆమె 2018 ఫిబ్రవరి 24న బాత్రూమ్లో కిందపడి విగతజీవిగా మారింది. కోట్లాదిమంది అభిమానులను, భర్త బోనీ కపూర్, పిల్లలు జాన్వీ, ఖుషీ కపూర్లను దుఃఖ సాగరంలో ముంచుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. రేపు శ్రీదేవి వర్ధంతి. ఈ సందర్భంగా బోనీ కపూర్ శ్రీదేవి మరణానికి ముందురోజు చివరగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో అందంగా రెడీ అయిన శ్రీదేవి కుటుంబంతో కలిసి ఫోటోకు పోజిచ్చింది. కల్మషం లేని చిరునవ్వు ఆమె పెదాలపై అలాగే నిలిచి ఉంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు 'శ్రీదేవికి మరణం లేదు, మా గుండెల్లో తను చిరస్థాయిగా నిలిచిపోయింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) చదవండి: అమెరికన్ పాపులర్ షోలో చరణ్ -
పుస్తకంగా రానున్న శ్రీదేవి జీవిత చరిత్ర
దివంగత నటి శ్రీదేవిని ఎవరూ అంత తొందరగా మరచిపోరు. భారతీయ సినీ చరిత్రలో చెరగని ఒక పేజీ ఆమె పేరు. అందం, అభినయం కలిస్తే శ్రీదేవి. బాల నటిగా సినీ రంగప్రవేశం చేసిన ఆమె ఆ తరువాత కథానాయకిగా మారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సూపర్స్టార్గా రాణించారు. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 300లకు పైగా చిత్రాలు చేశారు. ప్రముఖ నటులందరితోనూ నటించారు. ఈమె నటనకు గానూ పద్మశ్రీ నుంచి పలు జాతీయ, రాష్ట్రీయ, ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. అలాంటి శ్రీదేవి సినీ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె జీవిత చరిత్ర ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. శ్రీదేవి కుటుంబంతో ఎంతో అనుబంధం కలిగిన ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ కుమార్ ఆమె బయోగ్రఫిని ‘‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’’ పేరుతో పుస్తకంగా రచించారు. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకపూర్ బుధవారం అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో శ్రీదేవికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు. దీన్ని ఈ ఏడాది చివరిలో వెస్ట్ల్యాండ్ బుక్ సంస్థ విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాగా శ్రీదేవి బయోగ్రఫీని చిత్రంగా చేయాలని పలువురు దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా శ్రీదేవి బయోగ్రఫీలో నటించాలని పలువురు అగ్ర నటీమణులు ఆశపడుతున్నారు. కాగా ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్ పుస్తకం విడుదల అనంతరం శ్రీదేవి బయోపిక్ తెరకెక్కే అవకాశం ఉంటుందేమో చూడాలి. We are thrilled to announce that we will be publishing @AuthorDhiraj’s definitive biography of Sridevi—an iconic superstar and true legend. Out in 2023! pic.twitter.com/JVgaeYFR73— Westland Books (@WestlandBooks) February 8, 2023 చదవండి: పాన్ ఇండియా స్టార్ అంటే అన్ని భాషలు మాట్లాడాలి: శివ రాజ్కుమార్ -
క్యూట్గా నవ్వుతున్న చిన్నారిని గుర్తు పట్టారా.. ఇప్పుడేలా ఉందంటే?
ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్లో ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దివంగత నటి శ్రీదేవితో కలిసి ఉన్న ఆ ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ ఫోటోలో క్యూట్గా నవ్వుతున్న చిన్నారిని ఎవరో మీరు గుర్తు పట్టారా? మరెవరో కాదు.. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. దివంగత నటి కూతురు జాన్వీ కపూర్ ఫోన్ వాల్పేపర్గా ఉన్న ఫోటోతో నెట్టింట్లో వైరలవుతోంది. జాన్వీ జిమ్ చి ఇంనుంటికి వెళ్తుండగా ఈ ఫోటో కెమెరాలకు చిక్కింది. అదే సమయంలో ఆమె ఫోన్ వాల్పేపర్గా ఉన్న త్రోబాక్ పిక్ కనిపించింది. చిన్ననాటి ఫోటోలో జాన్వీ తన తల్లి ఒడిలో చిరునవ్వుతో క్యూట్గా ఉంది. ఫోటో చూసిన కొంతమంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరెమో ఎమోషనల్ అవుతూ ఎమోజీలు జతచేశారు. మరికొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే స్పోర్ట్స్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఆమెకు వరుణ్ ధావన్ నటించిన బవాల్ చిత్రంలోనూ కనిపించనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అతిలోక సుందరి శ్రీదేవి ఇల్లు చూశారా? ఇంద్రభవనంలా ఉంది..
అలనాటి అందాల తార శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్న ఆమె 54 ఏళ్ల వయసులోనే ఆకస్మికంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాక ఎంతో కష్టపడి, ఇష్టపడి చెన్నైలో మొట్టమొదటిసారిగా ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇల్లు అంటే తనకు ఎంతో ఇష్టమని స్వయంగా శ్రీదేవి పలు సందర్భాల్లో చెప్పింది. తాజాగా చెన్నైలోకి ఆ ఇంటికి వెళ్లిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లి నివాసాన్ని అభిమానులకు పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన హోంటూర్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న జాన్వీ.. తన తల్లిదండ్రుల పెళ్లి ఫోటోను చూపిస్తూ.. 'వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అందుకే ఈ ఫోటోల్లో ఇద్దరూ ఒత్తిడిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన బెడ్రూమ్లో బాత్రూమ్కి గడియ ఉండదని చెప్పిన జాన్వీ ఇందుకు గల కారణాన్ని కూడా రివీల్ చేసింది. 'నేను బాత్రూమ్లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడతానేమో అని అమ్మ భయపడేది. అందుకే నా బాత్రూమ్కి లాక్ పెట్టించలేదు. ఇప్పటికే ఇంటికి మరమత్తులు చేసినా నా బాత్రూమ్కి మాత్రం లాక్ పెట్టించలేదు' అంటూ జాన్వీ సీక్రెట్ను రివీల్ చేసింది. మరి శ్రీదేవి లాగే ఎంతో అందమైన ఆమె ఇంటిని మీరూ చూసేయండి. -
ఆ ఘటనతో అమ్మ ఒక్కసారిగా షాక్కు గురైంది: జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సాధించింది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం 'మిలి' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. 2019 మలయాళంలో హిట్ అయిన హెలెన్కి హిందీ రీమేక్ మూవీని తెరకెక్కించారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ చిట్ చాట్లో పాల్గొన్న జాన్వీ కపూర్ ఇటలీలో శ్రీదేవికి ఎదురైన ఓ ఘటనను పంచుకున్నారు. గతంలో శ్రీదేవి ఇటలీలో ఫర్నీచర్ షాపింగ్ చేయడానికి వెళ్లినట్లు జాన్వీ కపూర్ వెల్లడించారు. చెన్నైలోని తమ ఇంటికి ఫర్నీచర్ కోసమని తన ఫ్రైండ్తో కలిసి వెళ్లిన సమయంలో ఒక ఇటాలియన్ వ్యక్తి ఆమెకు సైట్ కొట్టాడని తెలిపింది. ఈ ఘటనతో మా అమ్మ షాక్కు గురైందని పేర్కొంది. ఆ కుర్రాడి ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన శ్రీదేవి ఫ్రైండ్ ఈ విషయాన్ని బోనీ కపూర్కు ఫోన్ చేసి వివరించినట్లు పేర్కొంది. కాగా.. శ్రీదేవి, బోనీ కపూర్ హనీమూన్ ఇటలీలోనే జరిగినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం రాజ్కుమార్ రావుతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహితో సహా పలు ఇతర ప్రాజెక్ట్ల్లో నటిస్తోంది. -
త్వరలో ఆ అవకాశం ఉంది: జాన్వీ కపూర్
‘‘దక్షిణాది ప్రేక్షకులు మా అమ్మకి (శ్రీదేవి), నాన్నకి (బోనీ కపూర్) ఎంత ప్రేమను ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను సౌత్లో సినిమా చేయాలనుకుంటున్నాను.. త్వరలోనే చేసే అవకాశం ఉంది’’ అని జాన్వీ కపూర్ అన్నారు. మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ– ‘‘గ్జేవియర్గారు ఈ కథ చెప్పి నప్పుడు నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా ఇది.. ఈ చిత్రం చూసి ఆయన చాలా ఎగ్జయిట్ అయ్యారు. మైనస్ 18 డిగ్రీల టెంపరేచర్లో నటించడం అనేది ఛాలెంజింగ్గా అనిపించింది’’ అన్నారు. బోనీ కపూర్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో నా సతీమణి శ్రీదేవికి లభించి నట్లుగానే నా కుమార్తె జాన్వీకి కూడా అదే తరహా ప్రేమాభిమానాలు దక్కుతాయని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
టైటిల్తో సహా కాపీ, పేస్ట్.. ఆ రెండు చిత్రాలపై బోనీ కపూర్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో రీమేక్గా వచ్చిన విక్రమ్ వేద, జెర్సీ సినిమాలు సక్సెస్ కాకపోవడంపై మాట్లాడారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాలు ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను వివరించారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న సౌత్ డబ్బింగ్ చిత్రాలు కొన్ని మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయన్న విషయంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బోనీ కపూర్ మాట్లాడుతూ..'కొన్ని దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం కాపీ-పేస్ట్ చేయడం. విక్రమ్ వేద, జెర్సీ మూవీలకు కనీసం టైటిల్స్ కూడా మార్చలేదు. అలాగే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా నార్త్ ఇండియన్ సంస్కృతిని జోడించాలి. అప్పుడు పాన్ ఇండియా అంగీకరించే సినిమా తీయాలి.' అని అన్నారు. విక్రమ్ వేద భారతీయ జానపద కథ విక్రమ్ ఔర్ బేతాల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా అదే పేరుతో తమిళంలో విడుదలైంది. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. జెర్సీ మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇది టాలీవుడ్లో నాని హీరోగా నటించిన చిత్రానికి రీమేక్. షాహిద్ కపూర్ తన కొడుకు కోరిక కోసం ఆటలోకి తిరిగి వచ్చే మాజీ క్రికెటర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం బోనీ కపూర్ మలయాళ చిత్రం హెలెన్కి బాలీవుడ్ రీమేక్తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మిలీ అని పేరు పెట్టారు. అతని కుమార్తె జాన్వీ కపూర్ ఈ మూవీలో టైటిల్ రోల్లో నటించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
అమ్మ ఆరోగ్యానికి రిస్క్..అయినా నాన్న పట్టించుకోలేదు: జాన్వీ
దక్షిణాది సినిమాల్లో సత్తా చాటిన అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్ను ఓ ఊపు ఊపేశారు. స్టార్ హీరోయిన్గా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. ఇద్దరు పిల్లల తల్లిగా ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలతో జనాలను అలరించారు. అయితే మాంసాహారిగా ఉన్న ఆమె బోనీ కపూర్ వల్ల శాఖాహారిగా మారిందట. డాక్టర్లు రిస్క్ అని హెచ్చరించినా ఆమె మాంసం ముట్టలేదట. తాజాగా ఈ విషయాన్ని శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్ వెల్లడించింది. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇది చాలాకాలం క్రితం జరిగింది. నాన్న సిగరెట్లు ఎక్కువగా తాగేవాడు. నేను, ఖుషి పొద్దున్నే లేచి సిగరెట్ ప్యాకెట్లు వెతికి నాశనం చేసేవాళ్లం. సిగరెట్లను కత్తిరించేయడమో, వాటిని ఓపెన్ చేసి టూత్పేస్ట్ రాయడమో చేసేవాళ్లం. కానీ ఎంత ప్రయత్నించినా ఆయన తన అలవాటు మానుకోలేదు. ఈ విషయంలో అమ్మ.. నాన్నతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేది. నాన్న సిగరెట్లు మానేసేవరకు మాంసం ముట్టుకోనని శపథం చేసింది. కానీ అమ్మ చాలా వీక్గా ఉందని, మాంసం తినకపోతే ఇబ్బంది అవుతుందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా అమ్మ వినిపించుకోలేదు. నాన్న బతిమిలాడినా తన పట్టు విడవలేదు. చివరాఖరకు ఇప్పుడా విషయాన్ని గుర్తు చేసుకుని నాన్న బాధపడుతున్నాడు. తన కోసం ఇప్పుడైనా పొగ తాగడం మానేస్తానన్నాడు' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. కాగా శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న మరణించిన విషయం తెలిసిందే! చదవండి: రెచ్చిపోయిన ఉర్ఫీ జావెద్, కేసు నమోదు గీతూ ఓవరాక్షన్, మండిపడ్డ హౌస్మేట్స్ -
వలిమై మాదిరే అజిత్ 61లోనూ హై ఓల్టేజ్ యాక్షన్
నటుడు అజిత్ రూటే సపరేటు. ఆయనకు దర్శక-నిర్మాతలతో మంచి ర్యాప్ కుదిరితే వారితోనే వరుసగా చిత్రాలు చేస్తారు. ఇది అరుదైన విషయమే అవుతుంది. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ అజిత్ కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై, తాజాగా నిర్మిస్తున్న చిత్రం వరుసగా నిర్మించడం విశేషం అయితే ఈ మూడు చిత్రాలకు దర్శకుడు హెచ్.వినోద్ కావడం మరో విశేషం. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూడవ చిత్రం షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే అజిత్ ప్రస్తుతం యూరప్లో ఫ్యామిలీ టూర్ చేస్తున్నారు. దీంతో ఆయన లేని సన్నివేశాలను దర్శకుడు హెచ్. వినోద్ చిత్రీకరిస్తున్నారు. అజిత్ ఈనెలా ఖరుకు టూర్ ముగించుకుని చెన్నై తిరిగి వచ్చి షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇకపోతే వలిమై చిత్రంలో బైక్ చేజింగ్ సన్నివేశాలు అజిత్ అభిమానులను అబ్బురపరిచాయి. హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉన్నాయంటూ సినీ వర్గాలు ప్రశంసించారు. అదే విధంగా తాజా చిత్రంలోనూ హై ఓల్టేజ్ యాక్షన్తో పాటు బైక్ చేజింగ్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫైటింగ్ సన్నివేశాల వీడియో లీక్ అయి చిత్ర యూనిట్ను షాక్కు గురి చేసింది. కాగా ఇందులో నటి మంజువారియర్, సముద్రఖని, జాన్ కొకెయిన్, వీరా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బోనీ కపూర్ నుంచి లక్షల్లో చోరీ.. పోయినట్టు కూడా తెలియదు
Boney Kapoor Credit Card Misused And Lost Lakhs Of Money: ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ నుంచి డబ్బు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు ద్వారా లక్షలు కొట్టేశారు. ఈ విషయంపై బోనీ కపూర్ బుధవారం (మే 25) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అంబోలీ పీఎస్ పోలీసులు పేర్కొన్నారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ తదితర డేటాను నిందితులు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపారు. ఈ ఐదు ట్రాన్సాక్షన్స్లతో మొత్తం రూ. 3.82 లక్షలను నిందితులు దోచుకున్నారు. అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్కు తెలియదని.. తర్వాత అకౌంట్స్ చెక్ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్లోని ఓ కంపెనీ అకౌంట్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్ స్టేషన్లోని ఒక అధికారి పేర్కొన్నారు. చదవండి:👇 త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే.. -
బాలీవుడ్పై మహేశ్ కామెంట్స్, స్పందించిన బోనీ కపూర్, ఆర్జీవీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన మేజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మహేశ్ మాట్లాడుతూ.. బాలీవుడ్ తనని భరించదని, అందుకే అక్కడ సినిమాలు చేసి సమయం వృధా చేసుకొనని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మహేశ్ వ్యాఖ్యలు బాలీవుడ్, టాలీవుడ్లో హాట్టాపిక్గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆయన కామెంట్స్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ స్పందించాడు. మహేశ్ వ్యాఖ్యలపై తన అభిప్రాయం చెప్పమని బోనీ కపూర్ను ఓ అంగ్ల మీడియా కోరింది. చదవండి: బాలీవుడ్ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది: అల్లు అరవింద్ దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మహేశ్ వ్యాఖ్యలపై స్పందించడానికి నేను కరెక్ట్ పర్సన్ కాదు. నేను ఉత్తరాదితో పాటు దక్షిణాదికి కూడా చెందిన వాడిని. ఇప్పటికే తెలుగు, తమిళంలో సినిమాలు నిర్మించాను. త్వరలోనే కన్నడ, మలయాళంలో కూడా తీయబోతున్నా. కాబట్టి నేను ఈ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయలేను. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడే హక్కు మహేశ్కు ఉంది. బాలీవుడ్ తనని భరించలేదని అతను అనుకుని ఉండోచ్చు. అలా చెప్పడానికి తన దగ్గర తగిన కారణాలు కూడా ఉండిఉంటాయి. ఎవరి అభిప్రాయం వారిది’ అని ఆయన చెప్పుకొచ్చాడు. చదవండి: ఆడియన్స్కు ‘సర్కారు వారి పాట’ టీం విజ్ఞప్తి అలాగే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మహేశ్ కామెంట్స్పై స్పందించాడు. ఓ అంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో వర్మ మాట్లాడుతూ.. ‘మహేశ్ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ సినిమాలు చేయాలి, ఎలాంటి కథలు ఎంచుకోవాలన్నది నటుడిగా తన సొంత నిర్ణయం’ అన్నాడు. ఇక బాలీవుడ్ తనని భరించలేదంటూ మహేశ్ చేసిన వ్యాఖ్యలు తనకు అర్థం కాలేదన్నాడు. బాలీవుడ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, మీడియా వాళ్లే ఆ పేరు సృష్టించారని వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. -
అతని రాకతో నాకు మరింత ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్
Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు టచ్లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్ఫేర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ గురించి చెప్పుకొచ్చింది. 'అమ్మ మరణం తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము (జాన్వీ, ఖుషీ కపూర్) మరింత ధైర్యంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగింది. మాకు మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇలా ఎవరైనా చెబుతారో లేదో తెలియదు కానీ, మేము చాలా అదృష్టవంతులం. ఇంతకన్న గొప్పగా మాకు ఏం లభించదు.' అని చెప్పుకొచ్చింది జాన్వీ. తర్వాత వాళ్ల నాన్న బోనీ కపూర్ గురించి చెబుతూ 'నిజాయితీగా చెప్పాలంటే నాన్నతో ఇలా కొత్తగా ఉంది. ఆయన మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు.' అని జాన్వీ కపూర్ తెలిపింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. చదవండి: తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'వలిమై' రన్టైం తగ్గించిన మేకర్స్.. ఎందుకంటే
వలిమై చిత్ర నిడివిని యూనిట్ కొంత మేరకు కుదించింది. వివరాలు.. అజిత్ కథానాయకుడిగా జీ సినిమాతో కలిసి బోనీ కపూ ర్ నిర్మించిన చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నాయకిగా నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గురువారం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రంలో పోరాట దృశ్యాలు, బైక్ ఛేజింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అజిత్ అభిమానులు భలే ఖుషీ అవుతున్నారు. అయితే చిత్ర నిడివి ఎక్కువైందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన యూనిట్ వెంటనే 14 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే చిత్ర నిర్మాత బోనీకపూర్ చెన్నైలో వలిమై చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను విజిట్ చేస్తున్నారు. ఆయనపై అజిత్ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. -
విధి మా కలలను నాశనం చేసింది.. బోనీ కపూర్ ఎమోషనల్
Sridevi Death Anniversary: Boney Kapoor Pens Emotional Post: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అకాల మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం నివ్వెరపోయింది. ఎన్నో అనుమాల మధ్య శ్రీదేవి మరణాన్ని నిర్ధరించారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ శ్రీదేవి నటన, అందం, అభినయాన్ని సినీలోకం గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఎవర్ గ్రీన్ హీరోయిన్గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి గురువారం కావడంతో ఆమె ఙాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. వెనిస్లో బోనీ కపూర్ శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగమైన కోట్స్ రాశాడు. 'మేము సెప్టెంబర్ 7, 2008న మిలన్ నుంచి వెనిస్కు వెళ్లాం. ఆ నగరంలో కొన్ని గంటలు మాత్రమే గడిపాం. మేము వెనిస్ని మళ్లీ సందర్శించాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ మా ప్రణాళికలను విధి తిరస్కరించింది.' అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేశాడు బోనీ కపూర్. అలాగే శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గతంలో తన తల్లిపై హృదయానికి హత్తుకునేలా పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
Viral Video: వలిమై నిర్మాత కారును ఫ్యాన్స్ ఎలా చేశారో చూడండి!
-
వలిమై నిర్మాత కారును ఫ్యాన్స్ ఎలా చేశారో చూడండి!
'మన ఊరి పాండవులు' హిందీ రీమేక్ 'హమ్ హై పాంచ్' సినిమాతో నిర్మాతగా కెరీర్ ఆరంభించాడు బోనీ కపూర్. తాజాగా ఆయన నిర్మించిన వలిమై సినిమా ఫిబ్రవరి 24న విడుదలైంది. అజిత్ హీరోగా, కార్తికేయ విలన్గా నటించిన ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను నటి హ్యూమా ఖురేషితో కలిసి చెన్నైలో ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షించాడు బోనీ కపూర్. ఈ క్రమంలో తన కారును థియేటర్ బయట పార్క్ చేశాడు. విషయం తెలుసుకున్న కొందరు క్రేజీ ఫ్యాన్స్ వలిమై నిర్మాత కారుకు పాలాభిషేకం చేశారు. పాలు, పెరుగుతో నిర్మాత కారుకు అభిషేకం చేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన బోనీ కపూర్ తన కారు స్థితిని చూసి కొంత ఆశ్చర్యపోయినప్పటికీ అదే కారులో తిరిగి వెళ్లిపోయాడు. -
ఆ ఇద్దరూ చాలా ఫోకస్డ్గా ఉంటారు: బోనీ కపూర్
‘‘బాపూగారు దర్శకత్వం వహించిన ‘మన ఊరి పాండవులు’ సినిమాను హిందీలో ‘హమ్ హై పాంచ్’గా రీమేక్ చేశాను. ఈ రీమేక్తోనే నిర్మాతగా నా కెరీర్ ప్రారంభమైంది’’ అన్నారు బోనీ కపూర్. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వలిమై’. కీలక పాత్రలో హ్యూమా ఖురేషీ, విలన్గా కార్తికేయ నటించారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 24) విడుదలవుతోంది. తెలుగులో ఇనుమూరి గోపీచంద్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోనీ కపూర్ మాట్లాడుతూ – ‘‘అజిత్, వినోద్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. వీరి కాంబినేషన్లో మూడో సినిమా చేస్తున్నాను. కార్తికేయ ఆఫ్ స్క్రీన్లో కూల్గా ఉంటాడు కానీ ఆన్ స్క్రీన్పై షేర్లా యాక్ట్ చేస్తాడు. నా కుమార్తె జాన్వీ కపూర్ దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. తెలుగులో యాక్ట్ చేసేందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తోంది’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారి బ్యానర్ (శ్రీదేవి భర్త బోనీ కపూర్)లో యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తికేయ. -
స్టార్ హీరో అజిత్పై బోనీ కపూర్ ప్రశంసలు
Boney Kapoor Praises Ajith Kumar For Valimai Film: నిర్మాతల ఇష్టమైన నటుడు అజిత్ అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అన్నారు. ఈయన జి.స్టూడెంట్స్ సంస్థతో కలిసి (అజిత్ కథానాయకుడిగా) నిర్మించిన చిత్రం వలిమై. హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో విడుదల కానుంది. ఇది కుటుంబ అనుబంధాలతో కూడిన యాక్షన్ చిత్రమని నిర్మాత బోనీ కపూర్ వెల్లడించారు. అజిత్ వినమ్రత కలిగిన నిబద్ధతతో కూడిన నటుడని కితాబు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆయన నిర్మాతల ఇష్టమైన నటుడని అన్నారు. ఈ చిత్రం తాము ఊహించిన విధంగా రూపొందడానికి అజిత్ సహకారమే కారణమన్నారు. దర్శకుడు హెచ్.వినోద్ శ్రమకు ప్రతిఫలం ఈ చిత్రం అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా తాము థియేటర్లోనే విడుదల చేయడానికి మొగ్గు చూపామన్నారు. -
శ్రీదేవిపై బోనీ కపూర్ ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట్లో వైరల్
Boney Kapoor Emotional Post On Her Late Wife Sridevi: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇటీవలే ఇన్స్టా గ్రామ్లో చేరారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు. తన కుటుంబ సభ్యుల ఫొటోలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం (డిసెంబర్ 18) తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్లో తన దివంగత భార్య, నటి శ్రీదేవితో సన్నిహితంగా కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో శ్రీదేవి నల్లటి కోటు, కండువా ధరించి బ్లాక్ షేడ్స్ పెట్టుకుని ఉన్నారు. అలాగే బోనీ కపూర్, శ్రీదేవి ఒకరి చేతులను ఒకరు చుట్టుకుని అందంగా నవ్వుతూ ఫొటోకు ఫోజిచ్చారు. ఈ పోస్ట్కు రెడ్ హార్ట్ ఎమోటికాన్లతో 'మై హార్ట్' అనే క్యాప్షన్ను యాడ్ చేశారు బోనీ కపూర్. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై అభిమానులు ప్రేమతో కామెంట్లు కురిపించారు. 'ఉత్తమ జంట' అని ఒక యూజర్ రాయగా, 'మిస్ యూ మేడమ్ ఎప్పటికీ' అని మరొకరు కామెంట్ చేశారు. గతంలో కూడా బోనీ తన కుటుంబం మొత్తం ఉన్న ఫొటోను పోస్ట్ చేసి దానికి 'నా బలం' అని క్యాప్షన్ ఇచ్చారు. అంతుకుముందు అతని పిల్లలైన అన్షులా, అర్జున్, జాన్వీ, ఖుషీలతో కలిసి ఫోజులిచ్చిన ఫొటోను షేర్ చేశారు బోనీ కపూర్. ఈ పోస్ట్కు 'నా ఆస్తి' అని క్యాప్షన్ యాడ్ చేశారు. బోనీ కపూర్, శ్రీదేవి 1996లో వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు కుమార్తెలు. ఫిబ్రవరి 24, 2018న దుబాయ్లో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరైన తర్వాత శ్రీదేవి మరణించారు. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) ఇదీ చదవండి: పెళ్లికి ముందు శ్రీదేవి ఎవర్ని ప్రేమించిందో తెలుసా? -
వాఘా సరిహద్దు వద్ద తల.. ఫోటోలు షేర్ చేసిన బోనీ కపూర్
తమిళంతో పాటు తెలుగులో ‘తల’ అజిత్ కుమార్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈయన సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈయనకి నటనే కాకుండా షూటింగ్, బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే సమయం చిక్కినప్పుడల్లా బైక్పై యాత్రలు చేస్తూ ఉంటాడు ఈ స్టార్. హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాణంలో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాలిమై’. ఈ సినిమా షూటింగ్ రష్యాలో జరుగుతున్న టైమ్లోనూ ఇలాంటి టూర్స్కి వెళ్లొచ్చాడు ఈ హీరో. అయితే తాజాగా ఆ మూవీ షూటింగ్ గ్యాప్లో వాఘా సరిహద్దుకు వెళ్లాడు ఈ నటుడు. ఆయన గేటు దగ్గర నిల్చుని మూడు రంగుల జెండా పట్టుకుని ఫొటోలకు ఫోజు ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ చిత్ర నిర్మాత బోనీ కపూర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అజిత్ సైనికులతో కలిసి ఫొటోలు దిగాడు. దీంతో ఆయన తాజా చిత్రంలో ఈ హీరో బైక్ రేసర్గా కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పిక్స్ వైరల్గా మారాయి. చదవండి: బైక్పై ప్రపంచాన్ని చుట్టేస్తున్న స్టార్ హీరో.. పిక్స్ వైరల్ Nothing can stop him from living his passion and making his each dream come true. Universally Loved. #AjithKumar pic.twitter.com/vcynxZdkZ8 — Boney Kapoor (@BoneyKapoor) October 23, 2021 -
అజిత్.. వలిమై తర్వాతేంటి..?
తమిళసినిమా: హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వలిమై. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది ఘట్టానికి చేరుకుంది. దీంతో అజిత్ నటించనున్న నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కాగా బోనీ కపూర్కి మరో అవకాశం ఇస్తున్నట్లు తాజా సమాచారం. ఇక గతంలో నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలలో అజిత్ నటించారు. ఈ రెండింటికీ హెచ్.వినోద్నే దర్శకుడిగా ఎంచుకున్నారు. తదుపరి చిత్రా నికి కూడా ఈయనే దర్శక త్వం వహించనున్నారు. నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలకు యువన్ శంకర్రాజా సంగీతం అందించారు. కాగా అజిత్ తాజా చిత్రానికి జిబ్రాన్ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు తెలిసింది. -
జాన్వీ అలా పిలిస్తే విచిత్రంగా అనిపిస్తుంది: అర్జున్
ముంబై: ‘‘అన్షులా మాత్రమే.. నన్ను ‘భాయ్’ అని పిలుస్తుంది. కానీ జాన్వీ ‘అర్జున్ భయ్యా’ అంటుంది. ఎందుకో జాన్వీ అలా పిలిస్తే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. చాలా కొత్తగా కూడా ఉంటుంది’’ అన్నాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. నిజానికి తనను అలా పిలవమని, ఎప్పుడూ చెప్పలేదని.. జాన్వీకి ఎలా నచ్చితే అలాగే పిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తమది పరిపూర్ణ కుటుంబం కాదని, ఒకరితో ఒకరం కలిసి పోయేందుకు ఇంకాస్త సమయం పడుతుందని పేర్కొన్నాడు. తామంతా కలిసినపుడు ఎంతో ఆహ్లాదంగా గడుపుతామని, అయితే అంతమాత్రాన ఇప్పుడే ఒక్క కుటుంబంగా మారిపోయామని చెప్పడం అబద్ధమే అవుతుందన్నాడు. కాగా శ్రీదేవి మరణించిన సమయంలో జాన్వీ, ఖుషీకి దగ్గరయ్యారు బోనీ కపూర్ మాజీ భార్య మోనా శౌరీ పిల్లలు అర్జున్, అన్షులాలు. అప్పటి నుంచి చెల్లెళ్లద్దరికీ అన్న ప్రేమను పంచుతున్నాడు అర్జున్ కపూర్. ఈ విషయం పట్ల బోనీ కపూర్ సైతం సంతోషంగా ఉన్నాడు. అయితే, జాన్వీ, ఖుషీలతో తన అనుబంధం గురించి అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘కేవలం అభిప్రాయాలు వేరుగా ఉన్నంత మాత్రాన మేం ఇంకా కలిసిపోలేదని చెప్పడం లేదు. రెండు వేర్వేరు కుటుంబాలు ఒక్కటి కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేగానీ.. ఇప్పుడే అంతా కలిసిపోయాం.. మేమంతా ఒక్కటే అనే అబద్ధపు ప్రచారాలు చేయడం నాకిష్టం ఉండదు. దేనికైనా సమయం పడుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మోనాకు విడాకులు ఇచ్చి, బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన మోనా 2012లో మరణించింది. ఆమె చనిపోయిన 6 సంవత్సరాలకు శ్రీదేవి కన్నుమూసింది. -
త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ!
అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తుంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విదేశాలలో ఇటీవలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని భావిస్తోందట. తండ్రి బోనీకపూర్ కూడా ఆమెను వెండితెరకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మొదట బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని భావించినా తండ్రి బోనీ కపూర్ మాత్రం తెలుగు సినిమాతో అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఖుషీ కపూర్ యాక్టింగ్లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇంతకుముందే జాన్వీ కపూర్ సైతం టాలీవుడ్లో నటించనుందనే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్- మహేష్బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇవి కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికే ఆ సినిమాలో పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ ఎవరు అన్న దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. చదవండి : శ్రీదేవి నాకు రోల్మోడల్ : ప్రియంక చోప్రా బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్ -
ఆర్జీవీ ఇంట విషాదం: సోదరుడిని మిస్ అవుతున్న వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్ కరోనాకు బలయ్యాడు. కొద్దిరోజులుగా కోవిడ్తో పోరాడుతున్న ఆయన హైదరాబాద్లో ఆదివారం తుది శ్వాస విడిచాడు. కాగా సోమశేఖర్ రంగీలా, దౌడ్, సత్య, జంగల్, కంపెనీ వంటి పలు చిత్రాల నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాడు. అనురాగ్ కశ్యప్ రచయితగా పని చేసిన హిందీ సినిమా 'ముస్కురాకే దేఖ్ జర'కు దర్శకుడిగానూ పని చేశాడు. అతడి మరణంపై ఆర్జీవీ ఎమోషనల్ అయ్యాడు. "కొన్నేళ్లుగా అతడు మాతో లేడు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్ అవుతున్నాను" అని పేర్కొన్నాడు. In this turbulent time just got to know about our old associate #PSomShekar passing away. He was taking care of his mother who had Covid. He got infected too but did not stop taking care of her. #RIPPSomShekhar pic.twitter.com/yqtJ4Xs6pK — Boney Kapoor (@BoneyKapoor) May 23, 2021 'తల్లి కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్న శేఖర్, కరోనా సోకిన తర్వాత కూడా ఆమె కోసం పరితపించాడు. ఈ క్రమంలో అతడూ కరోనా బారిన పడ్డాడు. అయినప్పటికీ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెను కాపాడుకోగలిగాడు కానీ తను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు' అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విచారం వ్యక్తం చేశాడు. సత్య చిత్రీకరణ సమయంలో వర్మ కంటే సోమశేఖర్కే ఎక్కువ భయపడేవాళ్లమన్న జేడీ చక్రవర్తి ఇద్దరి అభిరుచి ఒకటే కావడంతో చిన్న చిన్న తగాదాలు కూడా జరిగేవని తెలిపాడు. అయితే తొందరగానే అన్నింటినీ సర్దుకుపోయేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. ఈ మధ్య శేఖర్ ఒంటరివాడిగా మారిపోయాడని, కనీసం ఫోన్ కాల్స్ కూడా మాట్లాడకపోవడం ఆందోళనకు గురి చేసిందన్నాడు. ఇంతలోనే ఆయనను కరోనా కబళించడం విషాదకరమన్న జేడీ అతడు మన మధ్య లేనందుకు ఎక్కువగా బాధపడేది ఆర్జీవీనే అని తెలిపాడు. చదవండి: నా చావుకు సుపారీ ఇచ్చాను, ఆ అవసరం రాదు: ఆర్జీవీ -
రూ. 30 కోట్ల భారీ సెట్ ధ్వంసమైంది.. బోని కపూర్ ఆవేదన
ఒకవైపు కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే.. మూలిగే నక్క మీద తాటిపండు పడడం అన్నట్లుగా తౌటే తుఫాన్ వచ్చి దేశంలో కల్లోలం సృష్టించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తుఫాన్ ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా భారీగానే పడింది. బాలీవుడ్కు చెందిన చాలా సినిమాల సెట్టింగులు దెబ్బ తిన్నాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది. కేవలం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కారణంగా రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బోని కపూర్ మీడియాకు వెల్లడించారు. అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్ను ముంబైలో వేశారు. అయితే తౌటే తుఫాన్ దాటికి ఆ సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో బోనికపూర్ మాట్లాడుతూ..‘గతేడాది లాక్డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్ను తొలిసారి కూలగొట్టాం. ఆ తర్వాత మళ్లీ రెండోసారి సెట్ వేసి చిత్రీకరించాం. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మరోసారి సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌటే తుఫాన్ ధాటికి మళ్లీ సెట్ అంతా కూలిపోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది ’అని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
డ్యాన్సర్తో శ్రీదేవి బ్రేకప్ స్టోరీ
శ్రీదేవి.. ఏ తరానికైనా ఆరాధ్య తారే. మిథున్ చక్రవర్తి.. ఎప్పటికీ డాన్స్ గురునే! ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు దాదాపుగా హిట్టే! తెర మీద ఈ జంట సూపర్ హిట్! మూడుముళ్లతో జీవితంలోనూ కలిసి నడవాలనుకున్నారు.. తమ ప్రేమను కలకాలం నిలుపుకోవాలనుకున్నారు. అదే జరిగి ఉంటే ఇక్కడ ‘మొహబ్బతే’లో వాళ్ల గురించి ప్రస్తావన వచ్చి ఉండేది కాదు. ‘సప్తపది’ తెలుగు సినిమాను హిందీలో ‘జాగ్ ఉఠా ఇన్సాన్’గా ( దీనికీ కె. విశ్వనాథే దర్శకుడు) తీశారు. నాయికానాయకులు శ్రీదేవి, మిథున్ చక్రవర్తి. ఆ సినిమా సెట్స్ మీదే ఆ ఇద్దరికీ స్నేహం కుదిరింది. తన పని పట్ల మాత్రమే శ్రద్ధ పెట్టే శ్రీదేవి మనస్తత్వం మిథున్కు నచ్చింది. ఆమె మొహంలోని అమాయకత్వం అతణ్ణి ఆకర్షించింది. దాంతో ఆ స్నేహాన్ని ఆమె మీద ప్రేమగా మార్చుకున్నాడు. తనను ప్రత్యేకంగా.. కావాల్సిన వ్యక్తిగా ఆత్మీయంగా చూడసాగాడు. అతని కళ్లల్లోని ఆ ఆప్యాయత శ్రీదేవి శ్రద్ధను చెదరగొట్టింది. మనసు మిథున్ వైపు పోయేలా చేసింది. అలా వాళ్ల ప్రేమ ప్రయాణం మొదలైంది. ఇది 1984 నాటి ముచ్చట. ఆ ఇద్దరూ జంటగా బయట ఎక్కడా పెద్దగా కనిపించకపోయినా.. సోర్స్ ద్వారా పేజ్ త్రీ ఆ నిప్పు అందుకుంది.. రూమర్స్, గాసిప్స్ పొగను వదిలింది. ఆ సమయంలోనే... శ్రీదేవిని సైలెంట్గా, సీక్రేట్గా ఆరాధించసాగాడు నిర్మాత బోనీ కపూర్. అప్పటికే మిథున్, బోనీ మంచి ఫ్రెండ్స్. శ్రీదేవి పరిచయం నాటికే ఇటు మిథున్కు యోగితా బాలితో, అటు బోనీకి మోనాతో పెళ్లిళ్లయ్యాయి. రెండు జంటలూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్లోనే ఉన్నాయి. రాఖీ రోజులు గడుస్తున్నాయి. మిథున్, శ్రీదేవిల మధ్య అనుబంధం పెరుగుతోంది.. బంధం బలపడుతోంది. ఆమె లేకుండా అతను ఉండలేని పరిస్థితి. ‘పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాడు శ్రీదేవితో. ఆమె ఆనందానికి అవధుల్లేవు. శ్రీదేవితో తన ప్రేమను వెలిబుచ్చినప్పుడే ‘యోగితాకు విడాకులిస్తున్నాను’అనీ చెప్పాడు. అందుకే మిథున్ నోటెంట పెళ్లి ప్రస్తావన రాగానే విడాకులు మంజూరయ్యాయేమో అనుకుంది. ఇంకొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు అడిగింది శ్రీదేవి.. మిథున్ను ‘మీ లైఫ్లో రెండో స్త్రీగా ఉండలేను. విడాకులు ఎంతవరకు వచ్చాయి?’ అని. అతణ్ణించి స్పష్టమైన జవాబు రాలేదు కాని ఓ అనుమానం బయటకు వచ్చింది. బోనీకీ శ్రీదేవి అంటే ఇష్టం అన్న సంగతి మిథున్కి అర్థమైంది. శ్రీదేవీకీ ఆ విషయం తెలుసేమో.. తెలిసీ తేల్చట్లేదేమో అన్నదే ఆ శంక. శ్రీదేవి ముందు అనేశాడు. ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. ఆమెకు బోనీ కపూర్ కుటుంబంతో ఉన్న చనువుతో మిథున్ అనుమానాన్ని తీర్చేయాలనుకుంది. ఆ రాఖీ పౌర్ణిమ రోజు బోనీ కపూర్ వాళ్లింటికి వెళ్లి బోనీ చేతికి రాఖీ కట్టేసింది. మిథున్ చింతను దూరం చేసింది శ్రీదేవి. ఆత్మహత్య.. ఈలోపు పేజ్ త్రీ .. మిథున్, శ్రీదేవీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తను (అది వదంతే అని శ్రీదేవి, మిథున్ ఇద్దరూ కూడా కొట్టిపారేశారు) ప్రచారం చేసింది. ఇది యోగితాకు తెలిసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాంతో మిథున్ భయపడ్డాడు యోగితా ముందు విడాకుల విషయం తేవడానికి. ఇటు శ్రీదేవినీ వదులుకోదల్చుకోలేదతను. శ్రీదేవికి ఆ తాత్సారం అర్థం కాలేదు. మళ్లీ అడిగింది. ‘నేను కావాలో.. నీ భార్య కావాలో తేల్చుకో’ అని అల్టిమేటమూ ఇచ్చింది. యోగితాకు దూరమయ్యే ధైర్యం చేయలేకపోయాడు. అర్థం చేసుకుంది శ్రీదేవి. నెమ్మదిగా మిథున్ జీవితంలోంచి పక్కకు తప్పుకుంది. దాదాపు అయిదేళ్ల ఆ ప్రేమ అలా విషాదాంతమైంది. మానసిక క్షోభకు చాలానే గురైంది శ్రీదేవి. ఆ తర్వాత ఆమె కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు బోనీ కపూరే అండగా నిలబడ్డాడనీ అలా బోనీలో శ్రీదేవి ఓదార్పు వెదుక్కుందని, అతని ప్రేమను అంగీకరించి భర్తగా చేసుకుందని బోనీ, శ్రీదేవీల పెళ్లికి నేపథ్యం చెప్తారు ఇండస్ట్రీలో వాళ్లు. తాను కల కన్న పెద్ద కూతురు జాన్వీ కెరీర్ చూడకుండానే అర్థంతరంగా 54 ఏళ్లకే ఈ లోకానికి వీడ్కోలు చెప్పింది శ్రీదేవి. మిథున్ ఇష్టాన్ని నేనేప్పుడూ కాదనలేదు. ఒకవేళ అతను రెండో పెళ్లి చేసుకొని వచ్చినా నేను ఒప్పుకునేదాన్ని. – యోగితా బాలి (స్టార్ అండ్ స్టైల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో). తనకు, బోనీకి మధ్య ఏమీ లేదని మిథున్కు నిరూపించడానికే బోనీకి రాఖీ కట్టింది శ్రీదేవి. – బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ (సావీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) - ఎస్సార్ -
దర్శకుడు రాజమౌళిపై బోనీ కపూర్ ఆగ్రహం!
కరోనా వల్ల సినిమా పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఇలాంటి సమయంలో అందరూ కలసికట్టుగా ముందుకు వెళితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాల విడుదల విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాల్సిన అవసరం ఉందన్నది నిర్మాతల అభిప్రాయం. ఈ విషయంలోనే రాజమౌళిపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్కి ఆగ్రహం వచ్చినట్లు ఉంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ (అక్టోబర్ 13)ని ప్రకటించారు. ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతర భాషలవాళ్లు కూడా ఈ సినిమా విడుదల అప్పుడు తమ సినిమాని రిలీజ్ చేయడానికి ఇష్టపడరు. అయితే అజయ్ దేవగణ్తో తీస్తున్న ‘మైదాన్’ సినిమాని అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్లు చాలా రోజుల క్రితం చిత్రనిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్ కీలక పాత్ర చేస్తున్నారు. దసరాకి నా ‘మైదాన్’ ఉంది, ఒకసారి బోనీ కపూర్తో మాట్లాడండి అని రాజమౌళికి అజయ్ దేవగణ్ చెప్పినా, ఆయన పట్టించుకోలేదనే వార్త ప్రచారంలోకొచ్చింది. రెండు సినిమాల క్లాష్ గురించి బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో – ‘‘నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇది అనైతికం. ‘మైదాన్’ సినిమా రిలీజ్ డేట్ని ఆరు నెలల క్రితమే ప్రకటించాను. ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన సమయంలో రాజమౌళి ఇలా చేశాడు’’ అని పేర్కొన్నారనే వార్త ఉంది. మరి.. ‘ఆర్ఆర్ఆర్’ వెర్సస్ ‘మైదాన్’ క్లాష్ తప్పుతుందా? వేచి చూడాలి. -
రాజమౌళి నిర్ణయంతో వకీల్సాబ్ నిర్మాత అప్సెట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందరి ఆశలను ఎట్టకేలకు నిన్న ఈ మూవీ రిలీజ్ డేట్ను డైరెక్టర్ రాజమౌళి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ ఇద్దరూ రాజమౌళి నిర్ణయంతో సంతోషంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాత్రం నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ విడుదల తేదినే బోనీ కపూర్ ప్రొడక్షన్లో వస్తున్న మైదాన్ సినిమా విడుదల కానున్నట్లు నిర్మాత ఆరు నెలల క్రితమే ప్రకటించాడు. ఈ రెండు సినిమాల్లోనూ అజయ్ దేవగణ్ నటిస్తుండటం విశేషం. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీకి ముందే బోనీ కపూర్తో మాట్లాడాలని అజయ్ రాజమౌళిని కోరాడట. చదవండి: సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో అజయ్ నటిస్తున్న మైదాన్ చిత్రం ఫుట్బాల్ లెజండరీ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహిత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అందుకే ప్రత్యేకంగా రాజమౌళితో ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించే ముందు బోనీ కపూర్ను సంప్రదించాలని అజయ్ దేవగణ్ చెప్పినట్లు సమాచారం. అయితే బోనీ కపూర్ను కలవకుండానే రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ను ప్రకటించాడు. దీంతో ఈ బాలీవుడ్ నిర్మాత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ‘తప్పకుండా నేను నిరాశ చెందుతున్నాను! ఇది చాలా సరైనది కాదు. మైదాన్ విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితం ప్రకటించాను. సినీ పరిశ్రమను కాపాడటానికి మనమందరం కలిసి రావాల్సిన సమయంలో, అతను (రాజమౌళి) ఇలా చేశాడు’ అని బోనీ కోపంగా ఉన్నట్లు టాక్. చదవండి: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది ఇదిలా ఉండగా కోవిడ్ అనంతరం ప్రతి సినిమాకు చెందిన యూనిట్, నిర్మాతలు తమ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఫైట్ను నివారించేందుకు 'ఆర్ఆర్ఆర్' కోసం బోనీ కపూర్ తన చిత్రాన్ని వాయిదా వేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్లో విజయం సాధించిన పింక్ రీమెక్ వకీల్ సాబ్ను బోనీ కపూర్, దిల్ రాజ్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
అవును ఖుషీ ఎంట్రీ త్వరలోనే: బోనీ కపూర్
ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. కూతురిని హీరోయిన్గా చూడాలన్నది శ్రీదేవి కోరిక. అనుకున్నట్లుగానే పెద్ద కూతురిని హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేసింది శ్రీదేవి. ఇక తాజాగా ఆమె రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా త్వరలో నటిగా ఏంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఖుషీ ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందా అని శ్రీదేవి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఈ క్రమంలో ఆమె త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందంటూ కొంతకాలంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఖుషీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సైతం త్వరలోనే ఖుషీ నటిగా ఆరంగ్రేట్రం చేయనుందని స్పష్టం చేశాడు. అయితే ఖుషీని మొదట పరిచయం చేసేది మాత్రం తాను కాదని పేర్కొన్నాడు. ఓ ఇంటర్య్వూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. ‘ఖుషీని సినిమాల్లో పరిచయం చేయడానికి నా దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. (చదవండి: ఆ విషయంలో నన్ను ఎక్కిరించేవారు: ఖుషీ కపూర్) అయితే తనని మాత్రం మొదట పరిచయం చేసే వ్యక్తిని నేను కాదు. ఓ నిర్మాతగా నాకు, నటిగా తనకు ఇది మంచిది కాదు. ఎందుకంటే ఓ తండ్రిగా ఖుషీ తన సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ఖుషీ కూడా సోషల్ మీడియాలో వరుసగా తన ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుండటంతో ఆమె ఎంట్రీ తర్వలోనే ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రైవసీలో ఉన్న తన ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్ను తాజాగా ఖుసీ పబ్లిక్ చేసింది. అనంతరం హాట్ హాట్ ఫోటోలను పంచుకోవడం ప్రారంభించింది. అవి చూసిన ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు వెండితెరపై కనిపించేందుకు ఖుషీ సిద్దమైందని, ఆమె ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఖుషీ లండన్లో ఫిలీం స్కూల్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటుందని, త్వరలోనే తను నటిగా మీ ముందుకు వస్తుందని పలు ఇంటర్య్వూలో జాన్వీ కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: మా పిల్లలు ప్రతిభావంతులు) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) -
యాక్టర్ బోనీ కపూర్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కొత్త ప్రయాణం ప్రారంభించారు. దాదాపు నలభై ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న బోనీ ఇప్పుడు నటుడిగా మారారు. లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ ఓ సినిమా చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు బోనీ కపూర్. ఈ పాత్రకు బోనీ కపూరే సరిగ్గా సరిపోతారని దర్శకుడు భావించి, ఆయన్ను ఒప్పించారట. త్వరలోనే ఈ సినిమా సెట్లో జాయిన్ అవుతారు బోనీ. ఇటీవలే అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో వచ్చిన ‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు బోనీ. ఇప్పుడు రణ్బీర్ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తారు. -
నటుడిగా మారబోతున్న స్టార్ ప్రొడ్యూసర్
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఇటీవల నటన వైపు దృష్టి మళ్లించారు. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఏకె వర్సెస్ ఏకె' చిత్రంలో అతిథి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించమని బోనీ కపూర్కి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం పలు బహుళ భాషలు నిర్మించే పనిలో బిజీగా ఉండటంతో వాటిని సున్నితంగా తిరస్కరించారు. అయితే తాజాగా ఆయన లవ్ రంజన్ దర్శకత్వంలో నటించేందుకు పంచ జెండా ఊపేశాడు. ఈ చిత్రంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఆయన ఈ చిత్రం షూటింగ్లో పాల్గొననున్నారు. కాగా, బోనీ కపూర్ ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు.. బధాయి హూ రిమేఖ, తమిళంలో వాలిమై చిత్రాలను నిర్మిస్తున్నారు. Bollywood Star Producer #BoneyKapoor To Act In Luv Ranjan’s Next With #RanbirKapoor Boney Kapoor will play the role of father to young star hero Ranbir Kapoor in the movie. Boney Kapoor will join the shoot of the film soon. @BoneyKapoor pic.twitter.com/pdhZIc39mA — BARaju (@baraju_SuperHit) January 10, 2021 -
మా పిల్లలు ప్రతిభావంతులు
చిన్నతనంలో పిల్లలు పిచ్చి గీతలు గీస్తేనే మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. పెద్దయ్యాక వాళ్లే కుంచె పట్టుకొని అద్భుతమైన బొమ్మలు వేస్తే? ఆ ఆనందానికి అవధులుండవు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. లాక్డౌన్లో బోనీ కపూర్ కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ డ్రాయింగ్ మీద దృష్టి పెట్టారు. లాక్డౌన్లో వాళ్లు గీసిన పెయింటింగ్స్ను తన ట్విట్టర్లో షేర్ చేసి, ‘మా పిల్లలు ప్రతిభావంతులు’ అని మురిసిపోయారు బోనీ కపూర్. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గీసిన చిత్రాలను ఇక్కడ చూడొచ్చు. -
ఆ నిర్మాత ఇంట్లో మహమ్మారి బారిన మరో ఇద్దరు
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన 48 గంటల్లోనే ఆ ఇంట్లో పనిచేసే మరో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. వీరికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోవడం గమనార్హం. బోనీకపూర్ తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి ముంబైలోని లోఖండ్వాలా నివాసంలో ఉంటున్నారు. కాగా తమకు వైరస్ ప్రభావం లేదని, క్షేమంగా ఉన్నామని బోనీకపూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండురోజుల కిందట వారి ఇంట్లో పనిచేసే చరణ్ సాహూకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆ ఇంట్లో పనిచేసే వారితో పాటు బోనీకపూర్ కుటుంబ సభ్యులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. బోనీ సహా ఇద్దరు కుమార్తెలకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చింది. కాగా బోనీకపూర్ తన అభిమానులను ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో తామంతా క్షేమంగా ఉన్నామని, వైరస్ బారిన పడకుండా క్వారంటైన్లో ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని చెప్పారు. చదవండి : ప్రముఖ నిర్మాత ఇంట కోవిడ్-19 కలకలం -
బోనీ కపూర్ ఇంటి సహాయకుడికి కరోనా
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో ఒకరికి కరోనా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. బోనీ ఇంటి సహాయకుడు 23 ఏళ్ల చరణ్ సాహుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించగా కరోనా అని నిర్ధారణ అయిందట. దాంతో అతణ్ణి క్వారంటైన్కి తరలించారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం మా ఇంట్లో మాకెవరికీ (కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్) కరోనా లక్షణాలు కనిపించలేవు. లాక్ డౌన్ ప్రారంభించినప్పటి నుంచి మేం ఎవరం ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. అలాగే మా ఇంట్లో పని చేస్తున్న ఇతర సిబ్బందికి కూడా కరోనా లక్షణాలు లేవు. చరణ్ కోలుకుని మళ్లీ మా ఇంటి పనులకు హాజరవ్వాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు, -
ప్రముఖ నిర్మాత ఇంట కోవిడ్-19 కలకలం
ముంబై : బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నివాసంలో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడికి నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్గా ఫలితం వచ్చింది. తన ఇంట్లో పనిచేసే చరణ్ సాహూ శనివారం అస్వస్థతకు గురవడంతో బోనీకపూర్ శనివారం అతడిని పరీక్షలకు పంపించగా, అధికారులు ఐసోలేషన్లో ఉంచారు. కోవిడ్-19 పాజిటివ్గా నిర్దారణ కావడంతో చరణ్ సాహును బీఎంసీ అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించనున్నారు. కాగా తాను, తన కుమార్తెలు, ఇంట్లో ఉన్న ఇతర సిబ్బంది అందరం బాగానే ఉన్నామని, తమకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని బోనీకపూర్ చెప్పుకొచ్చారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ తాము ఇంట్లోనే ఉన్నామని చెప్పారు. వేగంగా స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అధికారులను బోనీ కపూర్ ప్రశంసించారు. బీఎంసీ, వైద్యాధికారుల సూనలను తాము విధిగా పాటిస్తున్నామని, చరణ్ సాహూ సైతం త్వరగా కోలుకుని తమ వద్దకు చేరతాడని భావిస్తున్నామని బోనీ కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : మానవత్వం చాటుకున్న ఢిల్లీ పోలీసులు -
‘జాన్వీ’ కోసం శ్రీదేవి-బోనీ ఎంతలా ఆలోచించారంటే?
తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి చిన్నపాటి యుద్దమే చేస్తారు. జనరేషన్కు అనుగుణంగా పెద్దయ్యాక తమను తిట్టుకోకుండా ఉండేలా పిల్లలకు సూటయ్యేలా పేర్లను ఎంపిక చేస్తారు. ఇక ఇలాంటి అనుభవమే అతిలోకసుందరి శ్రీదేవి-నిర్మాత బోనీ కపూర్ దంపతులకు కూడా ఎదురైంది. మార్చి 6, 1997న పుట్టిన తమ తొలి సంతానానికి ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించారంట ఈ దంపతులు. అయితే అప్పుడే (1997) తను నటించిన, తన భర్త నిర్మించిన ‘జుడాయి’ చిత్రంలోని ఓ పాత్ర శ్రీదేవిని చాలా ఆకర్శించిందంటా. ఆ చిత్రంలోని ఆ పాత్ర ప్రేరణతోనే తమ కూతురికి ‘జాన్వీ’ అనే పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారంట. అనిల్ కపూర్, శ్రీదేవి, ఊర్మిలా మటోండ్కర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘జుడాయి’. ఈ చిత్రంలో ఊర్మిలా పాత్ర పేరు జాన్వీ. ‘జుడాయి’ సినిమాలోని జాన్వీ పాత్ర శ్రీదేవి, బోనీ కపూర్లకు ఎంతో నచ్చిందంట, అంతేకాకుండా వారికి ఎంతో ప్రేరణ కలిగించిందట. దీంతో తమ తొలి సంతానానికి జాన్వీ అని నామకణం చేశామని ఓ ఇంటర్వ్యూలో ఈ దంపతులు పేర్కొన్న విషయం తెలసిందే. ‘దడఖ్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న జాన్వీకి తన తల్లి శ్రీదేవితో మంచి అటాచ్మెంట్ ఉంది. మదర్స్డే సందర్భంగా తన తల్లిని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. చదవండి: విరాటపర్వం: సాయిపల్లవి నక్సలైట్ కాదు! శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్ View this post on Instagram ❤️ A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on May 10, 2020 at 3:07am PDT -
తమిళంలోకి ఆర్టికల్ 15
గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న అణచివేతను ఈ సినిమాలో చర్చించారు. సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తీసుకున్నారు. బోని ఆ మధ్య హిందీ ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో అజిత్తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్లో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా నటిస్తారట. అరుణ్ కామరాజ్ దర్శకత్వం వహించ నున్నారు. -
హ్యూమాకి భయమా?
ముంబై వీధుల్లో బైక్పై షికారు చేస్తున్నారు హ్యూమా ఖురేషీ. కానీ ఇది సరదా కోసం చేస్తున్న షికారు కాదు. తన కొత్త సినిమా కోసం హ్యూమా నేర్చుకుంటున్న బైక్ పాఠాలు. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాతగా తమిళంలో ‘వలిమై’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటిస్తున్నారు హ్యూమా ఖురేషీ. రేసింగ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలోని తన క్యారెక్టర్ కోసం హ్యూమా ఖురేషీ బైక్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇందులో హ్యూమా అదిరిపోయే బైక్ స్టంట్స్ కూడా చేస్తారట. బైక్ స్టంట్స్ అంటే చిన్న విషయం కాదు. చాలా ధైర్యం ఉండాలి. ‘హ్యూమాకి భమయా’ అంటూ సరదాగా నవ్వుతూ హ్యూమా బైక్ స్టంట్స్ నేర్చుకుంటున్నారు. ఇందులో అజిత్ పోలీసాఫీసర్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరగాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. -
సల్మాన్తో సంబంధాలు దెబ్బతిన్నాయి: బోనీ కపూర్
ముంబై : కండల వీరుడు సల్మాన్ ఖాన్తో తనకు ప్రస్తుతం సంబంధాలు తగ్గిపోయాయని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అన్నారు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హిందీ రిమేక్ ‘పింక్’ సినిమాను తెలుగులో బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇటీవల బోనీ కపూర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పిల్లలు అర్జున్, అన్షులా, జాన్వీ ,ఖుషిపై అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బోనీ కపూర్ ఎప్పుడూ బహిరంగంగా చెప్పరు. ఎందుకని ప్రశ్నించగా.. పిల్లలపై తనకున్న ప్రేమ సహజమని, అది బయటకు చెప్పల్సిన అవసరం లేదని భావిస్తున్నాని అన్నారు. ఈ నలుగురిలో ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారని అడగ్గా.. ఒక తండ్రిగా తనకు నలుగురూ సమానమేనని. కాకపోతే ఖుషి చిన్నది కాబట్టి తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖుషి చదువుల నిమిత్తం విదేశాలలో ఉందని తెలిపారు. ఇక బోని కపూర్కు నలుగురు పిల్లలు. అర్జున్ కపూర్, అన్షులా, జాన్వీ, ఖుషీ.. అర్జున్, అన్షులా బోని కపూర్ మొదటి భార్య మోనా సంతానం కాగా అనంతరం ఆమెకు విడాకులిచ్చి అందాల తార శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ, ఖుషీ ఇద్దరు పిల్లలు. అన్షులా గురించి మాట్లాడుతూ.. ‘అన్షులా చాలా తెలివైన అమ్మాయి. కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంది. మొదట తనకు గూగుల్ సంస్థలో అమెరికాలో ఉద్యోగం వచ్చింది. తనను నేను ముంబైకి రమ్మని కోరాను. తర్వాత తన పనితనం మెచ్చి కంపెనీ వారు తనను ముంబై ఆఫీస్కు పంపించారు. తనను చూస్తుంటేనాకు గర్వంగా ఉంటుంది.’ అని తెలిపారు. జాన్వీ కపూర్పై వస్తున్న విమర్శల గురించి తమ అభిప్రాయం ఏంటని అడగ్గా.. శ్రీదేవి లాంటి నటనను జాన్వీ మొదటి సినిమాకే(ధడక్) ఆశించడం సరైనది కాదు. ధడక్ చిత్రంలో తన నటనతో అందరిని ఆకట్టుకుందని నేను భావిస్తున్నాను. శ్రీదేవి మరణించిన సమయంలో ఆ బాధను దిగమింగుకుని మరీ జాన్వీ ఆ సినిమా షూటింగ్ను పూర్తి చేసిందని సమాధానమిచ్చారు. అదే విధంగా అర్జున్ను హీరోగా మీరే ఎందుకు పరిచయం లేదని ప్రశ్నించగా.. ‘అర్జున్ ఎప్పుడూ డైరెక్టర్ కావాలని అనుకునేవాడు. అందుకే నేనూ కూడా హీరోగా రావాలనే ప్రయత్నం చేయలేదు. కానీ ఓ రోజు సల్మాన్ ఫోన్ చేసి నటుడికి కావాల్సిన లక్షణాలన్నీ అర్జున్లో ఉన్నాయి. అతన్ని నటుడిగా పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పారు. హీరోగా అర్జున్కు బీజం వేసింది సల్మానే. అయితే కొన్ని కారణాల వల్ల నాకు, సల్మాన్కు సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ హీరోగా అర్జున్ హీరోగా ఎదగడానికి సహకరించింది సల్మానే.’అంటూ చెప్పుకొచ్చారు. -
హ్యాపీ బర్త్డే అమ్మా.. హీరో భావోద్వేగం
‘అమ్మా లవ్ యూ.. ఎప్పటిలాగానే.. ఇప్పుడు ఎక్కడున్నా సరే నువ్వు నవ్వుతూనే ఉండాలి.. ఈ ఫొటో మనం కలిసి జరుపుకొన్న చివరి పుట్టిన రోజునాటిది.. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో జరగాలని నేను కోరుకున్నా... నిజంగా నిన్ను మిస్ అవుతున్నా అమ్మా.. 25 ఏళ్ల వయస్సులో నిన్ను కోల్పోయినపుడు ఈ సొసైటీ నేను ఎలా ఉండాలని అయితే భావించిందో అంతే దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాను. నీ జీవితం ముగిసిపోయిన తర్వాత చాలా రోజుల పాటు నేను ఎంతగా వేదన చెందానో నాకే తెలుసు... అయితే నీ ముందు కూర్చుని.. నిన్ను విసిగించడం మాత్రం ఇప్పటికీ మానలేదు.. హ్యాపీ బర్త్డే అమ్మా.. మనం ఇలాగే కలిసి మరింత సమయం గడుపుదాం. అన్షులా నీలాగే తను చేస్తున్న పనిలో దూసుకుపోతోంది’ అంటూ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన తల్లి మోనా శౌరీ కపూర్ను గుర్తుచేసుకున్నాడు. సోమవారం తల్లి పాత ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసి.. ఆమెతో కలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు. కాగా అర్జున్ కపూర్, అతడి సోదరి అన్షులా కపూర్.. బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్- అతడి మొదటి భార్య మోనా సంతానం అన్న సంగతి తెలిసిందే. ఇక అందాల తార శ్రీదేవితో ప్రేమలో పడిన తర్వాత మోనాకు విడాకులిచ్చిన బోనీ.. ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మోనా, ఆమె పిల్లలు అర్జున్, అన్షులా తండ్రికి దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలో 2012లో మోనా క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. ఇక తల్లితో తన అనుంబంధం గురించి అర్జున్ తరచుగా గుర్తుచేసుకుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా శ్రీదేవి మరణానంతరం తండ్రి, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలతో కలిసి పోయిన అర్జున్.. ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలుస్తున్నాడు. View this post on Instagram Happy birthday Mom Love You. I hope ur smiling right now whenever you are... this picture was the last birthday we had together & I just assumed we would have many more... it’s selfish to say I miss you all the time but I really do ya... I try & be strong cause that’s the way society expected me to be at the age of 25 when I lost you forever... they all expect u to figure it all out with ur life taken away from you I was supposed to sorted & what not... but I’m not strong enough on most days... I just ride it out... anyway as usual I sit and complain & trouble u with my non sense... happy birthday Mom wish we had more time together.... PS - @anshulakapoor s started @fankindofficial & she’s kicking ass just like you did.... A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Feb 2, 2020 at 10:42am PST -
నడిచే నిఘంటువు అక్కినేని
‘‘అందం, అభినయంతో సూపర్స్టార్స్ అయిన రేఖ, శ్రీదేవిగార్లకు అక్కినేని నాగేశ్వరరావుగారి అవార్డుని నా చేతులమీదుగా ఇవ్వడం నా అదృష్టం. వారిద్దరూ భారతదేశం గర్వించదగ్గ నటీమణులు’’ అని చిరంజీవి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకు ‘అక్కినేని జాతీయ అవార్డు’లకు శ్రీదేవి, రేఖలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి చిరంజీవి చేతులమీదుగా రేఖ తీçసుకోగా, శ్రీదేవి అవార్డును ఆమె భర్త బోనీకపూర్ స్వీకరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అంజనాదేవిగారికి నాగేశ్వరరావుగారంటే చాలా ఇష్టం. నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన నటించిన ‘రోజులు మారాయి’ సినిమా చూశారు. ఆ టైంలో అమ్మ కడుపులో ఉన్నది నేనే. అందుకేనేమో.. నాకూ సినిమాలంటే ఇష్టం కలిగింది. చదువు అయిపోయాక ఇండస్ట్రీలోకి వచ్చా. అది కూడా నాగేశ్వరరావుగారు, రామారావుగారు వంటి లెజెండ్స్ టైమ్లో. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో నాగేశ్వరరావుగారితో నటించడం అద్భుతమైన జ్ఞాపకం. నేను క్రమశిక్షణగా ఉన్నానంటే అది ఆయన వల్లే.. ఓ రకంగా నా గురుతుల్యులు. ఆయన నడిచే నిఘంటువు. నటనలో ఒక ఎన్సైక్లోపీడియా. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ ఏదో ఒక రోజు ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ అంత గొప్ప స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. శ్రీదేవి, రేఖగార్లు మనందరం గర్వించే స్థాయిలో ఉన్నారు. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేసిన శ్రీదేవిగారు ‘ఇండియా లేడీ సూపర్స్టార్’ అయ్యారు. రేఖగారిపై నాకున్న అభిమానంతో నా భార్య సురేఖని ఇప్పటికీ రేఖ అనే పిలుస్తుంటా.. ఆ విషయం తనకి తెలియదు(నవ్వుతూ)’’ అన్నారు. రేఖ మాట్లాడుతూ – ‘‘నా తొలి సినిమా, తెలుగు సినిమా ‘ఇంటిగుట్టు’. శ్రీదేవిగారు గొప్పనటి. ఆమెలా ఉండాలి. నా జీవితంలో తొలిసారి చూసిన సినిమా ‘సువర్ణ సుందరి’. అంజలీదేవిగారి ‘అమ్మకోసం’ సినిమాతో నాకు బ్రేక్ వచ్చింది. నేను ఇక్కడ ఉన్నానంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా నాగేశ్వరరావుగారు, అంజలి అత్తయ్యే కారణం. ‘సువర్ణసుందరి’ సినిమా వందసార్లు చూసి ఉంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నేనూ చూశాను. ముంబైలో ఉన్నప్పుడు టి.రామారావుగారు, పూర్ణచంద్రరావుగారు, దాసరి నారాయణరావుగారు, కె.విశ్వనాథ్గారు, జితేందర్గారు ఇక్కడ సినిమాలు చేయమని పిలిచేవారు. మా అమ్మ చెప్పిన మాట ప్రకారం మరో తెలుగు సినిమా తప్పకుండా చేస్తా’’ అన్నారు. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ వేడుక సందడి చూస్తుంటే అక్కినేనిగారి చిరునవ్వును చూసినట్లుంది. నాకు, ఏయన్నార్గారికి వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ క్లాస్మేట్స్లా ఉండేవాళ్లం. అందంతో పాటు మంచి మనసున్న నటి శ్రీదేవి. 35 ఏళ్ల క్రితం రేఖ ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారు. నాగేశ్వరరావుగారు, ఎన్టీఆర్, చిరంజీవి, నాగా ర్జున వంటి వారి నుంచి నేటితరం నటీనటులు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి’’ అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారి సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాం. శ్రీదేవి, రేఖగార్లకు ఈ అవార్డులు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావుగారు ఉంటారు. ఈ వేదికమీదున్న అవార్డుతో పాటు నాన్న కూడా ఇక్కడే మనమధ్యే ఉంటారు. శ్రీదేవిగారితో నేను నాలుగు సినిమాలు చేశా. బోనీకపూర్గారు భర్తగా లభించడం శ్రీదేవిగారి అదృష్టం. అక్కినేనిగారు, శ్రీదేవిగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. రేఖగారు, శ్రీదేవిగారు ఇద్దరూ తెలుగువాళ్లే.. ఇద్దరూ ఇండియా సూపర్స్టార్సే.. ఇది మనకు గర్వకారణం’’ అన్నారు. ఈ వేడుకలో బ్రహ్మానందం, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, అఖిల్, సుమంత్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, అడివి శేష్, అమల, సుప్రియ, మంచు లక్ష్మీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఈ కలయిక ఏ క్రేజ్కు చిహ్నం?
ఒక క్రేజీ కలయిక అమెరికా వేదికైంది. అది ఒక హిట్ చిత్ర కాంబినేషన్కు దారి తీయనుందా? ఆ సంగతేంటో చూద్దాం. సంచలన నటి నయనతారను అగ్రనటి అని, లేడీసూపర్స్టార్ అని పిలుస్తుంటారు. ఇటీవల విజయ్తో బిగిల్ చిత్రంలో నటించి హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రజనీకాంత్తో జతకట్టిన దర్బార్ చిత్ర రిజల్ట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న నెట్రికన్ చిత్రంలో నటిస్తోంది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం కావడం విశేషం. కాగా ఏ మాత్రం గ్యాప్ దొరికినా నయనతార తన ప్రియుడిని తీసుకుని విదేశాల్లో విహరించేస్తుంటుంది. తన పుట్టినరోజు అయినా, తన ప్రియుడి పుట్టినరోజు అయినా ఈ జంట విదేశాలకు చెక్కేస్తారు. తాజాగా ఎవరి పుట్టినరోజు వేడుకకాకపోయినా అమెరికాకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అలా అక్కడ బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ను ఈ జంట కలిశారు. అది యాదృచ్చిక కలయికా, లేక ప్లాన్ చేసుకున్న మీటింగ్నా అన్నది పక్కన పెడితే వీరి కలయికపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. వారు కలిసిన ఫొటో వైరల్ అవుతోంది. అక్కడ బోనీకపూర్తో పాటు ఆయన రెండవ కూతురు ఖుషీకపూర్ కూడా ఉంది. కాగా బోనీకపూర్ ఇటీవల తన నిర్మాణ సంస్థను కోలీవుడ్కు విస్తరించి, అజిత్ హీరోగా నేర్కొండ పార్వై చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదేవిధంగా అజిత్తో మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. నేర్కొండ పార్వై చిత్రం ఫేమ్ హెచ్.వినోద్నే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చిత్ర షూటింగ్ డిసెంబరులో మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో అజిత్ పోలీస్అధికారిగా నటించనునున్నట్లు సమాచారం. ఆయన ఇంతకుముందు ఎన్నైఅరిందాళ్, ఆంజనేయ, మంగాత్తా చిత్రాల్లో పోలీస్అధికారిగా నటించారు. కాగా తాజా చిత్రానికి వలిమై అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇది అజిత్కు 60వ చిత్రం అవుతుంది. ఇకపోతే ఇందులో ఆయనకు జంటగా నయనతార నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా బోనీకపూర్, నయనతారల అమెరికా కలయిక వలిమై చిత్రంలో భాగమేనా అనే ప్రశ్నకు ఆస్కారం కలిగిస్తోంది. అజిత్, నయనతార ఇంతకుముందు ఏకన్, ఆరంభం, విశ్వాసం చిత్రాల్లో జతకట్టారు. వీటిలో ఆరంభం, విశ్వాసం మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వలిమై చిత్రంతో ఈ జంట మరోసారి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా నయనతార తన ప్రియుడు విఘ్నేశ్శివన్నిర్మాత బోనీకపూర్, ఆయన కూతురు ఖుషీ కపూర్లతో కలిసి అమెరికాలో డిన్నర్ చేశారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
తెలుగు పింక్
ఇక పవన్ కల్యాణ్ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారా? అని చాలామంది అనుకుంటున్న తరుణంలో ఓ వార్త తెరమీదకు వచ్చింది. హిందీ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్లో ఆయన నటించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ మరో సినిమాలో నటించని సంగతి తెలిసిందే. ఇక హిందీ ‘పింక్’ని తమిళంలో అజిత్తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేసిన బోనీకపూరే తెలుగు రీమేక్ను నిర్మించబోతున్నారు. ‘దిల్’ రాజు మరో నిర్మాత. ‘ఓ.. మై ఫ్రెండ్, ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. హిందీ హిట్ ‘బదాయి హో’ తెలుగు రీమేక్ నిర్మాణానికి తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న బోనీ కపూర్, ‘దిల్’ రాజు తాజాగా ‘పింక్’ తెలుగు రీమేక్ను కూడా నిర్మించబోతుండటం విశేషం. ‘బదాయిహో’ తెలుగు రీమేక్లో ఎవరు నటించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరి.. ‘పింక్’లో పవన్ నటిస్తారా? లేదా? -
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్న్యూస్. పవర్స్టార్ మళ్లీ తెరపై సందడి చేయనున్నారు. సరికొత్త కాంబినేషన్లో పవన్ కొత్త సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. హిందీలో హిట్ అయిన పింక్ సినిమా రీమేక్లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. నాని హీరోగా ‘ఎంసీఏ’ సినిమా తీసిన వేణు శ్రీరామ్కు దర్శకత్వం బాధ్యతలు అప్పగించినట్టు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమితాబ్ బచ్చన్, తాప్పీ పొన్ను ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్’ సినిమా 2016లో హిందీలో మంచి విజయాన్ని అందుకుంది. 23 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 85 కోట్లు వసూలు చేసింది. సామాజిక సందేశంతో క్రైమ్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేశారు. స్టార్ హీరో అజిత్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. తమిళంలోనూ విజయం సాధించడంతో తెలుగులోనూ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘పింక్’ రీమేక్లో పవన్ నటిస్తున్నాడని తెలియడంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
శుభాకాంక్షలు చెబుతారా?
గత ఏడాది హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బదాయి హో’. అంటే... శుభాకాంక్షలు అని అర్థం. కమర్షియల్గా సూపర్ సక్సెస్ అయిన చిత్రం ఇది. రెండొందల కోట్ల వసూళ్లు సాధించింది. అంతే... ఆయుష్మాన్కు బాలీవుడ్ అంతా బదాయిహో చెప్పింది. ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. తమిళంలో ఆయుష్మాన్ పాత్ర కోసం ధనుష్ను సంప్రదించినట్టు సమాచారం. ధనుష్ కూడా సుముఖంగా ఉన్నారట. ప్రస్తుతం ధనుష్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఈ సినిమా మొదలుపెట్టనున్నారని టాక్. -
అతిలోక సుందరికి అరుదైన గౌరవం
అతిలోక సుందరి శ్రీదేవి ఈ ప్రపంచాన్ని విడిచి ఏడాదిన్నర కాలమవుతున్నా అభిమానులు ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చేసిన విభిన్న పాత్రలు, సినిమాల ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తాజాగా ఈ దివంగత నటికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు శ్రీదేవి మైనపు విగ్రహానికి సంబంధించిన ప్రొమో వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ ప్రోమోలు శ్రీదేవి కళ్లు.. ఆమే భువికి తిరిగొచ్చారా అన్నంత సహజంగా ఉండటంతో పూర్తి విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 4న సింగపూర్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షం ప్రసారం చేయనున్నారు. Sridevi lives forever in not just our hearts but also in the hearts of millions of her fans. Eagerly waiting to watch the unveiling of her figure at Madam Tussauds, Singapore on September 4, 2019. #SrideviLivesForever pic.twitter.com/AxxHUgYnzt — Boney Kapoor (@BoneyKapoor) September 3, 2019 -
ఆ వార్తల్లో నిజం లేదు : బోనీ కపూర్
ధడక్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్కు సౌత్ సినిమాలపై ఆసక్తి లేదనే వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోల పక్కన అవకాశం వచ్చినా.. ఆ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరిస్తోందని వార్తలు హల్చల్ చేస్తున్న తరుణంలో ఈ రూమర్స్పై బోనీ కపూర్ పుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తమకు సౌత్ సినిమాలంటే ఇష్టమని.. శ్రీదేవీ అక్కడి నుంచే వచ్చిందని, సూపర్స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇలా ప్రముఖ హీరోలందరితో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని బోనీ కపూర్ చెప్పుకొచ్చాడు. మహేష్బాబుతో, రామ్చరణ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, జాన్వీ వాటికి తిరస్కరించందనే వార్తల్లో ఏమాత్రం నిజంలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే సౌత్లోనూ ఎంట్రీ ఇవ్వనుందని, సరైన కథ కోసం ఎదురుచూస్తున్నామని బోనీకపూర్ తెలిపాడు. తాజాగా అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ‘నేర్కొండ పార్వై’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
జాన్వీ కపూర్ ఎందుకు రాలేదు!?
ముంబై: బోనీ కపూర్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'మైదాన్'. ఫుట్బాల్ కథాంశం నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్, ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ముంబైలో మంగళవారం ప్రారంభమైంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభ వేడుకకు బోనీ కపూర్ కుటుంబం సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. కానీ, బోనీ కపూర్-శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మాత్రం కనిపించలేదు. ఈ సినిమా పూజ కార్యక్రమంలో బోనీ కపూర్ తన పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా, ఖుషీతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఈ వేడుకకు జాన్వీ కపూర్ ఎందుకు హాజరుకాలేదన్న దానిపై వివరాలు తెలియదు. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్ కారణంగా ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఆమె రాలేకపోయారా? అన్నది తెలియదు. ఇక 1952 - 62 మధ్యకాలంలో భారత ఫుట్బాల్ క్రీడా వైభవాన్ని చాటేలా తెరకెక్కుతున్న ‘మైదాన్’లో అజయ్ దేవ్గణ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తుండగా, కీర్తి సురేష్ మరో కీలక పాత్రలో నటించబోతున్నారు. -
పుస్తక రూపంలో శ్రీదేవి జీవితం
అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని, తన అభిమానులను విడిచి వెళ్లి సంవత్సరం దాటిపోయిన ఆ విషయాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం ఈ లెజెండరీ స్టార్ జయంతి సందర్భంగా మరోసారి ఆమెను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పబ్లిషర్స్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త బోనికపూర్ అనుమతితో పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ‘శ్రీదేవి : గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్’ పేరుతో తయారవుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్ రాస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓ అభిమానిగా నేను ఎప్పుడు శ్రీదేవిని ఆరాధించేవాడిని. ఈ రోజు నాకు భారతీచయులకు ఎంతో నచ్చిన ఓ సూపర్ స్టార్ కథను చెప్పే అవకాశం దక్కింది. ఎన్నో ఏళ్లోగా శ్రీదేవితో కలిసి పనిచేసిన తారలు కలుసుకోవటం ఆనందంగా ఉంది. అవన్ని కలిపి ఓ చిన్నారి భారత తొలి లేడీ సూపర్ స్టార్ ప్రయాణంగా పుస్తకరూపంలో తీసుకురావటం ఓ గొప్ప అనుభూతి’ అన్నారు. ఈ పుస్తకాన్ని ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్
తమిళ స్టార్ హీరో అజిత్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విశ్వాసం చిత్రంతో అభిమానులను పలకరించాడు. ఇక ఈ చిత్రం తమిళ నాట దాదాపు రెండు వందల కోట్లను కలెక్ట్ చేసి.. రికార్డులను క్రియేట్ చేసింది. ఇదే ఏడాది మరో చిత్రంతో అజిత్.. తన ఫ్యాన్స్ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన.. పింక్ చిత్రాన్ని తమిళ్లో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదలవుతున్న సందర్భంగా.. నిర్మాత బోనీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సమయంలోనే.. అజిత్తో ఓ చిత్రాన్ని నిర్మించాలని శ్రీదేవి భావించడం.. ఆమె కోరిక మేరకే ఈ రీమేక్లో నటించేందుకు అజిత్ ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా విడుదలకు సిద్దం కావడం.. అంతేకాకుండా సింగపూర్లో ప్రీమియర్ షోలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ స్పందిస్తూ.. శ్రీదేవి కలను నెరవేర్చాను అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘సింగపూర్లో ఉదయం 9 గంటలకు ప్రీమియర్ షో ప్రారంభమైంది. శ్రీదేవి కల నెరవేర్చాను. అజిత్, దర్శకుడు వినోద్, ఇతర సాంకేతిక నిపుణులు లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు హెచ్వీ వినోద్ దర్శకత్వం వహించారు. I am truly blessed 9am IST today Premiere Show of @nerkondapaarvai will start in Singapore. I have managed to fullfil my wife Sridevi Kapoor’s dream It couldn’t have been possible without the support of #AjithKumar #HVinoth, entire cast & technicians. I shall always cherish this — Boney Kapoor (@BoneyKapoor) August 6, 2019 -
సౌత్ ఎంట్రీ?
తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ప్రస్తుతం ‘కార్గిల్ గాళ్ (వర్కింగ్ టైటిల్), రుహీ అఫ్జా, తక్త్’ సినిమాలతో బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారామె. అయితే సౌత్లో జాన్వీ నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జాన్వీ తండ్రి బోనీకపూర్ నిర్మాతగా హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఓ కీలక పాత్రలో జాన్వీ నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా అంటోంది. మరి.. తండ్రి నిర్మించబోయే సినిమాలో నటిస్తారా? వేచి చూద్దాం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మానాడు, ఆర్ఆర్ఆర్’ సినిమాలతో జాన్వీ సౌత్ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ అవి ఏవీ నిజం కాలేదన్న విషయం తెలిసిందే. -
శ్రీదేవి కల నెరవేరనుందా?
చెన్నై : హీరో అజిత్ సినిమా పరంగానూ, వ్యక్తిగతంగానూ భిన్నమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన పనేంటో తాను చేసుకుంటూ పోయే మనస్తత్వం ఆయనది. తనకు సంబంధం లేని ఏ విషయంలోనూ తల దూర్చరు. ఇంకా చెప్పాలంటే వివాదాలకు దూరంగా ఉండే అరుదైన నటుడు అజిత్. కాగా ప్రస్తుతం అజిత్ నటించిన నేర్కొండ పార్వై చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 8న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయనకు 59వ చిత్రం అన్నది గమనార్హం. ఇది హిందీలో సంచలన విజయాన్ని సాధించిన పింక్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అమితాబ్బచ్చన్ పోషించిన పాత్రలో అజిత్ నుటించగా ఆయనకు జంటగా నటి విద్యాబాలన్ నటించింది. ఇక హిందీలో తాప్సీ పాత్రను తమిళంలో నటి శ్రద్ధాశ్రీనాథ్ పోషించింది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించారు. ఈయన సోమవారం ట్విట్టర్లో ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో నేర్కొండ పార్వై చిత్ర యూనిట్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ‘అజిత్ 60వ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో నేను నిర్మించనున్నాను. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఇది రేస్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుంది. ఇందులో అజిత్ బైక్ రేస్లో పాల్గొనాలని తపించే రేసర్గా నటించనున్నారు’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. విశేషం ఏమిటంటే నటుడు అజిత్ నటనలోనే కాకుండా ఫోటోగ్రఫీ, బిరియానీ లాంటి వంటలు చేయడంలోనూ, బైక్ రేసింగ్లోనూ ఆసక్తి కలిగిన వ్యక్తి. ఈయన ఇంతకు ముందే జిల్లా స్థాయి బైక్ రేస్లో పాల్గొన్నారు కూడా. కాగా తాజాగా అలాంటి పాత్రనే చిత్రంలో పోషించనున్నారన్నమాట. అజిత్కు కూతురిగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కల నెరవేరనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. శ్రీదేవి పుట్టింది తమిళనాడులోనేనన్న విషయం తెలిసిందే. కాగా ఆమె తన కూతురు జాన్వీని తమిళంలో కథానాయకిగా పరిచయం చేయాలని ఆశ పడింది. అది తీరకుండానే హఠాన్మరణం పొందింది. అయితే శ్రీదేవి కలను ఆమె కూతును జాన్వీ నిజం చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మాతగా కోలీవుడ్కు ఎంటర్ అయ్యి అజిత్ హీరోగా నేర్కొండ పార్వై చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 8న తెరపైకి రానుంది. కాగా వెంటనే అజిత్తో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో అజిత్కు కూతురిగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ నటించనున్నట్లు తాజా సమాచారం. ఇదే నిజం అయితే జాన్వీ తన తల్లి కలను నిజం చేయబోతోందన్నమాట. -
బోనీతో మరో సినిమా!
కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్, దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్లో అజిత్ అతిథి పాత్రలో కనిపించి అలరించారు. అదే సమయంలో అజిత్ హీరోగా తన భర్త బోనీ కపూర్ నిర్మాణంలో ఓ సినిమా చేయాలని భావించారు శ్రీదేవి. తరువాత శ్రీదేవి మరణించినా బోనీ మాత్రం ఆమె అనుకున్నట్టుగా అజిత్ హీరోగా సినిమాను నిర్మించారు. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన పింక్ సినిమాను కోలీవుడ్లో నీర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేశారు. అంతేకాదు అజిత్ హీరోగా మరో సినిమాను కూడా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు బోనీ. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్లో అధికారికంగా ప్రకటించారు. కోలీవుడ్ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను బోనీ కపూర్ తన బ్యానర్లో నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాతలు అజిత్తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నా కేవలం శ్రీదేవి మీద ఉన్న అభిమానంతో అజిత్, బోనితో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. A big thank you to the entire unit of #NerkondaPaarvai for working towards August 8th release. Happy to announce our next AK60 with #AjithKumar #HVinoth and @ZeeStudios will start with Pooja end August 2019.@SureshChandraa @DoneChannel1 — Boney Kapoor (@BoneyKapoor) July 29, 2019 -
‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్
ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియ ప్రకాష్ వారియర్. తొలి సినిమా ఒరు ఆదార్ లవ్ రిలీజ్కు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన ప్రియా ఆ సినిమా ఫ్లాప్ అయినా తనపై వచ్చిన క్రేజ్ను మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ఓ వివాదాస్పద చిత్రంలో నటిస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రియా ప్రకాష్ నటిస్తున్న తాజా చిత్ర ‘శ్రీదేవి బంగ్లా’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే వివాదం మొదలైంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ శ్రీదేవి అనే నటి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు బాత్టబ్లు మునిగి చనిపోయినట్టుగా చూపించటంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ చిత్రయూనిట్కు నోటీసులు పంపారు. అయితే ఈ వివాదంపై స్పందించిన నటి ప్రియా ప్రకాష్, ఈ వివాదాలన్నీ చిన్న విషయాలంటూ కొట్టి పారేశారు. నటిగా నా పాత్రకు న్యాయం చేయటం వరకే నా బాద్యత, వివాదాలు వస్తే దర్శక నిర్మాతలు చూసుకుంటారు. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆరాత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ దర్శకుడు. -
‘శ్రీదేవిది సహజ మరణం కాదు’
భారతదేశ సినీ చరిత్రలో లేడీ సూపర్ స్టార్గా నిలిచిన అలనాటి అందాల తార శ్రీదేవి మరణించి నేటికి ఏడాదికి పైనే అయ్యింది. ఇప్పటికి కూడా శ్రీదేవి అభిమానులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో దుబాయ్లో శ్రీదేవి ఓ బాత్టబ్లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మృతి చుట్టూ ఎన్నో అనుమానాలు. కానీ వాటికి సరైన సమాధానం మాత్రం లభించలేదు. అభిమానుల మనసుల్లో నేటికి కూడా ఈ అనుమానాలు అలానే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీదేవి మృతి గురించి మరో సారి చర్చ ప్రారంభమయ్యింది. ఈ చర్చను ప్రారంభించిన వ్యక్తి సామాన్యుడు కాదు. కేరళ జైళ్ల శాఖ డీజీపీగా పని చేస్తున్న రిషిరాజ్ సింగ్ ఈ చర్చను తెరమీదకు తీసుకొచ్చారు. కేరళ కౌమిది పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిది సహజ మరణం కాదని బాంబు పేల్చారు. అతిలోక సుందరిది సహజ మరణం కాదని తన స్నేహితుడు, ఫొరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఉమదత్తన్ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. దాంతో మరోసారి దేశవ్యాప్తంగా శ్రీదేవి మృతి చర్చనీయాంశమైంది. శ్రీదేవి మరణం గురించి తాను ఉమదత్తన్తో మాట్లాడినప్పుడు ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేసినట్లు రిషిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన మాటాల్లోనే.. ‘ఏ మనిషి అయినా ఒక్క అడుగు లోతు ఉన్న బాత్టబ్లో పడి చనిపోవడం అసంభవం. ఒక వేళ సదరు వ్యక్తి విపరీతంగా తాగితే.. తప్ప ఇలా చనిపోయే అవకాశం లేదు. అలాకాకుండా ఎవరైనా వ్యక్తి కావాలని నీటిలో ముంచితే అప్పుడు ఆ వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది. అయితే శ్రీదేవికి అతిగా తాగే అలవాటు లేదు. పైగా ఎంత మత్తులో ఉన్నా సరే ఊపిరాడని పరిస్థితి ఎదురైతే.. మన శరీరం వెంటనే రియాక్టయి.. మత్తును తాత్కాలికంగానైనా బ్రేక్ చేస్తుంది. కానీ శ్రీదేవి విషయంలో అలా జరగలేదు’ అన్నారు రిషిరాజ్ సింగ్. మరోటి శ్రీదేవి దుబాయ్లో బీమా చేయించడం.. ఆమె అక్కడ మరణిస్తేనే బీమా పరిహారం అందుతుంది అనే అంశం కూడా అనుమానాస్పదంగానే ఉందన్నారు. చివరకు శ్రీదేవి కూడా దుబాయ్లోనే మరణించడం ఈ అనుమానానికి బలం చేకూరుస్తుందన్నారు. శ్రీదేవి మరణించిన తర్వాత బీమా పరిహారానికి సంబంధించిన వార్తలు పేపర్లలో కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పోలీసు అధికారి, ఫోరెన్సిక్ నిపుణుడు శ్రీదేవి మరణం గురించి సందేహాలు వ్యక్తం చేయడంతో మరోసారి ఈ టాపిక్ గురించి చర్చ జరుగుతోంది. అవన్ని ఊహాజనిత వార్తలే : బోనీ కపూర్ అయితే శ్రీదేవి మృతి పట్ల రిషిరాజ్ సింగ్ వ్యక్తం చేసిన అనుమానాలను బోనీ కపూర్ కొట్టి పారేస్తున్నారు. అవన్ని ఊహాజనిత ప్రశ్నలే అంటున్నారు. -
నువ్వా.. నేనా?
తమిళ నటుడు అజిత్ బైక్, కార్ రేసింగ్స్ పట్ల భలే ఇంట్రెస్ట్గా ఉంటారు. కొన్నిసార్లు ఆయన రేసింగ్ పోటీలో పాల్గొన్నారు కూడా. ఈ రేసింగ్ మజాను ఆయన వెండితెరపైకి తేచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. తన తర్వాతి సినిమాలోఅజిత్ కార్ రేసర్గా కనిపించబోతున్నారని టాక్. ఈ సినిమాకు బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమా షూటింగ్ను ఆగస్టులో ప్రారంభించాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్లో మేజర్ షూటింగ్ను ప్లాన్ చేశారు. సౌతాఫ్రికా, మిడిల్ ఈస్ట్, బుడాపెస్ట్ లొకేషన్స్ను ఫైనలైజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ సినిమాను తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారని కోలీవుడ్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. దాదాపు 18ఏళ్ల తర్వాత ఓ హిందీ సినిమాలో నటిస్తున్నారు అజిత్. 2001లో షారుక్ఖాన్ నటించిన ‘అశోక’ సినిమాలో అజిత్ ఓ చితన్న పాత్ర చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు రేస్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మాణంలో అజిత్ నటించిన ‘నెర్కొండ పరవై’ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
మా నాన్న తగ్గారోచ్
కథానాయికలు ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి జిమ్లలో చెమటోడుస్తుంటారు. కఠినమైన వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు కూడా. ఇక యువతారల్లో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ తన ఫొటోలు షేర్ చేసే జాన్వీ తాజాగా తన తండ్రి ఫొటో షేర్ చేసి, చాలామందిని ఆశ్చర్యపరిచారు. ‘‘మా డాడీ (బోనీ కపూర్) 12 కిలోల బరువు తగ్గారు. ఆరోగ్యకరమైన జీవనం గడిపేందుకు ఆయన అన్ని కిలోల బరువు తగ్గి స్లిమ్గా, ట్రిమ్గా తయారయ్యి నాకు స్ఫూర్తిగా నిలిచారు. నాన్నను చూసి చాలా గర్వపడుతున్నా’’ అంటూ తండ్రి ఫొటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు జాన్వీ కపూర్. గతంలో కంటే ఆ ఫొటోలో చాలా స్లిమ్గా కనిపిస్తున్నారు బోనీకపూర్. గత ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నాన్నతో మరింత ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నారు జాన్వీ. బహుశా బోనీ తగ్గాలనుకోవడానికి కూతురు కూడా ఓ కారణం అయ్యుంటుందేమో. జాన్వీ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె శరణ్ శర్మ దర్శకత్వంలో పైలట్ గున్జాన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘కార్గిల్ గర్ల్ ఇన్ లక్నో’, కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ‘తక్త్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
చైనాలో బాలీవుడ్ హవా!
ఇండియాలో చైనా వస్తువుల హవా కొనసాగుతుంటే.. చైనా మార్కెట్లో మాత్రం ఇండియన్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. చైనాలో రిలీజ్ అయిన పలు బాలీవుడ్ చిత్రాలు ఇండియాలో కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వసూళ్లు చేస్తున్నాయి. ఈ ఏడాది చైనాలో విడుదలైన అంధాదున్, మామ్ చిత్రాలు అక్కడి బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే అంధాదున్ 350కోట్లకు పైగా కలెక్ట్ చేయగా.. మామ్ సైతం వసూళ్లలో దూసుకుపోతోంది. గతవారం రిలీజ్ అయిన శ్రీదేవి ‘మామ్’ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మూవీ వందకోట్లను కలెక్ట్ చేసినట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఆమీర్ ఖాన్ పీకే చిత్రం బాలీవుడ్ మార్కెట్కు దారులు తెరవగా.. దంగల్ చిత్రంతో ఇండియన్ మూవీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయిజాన్, హిచ్కీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వెళ్లిన అంధాదున్, మామ్ చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. -
‘ఆమెని మర్చిపోవడమా.. అసాధ్యం’
అందాల తార శ్రీదేవి మరణించి ఇప్పటికే ఏడాది దాటినప్పటికి.. ఆమె జ్ఞాపకాలు మాత్రం అభిమానులను వదలడం లేదు. ఇక ఆమె భర్త, పిల్లల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటికి కూడా వారు ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఓ టీవీ షోకు హాజరైన బోనీ కపూర్.. శ్రీదేవి గురించి తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఫిల్మ్ ట్రేడ్ అనాలసిస్ట్ కోమల్ నాథ్ వ్యాఖ్యతగా వ్యవహరించే.. ‘ఔర్ ఏక్ కహానీ’ కార్యక్రమానికి హాజరయ్యారు బోనీ. ప్రస్తుతం ఈ ఎపిసోడ్కు సంబంధించిన ట్రైలర్ తెగ వైరలవుతోంది. కార్యక్రమంలో భాగంగా కోమల్ నాథ్ బోనీని.. ‘మీ జీవితంలో శ్రీదేవిని మర్చిపోయిన క్షణం ఏదైనా ఉందా’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే ఉద్వేగానికి గురైన బోనీ.. కన్నీటిని ఆపుకుంటూ.. ‘లేదు.. ఆమెని మర్చిపోవడం అసలు సాధ్యం కాద’ని సమాధానమిచ్చారు. అంతేకాక ‘మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు.. మరి సినిమాల్లో ఎందుకు నటించలేద’ని కోమల్ నాథ్ ప్రశ్నించగా.. ‘ఇప్పుడు కూడా నేను చాలా పొడవుగా.. అందంగానే ఉన్నానం’టూ బోనీ సమాధానమిచ్చారు. తప్పుడు ఆర్థిక నిర్ణయాల గురించి ప్రశ్నించగా.. ‘నేను రేస్లకు వెళ్లి, జూదం ఆడి డబ్బులు పొగొట్టలేదు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఆర్థికపరంగా కొన్ని తప్పులు జరిగాయని నాకు తెలుసు. అయితే ఇలాంటి సందర్భాల్లో కుటుంబం మద్దతు.. ముఖ్యంగా భార్య పిల్లల మద్దుతు లేకపోతే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అదృష్టం కొద్ది ఈ విషయంలో నా కుటుంబం నాకు పూర్తి మద్దతుగా ఉంద’ని బోనీ చెప్పుకొచ్చారు. Why did ostentatious producer Boney Kapoor @BoneyKapoor get emotional on Komal Nahta Aur Ek Kahani? See for yourself in this trailer and then on the show on Sunday, May 5, 1 p.m. on Tata Sky’s Classic Cinema channel (no. 318). @Subhash_somani @PRIYANKAAWASTHY@sukrit_banerjee pic.twitter.com/ucD9o03ZHr — Komal Nahta (@KomalNahta) May 3, 2019 ఈ కార్యక్రమం ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు టాటా స్కై క్లాసిక్ సినిమా చానెల్లో ప్రసారం కానుంది. శ్రీదేవి మరణంతో బోనీ కపూర్ పూర్తిగా కుంగిపోయాడని చెప్పవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన నలుగురు పిల్లలు బోనీకి మద్దతుగా నిలిచారు. -
అలా కలిశారు!
‘‘మహానటి’ చిత్రంలో మీ నటనకు ఫిదా అయిపోయాం’’ అంటూ కీర్తీ సురేశ్పై చాలామంది ప్రశంసల జల్లు కురిపించారు. ఈ లిస్ట్లో దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల పెద్ద కూమార్తె జాన్వీ కపూర్ కూడా ఉన్నారు. ఇటీవల తన ఫేవరెట్ యాక్ట్రస్ కీర్తీని ముంబైలో కలుసుకున్నారు జాన్వీ కపూర్. పై ఫొటోలో ఉన్నట్లు వీరిద్దరూ ఒకేఫ్రేమ్లోకి ఎలా వచ్చారు? అనేగా మీ డౌట్.. అక్కడికే వస్తున్నాం. కీర్తీ సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సినిమాకు బోనీకపూర్ ఓ నిర్మాత. ఇందులో అజయ్ దేవగన్ హీరో. ఇండియన్ ఫుట్బాల్ టీమ్ మాజీ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రం చర్చల్లో భాగంగానే కీర్తి ముంబై వెళ్లారట. అక్కడ కీర్తి, జాన్వీ, బోనీకపూర్ కలిసి డిన్నర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
‘ఆయన జెంటిల్మ్యాన్.. విమర్శలు మానండి’
అప్పుడప్పుడు మనం చాలా సాధరణంగా చేసే పనులే మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. మన తప్పేం లేకున్నా విమర్శలు స్వీకరించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. ఓ వివాహ వేడుకు హాజరైన బోనీ కపూర్ అక్కడ నటి ఊర్వశి రౌతెలాతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఆ తర్వాత ఈ ఫోటోలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన అభిమానులు వీరి మీద విరుచుకుపడుతున్నారు. బోనీ కపూర్ సదరు నటితో అసభ్యంగా ప్రవర్తించాడని ఇది ఆయనకు తగదని కామెంట్ చేస్తున్నారు. ‘బోనీ కపూర్ స్థానంలో ఓ సాధరణ వ్యక్తి ఉండి.. ఇలానే బిహేవ్ చేస్తే ఆ నటి ఊరుకునేదా. కానీ అక్కడ ఉన్నది ఓ బడా నిర్మాత కావడంతో ఆమె కిక్కురుమనడం లేద’ని కామెంట్ చేశారు. దీనిపై పేపర్లో వార్తా కథనాలు కూడా వచ్చాయి. వీటిపై స్పందించిన ఊర్వశి రౌతెలా ఓ పేపర్లో వచ్చిన ‘ఊర్వశిని బోనీ పట్టుకోబోయారు. అప్పుడు ఆమె ‘డోన్ట్ టచ్’ అని వార్నింగ్ ఇచ్చారు’ అనే న్యూస్ ఐటమ్ని స్ర్కీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇది ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందిన న్యూస్ పేపర్. దీనిలో వచ్చిన వార్త ఇది. మహిళల్ని గౌరవించడం రాని మీరు ఇంకెప్పుడు స్త్రీ స్వేచ్ఛ, మహిళా శక్తి గురించి మాట్లాడకండి. బోనీ కపూర్ ఒక జెంటిల్మ్యాన్. ఆయనతో ఫోటో దిగడం గౌరవంగా భావించాను. ఇకనైనా విమర్శిచడం ఆపండి’ అంటూ ట్వీట్ చేశారు. I felt appalled and beyond shocked this morning when i saw social media flooded with trolls of me in a video with respected @BoneyKapoor Sir. He is a true Gentleman and it makes me feel extremely unhappy and miserable because the social sites/media don't even think twice before pic.twitter.com/VIzuCeeObV — URVASHI RAUTELA (@UrvashiRautela) April 2, 2019 -
శ్రీదేవికి కళంకం ఆపాదించగలమా!
శ్రీదేవికి కళంకం ఆపాదించాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదంటున్నారు హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమాలతో పని లేకుండా ఒక్క కన్ను గీటుతోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుంది ప్రియా ప్రకాశ్ వారియర్. తొలి చిత్రం ఒరు ఆదార్ లవ్ ట్రైలర్తోనే అనూహ్య పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ కేరళ కుట్టి. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రియా ప్రకాశ్ ఏకంగా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం అంది పుచ్చుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రసాద్ మాంపుళ్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటిస్తుంది. అయితే నిర్మాణం పూర్తి కాకముందే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటి శ్రీదేవికి సంబంధించిన చర్చనీయాంశ సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరగడంతో ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే ఈ చిత్రం పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. శ్రీదేవి బంగ్లా చిత్రాన్ని చట్టబద్ధంగా అడ్డుకుంటామని శ్రీదేవి భర్త బోనీకపూర్ ప్రకటించారు. ఈ వివాదంపై నటి ప్రియా ప్రకాశ్ స్పందిస్తూ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసింది. అందులో.. శ్రీదేవి బంగ్లా చిత్రం నటి శ్రీదేవి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్నది కాదని స్పష్టం చేసింది. ఈ చిత్రానికి ఆమెకు ఎలాంటి సబంధం ఉండదని అంది. శ్రీదేవి జీవిత చరిత్రనో, ఆమె మరణం సంఘటనలతోనో చిత్రాన్ని రూపొందించి ఆమె కుటుంబం మనోభావాలను కించపరచాలన్నది తమ అభిమతం కాదని అంది. శ్రీదేవికి కళంకం ఆపాదించాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొంది. శ్రీదేవి బంగ్లా పూర్తిగా సాధారణ సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్ర టైటిల్ను నిర్ణయించడం, శ్రీదేవి మరణించడం ఒకే సమయంలో జరగడం యాదృచ్చికమేనని చెప్పింది. అందుకే ఇంత దూమారం చెలరేగుతోందని ప్రియాప్రకాశ్ పేర్కొంది -
శ్రీదేవిగారి అమ్మాయి
తొలి సినిమా ‘ధడక్’తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రీదేవి ముద్దుల తయన జాన్వీ కపూర్. తన అభిమాన నటుడు రాజ్కుమార్రావుతో కలిసి ఒక కామెడీ హారర్ సినిమాలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘సంచార జీవితం అంటే ఇష్టం’ అంటున్న జాన్వీ అంతరంగ తరంగాలు ఇవి.... మనసు పలికే.. చిన్నప్పుడు నేను ఎప్పుడూ నటి కావాలని అనుకోలేదు. మా అమ్మ కూడా నన్ను నటి చేయాలని ఎప్పుడూ ఆనుకోలేదు. ఒక దశలో చరిత్ర మీద బాగా ఆసక్తి కలిగింది. సృజనాత్మక రచనలు చేయాలనుకునేదాన్ని. ఎన్ని చేయాలనుకున్నా మనసు మాత్రం ‘నేను నటిని’ అని ఫిక్సైపోయింది. సీక్రెట్ ఏజెంట్! చిన్నప్పుడు స్కూల్లో కట్టుకథలు బాగా అల్లేదాన్ని.‘‘నేను మీలాంటి స్టూడెంట్ని కాను. సీక్రెట్ ఏజెంట్ని. ఒక వ్యక్తి మీద నిఘా వేయడానికి ఇక్కడ స్టూడెంట్గా నటిస్తున్నాను’’ అని చెప్పేదాన్ని. అదేమిటో...అందరూ నమ్మేవారు. ‘‘ఒక్క సారైతే... నాకు బెల్లీ డ్యాన్స్ నేర్పించడం కోసం షకీరా ముంబై వస్తుంది’’ అని చెప్పాను. నేను చెప్పింది ఫ్రెండ్స్ నమ్మడమే కాకుండా వాళ్ల ఇంట్లో కూడా విషయం చెప్పారు. అంతే...అమ్మకు వాళ్ల పేరెంట్స్ నుంచి ఒకటే ఫోన్లు... ‘‘గుడ్న్యూస్ తెలిసింది. మా అమ్మాయిని కూడా పంపమంటారా’’ అని రిక్వెస్ట్గా అడిగేవాళ్లు! సంచారమే బాగుంటుంది! నటి కాకపోతే...ప్రపంచాన్ని చుట్టేసేదాన్ని. కొత్తవ్యక్తులను కలుసుకునేదాన్ని. సృజనాత్మక రచనలు చేసేదాన్ని. సంచార జీవితం అంటే నాకు ఇష్టం. ‘ధడక్’ కోసం కథక్ నేర్చుకున్నాను. ఇది ఎంతో అందమైన నృత్యం. అమ్మ డ్యాన్స్ చూసి డ్యాన్స్లో చిన్నప్పుడు శిక్షణ తీసుకుందని అందుకే అంతా బాగా చేయగలుతుందని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. డ్యాన్స్లో అమ్మ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. డ్యాన్స్మాస్టర్లు చెప్పినట్లు అప్పటికప్పుడు అద్భుతంగా చేసేది...నిజంగా ఇది గొప్ప విషయం. అమ్మ మాట సినిమారంగంలోకి వచ్చిన తరువాత అమ్మ చెప్పిన ముఖ్యమైన మాట...‘మంచి నటి కావడానికి ముందు మంచి వ్యక్తి కావాలి. నిజాయితీ ఉండాలి. అది జరగనప్పుడు మనం ఏ పాత్రకూ న్యాయం చేయలేం’ నటనలో నాదైన ముద్ర కనిపించాలనే ఉద్దేశంతో ‘ఇలా నటించు...అలా నటించు’ అని సలహాలు ఇవ్వలేదు. ఎప్పుడూ సెట్స్కు రాలేదు. -
సౌత్కి బదాయి హో
బాలీవుడ్ యువనటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బదాయి హో’ చిత్రం గతేడాది అక్టోబర్లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడి తొలి సినిమా ‘తేవర్’కు బోనీకపూర్ నిర్మాత. ఇలా అమిత్శర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసింది బోనీ కపూర్నే. ఇప్పుడు అమిత్ శర్మ తెరకెక్కించిన ‘బదాయి హో’ చిత్రాన్ని సౌత్కి చూపించాలనుకుంటున్నారు బోనీకపూర్. ఈ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను ఆయన దక్కించుకున్నారు.‘‘బాలీవుడ్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అదే ఆదరణ సౌత్లోనూ ఉంటుందని ఆశిస్తున్నాను. అయితే ఈ సినిమాను ముందుగా తెలుగులో నిర్మించాలా? లేక తమిళంలో సెట్స్పైకి తీసుకుని వెళ్లాలా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు’’ అని పేర్కొన్నారు బోనీ కపూర్. -
సౌత్లో మరో బాలీవుడ్ సూపర్ హిట్
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన సినిమాలు ఉత్తరాదిలో.. అక్కడ సక్సెస్ అయిన సినిమాలు సౌత్లో రీమేక్ అవ్వటం తరుచూ జరుగుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్లు క్వీన్, పింక్ సినిమాలు సౌత్లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్లో మరో సూపర్ హిట్ సినిమా చేరింది. గత ఏడాది బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ‘బదాయి హో’. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బదాయి హో ఘన విజయం సాధించటమే కాదు, 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా సౌత్ రీమేక్ హక్కులు సొంత చేసుకున్న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దక్షిణాదిలో అన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అమిత్ షా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా దక్షిణాదిలో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
రాజకీయాల్లోకి అజిత్!
నటుడు అజిత్ రాజకీయాలకు ఆసక్తి చూపుతున్నారా? ఈయన్ని రాజకీయాల్లోకి దింపాలని పలు ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రయత్నించి విఫలం అయ్యాయి. ఇటీవల ఒక రాజకీయ పార్టీ ఈయనకు గాలం వేసే ప్రయత్నం చేసినా, తనను రాజకీయాల్లోకి లాగొద్దు అని స్పష్టం చేశారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా రాజకీయాలపై ఆసక్తి అని అంటారేమిటనేగా మీ ప్రశ్న. నిజమే అజిత్ నిజ జీవితంలోనే కాదు, సినిమాల్లోనూ ఇప్పటి వరకూ రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రంలో నటించలేదు. నటుడు విజయ్ కత్తి, మెర్శల్, సర్కార్ లాంటి రాజకీయ అంశాలతో కూడిన చిత్రాల్లో నటించి విజయాలతో పాటు, విమర్శలు కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా రాజకీయాలకు దూరంగా జాలీగా సాగే చిత్రం చేస్తుంటే, ఆయన సహ నటుడైన అజిత్ రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రంలో నటించడానికి సై అన్నట్లు తాజా సమాచారం. అజిత్ విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఇప్పుడు నర్కొండ పార్వవై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిందీ చిత్రం పింక్కు రీమేక్ అన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. హిందీ చిత్రం పింక్ను చిన్న చేర్పులు, మార్పులు చేసి తమిళంలో రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం తరువాత నిర్మాత బోనికపూర్ సంస్థలోనే అజిత్ మరో చిత్రం చేయనున్నారు. ఇది ఈజిప్ట్ చిత్రం హెప్టా లాస్ట్ లెక్చర్ అనే చిత్రానికి రీమేక్ అని సమాచారం. హెప్టా లాస్ట్ లెక్చర్ చిత్రాన్ని చూసిన అజిత్ దాని రీమేక్లో నటించడానికి ఆసక్తి చూపినట్లు తెలిసింది. దాని రీమేక్ హక్కులను బోనీకపూర్ పొందారట. దీనికి శివ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం తరువాత అజిత్ విశ్వాసం చిత్ర నిర్మాత సత్యజ్యోతి ఫిలింస్ సంస్థకు మరో చిత్రాన్ని చేయనున్నట్లు తాజా సమాచారం. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందట. దీనికి నర్కొండ పార్వై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హెచ్.వినోద్నే దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఆ విధంగా అజిత్ సినీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్నమాట. -
పింక్ రీమేక్.. అజిత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
బిగ్బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన పింక్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని సౌత్లో రీమేక్ చేయాలనేది శ్రీదేవి చివరి కోరిక అని బోనీ కపూర్ అప్పట్లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ రీమేక్లో అజిత్ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అటుపై మళ్లీ కొన్ని రోజుల తరువాత అజిత్ ఎటువంటి రీమేక్లో నటించడం లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే మొత్తానికి అజిత్ పింక్ రీమేక్లో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అంతేకాకుండా ఈ మూవీ ఫస్ట్లుక్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ రీమేక్ లో కన్నడ స్టార్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాద్ నటిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తోన్న ఈ మూవిని హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నాడు. -
‘మహానటి’ బాలీవుడ్ ఎంట్రీ
సౌత్ లో సక్సెస్ అయిన తారలు బాలీవుడ్ వైపు చూడటం సాధరణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ లిస్ట్లో సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్కువ. తాజాగా మరో హీరోయిన్ ఈ లిస్ట్లో చేరేందుకు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్లో స్టార్ హీరోల సరసన వరుసన సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. మహానటి సినిమా తరువాత కీర్తి ఇమేజ్ తారాస్థాయికి చేరింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్, అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కీర్తి బాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా కన్ఫామ్ అయ్యింది. మరిసౌత్ లో సత్తా చాటిన మహానటి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి. -
వేలంలో శ్రీదేవి చీర ధర ఎంత పలికిందంటే..?
పెరంబూరు: అతిలోక సుందరి శ్రీదేవికి నటిగా పారితోషమే కాదు. అమె ధరించిన చీరల వెల కూడా భారీగానే ఉంటుందన్నది నిరూపణ అయ్యింది. తమిళం, తెలుగు, హిందీ అంటూ భారతీయ సినిమాలో అగ్రనటిగా, అతిలోక సుందరిగా వెలిగిన నటి శ్రీదేవి. అలాంటి శ్రీదేవి గత ఏడాది దుబాయిలో అకాలమరణానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ధరించిన ఖరీదైన చీరలను వేలం వేసి అలా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించాలని శ్రీదేవి కుటుంబసభ్యులు భావించారు. అలా శ్రీదేవి చీరల వేలానికి సామాజిక మాధ్యమాన్ని వారు ఎంచుకున్నారు. శ్రీదేవికి చెందిన ఒక ఖరీదైన చీరకు ముందుగా రూ. 40 వేలను నిర్ణయించారు. అది ఆన్లైన్ వేలంలో రూ. 1.30 లక్షల ధర పలికింది. ఈ మొత్తాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అందించనున్నట్లు తెలిసింది. డబ్బుతో ఆసరా లేని మహిళలు, అనాథ బాలలు, వృద్ధుల సంక్షేమానికి ఉపయోగిస్తామని తెలిపారు. అలా అతిలోక సుందరి తాను లేకున్నా పది మందిని ఆదుకోవడానికి సహకరించారన్నమాట. -
శ్రీదేవిగా మాధురి?
బాలీవుడ్ వెండితెరపై బయోపిక్ ఫార్ములా నడుస్తోంది. ఆల్రెడీ కొన్ని బయోపిక్స్ వెండితెరపైకి వచ్చాయి. మరికొన్ని సెట్స్లో ఉన్నాయి. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ చర్చించుకునే బయోపిక్ జాబితాలో అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ కూడా ఉంది. ఆదివారం శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఆమె బయోపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీదేవి బయోపిక్ను నిర్మించేందుకు ఆయన భర్త బోనీ కపూర్ కూడా సుముఖంగానే ఉన్నారట. కానీ శ్రీదేవిలా నటించగల నటి ఎవరు? అన్నదే పెద్ద ప్రశ్న. అయితే శ్రీదేవిపాత్రలో మాధురీ దీక్షిత్ అయితే సరిపోతారని బోనీ భావిస్తున్నారని బాలీవుడ్ తాజా ఖబర్. -
మాట నిలబెట్టుకున్న అజిత్
తమిళ్ సూపర్ స్టార్ అజిత్, అతిలోక సుందరి శ్రీదేవికి మాట ఇచ్చారట. ఈ విషయాన్ని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్వయంగా వెల్లడించారు. అజిత్ కథానాయకుడిగా బోనీ కపూర్ తమిళంలో వరుసగా రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి హిందీలో సంచలన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్. ఇందులో అమితాబచ్చన్ నటించిన పాత్రలో తమిళంలో అజిత్ నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రం చేస్తున్న సమయంలోనే అజిత్తో పరిచయం ఏర్పడింది. . అప్పుడు శ్రీదేవి తాను నిర్మించబోయే తమిళ చిత్రంలో నటించాలని అజిత్ను కోరారు. అప్పుడు ఆయన కచ్చితంగా చేస్తానని మాట ఇచ్చారు. శ్రీదేవికిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆయనే ముందుకు వచ్చారు. నన్ను పిలిచి సినిమా చేద్దాం అని చెప్పారన్నా’రు బోనీకపూర్. అంతేకాక పింక్ చిత్రంతో పాటు అజిత్ హీరోగా మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు బోనీకపూర్. ఈ ఏడాది జూలైలో ఆ చిత్రాన్ని ప్రారంభిస్తామని.. 2020లో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ‘పింక్’ రీమేక్కు యువన్శంకర్రాజా సంగీత బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను నటి శ్రద్ధాశ్రీనాధ్ పోషిస్తుండగా.. మరో ముఖ్య పాత్రను రంగరాజ్ పాండే చేయనున్నారు. విలన్ పాత్రలో దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ నటించనున్నారని బోనీ కపూర్ తెలిపారు. -
‘బోనీ కపూర్.. వీటిని అస్సలు సహించరు’
సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. మలయాళ దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘శ్రీదేవి బంగ్లా’ అనే మూవీలో ప్రధాన పాత్రలో ఆమె నటిస్తున్నారు. శ్రీదేవి అనే సక్సెస్ఫుల్ హీరోయిన్ పాత్రలో ప్రియా కనిపించనున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా చిత్ర యూనిట్కు కష్టాలు తెచ్చిపెట్టింది. సినిమా టైటిల్, ట్రైలర్లో హీరోయిన్ బాత్టబ్లో పడి చనిపోవడం వంటి సీన్లు ఉండటంతో దివంగత నటి శ్రీదేవి జీవితం ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్.. ప్రియా ప్రకాశ్, ఈ చిత్ర దర్శకుడికి లీగల్ నోటీసులు పంపారు. దీంతో శ్రీదేవి అన్న పేరు చాలా మంది అమ్మాయిలు పెట్టుకుంటారని, ఈ విషయమై బోనీతో చర్చిస్తామని ప్రశాంత్ పేర్కొన్నాడు. కాగా బోనీ కపూర్ ఈ సినిమాను అంత తేలికగా తీసుకోబోవడం లేదని ఆయన సన్నిహితులు తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ తన భార్య పేరును, ఆమె పేరిట ఓ నీతిలేని కథను తెరకెక్కించడాన్ని బోనీ అంగీకరించలేరు. ఈ సినిమాను నిలిపివేసేంత వరకు బోనీ కపూర్ అస్సలు ఊరుకోరు. వారి సినిమా గురించి ప్రజల్లో ఆసక్తి రేకెత్తించేందుకు శ్రీదేవి బంగ్లా అనే పేరు పెట్టుకోవచ్చు. అయినప్పటికీ బోనీ వీటన్నింటిని సహించరు. సినిమాను ఆపేందుకు ఆయన చట్టబద్ధంగా ముందుకు వెళ్తారు’ అని వ్యాఖ్యానించారు. బోనీ కపూర్ పట్టుదల చూస్తుంటే ‘శ్రీదేవి బంగ్లా’కు చిక్కులు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’
‘రాజ్కుమార్ చాలా మంచివాడు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నేను నమ్మను. తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’ అంటూ నిర్మాత బోనీ కపూర్... బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాణీకి మద్దతుగా నిలిచారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్కుమార్కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంత మంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన హీరో ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ..‘ నేను దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. అయినా హిరాణీ ఈ వీటిని కొట్టిపారేశారు కూడా. నిజ నిర్ధారణ జరిగేంత వరకు ఈ విషయం గురించి కామెంట్ చేయకపోవడమే మంచిది’ అని వ్యాఖ్యానించాడు. కాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం సినిమా షూటింగ్లో భాగంగా తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో #మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. వివిధ రంగాల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మహిళలు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. (టాప్ డైరెక్టర్పై లైంగిక ఆరోపణలు.. షాక్లో బాలీవుడ్!) రాజ్కుమార్ హిరాణీ -
ప్రియా ప్రకాశ్కు షాకిచ్చిన బోనీ కపూర్
ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ప్రియా ప్రకాశ్కు లీగల్ నోటీసులు పంపారు. విషయం ఏంటంటే.. ప్రియా ప్రకాశ్ ప్రస్తుతం ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రంలో ప్రియ.. శ్రీదేవి అనే టాప్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ట్రైలర్, టైటిల్ని బట్టి చూస్తే ఇది దివంగత నటి శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అదీ కాకుండా ట్రైలర్లో శ్రీదేవి బాత్టబ్లో పడి చనిపోయిన సీన్ కూడా ఉండటంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దాంతో నిర్మాత బోనీ కపూర్.. ప్రియతో పాటు చిత్రబృందానికి కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి మాట్లాడుతూ.. ‘గత వారం బోనీ కపూర్ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. మేం ఈ సమస్యను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరేనని బోనీకి నచ్చజెప్పాను. నా సినిమాలో కథానాయిక పాత్ర పేరు శ్రీదేవి. మేం దీన్ని ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ‘ఇది శ్రీదేవి సినిమానా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్స్టార్ పాత్రలో నటిస్తున్నాను’ అంటూ అసలు విషయం చెప్పకుండా మాట దాటేశారు. -
అతిలోకసుందరి ఎవరు?
చరిత్రకారుల బయోపిక్లు వెండితెరకెక్కుతున్న కాలం ఇది. ఇటీవల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నుంచి క్రీడాకారుడు ఎంఎస్.ధోని, నటుడు సంజయ్దత్, మహానటి సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్.రాజశేఖరరెడ్డి, తాజాగా ఎంజీఆర్, జయలలిత ఇలా చాలా మంది బయోపిక్లు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అలా వెండితెర వెలుగు, అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్ను వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్నే స్వయంగా వెల్లడించారు. తమిళనాట పుట్టి, తెలుగు చిత్రసీమలో నటిగా ఎదిగి, ఉత్తరాది సినిమాలో వెలిగిపోయిన నాయకి శ్రీదేవి. బాల నటి నుంచి భారతీయ కథానాయకి వరకూ ఖ్యాతి గాంచిన శ్రీదేవి మరణం ఒక విషాదం అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మజిలీలు ఉన్నాయి. అవన్నీ కలిపి చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు, కథ, కథనాలు సిద్ధమైనట్లు బోనీకపూర్ ఒక భేటీలో తెలిపారు. శ్రీదేవిగా నటించే నటి కోసం అన్వేషణ జరుగుతోందని, ఈ చిత్రాన్ని హిందీతో పాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ నిర్మించబోతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో శ్రీదేవిగా నటించే అదృష్టం ఎవరికి దక్కనుందన్నది ఆసక్తికరంగా మారంది. మరో విషయం ఏమిటంటే తెలుగులో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్లో శ్రీదేవిగా నటి రకుల్ప్రీత్సింగ్ నటించింది. దీంతో ఆ అమ్మడిని శ్రీదేవి బయోపిక్లో నటింపజేయడానికి పరిశీలించే అవకాశం ఉంటుందా అన్న అంశం గురించి చర్చ జరుగుతోంది. ఈ సంచలన చిత్రం గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం బోనీకపూర్ హిందీ చిత్రం పింక్ను తమిళంలో రీమేక్ చేసే పనిలో ఉన్నా రు. అమితాబ్బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన సంచలన చిత్రం పింక్. దీని రీమేక్లో అమితాబ్బచ్చన్ పాత్రను నటుడు అజిత్ పోషించనున్నారు. మరో పాత్రలో నటి విద్యాబాలన్ నటించనున్నట్లు సమాచారం. హెచ్. వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. -
ఆ క్రేజ్ ఇంతింత కాదయా
స్టార్స్ అప్లోడ్ చేసిన ఫొటోలన్నిటికీ ప్రశంసలు వస్తాయంటే పొరపాటే. అప్పడప్పుడు విమర్శలు కూడా వస్తాయి. కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్ లాంటి వారు ఆ అనుభవాన్ని చవి చూసినవారిలో కొందరు. వాళ్లు పెట్టిన ఫొటోలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. వెయ్యి మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫొటో చెబుతుందంటారు. అందుకే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ఫీల ట్రెండ్ కూడా పెరిగింది. ఇక సోషల్ మీడియాలో అయితే రోజుకో ఫొటో అయినా అప్లోడ్ చేయనిదే కునుకు తీయని నెటిజన్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కూడా యాక్టివ్గా ఉంటున్నారు. వివాదం అయినా, విశేషం అయినా ఒకే ట్వీట్తోనే, ఇన్స్టా స్టోరీతోనే.. ఏదో ఒక సోషల్మీడియా యాప్ ద్వారానో తమ అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో సోషల్ మీడియా ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయబడిన కొన్ని ఫొటోలను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేశారు. దాన్ని బట్టే ఆ ఫొటోల క్రేజ్ ‘ఇంతింత కాదయా’ అనొచ్చు. వాటిలో కొన్నింటిపై లుక్కేద్దాం. ఒకే ఫ్రేమ్లోకి బోనీ కుటుంబం ఈ ఏడాది ఫిబ్రవరిలో అతిలోకసుందరి శ్రీదేవి మరణించినప్పుడు సినీలోకం కన్నీరు కార్చింది. బోనీకపూర్ రెండో భార్య శ్రీదేవి అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1983లో మోనా కపూర్ను వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. 1996లో బోనీ–మోనా విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరిద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతనే ఇప్పటి బాలీవుడ్ హీరో అర్జున్కపూర్. మోనా నుంచి విడాకులు తీసుకుని 1996లోనే శ్రీదేవిని వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. శ్రీదేవికి–బోనీకి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు సంతానం. అయితే మొదటి భార్య కుటుంబానికీ, రెండో భార్య కుటుంబానికీ పెద్దగా అనుబంధం ఉండేది కాదు. కానీ శ్రీదేవి చనిపోయాక రెండు కుటుంబాలూ కలిశాయి. జాన్వీ, ఖుషీలకు అర్జున్కపూర్ అండగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏడడుగులు వేసిన సోనమ్ కపూర్ పెళ్లి రిసెప్షన్ ముంబైలో జరిగినప్పుడు బోనీ ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్లోకి వచ్చారు. ఆ ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఇది హ్యాపీ మూమెంట్ అయితే విషాద సంఘటన శ్రీదేవి అంత్యక్రియల తాలూకు ఓ ఫొటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అభిమాన తార చివరి ఫొటోను అభిమానులు పదే పదే చూశారు. చిన్నోడు.. చిన్నారి.. క్రేజ్ బోలెడు బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్–కరీనాకపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్, షాహిద్ కపూర్–మీరా రాజ్పుత్ దంపతుల కుమార్తె మిషా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తుంటాం. ఈ ఏడాది ఆగస్టు 2న రెండేళ్లు పూర్తి చేసుకుంది బేబీ మిషా కపూర్. ఈ బర్త్డే వేడుకలకు ముందు ముద్దుల కూతురు మిషాతో ఓ ఫొటోషూట్ చేయించుకున్నారు మీరా రాజ్పుత్. ఆ ఫొటోలు ఫుల్గా వైరల్ అయ్యాయి. చిన్నోడు తైముర్, చిన్నారి మిషాలకు బోల్డంత క్రేజ్. ఈ ఏడాది బాలీవుడ్లో పెళ్లి సన్నాయి బాగా వినిపించింది. అందులో సోనమ్ కపూర్–ఆనంద్ ఆహుజాల పెళ్లి ఒకటి. దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్ చేసుకున్న తర్వాత సోనమ్–ఆనంద్ ఈ ఏడాది మేలో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఓ ఈవెంట్కి వెళ్లినప్పుడు క్లిక్మన్న ఫొటో నెటిజన్లను బాగా మెప్పించింది. నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా పెళ్లివేడుక సంబరాలు సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేశాయి. ఈ నెల 1,2 తేదీల్లో జో«ద్పూర్లో ఈ జంట రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలకు మొబైల్స్, కెమెరాల అనుమతి లేకపోవడంతో నిక్–ప్రియాంకా ఫొటోలు వారు రిలీజ్ చేసే వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిక్ అండ్ ప్రియాంకా చోప్రా. ఇన్స్టాగ్రామ్ లిస్ట్లో ట్వీటర్ అకౌంట్ ఉన్నప్పటికీ కొందరు స్టార్స్ కూడా ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమిర్ ఖాన్, కమల్హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్... ఈ ఏడాది ఇన్స్టాగ్రామ్లో అకౌంట్స్ తెరిచిన కొందరు స్టార్స్. ∙ మీరా రాజ్పుత్, మిషా ఆనంద్, సోనమ్ నిక్ జోనస్, ప్రియాంక -
‘శ్రీదేవి కాళ్లకు నమస్కరించేవాడిని’
శ్రీదేవి లాంటి సూపర్ స్టార్తో నటించడం నా అదృష్టం. ఆమెని కలిసిన ప్రతిసారి తన కాళ్లకు నమస్కరించేవాడిని అంటున్నారు బాలీవుడ్ మిస్టర్ ఇండియా అనిల్ కపూర్. శ్రీదేవితో కలిసి పలు హిట్ సినిమాల్లో నటించారు అనిల్ కపూర్. ఈ మధ్య ఓ టీవీ కార్యక్రమానికి హాజరైన అనిల్ కపూర్ ఈ సందర్భంగా శ్రీదేవితో తనకు గల అనుబంధం గురించి తెలిపారు. ‘నేను ఆమెని కలిసిన ప్రతి సారి ఆమె పాదాలకు నమస్కరించేవాడిని. ఇది ఆమె పట్ల నాకున్న గౌరవం. కానీ నేను ఇలా చేయడం శ్రీదేవికి చాలా అసౌకర్యంగా అనిపించేది’ అంటూ చెప్పుకొచ్చారు. ‘ఓ ఆర్టిస్ట్గా ఆమెలాంటి గొప్ప స్టార్తో కలిసి నటించడం నా అదృష్టం. ఆమెతో నటించడం నా కెరియర్కి బాగా హెల్స్ అయ్యింది. ఆమెలో చాలా ప్రతిభ ఉంది. స్ర్కీన్ మొత్తాన్ని ఆమె తన మ్యాజిక్తో నింపగలదు. ఆమె ప్రతిభకి కొలమానం లేదు. తను మా అన్నని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెపై ఉన్న భక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆమె మనతో లేరని బాధపడకూడదు. ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించినందుకు సంతోషించాలి’ అని వెల్లడించారు అనిల్. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి చనిపోయారు శ్రీదేవి. -
డాడీ కోసం డేట్స్ లేవ్!
సాధారణంగా ‘హోమ్ బేనర్’ అంటేనే ఏదో స్పెషల్ కిక్ ఉంటుంది ఎవరికైనా. కానీ ఈ కిక్ను ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ వద్దనుకుంటున్నారు. తండ్రి బోనీ కపూర్ ఆఫర్ చేసిన సినిమాలో నటించడానికి ‘నో’ చెప్పారు. కూతురు కాదన్నందుకు బోనీ కపూర్ సంబరపడిపోతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి కుమార్తె ఎదిగిందని ఆనందపడుతున్నారాయన. పైగా తండ్రికే డేట్స్ ఇవ్వలేనంత బిజీ అయినందుకు ఆయన డబుల్ హ్యాపీ. ‘‘మా ఫ్యామిలీతో కరణ్ జోహార్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రస్తుతం జాన్వీకి మంచి గైడ్లా ఉన్నారు కరణ్. జాన్వీని కూతురిలా భావిస్తారాయన. నా ప్రమేయం లేకుండానే జాన్వీ నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పెద్ద కూతురితో నేను తీయబోయే సినిమా తీసే టైమ్ వీలైనంత తొందరగా రావాలని కోరుకుంటున్నాను’’ అని బోనీ కపూర్ పేర్కొ న్నారు . అందడీ సంగతి.. జాన్వీ కపూర్ దగ్గర డాడీ సినిమాకు డేట్స్ లేవన్నమాట. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోçహార్ రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమా 2020 లో రిలీజ్ కానుంది. ఇది కాకుండా వేరే ఓ ప్రముఖ బేనర్లో సినిమా చేయడానికి జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకే తండ్రి సినిమాకి డేట్స్ ఇవ్వ లేకపోయారు. -
బోని కపూర్కు ఎవరంటే ఎక్కువ ఇష్టం
ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చిన ‘ఆస్క్ మి ఎనీథింగ్’ ఫీచర్, సెలబ్రిటీల నుంచి ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. తమ తమ జీవిత విశేషాలు, కెరీర్, ఇష్టఅయిష్టాలను సెలబ్రిటీలు ఈ ఫీచర్ ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల బోని కపూర్ మొదటి భార్య కూతురు అన్హులా కపూర్ కూడా ఈ ఫీచర్ను వాడారు. ఈ ఫీచర్ ద్వారా అన్హులా కపూర్ నుంచి పలు ఆసక్తికర విషయాలను అభిమానులు రాబట్టారు. ‘మీ నలుగురు తోబుట్టువుల్లో, బోని కపూర్ ఎక్కువగా ఇష్టపడేది ఎవరూ?’ అని అభిమానులు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం అందరూ అర్జున్ కపూర్ లేదా జాన్వీ కపూర్ వస్తుందని భావించారు. కానీ వారిద్దరూ కాదంట. అందరి కంటే చిన్న చెల్లి, ఖుషీ కపూర్ అంటే బోని కపూర్కు ఎక్కువగా ఇష్టమని అన్హులా రివీల్ చేశారు. బోని కపూర్ మొదటి భార్య మోనా కపూర్ సంతానం అర్జున్, అన్హులాలు కాగ, జాన్వీ, ఖుషీలు అందాల తార, రెండో భార్య శ్రీదేవి సంతానం. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీదేవీ చనిపోయిన తర్వాత వీరి బంధం బాగా బలపడింది. చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు అర్జున్, అన్హులాలు ఎల్లవేళలా తోడుంటూ వస్తున్నారు. అన్న అర్జున్ కపూర్, చెల్లెళ్లపై ఈగ కూడా వాలనీయనంత కేరింగ్గా చూసుకుంటూ వస్తున్నారు. చాలా మంది బోని కపూర్కు తన ఒకానొక కొడుకంటే ఎక్కువగా ఇష్టమని, లేదా జాన్వీని ఎక్కువగా ముద్దు చేస్తారని అనుకునే వారు. కానీ వారందరి కంటే కూడా నలుగురిలో ఎక్కువగా బోనికి తన చిన్న కుట్టి, ఖుషీ అంటే ఎక్కువ ఇష్టమని అన్హులా చెప్పారు. ఇదే విషయాన్ని శ్రీదేవి కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. ఖుషీ ఎక్కువగా బోనికి క్లోజ్ అని, జాన్వీ తనపై ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపారు. అయితే బోని నిజాయితీగా అందర్ని సమానంగా ప్రేమిస్తారని కూడా అన్హులా చెప్పుకొచ్చారు. మరో యూజర్, మీ తోబుట్టువుల్లో మీకు నచ్చే విషయమేమిటని అడుగగా.. ‘వారి హార్ట్, వారి బలం, చీకటి రోజుల్లో కూడా వారు ఎప్పుడూ వెలుతురు వైపే చూసే సామర్థ్యం కలిగి ఉండటం.. కారణం లేకుండా వారు నన్ను నవ్వించగలగడం.. కానీ ఎక్కువగా వారు నా వారు అని చెప్పుకోవడాన్ని ప్రేమిస్తాను’ అని అన్హులా ఎంతో భావోద్వేగంతో చెప్పారు. బోని కపూర్ ఇద్దరూ భార్యలు చనిపోయిన సంగతి తెలిసిందే. మొదటి భార్య మోనా కపూర్ 2012లో క్యాన్సర్తో చనిపోగా.. రెండో భార్య శ్రీదేవీ దుబాయ్లో బాత్టబ్లో పడి ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. అప్పటి నుంచి నలుగురు తోబుట్టువులు, తండ్రి తోడుగా, ఆయన్ని నవ్విస్తూ.. ఎంతో సానిహిత్యంతో మెలుగుతున్నారు. -
వైరలవుతోన్న నటి ఫోటో
బాలీవుడ్ లేడి సుపర్ స్టార్ శ్రీదేవికి ఎప్పుడు ఏ విషయానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో బాగా తెలుసు. అందుకే తల్లయ్యాక ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత 2012లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం మరో నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె కూతుళ్లు భవిష్యత్ గురించి ప్రణాళికలు రూపొందించారు. ఈ విషయం గురించి ఆమె ‘చాలా మంది మంచి కథలతో నా దగ్గరకు వస్తున్నారు. కానీ నేనే ఒప్పుకోలేదు. అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా పెద్ద కూతురు జాన్వీ ఉన్నత చదువులు చదువుతోంది. ఇప్పుడు తాను చాలా కొత్త విషయాలను ఎదుర్కోబోతుంది. ఈ సమయంలో ఒక తల్లిగా నేను తనతో ఉండటం చాలా అవసరం. తల్లిగా నా బాధ్యతలు నెరవేర్చడమే నా తొలి కర్తవ్యం’ అన్నారు. ‘మామ్’ శ్రీదేవి నటించిన చివరి చిత్రం. శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ప్రవేశం గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ ఆ కల నిజమయ్యే సమయానికి ఆమె మన మధ్యలో లేకుండా పోయారు. ఈ రోజు శ్రీదేవి 55వ పుట్టిన రోజు. గతంలో ఒక సారి శ్రీదేవి ఖుషి కన్నా జాన్వీకే తన అవసరం ఎక్కువ అని చెప్పారు. జాన్వీ కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత తల్లిని తల్చుకుంటూ ‘నేను ఇంత వరకూ ఎవరి మీదా దేని కోసం ఆధారపడలేదు. ఎందుకంటే నాకు కావలసినవన్ని సమకూర్చే ఏకైక వ్యక్తి.. నా ప్రాణ స్నేహితురాలు నువ్వే అమ్మ’ అనే సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ రోజు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ శ్రీదేవితో దిగిన అపురూపమైన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో శ్రీదేవి చిన్నారి జాన్వీని ఎత్తుకుని, భర్త బోనీ కపూర్తో పాటు ఉన్నారు. ఈ ఫోటో శ్రీదేవి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Aug 12, 2018 at 12:29pm PDT శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా బోనీ కపూర్ ‘ఇక్కడ చాలా మంది హీరోలు, లెజండ్లు ఉన్నారు. హీరోలను మర్చిపోతాం. కానీ లెజండ్లను ఎవరూ ఎన్నటికి మర్చిపోలేరు. శ్రీ ప్రతిరోజు.. ప్రతి క్షణం మాతోనే ఉంది. ఒక్క నిమిషం కూడా మేము తనని మిస్ అవ్వడం లేదు’ అంటూ శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. -
‘అతిలోక సుందరి’పై పది ఆసక్తికర అంశాలు
‘బూచడమ్మ.. బూచాడు బుల్లి పెట్టలో ఉన్నాడు’.. అంటూ ఆ చిన్నారి అందంగా, అమాయకంగా అభినయిస్తుంటే అబ్బా మనింట్లో కూడా ఇంత అందమైన బుజ్జి పాపాయి ఉంటే ఎంత బాగుండో అనుకున్నాం. అంతలోనే ‘ఆరేసుకుబోయి పారేసుకుంటే’ అంటూ ఎన్టీఆర్తో ఆడి పాడితే అరే ఇంత అందం ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుందా అని ఆశ్చర్యపోయాం. ఆనాటి ఆ బడిపంతులులోని ఆ బుజ్జాయే ఈ బుజ్జమ్మ అనగానే ఇంతలోనే ఎంత ఎదిగింది అంటూ విస్తు పోయాం. ఇక ఆ నాడు మొదలైన ఆ అతిలోక సుందరి ప్రస్థానం కొన్ని దశబ్దాల పాటు తిరుగులేకుండా అలా కొనసాగింది. దాదాపు 30 ఏళ్ల పాటు తన అందం, అభినయంతో పరిశ్రమను ఏలిన ఆ చాందినీ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిజంగానే ఆ తారల్లో చేరారు. ఈ రోజు శ్రీదేవి జన్మదినం. బతికుంటే ఇది ఆమెకు 55వ పుట్టిన రోజు. కానీ నేడు ఆమె మన మధ్యలో లేరు. ఈ తొలి జయంతి సందర్భంగా ఆ వసంత కోకిలకు సంబంధించి అభిమానులకు తెలియని పలు ఆసక్తికర అంశాలు... 1. బాలీవుడ్లో లేడి సూపర్ స్టార్గా ఎదిగిన శ్రీదేవిని హలీవుడ్ అవకాశాలు వరించాయి. ప్రముఖ హలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తన ‘జురాసిక్ పార్క్’ చిత్రంలో నటించాల్సిందిగా శ్రీదేవిని కోరారు. కానీ బాలీవుడ్కు దూరమవ్వడం ఇష్టం లేక ఆమె ఈ అవకాశాన్ని కాదన్నారు. 2. చాల్బాజ్ చిత్రంలోని ‘నా జానే కహా సే ఆయే హై’ పాట చిత్రీకరణ సమయంలో శ్రీదేవి హై ఫీవర్తో పడిపోయారంటా. 3 . శ్రీదేవి హింది పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో ఆమెకు హిందీ రాదు. 4 . శ్రీదేవి బాలీవుడ్లో నం.1 పొజిషనలో ఉన్నప్పుడు ఆమెకు చాలా మంది కోటీశ్వరులైన భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఇండియన్స్, అమెరికన్స్ నుంచి పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. 5. ‘ఇంగ్లీష్ - వింగ్లీష్’ చిత్రంలో ఆంగ్లం రానీ సగటు భారతీయ ఇల్లాలుగా మెప్పించిన శ్రీదేవికి పలు భాషలు వచ్చు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ ఆమె అనర్గళంగా మాట్లడగలరు. 6. తన కుటుంబాన్ని పోషించడానికి చాలా చిన్నతనంలోనే పరిశ్రమలోకి వచ్చిరు శ్రీదేవి. తల్లి, సవతి తండ్రి, చెల్లి, సవతి సోదరులకు ఆమె సంపాదనే ఆధారం. 7. శ్రీదేవి తన కుమార్తెలకు పెట్టిన పేర్ల వెనక కూడా చిన్న ఆసక్తికర సంఘటన ఉంది. జాన్వీ, ఖుషీ(పెద్ద కూతురు, చిన్న కూతుర్ల పేర్లు) అనే పేర్లు ఆమె భర్త బోనీ కపూర్ నిర్మించిన ‘జుడాయి’ (1997), ‘హమారా దిల్ ఆప్కే పాస్ హై’(2000) చిత్రాలోని హీరోయిన్ల పేర్ల కావడం విశేషం. 8. 1985 నుంచి 1992 వరకూ బాలీవుడ్ అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి. 9. శ్రీదేవి హిందీలో డబ్బింగ్ చెప్పుకున్న తొలి చిత్రం ‘చాందిని’. ఈ సినిమాకు గాను శ్రీదేవి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. 10. 1993లో వచ్చిన షారుక్ ఖాన్ చిత్రం ‘బాజీగర్’లో తొలుత శ్రీదేవినే తీసుకోవాలనుకున్నారు. అది కూడా డబుల్ యాక్షన్. కానీ ఆ చిత్రంలో షారుక్ ఖాన్ ఒక శ్రీదేవి పాత్రను చంపాల్సి వస్తుంది. ప్రేక్షకులు ఆ విషయాన్ని ఒప్పుకోరు. అందుకే దర్శకుడు ఆ సాహసం చేయలేకపోయాడు. తర్వాత ఆ చిత్రంలో కాజల్, శిల్పా శెట్టిలను తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఫోటోలు వారివి, కష్టం నాది
-
వీడియో నాది.. ఫోటోలు వారివి
‘ఐఫా’ వేదిక మీద అందాల నటి శ్రీదేవికి ఘన నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీదేవి ఫోటోలు, పాటలు కలిపి రూపొందించిన అద్భుతమైన వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియో చూసిన వారికి ఒక్క క్షణం అలనాటి జ్ఞాపకాలన్ని కళ్ల ముందు మెదిలాయి. శ్రీదేవి అభిమానులనే కాకా సిని ప్రియులందరి హృదయాలను దోచుకున్న ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ‘ఐఫా’ వేడుకల అనంతరం ఢిల్లీకి చెందిన సబా అరీఫ్ అనే శ్రీదేవి అభిమాని తాను కష్టపడి రూపొందించిన వీడియోను తన అనుమతి లేకుండా ‘ఐఫా’ వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై బోనీ కపూర్ స్పందిస్తూ ‘శ్రీదేవికి సంబంధించిన ఫోటోలపై హక్కులన్ని నావే. వాటిని వాడుకునే అధికారం నాకు ఉంది. ఈ వీడియో నాకు ఎంతో నచ్చింది. ఐఫాలో శ్రీదేవికి నివాళులు సమర్పించే సమయంలో ఈ వీడియోను వాడితే బాగుంటుందని అనిపించింది. అందుకే యశ్రాజ్ ఫిలిమ్స్తో కలిసి ఈ వీడియోను నేనే ఓకే చేశాను. ఇంకా చెప్పాలంటే నాకు సంబంధించిన ఫోటోలను ఆమె వాడుకుంది. అంతే కాక ఈ వీడియో తనదని చెప్పుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు. అయినా ఆమెకు ఏదైనా సమస్య ఉంటే నన్ను కలవాల్సింది. అంతే తప్ప ఇలా ఆరోపణలు చేయడం సరికాద’న్నారు. బోనీ వ్యాఖ్యలపై సబా స్పందిస్తూ ‘ఈ వీడియోలో ఉన్న ఫోటోలు ఆయనవే ఒప్పుకోంటాను. కానీ నేను ఎంతో శ్రమించి ఈ వీడియో తయారు చేశాను. పాటలు, అందుకు తగ్గట్లుగా ఫోటోలను సెలక్ట్ చేసి వీడియో తయారు చేయడానికి నాకు మూడు రోజులు పట్టింది. ఫోటోలు వారివి, కష్టం నాది. నా అనుమతి లేకుండా నేను రూపొందించిన వీడియోను ఎలా వాడతారు. ఈ వీడియోను పోస్టు చేస్తున్నప్పుడు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదు. ఇప్పటికి చెప్తున్నా ఆ వీడియో నాదే. ఈ విషయంలో నన్ను గుర్తించాలి’ అని కోరింది. -
కంటతడి పెట్టుకున్న బోనీ కపూర్!
శ్రీదేవి మరణానంతరం బోనీ కపూర్ పలు సందర్భాల్లో భావోద్వేగానికి లోనయ్యారు. జాతీయ చలన చిత్ర అవార్డు వేడుకల్లో బోనీ కపూర్ శ్రీదేవి తరుపున అవార్డు తీసుకుంటూ.. ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఐఫా వేడుకల్లో బోనీ కపూర్ స్టేజ్పైనే కన్నీటిపర్యంతమయ్యారు. శ్రీదేవి గతేడాది నటించిన మామ్ చిత్రానికి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డును శ్రీదేవి తరుపున బోనీ కపూర్ అందుకుంటూ భావోద్వేగానికి లోనవుతూ.. ‘నిన్ను ప్రతీక్షణం మిస్సవుతున్నాను’ అంటూ కళ్లు చెమర్చగా... అర్జున్ కపూర్, అనిల్ కపూర్లు వచ్చి బోనీ కపూర్ను ఓదార్చుతూ.. ప్రపంచం, భారతదేశం..మా కుటుంబాలు శ్రీదేవీని ఎప్పటికీ మరిచిపోలేమని అనిల్ కపూర్ అన్నారు. దుబాయ్లో పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి ప్రమాదావశాత్తు బాత్రూం టబ్లో పడి ఫిబ్రవరి 24న మరణించిన సంగతి తెలిసిందే. -
వారి ప్రశంసకు మురిసిపోయిన జాన్వీ
ముంబై : అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్.. బాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. త్వరలోనే తను నటించిన ‘ధడక్’ సినిమా తెరపైకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ను చూసిన వారంతా.. జాన్వీ నటనను, అందాన్ని చూసి ఫిదా అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తొలి సినిమానే అయినా జాన్వీ చాలా అద్భుతంగా నటించిందని, హావభావాలను పలికించిన తీరు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇన్ని ప్రశంసల్లో ఓ కాంప్లిమెంట్ తన హృదయాన్ని తాకిందట. అది అన్న అర్జున్ కపూర్ మెచ్చుకోలు. ‘ఈ సినిమాలో నీవు చాలా నిజాయితీతో నటించినట్టు ఉంది. హీరోయిన్ మాదిరి నీవు నటించలేదు. పాత్రలో లీనైపోయావు. నిజాయితీగా నీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించావు’ అని అర్జున్ ప్రశంస ఇచ్చాడట. ఈ మెచ్చుకోలును తన బెస్ట్ కాంప్లిమెంట్గా జాన్వీ చెప్పింది. అర్జున్ నుంచి వచ్చిన ఈ ప్రశంసతో తాను చాలా సంతోషంగా ఫీల్ అయినట్టు పేర్కొంది. అంతేకాక తన తండ్రి బోని కపూర్ కూడా ‘వావ్, ఎంత సహజంగా నీవు నటించావు’ అని ప్రశంసించారట. ఈ ఇద్దరి కాంప్లిమెంట్తో తాను చాలా ఖుషీగా ఉన్నట్టు జాన్వీ ఇటీవల ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. కాగ, ధడక్లో జాన్వీకి జోడిగా షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. జాన్వీ, ఇషాన్ ఇద్దరూ పోటీపడి నటించినట్టు ఉందని, ఇషాన్ ఖట్టర్ నటన కూడా అద్భుతంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. మరాఠి హిట్ మూవీ ‘సైరాట్' రీమేక్గా ‘ధడక్' చిత్రాన్ని తెరకెక్కించారు. -
బుల్లి జాహ్నవి కపూర్ వీడియో : వైరల్
-
జాన్వీ చిన్ననాటి వీడియో : వైరల్
ముంబై : చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనులు, స్టేజీలపై వేసిన డ్యాన్సులు ఇవన్నీ.. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక వాటి వీడియోలు చూసుకుని ఇప్పటికీ మురిసిపోతూ ఉంటాం. ఇక స్టార్ హీరోలతో దిగిన ఫోటోలు, వీడియోలు ఎంతో మెమరబుల్గా ఉంచుకుంటాం. తాజాగా 2002లో జరిగిన ‘జీ సినీ అవార్డు’లకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. అది బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్కు, అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు బుల్లి జాన్వీ కపూర్ అవార్డు ఇచ్చే వీడియో. త్వరలోనే ‘దడక్’ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్ తన చిన్నతనంలో స్టేజీపై నిల్చుని, తన బుజ్జిబుజ్జి మాటలతో షారుఖ్ను స్టేజీపైకి పిలిచి దేవ్దాస్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చింది. త్వరలోనే ధడక్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ అవార్డు ఇచ్చే సమయంలో జాన్వీ కపూర్తో పాటు తండ్రి బోని కపూర్, నటి ప్రీతి జింటా కూడా ఉన్నారు. బోని కపూర్, తన చిన్నారిని ఎత్తుకుంటే, ఆమె బెస్ట్ యాక్టర్ అవార్డును షారుఖ్ పుచ్చుకోవాల్సిందిగా స్టేజీ పైకి పిలవడం... ఆ అనంతరం జాన్వీ పిలుపుకు వెంటనే స్టేజీ పైకి వచ్చిన షారుఖ్, వెంటనే ఆమె బుగ్గపై ముద్దు పెట్టడం ఈ వీడియోలో ఎంతో చూడముచ్చటగా ఉంది. అనంతరం జాన్వీ చేతుల మీదుగా షారుఖ్ అవార్డును అందుకోవడం, అందరూ కలిసి స్టేజీలపై ఫోటోలు దిగడం.. క్యూట్నెస్ ఉట్టిపట్టేలా ఉందని అభిమానులంటున్నారు. 2002లో ఆ బుల్లి జాన్వీనే.. నేడు ధడక్ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. ఇషాన్ ఖట్టర్కు జోడిగా జాన్వీ అద్భుతమైన నటనను కనబర్చినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్లోనే అర్థమవుతోంది. -
నీ లోటు తీరనిది
ఈ జూన్ 2న బోనీ కపూర్, శ్రీదేవి తమ 22వ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకోవాల్సింది. కానీ శ్రీదేవి దురదృష్టవశాత్తు బాత్ టబ్లో పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ట్వీటర్ అకౌంట్ను ఆమె భర్త బోనీ కపూర్ మొయింటేన్ చేస్తున్నారు. పెళ్లి రోజు సందర్భంగా శ్రీదేవి చివరిసారిగా దుబాయ్లో అటెండ్ అయిన వెడ్డింగ్ ఈవెంట్ వీడియోను పోస్ట్ చేసి– ‘‘ఈ రోజు మన 22వ వెడ్డింగ్ యానివర్శరీ అయ్యుండేది. జాన్.. నా సోల్మేట్, నువ్వు ప్రేమానురాగాలకు నిర్వచనం. నీ ప్రేమను, అనుభూతులను, జ్ఞాపకాలను ఎప్పటికీ నాలోనే దాచుకుంటాను. లెజెండ్ అన్న దాని కంటే కూడా నువ్వు ఎక్కువ. నువ్వు లేని లోటు కచ్చితంగా తీరనిది’’ అని పేర్కొన్నారు బోనీ. తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా ‘బోనీ శ్రీదేవిని ముద్దాడుతున్న’ ఫొటోను షేర్ చేశారు కుమార్తె జాన్వీ. బీటౌన్లో జాన్వీ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ వచ్చే నెల 20న రిలీజ్ కానుంది. -
శ్రీదేవి ట్విటర్లో వీడియో షేర్ చేసిన బోనీకపూర్
-
జాన్ శ్రీదేవీ..బోనీకపూర్ స్పెషల్ ట్వీట్
సాక్షి, ముంబై: అందాలనటి, వెండి తెర జాబిలి శ్రీదేవి నింగికేగి అపుడే మూడు నెలలు గడిచిపోయింది. ఈ రోజు (జూన్ 2) శ్రీదేవీ, బోనీ కపూర్ల వివాహ వార్షికోత్సవం. శ్రీదేవి బతికి వుండి వుంటే ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకునే వారేమో. ఇదే విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. తన భార్య తనతో లేకపోయినా....ఆమె ప్రేమ, స్నేహం ఎప్పటికీ తనతోపాటే నిలిచి వుంటుందంటూ ట్విటర్లో తన ఆవేదనను పంచుకున్నారు. ఈ మేరకు శ్రీదేవి ట్విటర్ ఖాతాలో బోనీకపూర్ శనివారం ఒక ట్వీట్ చేశారు. దీంతోపాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ‘నువ్వు ఉండి వుంటే ఈ రోజు మన 22 వ వివాహ వార్షికోత్సవం అయ్యేది. నా ప్రాణమా.నా అర్థంగీ, నా ఆత్మ, ప్రేమకు ప్రతిరూపమా...నీ ప్రేమా నీ ఉత్సాహం, నీ నవ్వు ఎప్పటికీ నా తోనే..’ అంటూ ట్వీటర్ లో పేర్కొన్నారు. కాగా ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఫిబ్రవరి 25న హఠాన్మరణం చెందడం యావత్తు ప్రపంచాన్ని తీవ్ర విభ్రాంతికి గురిచేసింది. సమీప బంధువు పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసినట్టుగా కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. Today would have been our 22nd wedding anniversary. Jaan... My wife, my soulmate, the epitome of love, grace , warmth and laughter lives within me forever... pic.twitter.com/0XWhFIvOvz — SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) June 2, 2018 -
తల్లి చీరలో జాన్వీ కపూర్
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నవారిలో దివంగత నటి శ్రీదేవి కుటుంబం ఉంది. ‘మామ్’ చిత్రానికి ఉత్తమ నటిగా శ్రీదేవిని జాతీయ అవార్డుకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అందుకోవడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆమె కూమార్తెలు జాన్వీ అండ్ ఖుషీ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ‘‘ఇది మేం గర్వపడాల్సిన సమయం. ఈ మంచి క్షణాల్లో శ్రీదేవి బతికి ఉంటే చాలా సంతోషపడేవారు. సినిమాలో ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది’’ అన్నారు బోనీ కపూర్. జాన్వీ పట్టు చీర కట్టుకుని వెళ్లారు. తాను కట్టుకున్న చీర తల్లిదేనని ఆమె పేర్కొన్నారు. -
శ్రీదేవి ఎవరు?
నాలుగేళ్ల వయసులో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి జీవితంలో ఎక్కువ భాగం నటిగానే కొనసాగారు శ్రీదేవి. భౌతికంగా లేకపోయినా.. నటించిన చిత్రాలు, విభిన్నమైన పాత్రల రూపంలో ప్రేక్షకుల హృదయాల్లో ఆమె నిలిచే ఉంటారు. ఇలాంటి గొప్ప నటి జీవిత చరిత్ర ఆదర్శనీయమైంది. రాబోయే కథానాయికలకు మార్గనిర్దేశం లాంటిది. అందుకే శ్రీదేవి లైఫ్స్టోరీతో ఆమె భర్త బోనీకపూర్ ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నారని బీటౌన్లో స్ట్రాంగ్గా వినిపిస్తోంది. అందుకోసం ఈయన ‘శ్రీ, శ్రీదేవి, శ్రీ మ్యామ్’ అనే టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీదేవి పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించగల నటి ఎవరు? అన్న ఆసక్తి హట్టాపిక్గా మారింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. శ్రీదేవి కూమార్తెలు జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే శ్రీదేవి లేరనే బాధ నుంచి తేరుకున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా జరిగిన ఓ వేడుకలో పక్కనున్న ఫొటోలోలా ఫన్నీగా కనిపించారు జాన్వీ అండ్ ఖుషీ. -
బాహుబలిలో శ్రీదేవి అందుకే చేయలేదు: ఆర్జీవీ
-
శ్రీదేవి.. బాహుబలి చేయకుండా ఆపింది అతనే..!
తెలుగు సినిమా ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు నటీనటులకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణకు ఈ సినిమా వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ పాత్రకు ముందుగా అతిలోకసుందరి శ్రీదేవిని తీసుకోవాలని భావించారు. కానీ శ్రీదేవి అంగీకరించకపోవటంతో రమ్యకృష్ణను తీసుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి కూడా పలు వేదికల మీద ప్రస్తావించారు. అయితే తాజాగా ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో శ్రీదేవికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శ్రీదేవి.. బాహుబలి సినిమా చేయకపోవటానికి కారణం బోని కపూరే అన్నారు వర్మ. ఈ విషయంపై తాను అప్పట్లో శ్రీదేవితో మూడు నాలుగుసార్లు చర్చించానని.. శ్రీదేవి కూడా బాహుబలి సినిమాలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారని.. కానీ బోనీనే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి బాహుబలి చేయకుండా చేశారన్నారు. బోని నిర్ణయాల కారణంగానే శ్రీదేవి కెరీర్ పరంగా ఎంతో నష్టపోయారని.. పెళ్లి తరువాత ఆమె ఒక్క రోజు కూడా ఆనందంగా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
ఆ సినిమా సరిగా ఆడలేదు: దర్శకుడు
శ్రీదేవి, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రూప్ కి రాణి చోరోం కా రాజా’ చిత్రం ఏప్రిల్ 16, 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్నేహితుడు సతీశ్ కౌశిక్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం దర్శకునిగా, నటుడిగా కొనసాగుతున్న సతీశ్ తన తొలి చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఆ సినిమా జ్ఞాపకాలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘25 ఏళ్ల క్రితం బోనీ కపూర్ నాకు ఈ చిత్రం ద్వారా బ్రేక్ ఇవ్వాలని చూశారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అందుకు బోనీకి క్షమాపణలు. అది నా మనస్సుకు ఎంతో దగ్గరయిన చిత్రం. ఈ చిత్రం గురించి తలుచుకుంటే శ్రీదేవి మేడమ్ గుర్తొస్తున్నారు’ అని సతీశ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో నటించిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రూప్ కి రాణి చోరోం కా రాజా చిత్రం విడుదలై 25 ఏళ్లు గడిచాయంటే నమ్మకలేకపోతున్నాను. ఈ చిత్ర నిర్మాణంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనప్పటికీ, ఇది ఒక మరచిపోలేని జ్ఞాపకం. ప్రతి రోజు రూప్ కి రాణిని మిస్ అవుతున్నామని అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. కొన్ని అపజయాల్లో కూడా గొప్ప విజయం ఉంటుంది అని అనుపమ్ ఖేర్ తన సందేశాన్ని తెలిపారు. అభిమానులు మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా.. ఇది ఒక మంచి చిత్రమని తమ స్పందన తెలియజేస్తున్నారు. -
వైరల్ : అర్జున్ డిన్నర్కు జాన్వీ, ఖుషీ!
సాక్షి, ముంబై : దిగ్గజ నటి శ్రీదేవి అకాల మరణాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోవటానికి సినీ లోకం ప్రయత్నిస్తోంది. అయితే శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లు మాత్రం ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి కష్ట సమయాన వీరికి తన అన్న అర్జున్ కపూర్, అక్క అన్షూలు బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ తన చెల్లెళ్లను డిన్నర్కు ఆహ్వానించగా వారు తండ్రి బోనీ కపూర్తో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ డిన్నర్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అర్జున్, అన్షూలు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌర్య కపూర్ పిల్లలు. గతంలో జాన్వీ, ఖుషీలపై అర్జున్ కపూర్ అభిమానులు అసభ్యకర కామెంట్లు పెట్టగా అన్షూ తన చెల్లెళ్లను ఏమనవద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. శ్రీదేవి బతికున్నంత కాలం ఆమె కుటుంబానికి దూరంగా ఉన్న అర్జున్, అన్షూలు ఇప్పుడిప్పుడే తండ్రి బోనీతోపాటు జాన్వీ, ఖుషీలకు దగ్గర అవుతున్నారు. -
‘బోనీ కపూర్తో సినిమా లేదు’
కొద్ది రోజులుగా కోలీవుడ్ లో ఆసక్తికర వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. తమిళ టాప్ హీరో అజిత్, బాలీవుడ్ బడా నిర్మాత బోనీకపూర్ బ్యానర్లో ఓ సినిమా చేయనున్నాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఖాకీ సినిమాతో ఆకట్టుకున్న హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందన్న ప్రచారం బలంగా వినిపించింది. శ్రీదేవి కుటుంబానికి అజిత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్ లో అజిత్ అతిథిపాత్రలో నటించారు. ఈ సాన్నిహిత్యం మూలంగానే బోనికపూర్ బ్యానర్ లో అజిత్ సినిమా అంటూ వచ్చిన వార్తలకు బలం చేకూరింది. అయితే తాజాగా అజిత్ టీం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్.. శివ దర్శకత్వంలో విశ్వాసం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను అజిత్ ఇంతవరకు నిర్ణయించలేదట. దీపావళి సీజన్లో విశ్వాసం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అజిత్ విశ్వాసం సినిమాలో నటిస్తున్నారు, కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదని అజిత్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. -
కంటతడి పెట్టిన జాన్వీ కపూర్
చెన్నై : ప్రముఖ సినీనటి శ్రీదేవి సంతాప సభ సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీ కంటతడి పెట్టింది. గత నెల 24వ తేదీన దుబాయిలో హఠాన్మరణం పొందిన శ్రీదేవికి ఆదివారం చెన్నైలో సంతాపసభను నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలోని హోటల్లో నిర్వహించిన ఈ సంతాప సభకు బోనీకపూర్, ఆయన కూతుర్లు జాన్వి,ఖుషీ, శ్రీదేవి సోదరి శ్రీలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అతిలోక సుందరి శ్రీదేవికి మూగబోయిన గొంతుతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మౌనంగానే నివాళులర్పించారు. కాగా ముంబై నుంచి బీఎస్పీ పార్టీ నేత అమర్సింగ్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటటి సురేష్ బాబు తదితరులు శ్రీదేవి సంతాపసభలో పాల్గొన్నారు. శ్రీదేవి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించిన సినీ ప్రముఖులు, బంధువులు, ఆప్తులు శ్రీదేవితో తమ అనుభవాలను పంచుకోకుండానే, ఎలాంటి ఉపన్యాసాలు లేకుండా మౌనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీదేవి కుటుంబ సభ్యులను సినీ ప్రముఖులు ఓదార్చారు. ఆ సమయంలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కంటతడి పెట్టింది. మరోవైపు ఈ సంతాప సభకు మీడియాను అనుమతించలేదు. మీడియాకు అనుమతి లేదని చెప్పినా, ఎందుకు వచ్చారని శ్రీదేవి కుటుంబీకులు ప్రశ్నించడంతో ఎలక్ట్రానిక్ మీడియా బృందం హోటల్ ముందు భాగంలోని ఉండి సంతాప సభకు వచ్చినవారిని చిత్రీకరించారు. ఇక చెన్నైలోని ఆళ్వార్పేటలో ఉన్న శ్రీదేవి నివాసానికి ఆదివారం ఉదయం ప్రముఖ హీరో అజిత్, షాలిని దంపతులు వెళ్లి అక్కడ ఆమెచిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శ్రీదేవి కుటుంబసభ్యులను ఓదార్చారు. మరోవైపు దక్షిణ భారత నటీనటుల సంఘం నివాళులు అర్పించింది. నిన్న ఉదయం స్థానిక సంఘ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీదేవి చిత్రపటానికి సంఘ నిర్వాహకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు శివకుమార్, నటి అంబిక, కుట్టిపద్మిని, సంఘ కోశాధికారి కార్తీ పాల్గొన్నారు. -
శ్రీదేవి సంస్మరణ సభకి రజనీ గైర్హాజర్
సాక్షి, చెన్నై: అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న లెజండరీ నటి శ్రీదేవి సంస్మరణ సభను కోలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించనుంది. ఆదివారం చెన్నైలోని క్రౌన్ ప్లాజాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బోనీకపూర్ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి హాజరవనున్నారు. చెన్నై సినీ ప్రముఖులు హజరై.. శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కాలేకపోతున్నారు. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం హిమాలయాలకు వెళ్లనుండటంతో ఈ సభకి రావటంలేదు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్, అజిత్,భారతీరాజా ఇతర ప్రముఖులు హాజరవనున్నారు. చివరి వారం శ్రీదేవి సంస్మరణ సభ టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించిన సంగతి తెలిసిందే. -
వృద్ధాశ్రమంలో జాన్వీ పుట్టినరోజు వేడుకలు
-
వృద్ధాశ్రమంలో జాన్వీ బర్త్ డే వేడుకలు
శ్రీదేవి మరణించిన బాధనుంచి కపూర్ ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మంగళవారం శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన పుట్టిన రోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. తల్లి మరణించిన బాధనుంచి జాన్వీని బయటకు తీసుకొచ్చేందుక కపూర్ కుటుంబం సభ్యులు ఎంతగానో ప్రయత్నించారు. అందుకోసం జాన్వీ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా జాన్వీ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వారితో కొంత సమయం గడిపిన తరువాత కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సెలబ్రేషన్లో పాల్గొంది. బోని కపూర్ మొదటి భార్య పిల్లలతో శ్రీదేవి కూతుళ్లకు సన్నిహిత సంబంధాలు లేవన్న విమర్శలకు చెక్క పెడుతూ అన్షులా కపూర్ కూడా ఈ పార్టీకి హజరైంది. జాన్వీ బర్త్ డేకు సంబంధించిన ఫొటోలను సోనమ్ కపూర్ తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసింది. బోనీ కపూర్ దగ్గరుండి జాన్వీతో కేక్ కట్ చేయించారు. ఈ పార్టీలో జాన్వీ సొంత చెల్లెలు ఖుషీ కపూర్తో పాటు కపూర్ ఫ్యామిలీకి చెందిన జహాన్ కపూర్, షనయా కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్లు పాల్గొన్నారు. -
శ్రీదేవి అకౌంట్ నుంచి ట్వీట్.. వైరల్
సాక్షి, ముంబై: ‘ఆమె ఈ ప్రపంచానికి చాందినీ.. నాకు మాత్రం ఆమే సర్వస్వం.. నా ప్రేమ. ఓ స్నేహితురాలు, భార్య, ఇద్దరు కూతుళ్ల తల్లిని కోల్పోయాను. ఆమె లేని లోటు మాటల్లో వర్ణించలేను’ అని నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ట్వీట్ చేశారు. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం శ్రీదేవి ట్వీటర్ ఖాతా నుంచి ఆయన ట్వీట్ చేశారు. శ్రీదేవి మృతిచెందిన తర్వాత ఆమె ట్వీటర్ నుంచి పోస్టయిన తొలి ట్వీట్ ఇది. శ్రీదేవి వెండితెరపై ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. నేడు భౌతికంగా ఆమె మన మధ్య లేదు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు బోనీ కపూర్. ‘ఈ బాధాకర సమయంలో అర్జున్ కపూర్, అన్షుల నా వెంట నిలబడి.. నాకు, జాన్వికి, ఖుషికి ఎంతో ధైర్యాన్నిచ్చారు’ అని ట్వీట్ చేశారు. తన ఇద్దరు కూతుళ్లు జాన్వి, ఖుషిలను జాగ్రత్తగా చూసుకోవడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. సినీ తారల జీవితానికి తెర పడదని, వెండితెరపై వారెప్పుడూ సజీవంగానే ఉంటారని శ్రీదేవి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న భర్త బోనీ కపూర్ అన్నారు. శ్రీదేవి ట్వీటర్ నుంచి పోస్ట్ అయిన ట్వీట్ వేల రీట్వీట్లు, లైక్స్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/VNgw7FY9rF — SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) 28 February 2018 -
అభిమాన లోకం.. కన్నీటి శోకం
-
అభిమాన లోకం.. కన్నీటి శోకం
సినీలోకం మూగబోయింది. అభిమానం అశ్రుధారలైంది. గుండెగొంతులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. ముంబై దారులన్నీ కన్నీటి వరదలయ్యాయి! లక్షలాది అభిమానులు వెంటరాగా దేవకన్య శ్రీదేవి దివికేగింది. బుధవారం సాయంత్రం ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్ చితికి నిప్పంటించారు. సాక్షి, ముంబై: సినీలోకం మూగబోయింది. అభిమానం అశ్రుధారలైంది. గుండెగొంతులో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెగింది. ముంబై దారులన్నీ కన్నీటి వరదలయ్యాయి! లక్షలాది అభిమానులు వెంటరాగా దేవకన్య శ్రీదేవి దివికేగింది. బుధవారం సాయంత్రం ముంబై విలేపార్లేలోని శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి(54) అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త బోనీకపూర్ చితికి నిప్పంటించారు. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలు తండ్రి పక్కనే ఉన్నారు. అంతకుముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి తెల్లని పూలతో అలంకరించిన వాహనంపై శ్రీదేవి పార్థివదేహాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఆమెను కడసారి చూసేందుకు దారిపొడగునా అభిమానులు బారులుతీరారు. విలేపార్లే శ్మశానవాటికకు కుటుంబీకులు, సన్నిహితులు, పలువురు సినీతారలు మాత్రమే హాజరయ్యారు. అభిమానుల తాకిడి ఎక్కువకావటంతో షారుక్ఖాన్, సోనమ్ కపూర్ తదితరులు తమ వాహనాన్ని దూరంగా నిలిపేసి నడుస్తూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. ఆ దారి.. అభిమాన సంద్రం అంతిమయాత్ర అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి ఈ యాత్ర మొదలైంది. త్రివర్ణ పతాకం కప్పిన శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వాహనం ముందు, వెనుక శ్రీదేవి ఫొటోలను ఉంచారు. భర్త బోనీకపూర్, ఇద్దరు పిల్లలు, ఇంకొందరు కపూర్ కుటుంబీకులు భౌతికకాయంతో వాహనంలో ఉండగా.. మిగిలిన వారంతా కార్లలో శ్మశానవాటికకు చేరుకున్నారు. శ్రీదేవిని చివరిసారి చూసేందుకు అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్దఎత్తున బారులు తీరడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన అంతిమ యాత్ర సాయం త్రం 4 గంటలకు శ్మశానవాటికకు చేరుకుంది. ఉదయమే క్లబ్ వద్ద అభిమాను లను అదుపు చేసేందుకు 200 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్విగ్న క్షణాలు.. సెలబ్రేషన్ క్లబ్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. హాల్ మధ్యలో పూలతో అలంకరించిన టేబుల్పై శ్రీదేవి పార్థివదేహాన్ని ఉంచారు. ఓవైపు వీఐపీల కోసం మరోవైపు అభిమానుల కోసం బారికేడ్లు కట్టారు. బాక్స్కు ముందు ఓ ఫొటో పెట్టి దాని ముందు దీపం ఉంచారు. గదిలో ఓ మూల నిలబడ్డ బోనీ కపూర్ను, జాహ్నవి, ఖుషిలను సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓదార్చారు. బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా బోరున విలపించటంతో.. పక్కనే ఉన్న కరణ్ జోహార్ ఆయన్ను ఓదార్చారు. రాణీ ముఖర్జీ చాలాసేపు భౌతికకాయం వద్దే కూర్చున్నారు. రోదిస్తున్న సోనమ్ కపూర్ను ఓదార్చారు. సినీ ప్రముఖులంతా ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ.. బోనీ, పిల్లలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘శ్రీదేవిని కడసారి చూసొచ్చాను. సినీ పరిశ్రమ అంతా మౌనంగా రోదిస్తోంది. అదే శ్రీదేవి గొప్పదనం. అందమైన ఎర్రని చీరలో ప్రశాంతంగా ఆమె పడుకుని ఉంది’అని హేమమాలిని ట్వీట్ చేశారు. అభిమానుల నిరాశ ఉదయం నుంచే క్లబ్ ముందు పెద్దసంఖ్యలో అభిమానులు వేచి ఉన్నా.. 10 గంటల సమయంలో వీరిని లోపలకు అనుమతించారు. అయితే భారీగా తరలిరావడంతో కొంద రికే ఆఖరిచూపు దక్కింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్లతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు చివరి చూపు కోసం వచ్చారు. వీఐపీలు వచ్చినపుడల్లా అభిమానుల క్యూను ఆపేశారు. దీంతో చాలా మందికి లోపలకు వెళ్లే అవకాశం రాలేదు. శ్రీదేవి అంతిమయాత్ర వాహనాన్ని కూడా మూడువైపుల నుంచి మూసేశారు. ఆమెను చివరిసారిగా చూసేందుకు అభిమానులు చెట్లు ఎక్కారు. పక్కనున్న భవంతులపైకి చేరారు. ఫుట్ఓవర్పై నిలుచుని మరీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బాక్సులో పెట్టడం, పువ్వులతో పెట్టను, వాహనాన్ని కప్పడంతో వారికి ఆమె ముఖం కనిపించలేదు. ఎక్కడ్నుంచో వచ్చినా చివరిచూపు దక్కలేదని వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. దిగివచ్చిన తారాలోకం.. శ్రీదేవికి చివరి వీడ్కోలు పలికేందుకు తారాలోకం దిగివచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ సినీరంగాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. అమితాబ్ బచ్చన్, షారుక్ఖాన్, చిరంజీవి, రజనీకాంత్, కమల్హాసన్, నాగార్జున, వెంకటేశ్, సంజయ్ కపూర్, హేమామాలిని, రేఖ, జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్, నగ్మా, సారికా, దీపికా పదుకొనే, రాకేశ్ రోషన్, సంజయ్ఖాన్, సురేశ్ ఒబెరాయ్, వివేక్ ఒబెరాయ్, షబానా ఆజ్మీ, జావేద్ అఖ్తర్, అనుపమ్ ఖేర్, సుస్మితా సేన్, సోనంకపూర్, కాజోల్, అజయ్ దేవగన్, టబూ, జయప్రద, సంజయ్ఖాన్, అక్షయ్ ఖన్నాతో పాటు పలు పార్టీల ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్నారు భారత అధికారులు శ్రీదేవి పాస్పోర్టును రద్దుచేసి ఇతర దస్తావేజులను సిద్ధం చేస్తుండగానే.. పోలీస్ క్లియరెన్స్ కావాలంటూ జర్నలిస్టులు, అధికారులు, పలువురు స్థానిక భారతీయులు అశ్రఫ్కు ఫోన్ చేశారు. క్లియరెన్స్ తెచ్చిన తర్వాత దుబాయ్ సమీపంలోని ప్రభుత్వ మార్చురీకి చేరుకుని ఎంబామింగ్ ప్రక్రియ త్వరగా జరిగేలా చొరవ తీసుకున్నారు. అక్కడ అధికారులు శ్రీదేవితోపాటు మరో ముగ్గురి ఎంబామింగ్కు సంబంధించిన పత్రాలను అశ్రఫ్కు అందించారు. ఎంబామింగ్ సర్టిఫికెట్ అశ్రఫ్ పేరుతోనే జారీ కావడం గమనార్హం. అక్కడినుంచి మృతదేహాన్ని ఎయిర్పోర్టుకు తరలించి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. ఇదంతా పూర్తయ్యాక అశ్రఫ్ తన ఇంటికెళ్లాడు. ‘‘పెద్దల ఆశీర్వాదంతోనే ఈ పనిచేస్తున్నా. విదేశీయులు ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తరలించేందుకు ఏమేం చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారందరికీ నేను సాయం చేస్తా’ అని అశ్రఫ్ పేర్కొన్నారు. ‘‘శ్రీదేవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే ఉన్నారు. నిద్రపోతున్న అందాల రాణిలా..’’అని ఆయన తెలిపారు. సినిమాల్లో ఉన్నట్లుగానే ఆమె కనిపించారని.. ముఖంపై ఎలాంటి గాయాలూ లేవని వెల్లడించారు. ఎర్రని చీర.. నుదుట తిలకం.. మంగళ వారం రాత్రంతా శ్రీదేవి నివాసం గ్రీన్ఏకర్స్లోనే ఉన్న శ్రీదేవి భౌతికకాయాన్ని.. బుధవారం ఉదయం 9 గంటలకు సెలబ్రేషన్ క్లబ్కు తరలించారు. శ్రీదేవికి ఇష్టమైన ఎరుపురంగు కాంచీవరం చీరతో మృతదేహాన్ని చుట్టారు. సెల బ్రేషన్ క్లబ్లో బోనీ, జాహ్నవి, ఖుషి, అనిల్ కపూర్, సంజయ్కపూర్, మేన ల్లుడు హర్షవర్ధన్ కపూర్, కోడలు సోనమ్, రేఖ కపూర్లు భౌతికకాయం వద్ద ఉన్నారు. ఇక్కడ సినీరంగ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిం చిన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవికి నివాళులర్పించారు. పార్థివ దేహంపై త్రివర్ణ పతాకం కప్పిన అనంతరం గన్ సెల్యూట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత అంతిమయాత్ర ప్రారంభమైంది. -
నేను నేనే
శ్రీదేవి తరచూ మీడియాతో మాట్లాడేవారు కాదు.. కానీ మాట్లాడినప్పుడల్లా పదే పదే మాట్లాడించాలనిపిస్తుంది. చదివేవాళ్లకూ పదే పదే చదవాలనిపిస్తుంది. అలాంటి కొన్ని ‘సిరిమల్లె పువ్వులు’ మీకోసం... ► ‘రియల్ శ్రీదేవి’ ఎలా ఉంటారు? నేను అందరిలానే సాధారణ మనిషిని. నేనంత ఇంట్రస్టింగ్ కూడా కాదు. ఇంకో తల్లిదండ్రుల బిడ్డను. ‘రియల్ శ్రీదేవి’ అంటే ఏంటో తెలియాలంటే నా ఇంటికి వచ్చి నన్ను చూడాలి. నాకు చాలా సిగ్గు. అంత త్వరగా ఎవరితోనూ కలవలేను. మాట్లాడలేను. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నాకు అన్ ఈజీగా ఉంటుంది. సినిమాల్లో మాట్లాడేలా గలగలా మాట్లాడలేను. తక్కువగా మాట్లాడతా. ► ‘స్టార్డమ్’కి చేరుకున్నాక మీ ఫీలింగ్? చిన్నప్పటి నుంచి నాకేదైనా ఇష్టం అంటే అది నా దగ్గరకు వచ్చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా చీర నచ్చితే దానికోసం నేను షాప్కి వెళ్లక్కర్లేదు. అదే నా దగ్గరకు వచ్చేది. కోరుకున్నది మన దగ్గరికే వచ్చినప్పుడు జీవితం గురించి తెలుసుకునే చాన్స్ ఉండదు. ఆ విధంగా ‘స్టార్డమ్’ నాకు జీవితం గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. ► నటిగా మీకు నచ్చని విషయం ఏంటి? మీరు ఫలానా సినిమాలో అందంగా ఉన్నారని అభినందిస్తే నాకు నచ్చదు. ఆ కాంప్లిమెంట్కి రియాక్ట్ అవ్వను. అదే ‘మీరు ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు’ అంటే అప్పుడు చాలా ఆనందపడతా. ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ► మీలా అందంగా, స్లిమ్గా కనిపించాలంటే ఏం చేయాలి? అందంగా ఉండటమంటే డైట్ ఫాలో అవ్వడం, జిమ్కు వెళ్లడం కాదు. మానసికంగా సంతోషంగా ఉండటం. మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనేది మన లుక్స్ నిర్దేశిస్తాయి. లోపల సంతోషంగా లేనప్పుడు డైట్ ఫాలో అయ్యి, ఎంత జిమ్ చేసినా ఉపయోగం ఉండదు. ► వేరే హీరోయిన్స్తో పోటీ? పోటీ అనేది సమఉజ్జీల మధ్య ఉంటుంది. ప్రస్తుతానికి నా సమఉజ్జీ శ్రీదేవీయే. నాకు నేనే పోటీ. ► మీ సినిమాల గురించి జాన్వీ, ఖుషీలు ఏమంటారు? నేను నటించిన పాత సినిమాలను జాన్వీ, ఖుషీ అంతగా చూడలేదు. కానీ ఎప్పుడైనా టీవీల్లో వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూస్తారు. ఆ సినిమాల్లో నేను వేసుకున్న డ్రెస్లను అబ్జర్వ్ చేస్తారు. నేను కొన్ని సినిమాలకు ట్రెండీ డ్రెస్లను వాడాను. అవి బాగున్నాయంటారు. బాగా యాక్ట్ చేశావని కాంప్లిమెంట్స్ ఇస్తారు. ► సినిమాలంటే మీకు చాలా ఇష్టమా? నాలుగేళ్ల వయసు నుంచే నటించడం స్టార్ట్ చేశాను. అందరి అమ్మాయిల్లా నేను పెరగలేదు. నా చిన్నతనంలో స్టూడియోస్లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఒకవేళ స్టూడియో వాతావరణాన్ని ఇష్టపడకపోయి ఉంటే ఎప్పుడో సినిమాలు వదిలేసేదాన్నేమో. ఒక సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఎంత కష్టాన్నయినా ఇష్టంగా భావిస్తాను. ► మీ భర్త బోనీకపూర్ మిమ్మల్ని ఆటపట్టిస్తారా? నేను క్రమశిక్షణగా ఉంటాను. బోనీజీ ‘నువ్వేమైనా సాధువులా జీవిస్తున్నావా?’ అని ఆటపట్టిస్తారు. కానీ నా ఇష్టాలను ఆయన ఎప్పుడూ కాదనలేదు. ► యంగర్ జనరేషన్కి మీరిచ్చే సలహా? సక్సెస్నే కాదు ఫెయిల్యూర్నూ తట్టుకోగల మైండ్సెట్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. లైఫ్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కృతజ్ఞతాభావం, మానవత్వం ఉండాలి. మాట్లాడమని బోనీజీ బతిమాలేవారు మీరు స్వతహాగా మితభాషి కదా. ఇంట్లో కూడా అంతేనా? నేను తక్కువగానే మాట్లాడతాను. కానీ నాకు క్లోజ్గా ఉన్నవారితో బాగానే మాట్లాడతా. వర్క్ చేసే దగ్గర వర్క్ గురించే మాట్లాడటం ముఖ్యమని భావిస్తా. చెబితే నమ్మరు కానీ కాస్త ఎక్కువగా మాట్లాడమని బోనీజీ మొదట్లో బతిమాలేవారు. ఆ తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మేం ఇద్దరం ఉన్నప్పుడు నేనే ఎక్కువగా మాట్లాడతా. భర్తతో... పిల్లలు నన్ను వదిలి ఉండలేరు ► మీ పిల్లలు, మీరు అమ్మాకూతుళ్లలా కాకుండా అక్కచెల్లెళ్లలా ఉంటారు... మేం సిస్టర్స్లానే బిహేవ్ చేస్తాం. నేనెక్కడికైనా వెళితే చాలు జాన్వీ పదే పదే ఫోన్లు చేస్తుంటుంది. ఖుషీ కూడా అంతే. నన్ను వదిలి ఉండలేరు. వాళ్లు నాతో అలా క్లోజ్గా ఉండటం, నా మీద ఆధారపడటం, చిన్న చిన్న విషయాల్లో నన్ను డిస్ట్రబ్ చేయడం నాకెంతో ఫన్నీగా, హ్యాపీగా ఉంటుంది. పిల్లలతో... ► జాన్వీ సినిమాలో నటిస్తోంది కదా.. తనకు మీరిచ్చిన సలహా? మైండ్తో కాదు... హార్ట్తో వర్క్ చేయమని జాన్వీకి చెప్పాను. ‘నో పెయిన్ నో గెయిన్’ అని కూడా చెప్పాను. అమ్మా... నీ విజయాలకు నేనే సాక్ష్యం డియర్ మామ్.. నీ కీర్తి ప్రతిష్టలు, అంకితభావం, నిజాయితీ, స్ఫూర్తి గురించి వింటూ పెరుగుతున్నాను. నువ్వు సాధించిన విజయాలకు నేనే సాక్ష్యంగా ఉండటం నాకు ఆనందంగా ఉంది. జీవితంలో అన్నీ సాధించావు. నువ్వు సాధించిన ఈ ఘనత నన్ను ఈ ప్రపంచంలోనే గర్వపడే కూతుర్ని చేసింది. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను... – నీ కూతురు జాన్వీ ఓ సందర్భంలో శ్రీదేవికి ఓపెన్ లెటర్ రాయమని ఓ పత్రిక ఆమె పెద్ద కుమార్తె జాన్వీని కోరగా ఆమె పై విధంగా రాశారట. తల్లంటే జాన్వీకి ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో అర్థమవుతోంది కదూ. మరణం తర్వాత... మీరు బాధపడే విషయం : మరణం తర్వాత జీవితం ఉండదని మీ విలువైన ఆస్తి : నా ఫ్యామిలీ మీకు బోర్ కొట్టించేది : షూటింగ్లో ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్కు పరిగెత్తడం మీ సెక్స్ అపీల్ : నా జీన్స్ (జన్యువులు) మీ బలం : ఏది జరిగితే దాన్ని ఆమోదించడం మీకు నచ్చే మీ ఫేవరెట్ క్వాలిటీ : నా ఎమోషన్స్ మిమ్మల్ని చిరాకు పెట్టించేది : రీ–మేక్ మూవీస్లో రీ–టేక్స్ తీసుకోవడం బర్త్డే అంటే : ఎడ్జ్కు ఇంకొంచెం దగ్గరకి వచ్చేశాం అని గుర్తు చేసే రోజు -
శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు
-
శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు..
ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దీంతో దివి నుంచి భువికి దిగి వచ్చి, దశాబ్దాలపాటు వెండితెరను రాణిలా ఏలిన అతిలోక సుందరి మళ్లీ దివికి వెళ్లిపోయింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె... మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు తమ అభిమాన నటిని కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అభిమాన నటిని చివరిసారి చూసుకునేందుకు కడసారి వీడ్కోలు పలికి, నివాళి అర్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష జనవాహినితో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని... ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకి అలవాటు. చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే తయారు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. మల్లెపూలు అంటే శ్రీదేవి ఎంతో ఇష్టమట. అందుకే ఆమె పార్దీవదేహాన్ని తరలించే వాహనాన్ని ఆ పూలతోనే తీర్చిదిద్దారు. వాహనంలో శ్రీదేవి భౌతికకాయంతో పాటు ఆమె కుటుంబీకులు ఉన్నారు. తరలి వచ్చిన తారాలోకం అనంతలోకాలకు వెళ్లిపోయిన ప్రముఖ సినీనటి శ్రీదేవి చివరిచూపు కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పోటెత్తారు.హేమామాలిని, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురి దీక్షిత్, అక్షయ్ కుమార్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, అర్జున్ కపూర్, సంజయ్ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అలాగే రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,అర్జున్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ సినిమా రంగాలకు చెందిన ప్రముఖ నటీనటులంతా శ్రీదేవి ఇంటికి తరలివచ్చారు. తమతో కలసి నటించి, మెప్పించిన సహనటిని కడసారి సందర్శించి కన్నీటి నివాళి అర్పించారు. సినీ రంగంతో పాటు రాజకీయ, పారిశ్రామికరంగాలకు చెందిన ప్రముఖులు శ్రీదేవి ఇంటికి వచ్చి ఆమెకు అశ్రు నివాళి అర్పించారు. మరోవైపు విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో సినీ నటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నటి విద్యాబాలన్, ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఫర్హాన్ అక్తర్, దియా మిర్జా, ఆమె భర్త సాహిల్, అనిల్ అంబానీ, అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్ తదితరులు హాజరయ్యారు. -
శ్రీదేవి అంతిమ యాత్రకు వేలాదిగా తరలిన అభిమానులు
-
శ్మశానవాటికకు శ్రీదేవి భౌతికకాయం
ముంబై : సినీనటి శ్రీదేవి అంతిమ యాత్ర ముగిసింది. ఆమె అంతిమ యాత్రకు తారాలోకం తరలి వచ్చింది. తన అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటిక వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 9.30 సమయంలో అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి ఇంటికి సమీపంలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో ఉంచారు. మధ్యాహ్నం 12.30 వరకు అభిమానులను అనుమతించారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా యాత్రలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో వెంకటేష్లతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే ముంబై విచ్చేశారు విలేపార్లే హిందూ స్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. గౌరవ సూచకంగా ఆమె భౌతికకాయంపై పోలీసులు త్రివర్ణ పతాకం కప్పారు. ఈ నెల 24న శ్రీదేవి దుబాయ్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
ది కూల్ మామ్ శ్రీదేవి చివరి యాడ్ ఇదే?
‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత శ్రీదేవి నటించిన ‘మామ్’ కూడా సూపర్ హిట్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశేషం ఏంటంటే.. శ్రీదేవి ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన లాస్ట్ మూవీ ‘మామ్’ అయితే.. చివరి యాడ్ కూడా ‘మామ్’ పేరుతోనే ఉంది. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన దానిని బట్టి, శ్రీదేవి నటించిన లాస్ట్ యాడ్ ‘ది కూల్ మామ్’. 2 నిమిషాల 30 సెకన్లు నిడివిగల ఈ యాడ్లోని కొంత భాగం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇది చిన్నారులను ఉత్తేజపరిచే యాడ్. ఓ ఫుడ్కి సంబంధించిన ఈ యాడ్లో ‘‘ఇల్లైనా, స్కూలైనా ఓపెన్గా ఉండండి. ఎమోషనల్ డ్రామాను నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మీ అమ్మ మీకు స్నేహితురాలు అండ్ సూపర్ కూల్’’ అంటూ శ్రీదేవి సందడి చేశారు. ఇందులో జగదేక సుందరి మామ్గా చాలా అందంగా కనిపించారు. మొత్తం నాలుగు గెటప్స్లో కనిపించి, ఆకట్టుకున్నారు. ఈ యాడ్లో శ్రీదేవి హావభావాలు సూపర్గా ఉన్నాయి. అతిలోక సుందరి ఆకస్మిక మరణం పొంది ఉండకపోతే ఇలాంటి మరెన్నో యాడ్స్లోనూ, సినిమాల్లోనూ చూసి ఉండేవాళ్లం. అన్నట్లు.. ఇది చివరి యాడ్ అని సర్క్యులేట్ చేశారు. అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. ఆ సంగతలా ఉంచితే.. నిజజీవితంలో శ్రీదేవి కూల్ మామ్. ఈ యాడ్లోనూ అలానే కనిపించారు. కచ్చితంగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఓ మంచి మామ్ని మిస్సయ్యారు. అండ్.. మనం కూడా మంచి నటిని మిస్సయ్యాం. -
దుబాయ్ ఎయిర్పోర్ట్కు శ్రీదేవి భౌతిక కాయం
దుబాయ్ : ప్రముఖ సినీనటి శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ ముగిసింది. అనంతరం ఆమె మృతదేహాన్నిభర్త బోనీకపూర్కు అప్పగించారు. శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ చేస్తున్న సమయంలో బోనీకపూర్, ఖుషీ కపూర్ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి పార్థీవ దేహం దుబాయి ఎయిర్ పోర్ట్కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకు వెళ్లనున్నారు. శ్రీదేవి మృతదేహం రాత్రి 9గంటలకల్లా ముంబై చేరే అవకాశం ఉంది. మరోవైపు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్...శ్రీదేవి మృతిపై విచారణను ముగించింది. అన్ని కోణాల్లో విచారణ జరిపామని, ఆమె మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పృహ కోల్పోయి టబ్లో పడిపోవటం వల్లే శ్రీదేవి మరణించిందని, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని, బోనీకపూర్ ముంబై వెళ్లవచ్చని దుబాయ్ ప్రభుత్వం పేర్కొంది. ఎంబామింగ్ అంటే... ఎంబామింగ్ అంటే కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మృతదేహం కుళ్లిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలంపాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలను ధమనుల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావకాలనే 'ఎంబామింగ్ ఫ్లూయిడ్స్' అని పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్తోపాటు మరికొన్ని రకాల రసాయనాలను ఈ ప్రక్రియలో వాడతారు. ఎంబామింగ్ ప్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏరకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్ గా పనిచేయవు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, సత్యసాయి బాబా మరణించినప్పుడు కూడా ఎంబామింగ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూమింగ్.. తమ ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ 'తుది జ్ఞాపకం' ఇబ్బందికరంగా కాకుండా, ఎప్పట్లా ఆత్మీయంగానే ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ కోరికను బాడీ గ్రూమింగ్ తీరుస్తోంది. ఇది కూడా ఎంబామింగ్లో భాగమే. ఈ ప్రక్రియలో మరణించిన వ్యక్తి అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఉపయోగిస్తారు. -
శ్రీదేవి కేసు క్లోజ్.. దర్యాప్తు ముగిసింది
దుబాయి : ఎట్టకేలకు ప్రముఖ నటి శ్రీదేవి కేసు ముగిసింది. ఓ పక్క ఆమె హఠాన్మరణమే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా ఆమె చనిపోవడానికి గల కారణాలపై వచ్చిన కథనాలు అనుక్షణం సంచలనాన్ని రేపాయి. ఎన్నోమలుపులు, ఎన్నో అనుమానాల చుట్టూ తిరిగి చివరకు ప్రమాదవశాత్తు జరిగినా మరణం తప్ప ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని దుబాయ్ ప్రాసీక్యూషన్ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ఇక ముగిసిందని, కేసును క్లోజ్ చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. శనివారం రాత్రి 11 దాటిని తర్వాత శ్రీదేవి హఠాన్మరణం చెందారు. అయితే, ఆమె గుండెపోటుతో చనిపోయారని తొలుత అనుకున్నారు. అయితే, ఆమెకు పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమె ప్రమాదవ శాత్తు నీటిలో పడి ఊపిరి ఆడక చనిపోయారని తేల్చేశారు. ఆమె దేహంలో ఆల్కహాల్కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, బహుశా స్నానానికి వెళ్లిన ఆమె పట్టును కోల్పోయి కాలు జారీ టబ్లో పడిపోయి ఉంటారని, ఆ క్రమంలోనే ఊపిరి ఆడక చనిపోయారని అన్నారు. అయితే, ఈ క్రమంలో బోనీ కపూర్ను కొన్ని గంటలపాటు మూడుసార్లు విచారించడం, ఆమె మృతదేహాన్ని అప్పగించేందుకు తొలుత ప్రాసీక్యూషన్ అధికారులు అంగీకరించకపోవడంతో బహుశా ఏవో బలమైన కారణాలే ఆమె చావుకు కారణం అయి ఉంటాయని భిన్న కథనాలు మరోసారి వేగం పుంజుకున్నాయి. ఆమె బాత్ టబ్లో అనుకోకుండా పడ్డారా? ఎవరైనా తోసేశారా? లేకుంటే ఏవైనా సమస్యలతో శ్రీదేవినే బలవన్మరణానికి పాల్పడ్డారా? బోనీ కపూర్ ఇండియాకు వచ్చి మళ్లీ సర్ప్రైజ్ పేరుతో దుబాయ్ వెళ్లడం ఏమిటి? ఆయన వెళ్లిన తర్వాత శ్రీదేవి చనిపోవడం ఏమిటి? పోలీసులు స్వాధీనం చేసుకున్న బోనీ కపూర్ కాల్ డేటాలో ఏమున్నాయి? ఆయన ఎవరితో మాట్లాడారు? శ్రీదేవి చివరి సారిగా ఎవరితో మాట్లాడారు? ఎక్కువగా ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేశారు? అంటూ దాదాపు దర్యాప్తు బృందం లేవనెత్తెన్ని అనుమానాలతో మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. అయితే, వాటన్నింటికి పుల్స్టాప్ పెడుతూ దర్యాప్తు క్లియర్ అయిందని, ఇక ఎలాంటి అనుమానం లేదని, ఆమె అనుకోకుండా బాత్డబ్లో పడి ఊపిరి ఆడక చనిపోయారంటూ దుబాయ్ విచారణ అధికారులు తేల్చేయడంతో ఇక శ్రీదేవిని భారత్కు తీసుకురావడం, ఆమె అంత్యక్రియలకు సంబంధించిన అంశాలు మాత్రం మిగిలి ఉన్నాయి. -
శ్రీదేవి మృతి కేసు.. అనుమానాలివే!
దుబాయ్ : నటి శ్రీదేవి మృతి కేసు విచారణలో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలో పలు అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అవి నివృత్తి అయితేనే ఆమె మృతదేహాన్ని అప్పగించాలని నిర్ణయించారు. హోటల్ గదిలో అసలేం జరిగింది? శ్రీదేవి అసలు ఎన్ని గంటలకు మరణించారు? పోలీసులకు ఆలస్యంగా సమాచారం ఎందుకు ఇచ్చారు? ఫోరెన్సిక్ నివేదిక రాకముందే గుండెపోటు అని ఎందుక ప్రకటించారు? మద్యం తాగే అలవాటు లేని శ్రీదేవి కడుపులోకి ఆల్కహాల్ ఆనవాలు ఎలా వచ్చాయి? హోటల్లోని సీసీ ఫుటేజీ ఎందుకు బయటకు రాలేదు? కుటుంబ సభ్యులు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? బోనీ ఎందుకు తిరిగొచ్చారు? మార్వా పెళ్లిలో ఏమైనా గొడవ జరిగిందా? పెళ్లి 20వ తేదీన ముగిస్తే.. 24న ఆమె చనిపోయారు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగింది? తదితర అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో పడ్డారు. పోస్ట్మార్టమ్ రిపోర్ట్ ప్రాసిక్యూషన్ అధికారుల చేతికి అందింది. దీంతోపాటు రెండో ఫోరెన్సిక్ నివేదిక వెలువడాల్సి ఉంది. వాటిని పరిశీలించాక అవసరమైతే శ్రీదేవి మృతదేహానికి రీ పోస్ట్మార్టం నిర్వహించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆమె పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్.. కారణాలు అయ్యి ఉండొచ్చన్న కోణంలో సైతం విచారణ చేపట్టేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే వివాహ వేడుక తాలుకు ఫుటేజీలను తెప్పించుకున్న అధికారులు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు అటోప్సీ రిపోర్ట్ తోపాటు, బోనీ కపూర్ ఇచ్చిన వివరణపై ప్రాసిక్యూషన్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బోనీ పాస్ పోర్టును స్వాధీనపరుచుకున్నారు. శ్రీదేవి హెల్త్ రికార్డ్స్ తేవాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరిన అధికారులు.. ఆమె కాల్ డేటా మొత్తాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రైవర్, హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు శ్రీదేవి సవతి కొడుకు, నటుడు అర్జున్ కపూర్ను దుబాయ్ బయలుదేరటం గమనార్హం. ఇంకోపక్క మోహిత్ మార్వా కుటుంబాన్ని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హోటల్ గదిని సీజ్ చేసిన అధికారులు.. ఏం జరిగిందో తెలుసుకోడానికి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులన్నీ వీడితేనే ఆమె మృతదేహ తరలింపునకు క్లియరెన్స్ సర్టిఫికెట్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతకం చేస్తారు. దీంతో ఆమె మృతదేహం తరలింపులో మరింత జాప్యమయ్యేలా కనిపిస్తోంది. ఏ విషయమన్నదానిపై ప్రాసిక్యూషన్ అధికారులు మరికాసేపట్లో ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. -
శ్రీదేవి భర్త ఇంటరాగేషన్.. ట్విస్టింగ్ న్యూస్
దుబాయ్ : నటి శ్రీదేవీ మృతి కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. హోటల్ గదిలో శ్రీదేవీ ప్రాణాలు కోల్పోయిన సమయంలో భర్త బోనీ కపూర్ అక్కడే ఉన్నారన్న సంగతి తెలిసిందే. విచారణలో ఆయన ఇచ్చే వాగ్మూలం కీలకంగా మారింది. ఈ మేరకు బోనీని దుబాయ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారని, ఆయన చెప్పిన విషయాలకు, వైద్యులు డెత్ రిపోర్టులో పేర్కొన్న అంశాలకు ఏమాత్రం పోలికలేదని, దీంతో బోనీని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సోమవారం పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా ‘అసలు బోనీని పోలీసులు ఇంటరాగేషనే చెయ్యలేదం’టూ ప్రఖ్యాత ఖలీజ్ టైమ్స్ మంగళవారం ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి మరణవార్తను తొలుత బ్రేక్ చేసింది కూడా ఇదే వార్తా సంస్థ కావడం గమనార్హం. దుబాయ్లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో శ్రీదేవి చనిపోయినట్లు శనివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు.. నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను రషీద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అటుపై మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం యూఏఈ ఆరోగ్యశాఖ భవనానికి తరలించారు. ఆదివారం నాడు కొద్ది నిమిషాలు మాత్రమే బోనీని పోలీసులు ప్రశ్నించారని, ఆ తర్వాత గంటల తరబడి విచారించారనేది పూర్తి అవాస్తమని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది.