ముంబై-ఢిల్లీ విమానానికి తప్పిన ముప్పు! | Air India plane's tyre gets deflate, delays flight by 3 hours | Sakshi
Sakshi News home page

ముంబై-ఢిల్లీ విమానానికి తప్పిన ముప్పు!

Published Sun, Nov 30 2014 8:12 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

ముంబై-ఢిల్లీ విమానానికి తప్పిన ముప్పు! - Sakshi

ముంబై-ఢిల్లీ విమానానికి తప్పిన ముప్పు!

ఎయిర్ ఇండియా విమానానికి పెద్దప్రమాదం తప్పింది.

జైపూర్: ఎయిర్ ఇండియా విమానానికి పెద్దప్రమాదం తప్పింది. ముంబై నుంచి వచ్చిన ఈ విమానం జోద్పూర్లో ఉదయం 11.40 గంటలకు కిందకు దిగిన వెంటనే టైరు పేలింది. ఆ సమయంలో విమానంలో 128 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం ముంబై నుంచి జోద్పూర్ మీదగా ఢిల్లీ వెళ్లవలసి ఉంది.

ఢిల్లీ నుంచి ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది మరో విమానంలో టైర్ తీసుకొని వచ్చారు. సిబ్బంది విమానానికి టైర్ మార్చి, మరమ్మతులు చేశారు. ఆ తరువాత మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 4.05 గంటలకు విమానం ఢిల్లీ బయలుదేరింది.

**
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement