ఎంఎన్సీ ఉద్యోగినిపై గెస్ట్‌హౌస్ ఓనర్ అత్యాచారం | 21-Year-Old Executive Allegedly Raped by Guest House Owner in Gurgaon | Sakshi
Sakshi News home page

ఎంఎన్సీ ఉద్యోగినిపై గెస్ట్‌హౌస్ ఓనర్ అత్యాచారం

Published Sat, Nov 28 2015 4:42 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

ఎంఎన్సీ ఉద్యోగినిపై గెస్ట్‌హౌస్ ఓనర్ అత్యాచారం - Sakshi

ఎంఎన్సీ ఉద్యోగినిపై గెస్ట్‌హౌస్ ఓనర్ అత్యాచారం

గుర్గావ్: మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల మహిళపై ఓ పెయింగ్ గెస్ట్‌హౌస్ యాజమాని అత్యాచారం జరిపాడు. హర్యానా గుర్గావ్‌లోని సెక్టర్‌-39లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితురాలు శనివారం గుర్గావ్ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఆమె గత కొన్ని నెలలుగా ఓ పెయింగ్ గెస్ట్ హౌస్‌ యాజమాని ఇంట్లో ఉంటోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి యాజమాని అయిన ధర్మ్‌వీర్ థాక్రాన్ తన గదిలోకి బలవంతంగా ప్రవేశించి.. తనపై అత్యాచారం జరిపాడని, ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని మొదట స్నేహితుల పంచుకున్న బాధితురాలు.. వారిచ్చిన ధైర్యంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తూర్పు గుర్గావ్ డీసీపీ దీపక్ సహరణ్ తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని కోసం పోలీసులు గాలిస్తున్నారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement