‘ఆ దుండగుడి లక్ష్యం ఆప్‌ ఎమ్మెల్యే కాదు’ | Assailant Not Target Of AAP MLA Naresh Yadav In Delhi | Sakshi
Sakshi News home page

‘ఆ దుండగుడి లక్ష్యం ఆప్‌ ఎమ్మెల్యే కాదు’

Published Wed, Feb 12 2020 10:20 AM | Last Updated on Wed, Feb 12 2020 10:45 AM

Assailant Not Target Of AAP MLA Naresh Yadav In Delhi - Sakshi

కాల్పులు జరిగిన ఘటన స్థలం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ సీసీటీపీ ఫుటేజ్‌ ద్వారా తనపై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. కాల్పుల ఘటనపై నైరుతి ఢిల్లీ అదనపు డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్‌ మాట్లాడుతూ.. ‘ దర్యాప్తులో ఇప్పటివరకు ఒక దుండగుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దుండగుడు ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ను లక్ష్యంగా దాడికి పాల్పడలేదు. ఈ దాడిలో మరణించిన ఆప్‌ కార్యకర్తను లక్ష్యంగా చేసుకొని వచ్చాడు’ అని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఘటన స్థలంలో ఆరు బుల్లెట్‌ క్యాప్స్‌ పడి ఉ‍న్నాయిని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పూర్తిగా దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
చదవండి: ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు

కాగా ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ మంగళవారం అర్ధరాత్రి గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నరేష్‌ యాదవ్‌ మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement