woman raped
-
రేప్ చేసి, వీడియోలు బయటపెడతానని..
కోల్కతా: ఉన్నత చదువుల కోసం ఒడిశా నుంచి కోల్కతా వెళ్లిన ఓ పెళ్లికాని మహిళ(30)పై ఓ వ్యాపారవేత్త దారుణానికి తెగబడ్డాడు. ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి ఆమె పారిట శాపంలా మారాడు. దాదాపు ఏడాదిపాటు లైంగికి దాడికి పాల్పడ్డాడు. రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. క్రమంగా అతడి వేధింపులు మరింత ఎక్కువకావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..ఒడిశాకు చెందిన 30 ఏళ్ల మహిళ కోల్కతాలో ఉండి చదువుకుంటోంది. తన స్నేహితురాళ్లతో కలిసి జోద్పూర్ గార్డెన్స్లో ఓ ఫంక్షన్కు వెళ్లింది. ఆ పార్టీలోనే రాకేశ్ చౌదరీ, ఆయన భార్య ఆమెకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒకసారి పార్టీకి రావాలంటూ ఆహ్వానించిన రాకేశ్ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బాధితురాలిని కోల్కతాలోని బైపాస్ రోడ్డులో ఉన్న తన గెస్ట్హౌజ్కి తీసుకెళ్లాడు. పూర్తిగా మద్యం తాగించి స్పృహకోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తర్వాత తాను పిలిచిన ప్రతిసారి రాకుంటే ఫొటోలు బయటపెడతానని బెదరించి ఏడాదిపాటు దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత కూడా అతడు వేధింపుల స్థాయి పెంచడంతో భరించలేని బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. -
తొట్టంబేడులో దారుణం
చిత్తూరు: చిత్తూరు జిల్లా తొట్టంబేడులో దారుణం చోటు చేసుకుంది. చేతబడి పేరుతో యువతిని మంత్రగాడు మునిరెడ్డి లోబర్చుకున్నాడు. దాదాపు రెండు నెలల పాటు వైద్యం పేరిట అతడి నుంచి యువతి వేధింపులకు గురి అవుతుంది. ఆ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామ పెద్దలు రంగంలోకి దిగి.. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ ఆదేశించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
అత్యాచార నిందితులకు రిమాండ్
మెదక్: మోసపూరిత మాటలతో ఇంటి వద్ద దిగబెడతామని నమ్మించి బైక్ పై మహిళను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ఓ మహిళ(30)పై బాలేష్, నగేష్ అనే ఇద్దరు యువకులు బుధవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. -
పాపం చికిత్సకు వెళితే.. గ్యాంగ్ రేప్ చేశారు
గుర్గావ్: ఢిల్లీ శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. డిప్రెషన్తో బాధపడుతున్న ఓ మహిళ (22) చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. వార్డు బాయ్, గార్డు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. మేవాత్లోని ఎస్హెచ్కేఎమ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఐదో అంతస్తు 17 వార్డులో చికిత్స పొందుతున్న బాధితురాలిని బయటకు రమ్మని వార్డు బాయ్ పిలిచాడు. ఆమె వార్డు బయటకు వచ్చి తన బంధువులు ఉన్న లాంజ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, వార్డు బాయ్ ఖాళీగా ఉన్న ఓ రూమ్లోకి ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న గార్డు కూడా ఆ రూమ్లోకి వెళ్లాడు. ఇద్దరూ కలసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. కాసేపటి తర్వాత వార్డులో బాధితురాలు లేని విషయాన్ని ఆమె బంధువు గుర్తించాడు. నిందితులు బాధితురాలిని తీసుకెళ్లిన రూమ్ బయట ఆమె వస్తువులు పడిఉన్న విషయాన్ని గుర్తించి అలారమ్ మోగించాడు. దీంతో వార్డు బాయ్, గార్డు అక్కడి నుంచి పారిపోయారు. నిందితులను గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, నిందితులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆస్పత్రి డైరక్టర్ శన్సర్చంద్ శర్మ చెప్పారు. -
సెట్టాప్ బాక్స్ అప్డేట్ చేయాలని వచ్చి...
డీటీహెచ్ కంపెనీకి చెందిన ఉద్యోగి.. మీ ఇంట్లో సెట్టాప్ బాక్సును అప్డేట్ చేయాలంటూ వచ్చి మహిళపై అత్యాచారం చేశాడు. అతడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మునిరెడ్డి అనే వ్యక్తి ఓ డీటీహెచ్ సంస్థలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. గత వారం ఓ ఇంట్లో సెట్ టాప్ బాక్సు రిపేరు వచ్చిందని కంప్లయింట్ రావడంతో.. అక్కడకు వెళ్లినప్పుడు ఇంట్లో మహిళ ఒక్కరే ఉంటున్నట్లు గుర్తించాడు. దాంతో మరోసారి ఆ ఇంటికి వెళ్లి, సెట్ టాప్ బాక్సును అప్డేట్ చేయడానికి వచ్చానని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని నిర్ధారించుకుని, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు అరవడంతో మునిరెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పగా, వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో బెంగళూరుకు సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఉన్న మునిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఎంఎన్సీ ఉద్యోగినిపై గెస్ట్హౌస్ ఓనర్ అత్యాచారం
గుర్గావ్: మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న 21 ఏళ్ల మహిళపై ఓ పెయింగ్ గెస్ట్హౌస్ యాజమాని అత్యాచారం జరిపాడు. హర్యానా గుర్గావ్లోని సెక్టర్-39లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితురాలు శనివారం గుర్గావ్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పంజాబ్లోని లూథియానాకు చెందిన ఆమె గత కొన్ని నెలలుగా ఓ పెయింగ్ గెస్ట్ హౌస్ యాజమాని ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి యాజమాని అయిన ధర్మ్వీర్ థాక్రాన్ తన గదిలోకి బలవంతంగా ప్రవేశించి.. తనపై అత్యాచారం జరిపాడని, ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని మొదట స్నేహితుల పంచుకున్న బాధితురాలు.. వారిచ్చిన ధైర్యంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తూర్పు గుర్గావ్ డీసీపీ దీపక్ సహరణ్ తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని కోసం పోలీసులు గాలిస్తున్నారని వివరించారు. -
మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ
నల్లగొండ: కీచకుల పరంపర కొనసాగుతోంది. మహిళలపై అకృత్యాలకు అదుపు లేకుండా పోతోంది. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలోని కోదాడ మండలం గోండ్రియాలలో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య వంకతో పిలిచి.. అత్యాచారం
విజయనగరం జిల్లా రామభద్రపురంలో దారుణం జరిగింది. తన భార్య పిలుస్తోందంటూ ఓ మహిళను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. రామభద్రపురానికి చెందిన శ్రీను ఈ దారుణానికి ఒడిగట్టాడు. పైగా ఈ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశాడు. సెల్ఫోన్లో తీసిన దృశ్యాల్ని మరొకరికి షేర్ చేయడంతో పాటు ఇంటర్నెట్లో కూడా పెడతానని బెదిరిస్తూ బాధితురాల్ని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు బాడింగి కమ్యూనిటి హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు సరిగా స్పందించడంలేదని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతోంది. -
కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం
జైపూర్: ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన డ్రైవర్, కండక్టరే కర్కశంగా కదులుతున్న బస్సులోనే ఓ మహిళ(36)పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతం రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలోని పిలానీ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రాజస్థాన్లోని పిలానీ నుంచి హరియాణాలోని లోహారుకు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఈ ఘటన జరిగింది. ‘బస్సులో నేను ఒక్కదానినే ఉన్నాను. మొదట నాపై కండక్టర్ కాలియా(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత డ్రైవర్ కూడా నాపై అత్యాచారం చేశాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలివెళ్లారు’ అని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసు అధికారొకరు తెలిపారు. -
గృహిణిపై అత్యాచారం.. సెల్ఫోన్లో చిత్రీకరణ
హైదరాబాద్ నగర శివారులో దారుణం జరిగింది. దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలోని దొమ్మర పోచంపల్లి సాయిపూజ కాలనీలో ఓ గృహిణి అత్యాచారానికి గురైంది. పరిచయస్తులైన ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి బలవంతంగా ఆమెను తీసికెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆమె నగ్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన హఫీజ్ఖాన్, అబ్బూ ఫైజల్ను అరెస్టు చేశారు. -
డబ్బు అడగబోయినందుకు.. మహిళపై గ్యాంగ్రేప్
డబ్బు అడగబోయినందకు 30ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని ద్వారకాలో ఓ గెస్ట్ హౌస్లో గతరాత్రి చోటుచేసుకుంది. డబ్బు విషయమై గెస్ట్హౌస్కు వెళ్లిన ఆమెను నలుగురు బలవంతంగా గ్యాంగ్రేప్ చేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారైయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వికాస్, అనిల్, రమేష్లుగా పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
మరదలిపై బావ అత్యాచారం
వివాహం చేసుకుంటానని నమ్మించి సొంత మరదలిపై అత్యాచారం చేసిన వ్యక్తి కోసం కోసం ఇక్కడి వయ్యాలికావెల్ పోలీసులు గాలిస్తున్నారు. వయ్యాలికావెల్లో నివాసం ఉంటు పండ్ల వ్యాపారి సురేష్ కోసం గాలిస్తున్నామని శనివారం పోలీసులు అన్నారు. వయ్యాలికావెల్లో నివాసం ఉంటున్న సురేష్ మరదలు ఇక్కడికి సమీపంలోనే నివాసం ఉంటోంది. మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకుని వివాహం చేసుకుంటానని నమ్మించి కొన్ని నెలలుగా మభ్య పెడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోనని చెప్పడపంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెకు సురేష్తో వివాహం జరిపించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఔటర్ రింగ్రోడ్డుపై అత్యాచారం.. హత్య
హైదరాబాద్ మహానగరంలో మరోసారి దారుణం జరిగింది. అభయ సంఘటనను ఇంకా మర్చిపోకముందే.. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ యువతిపై అత్యాచారం చేసి, హతమార్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కత్తులతో దాడి చేసి, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలిని రాజేంద్రనగర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలిని మహబూబ్నగర్ జిల్లా వాసిగా గుర్తించారు. తనపేరు శిరీష అని ఒకసారి, అనిత అని మరోసారి ఆమె చెప్పింది. కొంతమంది వ్యక్తులు ఆమెపై కారులో అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి వేళ అమెపై అత్యాచారం చేసి, కత్తులతో పొడిచి రోడ్డుమీద విసిరి పారేశారు. కొంతమంది వ్యక్తులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆమెను పడేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత వాళ్లు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో కొద్ది సేపటి తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ దారిలోనే ఆమె కొన్ని వివరాలు తెలిపింది. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఉస్మానియా మార్చురీలో ఉన్న ఆమె మృతదేహం కోసం ఇంతవరకు బంధువులు ఎవరూ రాలేదు. ఔటర్ రింగ్రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితులు వచ్చిన కారును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
కుమార్తెపై పెంపుడు తండ్రి, స్నేహితుల గ్యాంగ్ రేప్
27 ఏళ్ల కుమార్తెను పెంపుడు తండ్రితోపాటు అతడి ఇద్దరు స్నేహితులు కిడ్నాప్ చేసి అపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ సంబల్ ప్రాంతంలోని హయత్ నగర్లో చోటు చేసుకుంది. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి పెంపుడు తండ్రి చంద్రపాల్తోపాటు ఇద్దరు స్నేహితులు రవి శర్మ, రాంబాబులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఫ్యాక్టరీలో పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న యువతిని పెంపుడు తండ్రి ప్రోద్బలంతో అతడి స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు. -
ఎన్నికల విధులకు వచ్చి... అత్యాచారం చేశాడు
-
ఎన్నికల విధులకు వచ్చి... అత్యాచారం చేశాడు
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల నిర్వహణ కోసం వచ్చిన కానిస్టేబుల్ దుర్గారెడ్డి ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దాంతో బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో దుర్గారెడ్డి ఎన్నికలు విధులు నిర్వహిస్తున్నాడు. ఆ క్రమంలో ఓ ఆటోను అద్దెకు తీసుకుని గత రెండు రోజులుగా పెట్రోలింగ్ చేస్తున్నాడు. గత అర్థరాత్రి ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లిన దుర్గారెడ్డి... ఆటో డ్రైవర్ భార్యపై అసభ్యంగా ప్రవర్తించి... అత్యాచారం జరిపాడు. దాంతో ఆటో డ్రైవర్ భార్య ఆ విషయాన్ని బంధువులకు తెలిపింది. దాంతో ఆటో డ్రైవర్ భార్యతోపాటు బంధువులు త్రిపురారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ రోజు స్థానిక ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో తర్వాత చుద్దామని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో ఆటో డ్రైవర్ భార్య ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో చేసేది లేక పోలీసులు దుర్గారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
అత్యాచారం... హత్య... వాటర్ ట్యాంక్
బంధువుల ఇంటికి వచ్చిన మహిళపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేసి వాటర్ ట్యాంక్లో పడవేసిన ఉదంతం రాజస్థాన్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మహిళ బర్మర్లో పంచు పట్టణంలోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి వచ్చింది. ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రామ్దేవ్ అనే యువకుడు వరుసగా అత్యాచారం జరిపాడు. అనంతరం ఆమెను హత్య చేసి, వాటర్ ట్యాంక్లో పడేసి అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆమె సోదరుడు వాటర్ ట్యాంక్లో అక్క మృతదేహన్ని చూసి బంధువులకు వెల్డడించాడు. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రామ్దేవ్ మాత్రం పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు అనుమానించి అతడిని తమదైన శైలిలో విచారించారు. అంతే రామ్దేవ్ దారికి వచ్చి తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. రామ్దేవ్ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
వివాహితపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అత్యాచారం.. అరెస్టు
న్యూఢిల్లీ: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వివాహితపై అత్యాచారం చేసిన నేరంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. రమణ్ స్వామి అనే ఈ నాయకుడు ఓ మహిళపై జనవరి 25వ తేదీన అత్యాచారం చేసినందుకు అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా, ఈనెల 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని హృషికేశ్ నగర్ ప్రాంతంలో తనకు స్వామితో పరిచయం అయ్యిందని, తనకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా ఆయనను కోరానని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. తనను ఓఖ్లా ప్రాంతంలో కలవాల్సిందిగా జనవరి 25న అతడు చెప్పడంతో ఆమె అక్కడకు వెళ్లింది. అక్కడినుంచి తన కారులో ఎక్కించుకుని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు వివరించారు. దీ ని గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా స్వామి ఆమెను బెదిరించాడని తెలిపారు. ఎలాగోలా అదే రోజు ఆమె పోలీసులను ఆశ్రయించింది. దాంతో వారు ఆమెకు వైద్యపరీక్షలు చేయించి, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన స్వామి, ఓఖ్లా నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆశించారు. కానీ ఆయనకు అది దక్కలేదు. -
గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం
నల్గొండ: కీచకుల సంతతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అత్యాచార ఘటనలు ఆగడం లేదు. నిర్భయ చట్టాలు తెచ్చినా కీచకుల అకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. నల్గొండ జిల్లాలో 11మంది గిరిజన బాలికలపై కీచక ట్యూటర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే మరో దారుణం హాలియాలో శనివారం చోటుచేసుకుంది. ఓ గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకితో బెదిరించి అత్యాచారం
ఒడిసా రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్లో ఓ మధ్యవయసు మహిళను (35) తుపాకితో బెదిరించి అత్యాచారం చేశారు. ఆమె భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నగరంలోని సమంత్రాపూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఆమె ఒంటరిగా ఉండగా ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. బుధవారం రాత్రి ఈ సంఘటనపై ఆమె మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసింది. నిందితుడు తన ఇంటి పొరుగు వ్యక్తేనని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్టుచేస్తామని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఇళ్లలో పనిచేసుకుని పొట్టపోసుకునే తాను.. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా పడుకున్నానని, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఎవరో తలుపు తట్టారని తెలిపింది. తలుపు తెరిచేసరికి నిందితుడు తన నోరు మూసి.. రివాల్వర్ను తన నుదిటిపై పెట్టి బెదిరించాడని ఆమె మీడియాకు తెలిపింది. తర్వాత తనపై అత్యాచారం చేసి పారిపోయినట్లు చెప్పింది. అతడు తనను చాలాకాలంగా వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. ఆమె నుంచి ఫిర్యాదు రాగానే నిందితుని ఇంట్లో పోలీసులు సోదా చేశారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడికోసం ఓ బృందాన్ని ఏర్పాటుచేశామని చెప్పారు.