న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన కేబినెట్ను ఆదివారం మధ్యాహ్నం విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణకు ముందు కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రులకు ప్రధాని మోడీ తేనీటి విందు ఇవ్వనున్నారు. ఈ విందులో కొత్తగా మంత్రి పదవి చేపట్టేవారితోపాటు పాత మంత్రులు కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే కొత్తగా మంత్రి పదవి చేపట్టే ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు పీఎంవో ఫోన్ ద్వారా సమాచారం అందించింది.
దాంతో పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గం. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.