tea
-
ఇది ‘కేటీఆర్.. ఓ టీస్టాల్’ కథా చిత్రం!
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ చిరు వ్యాపారి.. కేటీఆర్ పేరుతో నడుపుకుంటున్న టీ కొట్టు డబ్బాను అధికారులు ఇటీవల ఎన్నికల సమయంలో మూసివేయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాపారికి కేటీఆర్ అండగా నిలిచారు. మళ్లీ టీకొట్టు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. గత నెలలో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మఘాట్ వద్ద కేటీఆర్ పేరు, ఫొటోతో ఉన్న టీస్టాల్ను అధికారులు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేదన్న సాకుతో ఫిబ్రవరి 19న మూయించారు. అయితే బీఆర్ఎస్ అభిమానులు, కేటీఆర్ అనుచరులు అదే రోజు సాయంత్రమే హోటల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్తో టీస్టాల్ను తెరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న సాయంత్రం టీస్టాల్ డబ్బాకు అనుమతి లేదని పేర్కొంటూ మున్సిపల్ అధికారులు ఆ డబ్బాను పోలీస్ రక్షణ మధ్య తొలగించి, ట్రాక్టర్పై మరోచోటికి తరలించారు. ఈ చర్యతో శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, బత్తుల శ్రీనివాస్కు ఫోన్ చేసి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఇచి్చన మాట ప్రకారం ఇటీవల సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా శ్రీనివాస్కు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బులతో మరోచోట హోటల్ పెట్టుకోవాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. కేటీఆర్ సలహాతో పట్టణంలోని గాం«దీచౌక్లో శ్రీనివాస్ కొత్తగా టీస్టాల్ను కేటీఆర్ పేరుతో ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేటీఆర్, ఎమ్మెల్సీ రమణతో కలసి శ్రీనివాస్ టీస్టాల్ను ప్రారంభించారు. -
స్టాక్మార్కెట్లోకి ‘చాయ్ పాయింట్’
న్యూఢిల్లీ: టీ, కాఫీ చైన్.. చాయ్ పాయింట్ 2026 మే నెలకల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. ఈ అంశాన్ని ప్రతిరోజు సుమారు 9 లక్షల కప్పుల టీ, కాఫీ విక్రయిస్తున్న సంస్థ సహవ్యవస్థాపకుడు తరుణ్ ఖన్నా తెలియజేశారు. అయితే కుంభమేళాలో రోజుకి 10 లక్షలకంటే అధికంగా విక్రయించినట్లు తెలియజేశారు.ముంబైలో తమ విద్యార్ధి అములీక్ సింగ్ బిజ్రాల్తో కలసి ఒక కేఫ్లో టీ తాగే సమయంలో 2009లో చాయ్ పాయింట్ ప్రారంభించే ఆలోచన వచ్చినట్లు హార్వార్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖన్నా వెల్లడించారు. ప్లాస్టిక్ కప్పులలో అంత శుభ్రతలేని విధంగా అందిస్తున్న చాయ్ స్థానే అత్యున్నత నాణ్యతతో, పరిశుభ్రంగా అందుబాటు ధరలో సువాసనలతో కూడిన చాయ్ అందించాలనే ఆలోచనతో చాయ్ పాయింట్కు తెరతీసినట్లు వివరించారు.దీంతో టీ అందించే వ్యక్తు(చోటూ)లకు ఉపాధిని సైతం కల్పించవచ్చని భావించినట్లు తెలియజేశారు. దీంతో 2010లో బెంగళూరులోని కోరమంగళలో తొలి ఔట్లెట్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అములీక్తో కలిసి ఐదుగురు ఉద్యోగులతో బిజినెస్ను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకి 90 లక్షల కప్పుల టీ, కాఫీలను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. -
వేసవిలో బాడీ ఆర్మర్ లైట్ స్పోర్ట్స్ డ్రింక్
న్యూఢిల్లీ: ఈసారి వేసవి ప్రభావం కాస్త ముందే కనిపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ డ్రింక్ బాడీఆర్మర్లైట్తో పాటు హానెస్ట్ టీ తదితర బ్రాండ్లను ఈ వేసవిలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కోకా కోలా ఇండియా, నైరుతి ఆసియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా తెలిపారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద విమానాశ్రయాల్లాంటి ప్రదేశాల్లో విక్రయిస్తున్న విటమిన్వాటర్ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. అలాగే కోక్ జీరో షుగర్, స్ప్రైట్ జీరో షుగర్ శ్రేణిని మరింతగా విస్తరిస్తామన్నారు. ఎలక్ట్రోలైట్స్, కొబ్బరి నీటితో తయారైన బాడీఆర్మర్లైట్.. హైడ్రేషన్ విభాగానికి చెందిన బ్రాండ్ కాగా హానెస్ట్ టీ అనేది అస్సాం తేయాకుతో తయారైన సేంద్రియ టీ బ్రాండు. మరోవైపు, థమ్సప్, స్ప్రైట్ త్వరలో 2 బిలియన్ డాలర్ల బ్రాండ్లుగా మారే అవకాశం ఉందని సందీప్ వివరించారు. వీటితో పాటు మాజా, మినిట్ మెయిడ్ విక్రయాలను కూడా పెంచుకునేందుకు మరింతగా అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
కేటీఆర్ వర్సెస్ కలెక్టర్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యహరించే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా కొన్నిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. భూకబ్జాలు, అనుమతిలేని వాణిజ్య సముదాయాలు, వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో వింతేమీలేదు. అయితే.. బాధితులంతా తాము కేటీఆర్ అనుచరులం, బీఆర్ఎస్ నాయకులం కాబట్టే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల కేటీఆర్ సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ను సన్నాసి.. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి తమపై కలెక్టర్ దాడులు చేయిస్తున్నాడని కేటీఆర్ అనుచరులు ఆరోపిస్తుండగా..తనపని తానుచేసుకుంటున్నానే తప్ప.. ఎలాంటి ప్రతీకారాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కలెక్టర్ సమాధానమిస్తున్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఇప్పుడు రాజ కీయరంగు పులుముకుంటోంది. కలెక్టర్ సందీప్కుమార్ఝాపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా బీఆర్ఎస్ నాయకులు సీఎస్ శాంతికుమారిని కలవడంతో వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది.కేటీఆర్ అనుచరులు ఏమంటున్నారు? టీస్టాల్ వద్ద కేటీఆర్ బొమ్మ ఉన్న కారణంగా ఈనెల 19న దాన్ని తరలించారు. టీస్టాల్ యజమానికి బత్తుల శ్రీనివాస్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు. కేవలం తమనాయకుడి బొమ్మ పెట్టుకున్నాడన్న అక్కసుతో బీదవాడిపై ప్రతాపం చూపించారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని ఇటీవల కలెక్టర్ సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న పాడిరైతులు ఆందోళనకు దిగారు. డెయిరీ నిర్వాహకులు బీఆర్ఎస్, కేటీఆర్కు మద్దతుదారులన్న కారణంతోనే సీజ్చేశారని ఆరోపించారు. కలెక్టర్ తీరుపై తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అనిల్రెడ్డి (గతంలో కేఏపాల్ మీద దాడిచేసిన వ్యక్తి) సందీప్కుమార్ ఝా మీద కేసులున్నాయని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. అతను పోలీసులకు చిక్కకపోవడంతో అతని చిన్నాన్న అబ్బాడి రాజిరెడ్డి 30 గుంటల స్థలం కబ్జాచేశాడని పోలీసులు అరెస్టు చేశారు. రాజిరెడ్డి మూగవాడన్న కనికరం లేకుండా పట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాల్లో నిబంధనలకు తూట్లు పొడిచారు. కౌన్సెలింగ్ లేకుండానే కలెక్టర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. నిబంధలనకు విరుద్ధమని చెప్పిన డీఈవోను కలెక్టర్ బెదిరించారు. ఉంటే ఉండు లేకుంటే లీవులో వెళ్లంటూ హెచ్చరించారు.ఆరోపణలపై కలెక్టర్ ఏమన్నారంటే.. సిరిసిల్లలో పబ్లిక్ ప్రాంతాన్ని టీస్టాల్ యజమాని ఆక్రమించి నడుపుతున్నాడు. పైగాఅతనికి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేదు. అతను ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న అగ్రహారం డెయిరీ లైసెన్స్ లేకుండా నడుస్తోంది. దా నికి ఫైర్ సేఫ్టీ లైసెన్స్, ల్యాండ్ కన్వర్షన్, బిల్డింగ్ పర్మిషన్, పర్యావరణ అనుమతులు లేవు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో సర్వే నెంబరు 1,183లోని స్థలాన్ని రాజిరెడ్డికి ప్రభుత్వం అసైన్ చేయలేదు. 2018లో ప్రభుత్వ రికార్డులను ట్యాంపరింగ్ చేసి తనపేరిట మార్చుకున్నాడు. ఇది అవినీతి వ్యవహారం. వాస్తవానికి జగన్మోహన్రెడ్డి విధులపై అంకితభావం లేదు. నాకు తెలియకుండా డీఈవో ఆర్డర్స్ ఇచ్చారు. అదేంటని అడిగితే.. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని సమాధానమిచ్చాడు. జిల్లా సర్వశిక్షాభియాన్ చైర్మన్గా నేను ఉండగా.. వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడం, పైగా ఆ ఆదేశాలు నేను ఇచ్చానని ప్రచారం చేయడం ఎంతమేరకు సమంజసం?నిజాయితీకి దక్కిన బహుమానంనేను ఎవరినీ టార్గెట్ చేయలేదు. నాకెలాంటి రాజకీయ కక్షలేదు. అందరూ సమానమే. నాపని నేను చేసుకుంటూ పోతున్న. అవినీతి, అక్రమార్కుల విషయంలో అధికారులు కూడా వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇంతకాలం వారికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. కానీ.. మేము అక్రమాలపై చర్యలు తీసుకుంటుంటే కొందరు దుబాయ్ వేదికగా సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది నా నిజాయతీకి దక్కిన బహుమానం.– సందీప్కుమార్ ఝా,కలెక్టర్, రాజన్న సిరిసిల్ల -
Maha Kumbh: వేల రూపాయలు తెచ్చిపెట్టిన ‘పర్సు చోరీ’
ప్రయాగ్రాజ్: కుంభమేళాలో స్నానం చేస్తే తాము చేసిన పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అయితే దీనికి విరుద్ధంగా కొందరు కుంభమేళా ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతూ పాపాలను మూటగట్టుకుంటున్నారు. మధురలోని బృందావనాన్ని సందర్శించి, అక్కడినుంచి కుంభమేళాకు వచ్చిన ఒక వ్యక్తికి చేదు అనుభం ఎదురయ్యింది. జనసమూహంలో అతని పర్సు చోరీకి గురయ్యింది. ఆ పర్సులో నగదు, విలువైన కాగితాలు ఉన్నాయి. దీంతో అతను కాసేపు బాధపడ్డాడు. తిరిగి తన స్వస్థలానికి చేరడం ఎలా అని ఆలోచించాడు. వెనువెంటనే ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు.జేబులో ఒక్కపైసా కూడా లేకపోవడంతో మరోమార్గం లేక అక్కడున్న కొందరు భక్తులకు తన పరిస్థితి చెప్పుకుని, డబ్బులు సాయం చేయాలని కోరాడు. వారిచ్చిన డబ్బుతో టీ తయారు చేసి విక్రయించసాగాడు. ఇలా కుంభమేళాలో రోజుకు రెండు, మూడు వేలు సంపాదిస్తూ రూ. 50 వేలు జమచేశాడు.పర్సుపోతే పోయిందిగానీ, అతనికి ఒక కొత్త ఉపాధి మార్గం దొరికింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను బృందావనం నుంచి మహాకుంభమేళాలో స్నానం చేసేందుకు వచ్చాను. ఇంతలో నా పర్సు ఎవరో చోరీ చేశారు. ఏం చేయాలో తెలియక టీ విక్రయిస్తూ, డబ్బులు కూడబెట్టాలని నిర్ణయించుకున్నాను. రాత్రనక, పగలనక ఇక్కడికి వచ్చే భక్తులకు టీ అమ్ముతూ వచ్చాను. రోజుకు మూడు వేల రూపాయల వరకూ సంపాదించాను. అలా ఇప్పటివరకూ రూ. 50 వేలు కూడబెట్టాను’ అని తెలిపాడు. ఇది కూడా చదవండి: శివాజీ జయంతి: చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి.. -
ఆహా.. ఏమి టీ!
రోజూ ఇంట్లో పొద్దున్నే చాయ్ చేసి కుటుంబసభ్యులకు అందించే చేతులు.. ఇప్పుడు అదే చాయ్తో, అదే కుటుంబానికి ఆదాయాన్ని అందిస్తున్నాయి. స్వయం ఉపాధితోపాటు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో స్త్రీ టీ క్యాంటీన్లు నడుపుతున్న మహిళల విజయ ప్రస్థానమిది. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ చొరవతో ఏర్పాటైన ఈ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో మరికొన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. - సాక్షి ప్రతినిధి, ఖమ్మంఉపాధి కల్పనే లక్ష్యం స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గం చూపించాలని భావించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్.. అందుకోసం వారితో టీ క్యాంటీన్లు ఏర్పాటు చేయించాలని సంకల్పించారు. అందుకోసం అన్ని శాఖల అధికారులతో చర్చించి ముందుడుగు వేశారు. టీ క్యాంటీన్కు ప్రత్యేక లోగో, బ్రాండ్ తయారు చేయించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 41 షాపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తొలి షాపును కలెక్టరేట్ వద్దే ప్రారంభించారు.కలెక్టరేట్ ఆవరణలోని క్యాంటీన్ ఆదాయంతో పోలిస్తే గేటు బయట ఏర్పాటైన స్త్రీ టీ క్యాంటీన్కు రెట్టింపు ఆదాయం వస్తుండటంతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10, మండలాల్లో మరో 30కి పైగా మంజూరు చేశారు. ప్రస్తుతం 22 టీ క్యాంటీన్లను నడుస్తున్నాయి. మొత్తం 300 వరకు స్త్రీ టీ క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ఏర్పాటుకు బ్యాంకు లింకేజీతో సంఘం తరఫున రూ.1.5 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. సంఘంలోని మహిళలందరికీ ఒకటే కాకుండా అర్హత, ఆసక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒక క్యాంటీన్ కేటాయిస్తున్నారు. నిరంతరం పర్యవేక్షణ... స్త్రీ టీ క్యాంటీన్ మంజూరు చేసే సమయంలో లబ్ధిదారులు గతంలో ఏదైనా వ్యాపారం చేశారా లేదా? అన్నది పరిగణనలోకి తీసుకున్నారు. యూనిట్ కేటాయించాక ఏ మేరకు లాభాలుంటాయనే అంశంపై రెండు నెలలపాటు మండల, జిల్లా సమాఖ్యల్లో చర్చించారు. చట్టాలు, పన్నుల చెల్లింపు, వ్యాపార నిర్వహణపై 400 మంది మహిళలకు హైదరాబాద్కు చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఆపై రద్దీ ప్రాంతాలను గుర్తించి క్యాంటీన్లు ఏర్పాటుచేయించారు.అంతటితో వదిలేయకుండా మూడు నెలల పాటు వాటి నిర్వహణ, లాభాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. యూనిట్లలో దివ్యాంగులకు 25 శాతం కేటాయించారు. టీతోపాటు కూల్డ్రింక్స్, ఇతరత్రా కలిపి కాస్త పెద్ద యూనిట్లు కూడా ఏర్పాటుచేయించాలని నిర్ణయించారు. ఇవి ఖమ్మం కార్పొరేషన్లో మూడు, మండలాల్లో 10 వరకు ఏర్పాటు కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఇవి గ్రౌండ్ అవుతాయి. పదేళ్ల తర్వాత కూడా కొనసాగాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.ఇంకొకరికి ఉపాధి గ్రామంలో మాకు టీ స్టాల్ ఉన్నా పెద్దగా ఆదాయం ఉండేది కాదు. కలెక్టర్ ఇచ్చిన అవకాశంతో కలెక్టరేట్ వద్ద టీ స్టాల్ పెట్టాను. ఇప్పుడు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నా. నెలకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తుండగా, రూ.10 వేలు మిగులుతున్నాయి. – పోతగాని రాజేశ్వరి, స్త్రీ టీ క్యాంటీన్ ఓనర్, కలెక్టరేట్ బస్టాప్, ఖమ్మం. స్వయం ఉపాధి లభించింది.. మా స్త్రీ టీ క్యాంటీన్ గతనెల 4న ప్రారంభమైంది. ప్రస్తుతం టీ, కాఫీ, అల్లం టీ అమ్ముతున్నాం. కరెంట్ సౌకర్యం రాగానే పాలు, పెరుగు కూడా అమ్ముతాం. రోజురోజుకు వ్యాపారం పుంజుకుంటోంది. మొదటి నెల రూ.50 వేలు వచి్చంది. రుణ కిస్తీ చెల్లించగా.. కొంత మిగులుతోంది. – శ్రీరంగం గీత, జలగం నగర్, నవ్య గ్రామసమాఖ్య. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసమే.. మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో స్త్రీ టీ క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం తరఫున యూనిట్ గ్రౌండింగ్ చేశాం కదా అని వదిలేయకుండా స్థల గుర్తింపు, ఏమేం అమ్మాలి, నాణ్యతపై క్షుణ్ణంగా చర్చించి, శిక్షణ ఇప్పించాకే ముందడుగు వేశాం. యూనిట్ ఏర్పాటయ్యాక నిత్యం పరిశీలిస్తూ ఏళ్ల తరబడి కొనసాగేలా చూస్తున్నాం. – ముజమ్మిల్ఖాన్, కలెక్టర్, ఖమ్మం. -
పడి.. లేచి.. బబుల్ టీతో వేల కోట్లకు పగడలెత్తాడు
మీరు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా (business ideas in telugu) కోసం చూస్తున్నారా? ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఐడియాతో ఎక్కువ లాభం అర్జించాలని అనుకుంటున్నారా? అయితే, ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కొత్త బిజినెస్ ఐడియా ఏంటో తెలుసా? బబుల్ టీ. మనకు సాధారణ టీ గురించి, టీ ఫ్రాంచైజీల గురించి తెలుసు. దాని బిజినెస్ మోడల్ గురించి తెలుసు. మరి బబుల్ టీ(Bubble tea). ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిజినెస్సే ఈ బబుల్ టీ బిజినెస్. బబుల్ టీని అమ్మి తాజాగా 38 ఏళ్ల యునాన్ వాంగ్ (Yunan Wang) చైనాలో బిలియనీర్ అవతారం ఎత్తారు.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఇటీవల యునాన్ వాంగ్ సంస్థ ‘మింగ్ హోల్డింగ్స్’ ఐపీవోకి వెళ్లింది. ఈ ఐపీవోలో అదరగొట్టేలా 233 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో వాంగ్ నికర విలువ 1.2 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా చైనా బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మింగ్ హోల్డింగ్స్ ‘గుడ్మీ’ పేరుతో బబుల్ టీని విక్రయిస్తుంది. 2023 చివరి నాటికి చైనాలోని తొలి ఐదు బబుల్ టీ బ్రాండ్లలో 9.1శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతుంది. యునాన్ వాంగ్ ఎవరు?38 ఏళ్ల యునాన్ వాంగ్ చైనాలోని ప్రముఖ బబుల్ టీ కంపెనీ గుమింగ్ హోల్డింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. అతని తల్లిదండ్రులు మయన్మార్ సరిహద్దుల్లో చిన్న రిటైల్ బిజినెస్ను నిర్వహిస్తున్నారు. యునాన్ వాంగ్ 2010లో జెజియాంగ్ సైన్స్-టెక్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్,ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ ఏడాది దాదాపు 15 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన డాక్సీలో బబుల్ టీ షాపును ప్రారంభించాడు. బబుల్ టీ బిజినెస్ ప్రారంభంలో అనేక ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. రోజుకి వాంగ్ బబుల్ టీ అమ్మకాలు కేవలం 100 యువాన్ల (సుమారు $18.50) వరకు మాత్రమే అమ్మకాలు జరిగేవి. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుందని భావించిన వాంగ్ తన సహ వ్యవస్థాపకుడి కూల్డ్రింక్ను అమ్మేవారు. ఫ్రాంచైజీలు రోజులు గడిచే కొద్ది వాంగ్ అమ్మే బబుల్ టీ షాపుకు కస్టమర్ల తాకిడి ఎక్కువైంది. అమ్మకాలు జోరందుకున్నాయి. చైనా వ్యాప్తంగా మొత్తం 10వేల బబుల్ టీ ఫ్రాంచైజీలతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. తాజా బబుల్ టీ బిజినెస్లో బిలియనీర్ అయ్యాడు.బబుల్ టీ క్రేజ్బోబా టీనే బబుల్ టీగా అవతరించింది. 1980లలో తైవాన్లో పుట్టిన బబుల్ టీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుర్రకారుకు యమక్రేజ్. ఈ బబుల్ టీని చల్లని పాలు, పండ్ల రసాలు, టాపియోకా (టాపియోకా అనేది కాసావా (Cassava) అనే మొక్క వేరు నుండి తయారు చేసే పిండి పదార్థం) , జెల్లీ ముక్కలతో తయారు చేస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా తైవాన్, చైనా, ఇతర ఆసియా దేశాలలో ప్రాచుర్యం పొందింది. ఈ బబుల్ టీ అమ్మకాలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లలో మన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. వివిధ రకలా పండ్ల రుచులు, చాక్లెట్, ఇతర ప్రత్యేక రుచులతో బబుల్ టీని విక్రయిస్తున్నారు. -
కాఫీ.. టీతో క్యాన్సర్కు చెక్...!
తల, మెడ క్యాన్సర్... ప్రపంచవ్యాప్తంగా ఏడో అత్యంత సాధారణ క్యాన్సర్గా వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఎక్కువగా ఉన్న వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, రోజూ నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగిన వారిలో ఈ క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం ఉందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఫర్ రివ్యూడ్ జర్నల్ వెల్లడించింది. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడిమియాలజీ కన్సార్టియంతో అనుసంధానమైన శాస్త్రవేత్తలు సుమారు 14 అధ్యయనాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ...’ అన్నాడో సినీ రచయిత. చాలామందికి తమ దైనందిన జీవితం కాఫీతో మొదలవుతుంది. కొందరికి ఉదయం కాఫీ/టీ తాగకపోతే అసలు ఏ పనీ జరగదు. అంతలా అవి మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. కొందరు కాఫీ, టీ తాగడం మంచిది కాదని చెబుతున్నా... అమెరికన్ కాన్సర్ సొసైటీ మాత్రం కాఫీ, టీలు క్యాన్సర్ నుంచి రక్షిస్తాయని చెబుతోంది. – ఏపీ సెంట్రల్ డెస్క్పరిశోధన ఇలా...సుమారు 25వేల మందికిపైగా వ్యక్తుల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. కాఫీ/టీ తాగడం వల్ల ఉత్సాహంగా ఉండటమే కాకుండా తల, మెడ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్నవారు రోజు/వారం/నెల/సంవత్సరానికి.... కెఫెన్ లేని కాఫీ, టీని తీసుకోగా వచ్చిన డేటా ఫలితాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.ఇదీ డేటా..తల, మెడ క్యాన్సర్తో బాధపడుతున్న 9,548 మంది, క్యాన్సర్ లేని 15,783మందిపై పరిశోధనలు చేయగా... కాఫీ తాగని వారితో పోలిస్తే రోజూ 4 కప్పులు కంటే ఎక్కువ కెఫెన్ ఉన్న కాఫీ తాగే వ్యక్తుల్లో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశం 17% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే నోటికుహరంలో క్యాన్సర్ వచ్చే అవకాశం 30% తక్కువని, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం 22% తక్కువని తేలింది.ఇక రోజూ 3–4 కప్పుల కెఫెన్ ఎక్కువ ఉన్న కాఫీ తాగడం వల్ల హైపోఫారింజియల్ క్యాన్సర్ (గొంతు దిగువన ఉండే ఒక రకమైన క్యాన్సర్) వచ్చే ప్రమాదం తక్కువని తేలింది. అలాగే కెఫెన్ లేని కాఫీ తాగడం వల్ల నోటి కుహర క్యాన్సర్ వచ్చే అవకాశాలు 25% తక్కువని, టీ తాగడం వల్ల హైపోఫారింజియల్ క్యాన్సర్ 29% తక్కువ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాగా, 1 కప్పు లేదా అంతకంటే తక్కువ టీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9% తక్కువని, హైపోఫారింజియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందంటున్నారు. ఇలా ఉంటే, అధిక కాఫీ వినియోగం పలు రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించడంలో మేలు చేసినా, ఇందుకు మరింత పరిశోధన అవసరమని నివేదికలో పేర్కొన్నారు. క్యాన్సర్ తగ్గించుకునేందుకు కాఫీ, టీలు తాగడం మాత్రమే పరిష్కారం కాదనీ, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామాలు, వైద్యపరీక్షలు ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. -
ఎయిర్పోర్ట్లో రూ.10కే టీ, రూ20కే సమోసా!
ఎయిర్పోర్ట్లో స్నాక్స్ ధర రూ.వందల్లో ఉంటుందని తెలుసుకదా. అయితే కొత్తగా ప్రారంభించిన కేఫ్లో మాత్రం కేవలం రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే సమోసా, స్వీటు లభిస్తుంది. ‘అదేంటి.. షాపింగ్ మాల్స్లోనే వాటర్ బాటిల్ రూ.80 వరకు ఉంది. మరి ఎయిర్పోర్ట్లో ఇంత తక్కువా..?’ అని ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్పోర్ట్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ప్రారంభించింది. విమాన ప్రయాణికులకు చౌకగా స్నాక్స్ అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ పుణ్యమా అని సరసమైన స్నాక్స్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. 2024 డిసెంబర్ 21న పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కేఫ్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సుమారు 900 మంది ప్రయాణీకులు ఈ కేఫ్ సేవలు వినియోగించుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీని ఆవిష్కరణ సమయంలో మంత్రి మాట్లాడుతూ..విమానాశ్రయంలో ఆహార ధరల పెరుగుదలపై దీర్ఘకాలంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.No more overpriced food at the airport. Now you can have affordable snacks at airports at Udaan Yatri Cafe.Tea : ₹10Water : ₹10Samosa : ₹20Sweet : ₹20 pic.twitter.com/SGEsKGjEf8— Aaraynsh (@aaraynsh) January 23, 2025ఇదీ చదవండి: 2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖధరలిలా..ఉడాన్ యాత్రి కేఫ్లో ప్రయాణికులు రూ.10కే టీ, రూ.10కే వాటర్ బాటిల్, కేవలం రూ.20కే సమోసా, రూ.20కు స్వీట్లు వంటి స్నాక్స్ను ఆస్వాదించవచ్చు. ఈ ధరలు విమానాశ్రయంలోని ఇతర ఆహార దుకాణాలు వసూలు చేసే అధిక రేట్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి ఈ కేఫ్కు సానుకూల స్పందన వస్తోంది. కేఫ్ ప్రారంభించిన మొదటి నెలలో సుమారు 27,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించింది. ఇతర విమానాశ్రయాల్లో ఈ నమూనా కేఫ్లను ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. -
జుట్టు రాలిపోతోందా? డోంట్ వర్రీ..టీ వాటర్తో ఇలా చేస్తే..!
Tea Water for Hair: జుట్టు రాలడం చాలా సహజమైనదే. అయితే ఎప్పడికప్పుడు కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. జుట్టు రాలిన విషయంమనకు తెలియకుండానే ఈప్రక్రియ జరిగిపోతుంది.అయితే అకారణంగా, చాలా ఎక్కువగా జుట్టురాలిపోవడం ఆందోలన కలిగించే అంశం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవడానికి లెక్కలేనన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన పద్ధతులను ఎంచుకోవడం మంచిది. అలాంటి వాటిట్లో ఒకటి టీ నీటితో జుట్టును కడగడం. యాంటీఆక్సిడెంట్లు , పోషకాలతో సమృద్ధిగా ఉన్న టీ, జుట్టును బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మాడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి దీని తయారీ, ఎలా ఉపయోగించాలో చూద్దాం.టీ వాటర్ ఎలా తయారు చేయాలిహెయిర్ వాష్ కోసం టీ వాటర్ ను తయారు చేయడం చాలా సులభంకావాల్సిన పదార్థాలు:2–3 టీ బ్యాగులు (బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ)2–3 కప్పుల నీరుకావాలంటే ఇందులో లావెండర్ లేదా రోజ్మేరీ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? ఎలావాడాలి?నీటిని మరిగించి, అందులో టీ బ్యాగులను 5–10 నిమిషాలు నానబెట్టాలి.ఇందులో కొద్దిగా లావెండర్, రోజ్మేరీ ఆయిల్ చుక్కలు కలపాలి.చల్లారిన తరువాత టీ నీటిని శుభ్రమైన స్ప్రే బాటిల్ లేదా కంటైనర్లో పోసుకోవాలి.ఇపుడు తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును శుభ్రంగా వాష్ చేయాలి.షాంపూ చేసిన తర్వాత జుట్టుంతా తడిచేలా స్ప్రే చేయాలి. తర్వాత 5–10 నిమిషాలు పాటు చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి.15-20 నిమిషాలు పాటు ఉంచుకుని సాధారణ నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోప్రయోజనాలు జుట్టు సిల్కీగాఅవుతుంది. కొత్త మెరుపువస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది, యాంటీఆక్సిడెంట్లు ,కెఫిన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.మాడు ఆరోగ్యానికి కూడా మంచిది. చుండ్రు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయి. టీ వాటర్ జుట్టు క్యూటికల్ను మూసివేస్తుంది.కెఫిన్ కారణంగా రక్త ప్రసరణ బాగా జరిగిన జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఇది ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ ప్రక్రియ చాలామంచిది. జుట్టు చిట్లడం అనే సమస్యను కూడా దూరం చేస్తాయి.ఇదీ చదవండి : Sankranti 2025: పండక కళ, పేస్ గ్లో కోసం ఇలా చేయండి! -
'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..
యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ తయారీ చేరింది. చైనాలో టీ అనేది ప్రజల రోజువారీ జీవితంలో అల్లుకుపోయిన పానీయం, టీ తో అక్కడి ప్రజలకు లోతైన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.బీజింగ్ టీ మ్యూజియంలో ఉత్తర– దక్షిణ రాజవంశాల (క్రీ.పూ. 386– క్రీ.పూ. 589) నాటి 100కి పైగా టీ–సంబంధిత కళాఖండాల సేకరణ ఉంది. ఇక్కడి కాలిగ్రఫీ, పెయింటింగ్లు, సాంస్కృతిక అవశేషాలు, పురాతన టీ సెట్లు, టీల నమూనాలు ఉన్నాయి, ఇవి చైనా గొప్ప టీ సంస్కృతి, సమగ్ర, క్రమబద్ధమైన సేకరణను అందిస్తాయి. టీ సంస్కృతిని ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ టీ సంస్కృతికి కేంద్రంగా ఈ మ్యూజియం సంవత్సరాలుగా టీ–సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులకు సాంప్రదాయ సాంçస్కృతిక విద్యా కార్యక్రమాలను, చైనాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు టీ సంస్కృతి అనుభవాలను అందిస్తుంది.. ‘టీ తయారీ కోసం చైనీస్ ప్రజలు సృష్టించిన అనేక మార్గాలు, వస్తువులను చూసి విదేశీ రాయబారులు ఆశ్చర్యపోతారు. తూర్పు తీసుకువచ్చిన టీ ఆకుతో ఇక్కడి ప్రజలు రకాల రకాల టీ లను ఎలా సృష్టిస్తారో తెలియజేస్తుంది. వారసత్వ జాబితాలో..టీ సంస్కృతికి పుట్టినిల్లుగా చైనీస్ టీ చరిత్రను క్రీ.పూ హాన్ రాజవంశాల నుండి గుర్తించవచ్చు, చైనాలో సాంప్రదాయ టీ ప్రాసెసింగ్ పద్ధతులు, అనుబంధ సామాజిక పద్ధతులు 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. చైనీయుల దైనందిన జీవితంలో టీ సర్వవ్యాప్తి చెందుతుంది, ఎందుకంటే కుటుంబాలు, కార్యాలయాలు, టీ హౌస్లు, రెస్టారెంట్లు, దేవాలయాలలో వేడి వేడి తేనీటిని అందిస్తారు. వివాహాలు, సమూహాలుగా జరిగే వేడుకలలో కూడా ముఖ్యమైన భాగం అని యునెస్కో తెలిపింది. వాస్తవానికి ‘తు‘ అని పిలిచే టీ, పురాతన చైనీస్ ఔషధ పుస్తకాలలో విరుగుడుగా ఉపయోగించబడటానికి కనుక్కున్నట్టు రాయబడి ఉంది. ముఖ్యమైన టీ సంగతులు...టీ తాగే ధోరణి ప్రారంభమైనప్పుడు టాంగ్ రాజవంశం (క్రీ.పూ.618– క్రీ.పూ.907) నుండి టీ ని విశ్వవ్యాప్తంగా ‘చా‘ అని పిలిచారు. 1987లో పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయంలోని భూగర్భ ప్యాలెస్ నుండి తొలి, అత్యున్నత స్థాయి టాంగ్ ఇంపీరియల్ టీ సెట్ను కనుగొన్నారు. 8వ శతాబ్దంలో టాంగ్ పండితుడు లు యు రచించిన క్లాసిక్ ఆఫ్ టీ, టీ– సంబంధిత అభ్యాసాల గురించి క్రమపద్ధతిలో వివరించిన మొదటి గ్రంథం.సాంగ్ రాజవంశం (960–1279)లో ప్రజలలో ప్రజాదరణ పొదింది: మ్యూజియంలోని కుడ్యచిత్రం టీ పోటీలో పాల్గొనడానికి ప్రజలు తమ సొంత టీ, టీ సెట్లను తీసుకువచ్చిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. మ్యూజియంలో అతి ముఖ్యమైనది ‘గోల్డెన్ మెలోన్ ట్రిబ్యూట్ టీ‘, దీనిని ‘రెన్ టౌ చా‘ (తల ఆకారపు టీ) అని కూడా పిలుస్తారు. ఇది ఒక శతాబ్దానికి పైగా భద్రపరచబడిన అరుదైన, వయస్సు గల ప్యూర్ టీ. దీని ఆకారం గుమ్మడికాయ, బంగారు రంగును ΄ోలి ఉంటుంది కాబట్టి దీనికి గోల్డెన్ మెలోన్ టీ అని పేరు పెట్టారు. ఆకుపచ్చ, పసుపు, ముదురు, తెలుపు, బ్లాక్ .. టీలతోపాటు యువ తరం కొత్త మార్గాలతో సంప్రదాయాన్ని స్వీకరించింది. వారు స్థానిక టీ ఆకులను బేస్గా ఉపయోగిస్తారు. టీని తాజా పాలు, బెర్రీ, పీచెస్ వంటి పండ్లతో కలిపి కొత్త టీ డ్రింక్స్ను తయారు చేస్తారు. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
ఎంఏ చాయ్వాలా.. ఏటా లక్షల సంపాదన
దేశంలో చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం దొరకడం అనేది సాధ్యమయ్యే పనికాదు. అలా ఉద్యోగాలు దొరకనివారిలో చాలామంది ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరిలో కొందరు సక్సెస్ అవుతున్నారు. అలాంటివారిని చూసి, ఇతరులు స్ఫూర్తి పొందుతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు యూపీకి చెందిన ఎంఏ చాయ్వాలా. వివరాల్లోకి వెళితే..చదువుకు ఫుల్స్టాప్ పెట్టి..ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాకు చెందిన ఓ యువకుడు టీ వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏటా లక్షల్లో టర్నోవర్ చేస్తున్నాడు. అతని పేరు రాజ్ జైస్వాల్. అతను మీడియాతో మాట్లాడి తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలియజేశాడు. అవి అతని మాటల్లోనే.. ‘నేను ఎంఏ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నాను. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మధ్యలోనే చదువు మానేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోనే గోండాలోని ఎల్బీఎస్ చౌరస్తాలో ఒక టీ దుకాణాన్ని ప్రారంభించాను. దానికి ఎంఏ చాయ్వాలా అని పేరు పెట్టాను’ అని తెలిపారు.తల్లి ఇచ్చిన డబ్బుతో..రాజ్ జైస్వాల్ బీఏ పూర్తి చేశాక ఎంఏ చదువుకుందామనుకున్నాడు. ఆర్థిక పరిస్థుతుల కారణంగా అతని కల నెరవేరలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, అవేవీ అతనికి సంతృప్తి నివ్వలేదు. దీంతో టీ దుకాణం తెరవాలని అనుకుని ఎంఏ చాయ్ వాలా పేరుతో దుకాణం ప్రారంభించాడు. అయితే ఈ పని అతని తండ్రికి అస్సలు నచ్చలేదు. తల్లి మాత్రం రాజ్ జైస్వాల్కు అండగా నిలిచింది. ఆమె తన తగ్గరున్న డబ్బు ఇచ్చి, టీ దుకాణం తెరవాలని ప్రోత్సహించింది.రోజుకు 300 టీల విక్రయంఅందరూ ఇంట్లో తయారుచేసుకునే టీలకు భిన్నంగా తాము కొన్ని మసాలాలను టీ తయారీకి ఉపయోగిస్తామని, దీంతో తమ దగ్గర టీ మరింత రుచిగా ఉంటుందని రాజ్ జైస్వాల్ తెలిపాడు. కాగా ఇక్కడి టీ రుచి చాలా బాగుంటుందని, అందుకే ఇక్కడికి రోజూ వచ్చి టీ తాగుతామని పలువురు వినియోగదారులు మీడియాకు తెలిపారు. ఇక్కడ రూ.10 నుంచి రూ.40 ధరతో అనేక రకాల టీలు లభ్యమవుతాయి. ప్రతిరోజూ రాజ్ 250 నుంచి 300 కప్పుల టీ విక్రయిస్తుంటాడు. ఈ లెక్కన రాజ్ ప్రతీనెలా టీ విక్రయాలతో కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని అర్థం చేసుకోవవచ్చు. ఇది కూడా చదవండి: 14 ఏళ్ల పాటు వైద్యం అందించిన డాక్టర్కు రూ. 10 లక్షల జరిమానా -
టీ బ్యాగ్లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. "మనం ఈ టీ బ్యాగ్లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. (చదవండి: భారత్లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..) -
50 పైసలకు టీ అమ్ముకునే మహిళ..రూ. 100 కోట్లకు అధిపతిగా!
స్వతంత్రంగా జీవించాలని, సొంతకాళ్లపై నిలబడాలనే ఆలోచన ఒక మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అదీ కష్టాల్లో ఉన్న మహిళ ధైర్యంగా, ఆర్థికంగా ఉన్నతంగా బతకాలని నిర్ణయించుకుంటే మాత్రం తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ధీరగా నిలబడుతుంది. బీచ్లో కాఫీ, టీ అమ్ముకునే స్థాయి నుంచి రెస్టారెంట్ల సారధిగా ఎదిగిన పెట్రిసియా నారాయణ్ అనే మహిళ సక్సెస్ జర్నీ అలాంటిదే. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి!తమిళనాడులోని నాగర్కోయిల్ ప్రాంతంలో జన్మించారు ప్యాట్రిసియా థామస్ 17 ఏళ్ల వయస్సులోనే నారాయన్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కలిగారు. కానీ కాల క్రమంలో ఆమె కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. ఆమె భర్త మాదకద్రవ్యాలు, డ్రగ్స్కి భావిసగా మారిపోయాడు. జీవితం దుర్భరమైపోయింది. డబ్బుల కోసం భర్త వేధించేవాడు. సిగరెట్లతో కాల్చేవాడు. అందిన డబ్బులు తీసుకుని నెలల తరబడి అదృశ్యమయ్యేవాడు. ఇక అతనిలో మార్పురాదని గ్రహించింది. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు అదృష్టవశాత్తూ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆసరాగా నిలబడ్డారు.తల్లి ఇచ్చిన ఆర్థిక బలానికి పెట్రిసియా నారాయణ్ దృఢ సంకల్పం తోడైంది. వంటపై ఉన్న ఆసక్తినే వ్యాపారంగా మార్చుకుంది. పచ్చళ్లు, జామ్ లు వంటివి సిద్ధం చేసి విక్రయించటం ప్రారంభించింది. మంచి ఆదరణ లభించింది. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. విభిన్నంగా ఆలోచించింది. పచ్చళ్లు, జామ్ల వ్యాపార లాభాలను మరో వ్యాపారంలో పెట్టాలని భావించింది. అంతే క్షణం ఆలోచించకుండా చెన్నై మెరీనా బీచ్లో టీ, కాఫీ, జ్యూస్, స్నాక్స్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 పైసలకు కాఫీ, టీ అమ్మింది. మెుదటి రోజు కేవలం ఒక్క కాఫీ మాత్రమే అమ్ముడు బోయింది. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అంతే తర్వాతి రోజు పుంజుకున్న వ్యాపారం రూ.700కి చేరింది. మెనూలో శాండ్విచ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్క్రీమ్లను కూడా చేర్చింది. స్నాక్స్, ఫ్రెష్ జ్యూస్, కాఫీ, టీ అమ్మడంలో ఆమెకు సహాయం చేయడానికి ఇద్దరు వికలాంగులను నియమించుకుంది. మెరీనా నే బిజినెస్ స్కూల్,అదే నా ఎంబీయే అంటారు ప్యాట్రిసియా. అలా తన సొంత వ్యాపారంతో కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో 1998లో సంగీత గ్రూప్ నెల్సన్ మాణికం రోడ్ రెస్టారెంట్కి డైరెక్టర్ అవకాశాన్ని పొందటంతో జీవితం మలుపు తిరిగింది.2002లో భర్త మరణించాడు. రెండేళ్ల తర్వాత కూతురు, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో దివంగత కుమార్తె జ్ఞాపకార్థం, కుమారుడుతో కలిసి తొలి రెస్టారెంట్ 'సందీప'ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచీ, ఆ హోటలే తన కుమార్తెగా మారిపోయింది. అంత జాగ్రత్తగా దాన్ని ప్రేమించి పోషించింది. కట్ చేస్తే..సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ చెన్నైలో కొత్త బ్రాంచీలతో విస్తరించింది. ప్రస్తుతం పెట్రిసియా నారాయణ్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఆమె 14 వివిధ ప్రాంతాల్లో 200 మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తున్న ఆమె సక్సెస్ జర్నీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. 2010లో 'FICCI ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. సైకిల్ రిక్షా, ఆటో రిక్షానుంచి సొంతకారుకు తన జీవితం మారిందనీ, రోజుకు 50 పైసలు ఆదాయం రోజుకు రూ. 2 లక్షలకు పెరిగింది. ఇద్దరు వ్యక్తులతో మొదలైన తన వ్యాపారం 200 వందలకు చేరిందని గర్వంగా చెప్పుకుంటారు ప్యాట్రిసియా . ఇదీ చదవండి : నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ! -
టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఎఫ్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇదిగో!
ఉదయం నిద్రలేచింది మొదలు గొంతులో రాత్రి పడుకునేదాకా కాసిన్ని ‘టీ’ నీళ్లు పడితే తప్ప ఏ పనీ జరగదు చాలామందికి. బ్లాక్టీ, హెర్బల్ టీ, మసాలా టీ, లెమన్ టీ, హనీ టీ..ఇలా ఏదో ఒక‘టీ’ పడాల్సిందే. తాజాగా టీకు సంబంధించిన ఒక మంచి వార్త ముఖ్యమైన ఆరోగ్య నియంత్రణ ఏజెన్సీ అందించింది . అదేంటంటే..టీ ఆరోగ్యకరమైనదే అని యూఎస్ ఎఫ్డీఏ టీకి సర్టిఫికెట్ ఇచ్చింది. టీ హెల్దీ డ్రింకా కాదా అనే అంశంపై తన తుది నిర్ణయాన్ని డిసెంబరు 19న ప్రకటించింది.ఈ నిర్ణయం టీ ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి ప్రపంచ టీ పరిశ్రమ వాదనలను ధృవీకరిస్తుందంటూ ఆనందం వెల్లువెత్తింది.అయితే ఇది కామెల్లియా సినెన్సిస్ (తేయాకు) నుండి తీసుకోబడిన టీకి మాత్రమే వర్తిస్తుందని ఎఫ్డీఐ స్పష్టం చేసింది. ఐదు కేలరీల కంటే తక్కువ ఉన్న నీరు, టీ , కాఫీ వంటి పానీయాలు మాత్రం "ఆరోగ్యకరమైన" హోదాకు అర్హత పొందుతాయని ఎఫ్డీఏ పేర్కొంది. అయితే, చామోమిలే, పిప్పరమెంటు, అల్లం, లావెండర్, మందార, శంఖంపువ్వు (అపరాజిsత) లేదా మసాలా టీతో సహా ఇతర హెర్బల్ టీలకు "ఆరోగ్యకరమైన" ఈ గుర్తింపు వర్తించదని ఏజెన్సీ స్పష్టం చేసింది. కామెల్లియా సైనెన్సిస్ను కొన్ని క్యాన్సర్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలకు ముందస్తు పరిశోధనలను కూడా ఎఫ్డీఏ అంగీకరించింది.నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్ (NETA), ఇండియన్ టీ అసోసియేషన్ (ITA) U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కూడా కామెల్లియా సినెన్సిస్ టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించడాన్ని స్వాగతించాయి. దేశంలోని అతిపురాతన టీ ఉత్పత్తిదారుల సంస్థ ఇండియన్ టీ అసోసియేషన్ (ITA), ఇది ల్యాండ్మార్క్ నిర్ణయంగా అభివర్ణించింది. అటు ప్రపంచ తేయాకు పరిశ్రమకు ఇది "అద్భుతమైన వార్త" అంటూ అమెరికా టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటర్ ఎఫ్. గోగీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ చైర్మన్ బిద్యానంద బోర్కకోటి కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్డీఏ గుర్తింపు, టీ ఆరోగ్య ప్రయోజనాల నేపథ్యంలో టీని ఒక వెల్నెస్ ,జీవనశైలి పానీయంగా ప్రచారం చేయాలని తాము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్ -
ఎనిమిది సార్లు కారు బోల్తా పడితే.. తాపీగా ‘టీ ఉన్నాయా?’ అని అడిగారంట
జైపూర్ : ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ఐదుగురు ప్రయాణికులతో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంది. అయితే, మార్గం మధ్యలో జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎస్యూవీ క్షణాల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది.ఊహించని పరిణామంతో స్థానికంగా ఉన్న ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. కారు తుక్కు తుక్కు అయ్యింది. ప్రమాద తీవ్రత ఉన్నప్పటికీ వాహనంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024అన్నా.. టీ ఉన్నాయా?స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ కారులో నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఊహించని ఘోర ప్రమాదంలో కారు దిగిన నలుగురు ప్రయాణికులు స్థానికంగా ఉన్న కార్ షోరూంలోకి వెళ్లారు. అనంతరం, షోరూం సిబ్బందిని ‘టీ ఉన్నాయా’? అని అడిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారు ప్రయాణికులు స్పందించిన తీరుపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. నాగౌర్ నుండి బికనీర్ వరకు ప్రయాణంప్రమాద సమయంలో ఎస్యూవీ నాగౌర్ నుండి బికనీర్కు వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫిర్యాదు ఆధారంగా ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించే పనిలో ఉండగా.. మితిమీరిన వేగం కూడా ఓ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఎలా బోల్తా పడిందో మీరూ చూసేయండి. -
'ఉసిరి టీ' గురించి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంట్లోనే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉండే టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎన్నో రకాల హెర్బల్ టీలు విని ఉంటారు. ఈ టీ గురించి అస్సలు విని ఉండరు. గ్రీన్ టీకి మించి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టీ ఏంటనే కదా..మనం ఎంతో ఇష్టంగా పచ్చళ్లు పట్టుకునే తినే ఉసిరితో ఈ టీ తయారు చేస్తారు. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.కావాల్సినవి: ఉసిరి, చూర్ణంపుదీనా ఆకులు-4అల్లం-1 అంగుళం -క్యారమ్ విత్తనాలుతయారు చేయు విధానం..ఒక గ్లాస్ నీటిని మరిగించి..అందులో పైన చెప్పిన పదార్థాన్నీ వేసి కాసేపు తిరగబడనివ్వాలి. ఆ తర్వాత వడకట్టండి అంతే అదే ఉసిరి టీ. ప్రయోజనాలు..గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో మొత్తం పది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందట. వివిధవ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. గ్రీన్ టీ కంటే ఇదే మంచిదా..?పులుపు పడని వాళ్లు దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇది యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. తీసుకునే మోతాదును బట్టి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..) -
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్
ఒసేయ్.. తల పగిలిపోతుంది కాసింత టీ పొయ్యవే ..గట్టిగా భార్య భారతి మీద అరిచాడు సూర్యం.రండి..రండి.. చాన్నాళ్ళకు వచ్చారు కూర్చోండి.. టీ తాగుతారామామా చికాగ్గా ఉంది అలా వెళ్లి మంచి అల్లం టీ తాగి వద్దాం రా మామా పిలిచాడు రామకృష్ణహలో అమీర్ భాయ్ దో చాయ్ దేదో కేకేశాడు లక్ష్మణ్ఇలా చినుకులు పడుతుండగా అలా నీ కళ్ళలోకి చూస్తూ వేడివేడి టీ పెదాలను తాకుతుంటే అచ్చం నిన్ను ముద్దాడినట్లె ఉంటుంది ప్రియా.. పొయిటిక్ గా చెబుతున్నాడు దీపక్తెల్లారి ఆరైంది ఇంకా టీ లేకపోతే ఎలాగూ..కోడలు పిల్లా నాకూ మీ మామయ్యకు స్ట్రాంగ్ ఇలాచి టీ తీసుకురామ్మా.. ఆర్థర్ వేసింది అత్త అనసూయఈరోజు బోర్డు మీటింగ్..మంచి టీ ఓ ఇరవై చెప్పండి.. చెక్ లిస్టులో రాసేసాడు ఎండీపిల్లాడికి జ్వరం..దగ్గు ఉంది .కాస్త అల్లం టీ ఇవ్వండి గొంతు రిలీఫ్ వస్తుంది.. ఓ డాక్టర్ సూచనట్రైనెక్కి అరగంట అయింది ఇంకా టీ కుర్రాడు రాలేదేంటి..కిటికీలోంచి చూస్తూ గొనుక్కున్నాడు రాకేష్సర్ మీకు ఏ టీ తేమ్మంటారు.. అల్లం టీ..ఇలాచి టీ..గ్రీన్ టీ.. లెమన్ టీ.. హెర్బల్ టీ.. ఏదిమ్మంటారు అడిగింది ఎయిర్ హోస్టెస్..పొద్దంతా రిక్షా లాగి లాగి తల వాచిపోతోంది.. ఓ టీ పడితే తప్ప ఇంకో ట్రిప్ లోడ్ ఎత్తలేను అంటూ టీ బంక్ వైపు పరుగుతీసాడు నర్సయ్యదేశంలో ఎక్కడ ఏ స్థాయిలో .. ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా వారిమధ్య వారధి టీ.. దేశ రాజకీయాలన్నీ చర్చకు వచ్చేది కూడా టీ బంకుల దగ్గరేటకీమని మూడ్ మార్చేస్తుంది..మనసు బాగా లేకపోయినా.. ఒంట్లో బాలేకపోయినా.. ఇంట్లో బాలేకపోయినా ఏ ఇద్దరి మధ్య గొడవ అయినా సరే ...ఇలాంటి ఎన్నో చిన్నచిన్న సమస్యలను టీ చటుక్కున పరిష్కరించేస్తుంది.. అడగ్గానే డబ్బు సరిపోక.. భర్త నక్లెస్ కొనలేదని మూడు రోజులుగా జగడమాడి మాటలు మానేసి అటు తిరిగి మూతి ముడుచుకుని కూర్చున్న ప్రశాంతి సాయంత్రం చిన్నగా వర్షం పడుతున్న వేళ ఎలాగైనా శ్రీమతిని మచ్చిక చేసుకోవాలని మూడు రోజులుగా భర్త శ్రీకాంత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తనకు ఇష్టమైన యాలకుల టీ చేసి రెండుకప్పుల్లో పోసి ఒక కప్పును ప్రశాంతి ముందుకు జరిపి ఏమంటుందో ఏమో అని కాస్త భయంతో బెదురు చూపులు చూస్తున్న శ్రీకాంత్ కు ఆఫర్ తగిలేసింది.. ఘమాఘమలాడే టీ సువాసనతో ప్రశాంతి కోపం కూడా ఆవిరైపోయింది. భర్తను దగ్గరకు తీసుకుని నెక్లెస్ ఏముంది..డబ్బులున్నపుడు కొందాం లెండి అంటూ అల్లుకుపోయింది.విద్యార్థులను మేల్కొలిపే ఆత్మీయ హస్తం టీఇప్పటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయ సాధించేందుకు గంటలు గంటలు.. ఒక్కోసారి నైట్ అవుట్.. అంటే తెల్లార్లు చదవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నిద్ర మేల్కొని ఉండేందుకు.. శరీరం డస్సిపోకుండా ఉండేందుకు.. కోల్పోయిన శక్తిని మళ్లీ రీచార్జ్ చేసుకునేందుకు. చదివింది మైండ్ లోకి ఎక్కేందుకు .. నిద్ర రాకుండా.. మూత పడిపోకుండా ఉండేందుకు కూడా టీ ఆత్మీయ మిత్రుల పక్కనే నిలబడి ఉంటుంది. ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని పుస్తకం పట్టుకుని కూర్చున్నారు అంటే ఇక ఆ సిలబస్ అంతు తేల్చేయాల్సిందే. రెప్పల మూతపడుతున్న తరుణంలో.. లేవయ్యా.. బోలెడు సిలబస్ ఉంది నిద్రపోతే ఎలా.. అంటూ ఆ టీ కప్ మనల్ని నిద్రలేపి పుస్తకం వైపు చూసేలా చేస్తుంది..సర్జరీలు చేసి అలసిపోయే డాక్టర్లు.. వేల కిలోమీటర్లు ప్రయాణాన్ని అలవోకగా పూర్తిచేసే డ్రైవర్లు.. పరిశోధన విద్యార్థులు శాస్త్రవేత్తలు ఒకరేమిటి,. అన్ని రంగాల వారికి టి అనేది ఒక ఔషధం.. అందమైన వ్యసనం.. ఉదయం పూట సూర్యోదయాన్ని చూస్తూ.. ఆ వెచ్చదనాన్ని టీ కప్పులో ఆస్వాదించడం కొందరికి ఒక ఇష్టమైన దినచర్య. సాయంత్రం వేళ కొండల్లోకి వెళ్లిపోతున్న సూర్యుని చూస్తూ మళ్ళీ ఓ టీ తీసుకోవడం మరికొందరికి ప్రియమైన ప్రక్రియ. ఇలా అన్నివర్గాల వారినీ కలిపి ఉంచే టీ కి కూడా అన్ని సందర్భాల్లో ఓ గౌరవప్రదమైన స్థానం ఉంది. అందరం టీ తాగుదాం.. ఆరోగ్యంగా ఉందాం.- సిమ్మాదిరప్పన్న -
నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ని కరిగించే బెడ్టైమ్ 'టీ'..!
చాలామంది బానపొట్టతో ఇబ్బంది పడుతుంటారు. ఏ డ్రెస్ వేసుకోవాలన్న ఇబ్బెట్టుగా ఈ పొట్ట కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాస్త శారీరక శ్రమతో పట్టుదలతో కష్టపడితే బెల్లీఫ్యాట్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు జస్ట్ ఈ టీతో నిద్రపోతున్నప్పుడే ఈ ఫ్యాట్ని కరిగించేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ఖ్యాతీ రూపానీ. రాత్రిపూట చిరుతిళ్లకు బదులుగా ఈ బొడ్డు బస్టింగ్ టీని సేవించడం మేలని అన్నారు. ఇంతకీ ఏంటా 'టీ'? అదెలా తయారు చేస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ టీ కోసం..వాము, సొంపు గింజలు: వాము శరీంలోని అధిక నీటి శాతాన్ని తగ్గించి, పొట్ట ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇక సొంపు జీర్ణక్రియకు, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.పసుపు: ఇది ప్రసిద్ధ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్హౌస్. ఇది శరీర కొవ్వుని నియంత్రించడంలో సమర్ధవంతంగా ఉంటుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. పైగా పరోక్షంగా బరువుని కూడా తగ్గిస్తుంది. ధనియాలు: ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి. ఇది కూడా బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. తయారీ విధానం: టేబుల్ స్పూన్ వాము, సొంపు తీసుకోవాలి. దీనికి 1/4 టీస్పూన్ తాజా పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలను జోడించాలి.ఆ తర్వాత 500-600 ml నీరు పోసి స్టవ్పై బాగా మరిగించాలి. 15 నిమిషాల తర్వాత వడకట్టి వేడివేడిగా ఆస్వాదించాలి. ప్రయోజనాలు..హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా PCOS, అడెనోమయోసిస్ సమస్యలకు చెక్ పెడుతుంది. జీవక్రియ, ఇన్సులిన్ పనితీరును మెరుగ్గా ఉంచుతుందిబరువు నిర్వహణకు ఉపయోగపడుతుందిమంచి నిద్రను ప్రోత్సహిస్తుందినిద్రవేళల్లో ఈ టీని ఆరోగ్యకరంగా తయారుచేసుకుని తాగితే బెల్లీఫ్యాట్ కరగడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని పోషకాహారనిపుణురాలు ఖ్యాతీ రూపానీ చెబుతున్నారు.(చదవండి: అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!) -
చాయ్ తాగేందుకు వెళితే ఏకంగా ప్రాణమే పోయింది!
మూసాపేట: టీస్టాల్ వద్ద కొందరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్పల్లికి చెందిన గంటిమల్ల వెంకటరమణ (22) ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. ఈ నెల 22న రాత్రి కూకట్పల్లిలోని దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద సమోసాలు తింటున్నాడు. అదే సమయంలో చెన్నబోయిన పవన్, అతడి సోదరుడు చెన్నబోయిన శ్రీధర్ తమ చెల్లెలు, మరదలితో కలిసి అదే టిఫిన్ సెంటర్వద్దకు టీ తాగేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణ అతని స్నేహితులు పవన్ చెల్లెలు, మరదల్ని కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చెన్నబోయిన శ్రీధర్ బానోత్ సురేష్, గుంటుక అజయ్ కుమార్ అనే యువకులకు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. నలుగురు కలిసి వెంకటరమణపై దాడి చేశారు. పవన్ హోటల్లో ఉన్న చపాతి కర్రతో వెంకటరమణ తలపై మోదాడు కొద్దిసేపు ఘర్షణ పడిన ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 23న ఉదయం వెంకటరమణ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పరీక్షించి తలకు లోపల బలమైన గాయంకారణంగా మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు చెన్నబోయిన పవన్, చెన్నబోయిన శ్రీధర్, బానోతు సురేష్, గుంటుక అజయ్ కుమార్లను అరెస్టు చేసి రిమాడ్కు తరలించారు. -
రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం సాగించి మూడేళ్లలో ఏకంగా రూ.33.61 కోట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. అసలు కాలేజీ డ్రాపవుట్ అయ్యాక తాను ఏ బిజినెస్ ఎంచుకున్నాడు.. తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.డారియన్ క్రెయిగ్(31) కొన్ని కారణాల వల్ల కాలేజ్ డ్రాపవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇళ్లు గడవడం ఇబ్బందిగా ఉండడంతో చిన్న ఉద్యోగం చేరాడు. ఒకరోజు ఆఫీస్కు వచ్చిన క్రెయిగ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. తాను ఉద్యోగం కోల్పోయే నాటికి తన బ్యాంకు అకౌంట్లో కేవలం 7 డాలర్లు(రూ.600) ఉన్నాయి. తాను ఎలాగై జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం తన చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్ సాయంతో 300 డాలర్లు(రూ.25,000) అప్పుచేసి వ్యాపారం మొదలు పెట్టాడు. ‘వైఆల్ స్వీట్ టీ’ పేరుతో టీ బిజినెస్ ప్రారంభించాడు. 2021లో మొదలుపెట్టిన ఈ వ్యాపారం అభివృద్ధి చెంది మూడేళ్లలో ఏటా రూ.33.61 కోట్ల ఆదాయం సమకూర్చే స్థాయికి ఎదిగింది.వెంచర్ క్యాపిటలిస్ట్ల నుంచి విశేష ఆదరణయునైటెడ్ స్టేట్స్లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ ద్వారా నేరుగా వినియోగదారులకు తమ టీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సుమారు 600 రిటైల్ అవుట్లెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. విభిన్న ఫ్లేవర్లలో టీను అందిస్తున్నారు. ఇటీవల క్రెయిగ్, ఎకోల్స్ తమ కంపెనీ విస్తరణకు వెంచర్ క్యాపిటలిస్ట్ల సాయం కోరగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతాకష్టాలు సహజం.. సరైన నిర్ణయాలు ముఖ్యంఉద్యోగం రాలేదనో, డబ్బు లేదనో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్రెయిన్, ఎకోల్స్లాగా జీవితంలో కష్టపడి ఎదుగుతున్నవారు కోట్లల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం.. సొంత పార్టీ కార్యకర్త టీ దుకాణం కూల్చివేత
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కసుతో జనసేన కార్యకర్త నిర్మించుకున్న టీ దుకాణాన్ని జనసేన ఎమ్మెల్యే కూల్చివేయించారు. సర్పవరం భావన నారాయణ స్వామి ఆలయం సమీపంలో మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు మూడు నెలల క్రితం టీ దుకాణాన్ని నిర్మించుకున్నారు.అయితే, బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొనాలంటూ కొద్ది రోజుల కిందట బాలరాజుతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం జనసేన నాయకులు మంతనాలు జరిపారు. స్థలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే ఇవాళ టీ దుకాణాన్ని పంచాయితీ అధికారులు కూల్చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపిస్తున్నారు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు బాలరాజు చెబుతున్నారు.ఇదీ చదవండి: జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి -
యంగ్ హీరోయిన్ సింప్లీసిటీ.. రోడ్డు పక్కన టీ తాగిన ముద్దుగుమ్మ!
తెలుగులో వరుస సినిమాలతో మెప్పించిన కన్నడ బ్యూటీ శ్రీలీల. గతేడాది భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన ముద్దుగుమ్మ.. నితిన్ సరసన రాబిన్హుడ్ చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్లోనూ నటిస్తోంది. వీటితో పాటు ఓ బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పినా భామ.. ఇటీవల ఆ మూవీ నుంచి తప్పుకుంది.ప్రస్తుతం శ్రీలీల తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడులో అరకులో ఫ్యామిలీతో కలిసి కనిపించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో కనిపించింది. సామాన్యురాలిగా టీ తాగుతూ సందడి చేసింది. ఆమెను గమనించిన స్థానికులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రీలీల క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #TFNExclusive: The charming beauty @sreeleela14 snapped along with her family as she enjoys a tea break at Araku!!☕😍#Sreeleela #UstaadBhagatSingh #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/zNFABqBY3P— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024 -
HYD: బయట టీ తాగే వారు జాగ్రత్త.. నకిలీ టీ పౌడర్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రోజులో ఒక్కసారైనా టీ తాగినిదే ఏం పని తోచదు చాలా మందికి. ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినా సమాయనుసారం టీ చుక్కా నోట్లో పడాల్సిందే. కానీ షాపుల్లో, టీ కొట్టుల్లో ఎక్కువగా లూస్ టీపోడినే వాడుతుంటారు. ఇకపై బయట టీ తాగే సమయంలో చాయ్ లవర్లు కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నగరంలో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను ఆటకట్టించారు మధ్యమండలం టాస్క్ఫోర్స్ పోలీసులు. సనత్నగర్లోని ఓ కంపెనీపై దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. టన్నుల కొద్దీ నకిలీ టీపొడి స్వాధీనం చేసుకున్నారు.నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ పౌడర్ కలిపి కస్తే టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 పేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపారు. ఫతేనగర్కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ ఆండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు.తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమ య్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ. 80 ఖరీదు చేసే టీ పొడి, రయనాలు, రంగులు, ఫ్లేవర్స్తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజ్ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్థిస్తున్నాడు.ఈ టీ పొడిని ప్రతినిదులు ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు వచ్చిన టీ బుధవారం స్టాల్స్ కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న కార్యాలయ మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్ రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్నగర్ పోలీ సులకు అప్పగించారు. జగన్నాథ్పై ఇప్పటికే మోమిన్పేట్, సనత్ నగర్ ఠాణాల్లో మూడు అదే తరహా కేసులు ఉన్నాయని అయిన ప్పటికీ అతడు తన వంతా కొనసాగుస్తున్నాడని టీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ పొడి తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
ఈ ‘టీ’తో నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్పై ఇప్పటికే మోమిన్పేట్, సనత్నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
'టీ'లో బిస్కెట్స్ ముంచుకుని తింటున్నారా..?
మనం కొన్ని రకాల ఆహార పదార్థాలని పలు కాంబినేషన్స్లో తింటుంటాం. అయితే ఇలా తినడం అన్ని రకాల ఆహార పదార్థాలకు మంచిది కాదు. ఒక్కోసారి ఇలా తినడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కూడా. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. చాలామందికి విరామ సమయంలో 'టీ' తాగే అలవాటు ఉంటుంది. దీంతోపాటు బిస్కెట్లు తీసుకుంటుంటారు. ఇలా 'టీ'లో బిస్కెట్లు ఇముంచుకుని తినడం అలవాటు లేదా ఇష్టంగా ఉంటుంది కొందరికి. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో స్నాక్స్గా ఇలా తింటుంటారు కూడా. అయితే ఇది అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు ఎందుకంటే..మనం ఇలా చాయ్లో బిస్కెట్లు ముంచుకుని తినడం వల్ల అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందులోనూ ఈ బిస్కెట్లు ప్యాక్ చేయబడి ఉంటాయి. వీటిని శుద్ధి చేసిన మైదాపిండి, చక్కెరలతో తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా తింటామో రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఫలితంగా శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత తదితర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు.అంతేగాదు ఇది గట్ మైక్రోబయోమ్కు అంతరాయం కలిగిస్తుంది. పైగా మనం ఇలా తెలయకుండానే అధిక మొత్తంలో మైదా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది కాస్తా అధిక బరువుకి, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అలాగే అనేక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో పామ్ ఆయిల్ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ బిస్కెట్లు కూడా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాల్లోకే వస్తాయి. ఇందులో ఉపయోగించే పామాయిల్ గుండె సంబంధిత సమ్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. దీనికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ హెర్బల్ టీలను వినయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అవేంటంటే..హార్మోన్ బ్యాలెన్స్ 'టీ'లు..కొత్తిమీర సీడ్స్తో చేసే 'టీ' అదేనండి ధనియాలతో చేసే టీ. ఇది హైపోధైరాయిడజంతో సమర్థవంతంగా పోరాడుతుంది. మేతి సీడ్స్ 'టీ' మధుమేహం ఉన్నవారికి మంచిది. ఫెన్నెల్ అజ్వెన్ 'టీ' జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కరివేపాకు 'టీ' జుట్టు పెరుగుదలకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ హెర్బల్ 'టీ'లు హార్మోన్ల సముతుల్యత తోపాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అలాంటి పెర్ఫ్యూమ్స్ కొంటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!) -
రెండు 'టీ' లకు మించొద్దు..! లేదంటే ఆ సమస్య తప్పదు..!
రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు. టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్లో సుదీర్ఘ పరిశోధన చేశారు. కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.(చదవండి: కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!) -
గుళికల ప్యాకెట్ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
"నెయ్యి టీ"నా..! ఎన్ని లాభాలో తెలుసా?
గ్రీన్ టీ, బ్లాక్ టీ, నిమ్మ టీ వంటి ఎన్నో రకాల చాయ్లు గురించి విన్నాం. కానీ ఇదేంటి 'నెయ్యి టీ' అని అనుకోకుండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు వారంలో కనీసం రెండుసార్లు ఈ టీని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. మన దైనందిన జీవితంలో దీన్ని భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..'నెయ్యి టీ' అనేది కొత్తగా వచ్చిన వంటకం ఏం కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగించేవారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు చరక సంహితలో రోజువారీ వినియోగానికి అవసరమైన 11 ప్రధాన ఆహారాలలో దీన్ని ఒకటిగా చెప్పారు ఆయుర్వేద నిపుణులు. దీన్ని సాధారణ టీ మాదిరిగానే చేసుకుంటారు. అయితే చివర్లో ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే అదే నెయ్యి టీ. ఇది తాగేందుకు టేస్టీగానే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందట. అదెలా అంటే..?తక్షణ ఎనర్జీని పొందిన ఫీల్ లభిస్తుందట. అందువల్ల చిరుతిండులు తినాలనే కోరికన నివారించడమే కాకుండా ఎక్కువసేపు శక్తిమంతంగా ఉండొచ్చు.ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా శీఘ్ర శక్తిని పొందడంలో సహాయపడుతుంది.మలబద్ధకం, జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.ప్రకాశవంతంమైన చర్మాన్ని పొందొచ్చట. క్రమం తప్పకుండా తాగితే చర్మానికి మంచి పోషణను అందిస్తుందట. ఇందులో ఉండే విటమిన్లు, ఏ, డీ, ఈ, కేలు చర్మాన్ని హైడ్రేట్ చేసి, పునరుజ్జీవింప చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. బ్లడ్ షుగర్కి చెక్ పెడుతుంది.అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ఈ పానీయాన్ని కనీసం వారానికి రెండుసార్లు అయినా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో తీసుకోవడం మంచిదని అన్నారు. ముఖ్యంగా వ్యాయమాలు చేసేవాళ్లకు ఈ టీ మరింత మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. (చదవండి: రెడ్లైట్ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
నయన తార మెచ్చిన హైబిస్కస్ టీ : ఎన్ని మ్యాజిక్కులో
మన భారతదేశంలో మందార మొక్కకు ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దదే. మందార ఆకులు, పువ్వులు, పువ్వుల నుంచి తీసిన తైలం సౌందర్య ఉత్పత్తుల్లో అనాదిగా వాడుకలో ఉన్నవే. ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఈ మందార టీ తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది స్టార్ హీరోయన్ నయనతార.మందార పువ్వుల టీ, లేదా హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి .మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు , గుండె సంబంధిత వ్యాధులు,తదితర సమస్యలకు చక్కగా పనిచేస్తోంది. బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు, చర్మంపై వేడి కురుపులు రాకుండా కాపాడుతుంది. అలాగే హైబిస్కస్ టీ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్/అనారోగ్యం నుండి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) రోజూ మందార టీ తాగడం సురక్షితమేనా? అంటే నిక్షేపంలా తాగవచ్చు (మితంగా) మందారతో దాదాపు ఎలాంటి అలెర్జీలు ఉండవు. మందార టీ దేనికి మంచిది? మందార టీ వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాం. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది.హైపోలిపిడెమిక్ లక్షణాల వల్ల మధుమేహం వంటి బ్లడ్ షుగర్ డిజార్డర్స్తో బాధపడేవారికి అద్భుతాలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి , రక్త నాళాలు దెబ్బతినకుండా కాపాడటానికి దోహదం చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మన శరీర కణజాలం, కణాలలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడటం ద్వారా ఈ వ్యాధుల నుండి కాపాడుతుంది. మెరిసే చర్మం కోసం మందార టీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. హైబిస్కస్ టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇంకా మైరిసెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. హైడ్రేటెడ్గా ఉంచుతుంది కాబట్టి చర్మం మెరుపును కాపాడుతుంది.ఆరోగ్యకరమైన జుట్టుమందార టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెలనిన్ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. జుట్టుకు సహజమైన రంగును అందించి పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తుంది. జుట్టు తొందరగా తెల్లగా కావడాన్ని అడ్డుకుంటుంది. ఈ టీలో ఉన్న అమైనో ఆమ్లాలు మీ శరీరంలో ఎక్కువ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇది కుదుళ్లు గట్టి జుట్టు ఒత్తుగా, షైనీ ఉంచేందుకు మ్యాజిక్లా పనిచేస్తుంది.ఇంకా రక్తపోటు నియంత్రణలోనూ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి) సమృద్ధిగా ఉండటం వల్ల, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా ప్రసిద్ది చెందింది, ఇది సాధారణ అనారోగ్యాలను అరికట్టడంలో సహాయపడుతుంది ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం చికిత్సలోనూ పనిచేస్తుంది.మందార పూల టీ తయారీఎండ బెట్టిన మందార పూలను నీటిలో వేసి కొద్ది సేపు మరిగించాలి.దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసి మరికొద్దిసేపు మరిగించాలి. చక్కటి రంగు వచ్చిన తరువాత ఒక కప్పులోకి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. రుచికోసం ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఇంకా నిమ్మ, పుదీనాతో గార్నిష్ చేసుకొని చల్లగాగానీ, వేడిగా గానీ తాగవచ్చు. రెండు రోజులు ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. -
హెల్దీ తిండి.. కొత్త ట్రెండీ
వీలైతే నాలుగు రకాల స్నాక్స్.. కుదిరితే కప్పు కాఫీ.. సాయంత్రమైతే చాలు. విశాఖ వాసి మదిలో మెదిలో మొదటి ఆలోచన ఇదే. చిరుతిండి.. మన జీవితాల్లో భాగమైపోయింది. టీ తాగుతూ స్నాక్స్.. సాయంత్రం సరదాగా స్నాక్స్.. ఇంటికి చుట్టాలొస్తే స్నాక్స్.. చినుకుపడినా.. సమయమేదైనా.. స్నాక్స్ తిందాం మిత్రమా అన్నట్లుగా చిరుతిళ్లపై మనసు మళ్లిస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చిరుతిళ్లలోనూ ఆరోగ్యాన్ని వెదుకుతున్నారు. విశాఖ సహా 30 నగరాల్లో స్నాక్స్ విక్రయాలు, ప్రజల ఇష్టాయిష్టాలపై ప్రముఖ స్నాక్స్ తయారీ సంస్థ ఫార్మ్లే విడుదల చేసిన ది హెల్దీ స్నాకింగ్–2024 నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. చిరుతిళ్లలో పోషకాల స్నాక్స్ వేరయా.. అవే మాకు ఇష్టమయా అంటూ 73 శాతం మంది చూసి మరీ తింటున్నారంట. మార్కెట్లోకి బెస్ట్ స్నాక్స్ ఏమొచ్చాయో అని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది వెతుకుతున్నారని నివేదిక చెబుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. టీ, కాఫీ తాగుతున్నప్పుడు వేడి వేడి సమోసా లేదంటే.. బిస్కెట్లు ఉండాల్సిందే. లంచ్, డిన్నర్కి మధ్య స్నాక్స్ టైమ్ ఫిక్సయిపోయింది. అందుకే భారతీయులకు చిరుతిండి ఇష్టంగా మారిపోయింది. అయితే ఇటీవల ఆహార పదార్థాల కల్తీపై ఆందోళనల నేపథ్యంలో.. స్నాక్స్ ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నారు. భారతీయులు ఎలాంటి స్నాక్స్ ఇష్టపడుతున్నారనే వివరాలను తెలుసుకునేందుకు ఫార్మ్లే దేశవ్యాప్తంగా 30 నగరాల్లో సర్వే చేసింది.ఈ వివరాలతో ది హెల్దీ స్నాకింగ్–2024 అనే నివేదికను విడుదల చేసింది. నగరంలోనూ సర్వే నిర్వహించగా.. ఆకలేస్తే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి రెండు బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లు లేదా బేకరీకి వెళ్లి సమోసా తినే రోజులు పోయాయని విశాఖ వాసులు చెప్పారంట.! కొనేది చిన్న ప్యాకెట్ అయినా.. అందులో ఏం ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి? వాటిలో పోషకాల విలువెంత? అవి తింటే వచ్చే అనర్థాలేమైనా ఉన్నాయా? ఇలా ప్రతి విషయంలోనూ మిస్టర్ పర్ఫెక్ట్లమని తెగేసి చెబుతున్నారు. మార్కెట్ ట్రెండ్.. మారిపోయిందండోయ్.. ప్రస్తుతం ఫుడ్ ప్యాకేజీ మార్కెట్ని స్నాక్స్ సంస్థలే శాసిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ.3.75 ట్రిలియన్ల ఫుడ్ ప్యాకేజీ ఇండస్ట్రీ ఉండగా.. ఇందులో 33.4 శాతం వరకూ స్నాక్స్, స్వీట్స్ పరిశ్రమలు ఆక్రమించేసుకున్నాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్ని ఇష్టపడుతున్నారని తెలిసి.. వాటి తయారీ పైనే ఆసక్తి చూపిస్తున్నాయి. శరీరంలో తక్కువ కొవ్వు ఉత్పత్తి చేసే పాపింగ్, బేకింగ్, ఎయిర్ఫ్రైయింగ్, వాక్యూమ్ ఫ్రైయింగ్ మొదలైన ప్రాసెస్ విధానంలో తయారు చేసే స్నాక్స్ ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన స్నాక్స్తో పోలిస్తే 75 శాతం కేలరీలను తగ్గిస్తాయనే ఉద్దేశంతో ఎయిర్ ఫ్రయర్ స్నాక్స్కే మొగ్గు చూపుతున్నారు.బ్రాండెడ్ స్నాక్స్ కావాలి ఒకప్పుడు స్నాక్స్ ప్యాకెట్ తీసుకుంటే కేవలం ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్నాక్స్ కొనుగోలు చేసినప్పుడు ఫస్ట్ అవి బ్రాండెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు. అంతేకాదండోయ్.. ప్రతి 100 మందిలో 73 మంది మాత్రం అందులో పోషకాలు ఏం ఉన్నాయి.? సోడియం కంటెంట్ ఎంత ఉంది.? అవి తినడం వల్ల కొవ్వు శరీరంలో పెరుగుతుందా లేదా.? ఆరోగ్యానికి హానికరమైన ముడిపదార్థాలేమైనా ఉన్నాయా అనేది కచ్చితంగా చెక్ చేస్తున్నారు.మిల్లెట్ల వైపు దృష్టి.. ఇప్పుడిప్పుడే స్నాక్స్ ప్లేస్లో మిల్లెట్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం సమయంలో బిస్కెట్, సమోసా, బజ్జీ, ఆలూ చిప్స్ మొదలైన వాటి స్థానాలను బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, తృణధాన్యాలు, మొలకలు ఆక్రమించేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ మిల్లెట్స్ను ప్యాకేజింగ్ ఫుడ్గా మార్చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2025 నాటికి మిల్లెట్ స్నాక్స్ 20 శాతానికి చేరుతాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.స్నాక్స్ ప్లేస్ను పప్పుగింజలు ఆక్రమించుకుంటున్నాయి ఒకప్పుడు ఇంట్లో స్నాక్స్ తయారు చేసి.. వాటినే తినేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్యాకేజ్డ్ స్నాక్స్ రావడంతో వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని తెలుసుకున్నారు. దీంతో స్నాక్స్ స్థానాన్ని పప్పుగింజలు ఆక్రమించేసుకున్నాయి. ముఖ్యంగా బాదం, పిస్తా వంటివాటికే ఓటేస్తున్నారు. ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగినంతగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్, విటమిన్ ఈ వంటివి ఉండే బాదంను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తృణధాన్యాలు, పప్పుగింజలు పోషకాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అందుకే చిరుతిళ్లలో పప్పుగింజలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. – షీలా కృష్ణస్వామి, పోషకాహార నిపుణురాలు -
రకుల్ ప్రీత్ ‘ఫెన్నెల్ టీ’ పోస్ట్ వైరల్, దీని లాభాలేంటో తెలుసా?
అందానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేనటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రమంగా జిమ్ చేస్తూ, బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చే రకుల్ ప్రీత్ తాజాగా ఒకటీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అసలు ఏంటీ ఫెన్నెల్ టీ, దీని ప్రయోజనాలేంటి అనేది హాట్ టాపిక్గా మారింది. మరి ఫెన్నెల్ టీతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?ఫెన్నెల్ టీ అంటే సోంపు గింజలతో తయారు చేసే టీ. దీన్నే ఫెన్నెల్ సీడ్స్ వాటర్, లేదా ఫెన్నెల్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజూ ఉదయం ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోపు గింజలను నీటిలో వేసి కాచడం ద్వారా ఫెన్నెల్ టీని తయారు చేస్తారు. దీని రుచి చిరు చేదుగా, చక్కటి సువాసనతో ఉంటుంది. శతాబ్దాలుగా దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఫెన్నెల్ టీ ఎలా తయారు చేయాలిఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఫెన్నెల్ గింజలను తీసుకుని వాటిని రెండు కప్పుల నీటిలో మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లబడిన తరువాత గానీ, వేడి వేడిగా కానీ సేవించవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో ఫెన్నెల్ టీ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఫెన్నెల్ టీ లాభాలుసోంపు గింజలలో ఉండే విటమిన్ సీ ఐరన్, ఖనిజాలు నిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షణ అందిస్తుంది. ఫెన్నెల్ టీ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సోంపు గింజలలో అనెథోల్ వంటి నూనెలు జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియలో సాయపడతాయి. సోంపు గింజలలో కార్మినేటివ్ గుణాలు ప్రేగు కదలికలను మెరుగు పరుస్తాయి. జీర్ణశయాంతర ప్రేగులలోని కండరాలను ప్రేరేపించి, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సాయపడతాయి. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అజీర్ణం, గుండెల్లో మంటకు ఉపశమనం లభిస్తుంది. మధుమేహులకు లేదా డయాబెటిస్ రిస్క్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. సోంపు గింజల వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. వయస్సు-సంబంధిత మచ్చలు తగ్గుతాయి. కంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.సోంపు గింజలలో పొటాషియం ఉంటుంది. సోంపు గింజలలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయ పడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఫెన్నెల్ టీ పీరియడ్స్ క్రాంప్ల నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది. ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కండరాలకు శాంతి కలుగుతుంది. దీంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది. -
భార్యతో టీ తాగుతూ.. మనీష్ సిసోడియా భావోద్వేగ సెల్ఫీ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి పదిహేడు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం(ఆగస్టు10) ఉదయం ఇంట్లో తన భార్యతో కలిసి టీ తాగుతూ తీసుకున్న సెల్ఫీ చిత్రాన్ని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. आज़ादी की सुबह की पहली चाय….. 17 महीने बाद!वह आज़ादी जो संविधान ने हम सब भारतीयों को जीने के अधिकार की गारंटी के रूप में दी है।वह आज़ादी जो ईश्वर ने हमें सबके साथ खुली हवा में साँस लेने के लिए दी है। pic.twitter.com/rPxmlI0SWF— Manish Sisodia (@msisodia) August 10, 2024ఈ సందర్భంగా ‘17 నెలల తర్వాత.. ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్. భారతీయులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నుంచి వచ్చిందే ఈ స్వేచ్ఛ’అని తన ట్వీట్కు సిసోడియా భావోద్వేగపూరిత కామెంట్స్ జత చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో లిక్కర్స్కామ్ కేసులో అరెస్టయిన సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. -
వాడేసిన టీ పొడితో అందాన్ని పెంచుకోవచ్చు! ఎలాగో తెలుసా..!
టీ తయారు చేశాక సాధారణంగా టీ పొడిని వడకట్టి బయటపడేస్తారు. అలాగే టీ బ్యాగులను కూడా పడేస్తారు. అందులో మిగిలిన టీ పొడితో అందాన్ని పెంచుకోవడమే కాదు, ఇంటిని మెరిపించుకోవచ్చు. చాలామందికి టీతోనే రోజు ప్రారంభమవుతుంది. చెప్పాలంటే.. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం టీ తాగాల్సిందే. టీ తయారు చేసిన తర్వాత, టీ పొడి మిగిలిపోతుంది. దీనిని తరచూ చెత్తగా భావించి చెత్తబుట్టలో వేస్తాం. ఈ పనికిరాని టీ పొడితో ఇంటి శుభ్రతను నుంచి అందం వరకు పలు రకాలుగా ఉపయోగించొచ్చు. అదెలాగో సవివరంగా చూద్దాం. !అద్దాలు శుభ్రం చేసేందుకు..టీ పొడితో ఇంటి అద్దాలను పాలిష్ చేయవచ్చు. దీని కోసం, మిగిలిన టీ ఆకులను నీటిలో మరిగించండి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి దాని సహాయంతో అద్దాలను శుభ్రం చేస్తే అద్దాలు తళతళ ప్రకాశిస్తాయి. దీనితో పాటు, గ్యాస్ బర్నర్లు ఎంత నల్లగా మారినా, మీరు వాటిని నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. టీ నీటిలో కొద్దిగా డిష్ వాష్ మిక్స్ చేసి బ్రష్ సహాయంతో క్లిన్ చేస్తే గ్యాస్ బర్నర్లను తళతళ మెరిసిపోతాయి..పాదాల దుర్వాసనరోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాల్లో తరచూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు మిగిలిపోయిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి చల్లారాక ఆ నీటిలో మీ పాదాలను 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజూ చేస్తే పాదాల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.నేచురల్ షైనింగ్..మిగిలిపోయిన టీ పొడి జుట్టుకు ఒక వరం. ఇది శిరోజాలకు నేచురల్ షైన్ జోడించడానికి పనిచేస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం, టీ పొడిని శుభ్రమైన నీటిలో మరిగించాలి. మరిగిన తర్వాత నీళ్లు చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటితో తలస్నానం చేయాలి. కొద్ది రోజుల్లోనే జుట్టు సిల్కీగా మెరుస్తూ ఉంటుంది. మొక్కలకు ఎరువుగా..ఇంట్లో పెంచుకునే మొక్కలకు సహజ ఎరువుగా టీ పొడి ఉపయోగపడుతుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు ఉంటే ఈ టీ పొడివాటి ఎదుగుదల రెట్టింపు అయ్యేలా చూసుకోవచ్చు. మిగిలిపోయిన టీ పొడిని కంపోస్టులా మొక్కల కుండీల్లో వేసేయండి. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే పంచదార కలిపిన టీ పొడిని మాత్రం బాగా కడిగి అప్పుడు వినియోగించండి.(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !) -
టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!
ప్రతిభ ఎవ్వరి సొత్తు కాదు. ఎందరో మట్టిలో మాణిక్యాలు విద్యతో తమ ప్రతిభాపాటవాలను చాటుకుని ఔరా అనిపించుకున్నారు. సకల సౌకర్యాలు తల్లిదండ్రులు సమకూర్చినా..చదువు అబ్బదు కొందరు పిల్లలకి. మరి కొందరూ కటిక దారిద్ర్యంలో మగ్గిపోతూ కూడా సరస్వతి కటాక్షం మెండుగా ఉంటుంది వారికి. అయితే వారి తల్లిదండ్రులు కనీస సౌకర్యాలు ఇవ్వలేని స్థితిలో ఉంటారు. చెప్పాలంటే ఉన్నత చదువులు చదివే సత్తా ఉన్న ధనలక్ష్మీ అనుగ్రహం లేక విలవిల్లాడుతుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ అమ్మాయి. ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. వివరాల్లోకెళ్తే.. ఢిల్లీకి చెందిన అమితా ప్రజాపతి మురిక వాడలో నివశించే టీ అమ్మే వ్యక్తి కూతురు. ఎంతో కష్టపడి సీఏ ఉత్తీర్ణురాలయ్యింది. అందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. ఈ భావోద్వేగపూరిత క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అమిత. ఆ పోస్ట్లో అమిత..తాను టీ అమ్మే వాళ్ల కూతురునని, తన చదువుకు విషయమై చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు డబ్బు ఆదా చేసి ఇల్లు కట్టుకోమని చెప్పేవారు. ఎదిగిన కూతుళ్లతో ఎంతకాలం వీధుల్లో ఉంటారిని సూటిపోటీ మాటలు అనేవారు అంతా. అయినా వాళ్లు అమ్మాయిలు చదివి డబ్బులు సంపాదించినా వేరు వాళ్ల పరమే అవుతుందని ఉచిత సలహాలు ఇచ్చి బాధపెడుతుండేవారిని ఆవేదనగా పోస్టులో తెలిపింది. అంతేగాదు ఏదో ఒక రోజు తాను తన తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సి వస్తుందన్న ఆలోచన తనకు రాలేదని, బదులుగా తన కూతుళ్లను బాగా చదివించుకోవాలన్న కసి పుట్టిందని అంటోంది.ఈ రోజు తాను సాధించిన విజయం నిజమా..? కలనా..? అని సంభమాశ్చర్యంలోనే ఉన్నానంటూ భావోద్వేగంగా చెబుతోంది. పదేళ్ల కష్టం ఫలించిందని, ఏ నాటికైనా ఉత్తీర్ణురాలినవ్వాలంటూ ఆశగా ఎదురుచూశానని పోస్ట్లో పేర్కొంది. ఈ ఆనంద క్షణానికి ఉబ్బితబ్బిబై తనం తండ్రిని హగ్ చేసుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. అందుకు సంబధించిన వీడియోకి "భావోద్వేగపు క్షణం" అనే క్యాప్షన్తో జోడించి మరీ పోస్ట్ చేసింది అమిత. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. This is Amita Prajapati of Delhi, who said her father(Chai seller) ignored jibes from relatives and faced financial difficulties to ensure she could study. She finally cracked the CA exam after a decade of hard work and realized her dream. pic.twitter.com/iauQpgfyI1— Kakul Misra (@KakulMisra) July 21, 2024 (చదవండి: ఆటో డ్రైవర్గా మైక్రోసాఫ్ట్ ఇంజనీర్..ఎందుంటే..?) -
వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా
విమానంలో వేడి టీ సర్వ్ చేస్తున్నపుడు కుదుపులకు గురవడంతో ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో సదరు విమాన సంస్థపై ప్యాసింజర్ ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు (రూ.12.5 కోట్లు) దావా వేశారు.ప్రయాణికురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం..తహజానా లూయిస్ అనే మహిళా ప్యాసింజర్ తన కుటుంబంతో మే 15న ఓర్లాండో నుంచి కనెక్టికట్లోని హార్ట్ఫోర్డ్కు ‘జెట్బ్లూ ఫ్లైట్ 2237’ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి సీట్బెల్ట్ పెట్టుకోవాలనే సిగ్నల్ వచ్చింది. అదేమీ పట్టించుకోకుండా విమాన సిబ్బంది వేడి టీ సర్వ్ చేయడానికి సిద్ధం అయ్యారు. కానీ అప్పటికే సీట్బెల్ట్ వార్నింగ్ రావడంతో విమానం కుదుపులకు గురైంది. దాంతో వేడి టీ ప్రయాణికురాలి శరీరంపై పడి ఛాతీ, కాళ్లు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో కనీసం విమాన సిబ్బంది ప్రథమ చికిత్స కూడా చేయలేదు.ప్రయాణికురాలు గాయాల నుంచి కోలుకున్నాక ఇటీవల విమాన ఘటనపై కోర్టును ఆశ్రయించారు. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో ఈమేరకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంస్థ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర గాయాలపాలయ్యానని తెలియజేస్తూ 1.5 మిలియన్ డాలర్లు(రూ.12.5 కోట్లు) దావా వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం విమానంలో సీట్బెల్ట్ సిగ్నల్ వచ్చినపుడు వేడి పానీయాలు, భోజన సేవలను నిలిపేయాలి.ఇదీ చదవండి: జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టుఇదిలాఉండగా, మే నెలలో సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దాంతో ఒక ప్యాసింజర్ గుండెపోటుతో మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
‘టీ’పాట
‘చాయ్ హోటల్కు ఎందుకు వెళతారు?’ అనే ప్రశ్నకు–‘చాయ్ కోసమే వెళతారు’ అనే జవాబు మాత్రమే వినిపిస్తుంది. అయితే సూరత్లోని విజయ్భాయి పటేల్ అలియాస్ డాలీ చాయ్వాలా అలియాస్ సింగింగ్ చాయ్వాలా హోటల్కు ‘పాట’ కోసం వెళతారు. డాలీ చాయ్వాలా కస్టమర్లకు వేడి వేడి టీ అందిస్తూనే, మైక్రోఫోన్లో అద్భుతంగా పాడుతుంటాడు. ఆయన గానం వింటూ ‘మరో చాయ్’ అనే మాట కస్టమర్ల నోటి నుంచి వినిపించడం అక్కడ సాధారణ దృశ్యం. ఈ ‘సింగింగ్ చాయ్వాలా’కు సంబంధించిన వీడియో క్లిప్ను ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ బయాని ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేస్తే వైరల్ అయింది. -
భ్రుకు టీ ముడిపడే సీన్!
శివుని జటాఝూటంలోని గంగ గురించి మనకు తెలుసు. అయితే ఇరానీ మోడల్ శిరోజాలలోని ‘టీపాట్’ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. హెయిర్ స్టైల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ‘టీ పాట్ హెయిర్స్టైల్’ గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండం. ఇరాన్కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ సైదెహ్ ‘టీపాట్ హెయిర్స్టైల్’ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహో వోహో’ అంటున్నారు. ఈ వీడియో నాలుగు మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. హెయిర్ పిన్స్తో మోడల్ సబుర్ నగర్కు పోనీ టెయిల్ వేసింది. ఆ తరువాత మెటల్ వైర్లు, గ్లూ గన్తో టీపాట్ స్ట్రక్చర్స్ను సెట్ చేసింది. ఈ శిరో టీపాట్లో టీ ΄ోసి ఆ తరువాత కప్పులోకి ఒంపి తాగింది. ‘ఫ్యాషన్ స్టైల్ అనేది ఎన్నో వెరైటీలకు కేంద్రం. హెయిర్ స్టైల్కు సంబంధించి సహజంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నాను. రెండు రోజుల కృషి ఫలితమే ఈ విజయం. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు’ అని తన ఇన్స్టాగ్రామ్ ΄ోస్ట్లో చెప్పింది సైదేహ్. -
అడగకుండా నీళ్లు తాగాడని..
మియాపూర్: తమను అడగకుండా నీళ్లు తీసుకున్నాడని టీ స్టాల్లో పనిచేసే ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన చాకలి సాయిలు (35)కు భార్య మీనా ఇద్దరు కుమారులు మహి, కిరణ్ ఉన్నారు. బీరంగూడలో ఉంటూ మియాపూర్లోని లారీలలో ఇసుకను ఖాళీ చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాయిలు ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు మియాపూర్ వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేసి ఉదయం ఇంటికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటలకు పనికి వచ్చి లారీలలోని ఇసుకను ఖాళీ చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున దాహం వేస్తోందని మియాపూర్లోని రాజారామ్ కాలనీ సమీపంలో ఉన్న సురక్ష టీ స్టాల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాడు. నీళ్లు తాగుతుండగా టీ స్టాల్లో పని చేస్తున్న సతీష్ అనే యువకుడు సాయిలుతో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత సాయిలు అక్కడి నుంచి సమీపంలో ఉన్న కూలీల అడ్డా వద్దకు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత టీ స్టాల్లో పనిచేసే సతీష్ పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు వెళ్తుండగా మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. స్నేహితులకు ఫోన్ చేసి.. రప్పించి.. సతీష్ ఆగ్రహంతో సమీపంలో ఉన్న స్నేహితులు భాను, లక్ష్మణ్ అలియాస్ లక్కీలకు ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురూ కలిసి సాయిలుపై దాడికి దిగారు. సమీపంలోని కూలీలు విడిపిస్తున్నా వినకుండా తీవ్రంగా కొట్టి సాయిలును స్కూటీపై తీసుకుని టీ స్టాల్ వద్ద పడేసి వెళ్లిపోయారు. స్థానికులు, కూలీలు చూసేసరికి సాయిలు మృతిచెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువు నాగారం సాయిలు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. సాయిలు హత్యకు గురయ్యారడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి కూలీలు మియాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని న్యాయం చేయాలంటూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
సౌందర్యమైన ‘బ్లూ టీ’ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో! ఎలా చేసుకోవాలి?
ఆధునిక కాలంలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. పోషకాలతో నిండిన ఆహారం, పానీయాలు, హెర్బల్టీ పై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, బరువును అదుపులోఉంచుకునే హెర్బల్ టీల గురించి తెలుసుకుంటున్నారు. మరి అపరాజిత పువ్వులు, ఈ పువ్వులతో తయారు చేసుకునే ‘బ్లూ టీ’ ప్రయోజనాలు గురించి తెలుసా? తెలుసుకుందాం రండి!అపరాజిత, వీటినే శంఖుపుష్కాలు , బటర్ఫ్లై పీ అని కూడా అంటారు. తెలుగు, నీలం, ముదురు నీలం రంగుల్లో ఈ పూలు పూస్తాయి. ఈ పువ్వులతో తయారు చేసిన టీని తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ‘బ్లూ టీ’ గా పాపులర్ అయిన ఈ టీతో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. పలు వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అపరాజిత ప్రస్తావన ఉంది. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. లక్షణాలతో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ టీతాగడం బరువు తగ్గినట్టు అధ్యయనాల్లో రుజువైంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.యాంటీ-డయాబెటిక్, యాంటీ-కేన్సర్ లక్షణాలుకూడా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలోని యాంటిథ్రాంబోటిక్ లక్షణం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బ్లూటీ తయారీనాలుగు నీలిరంగు అపరాజిత పువ్వులను తీసుకొని ఒక కప్పు నీళ్లలో బాగా మరిగించాలి. నీళ్లు నీలం రంగులోకి మారతాయి. తరువాత, దీన్ని ఒక కప్పులోకి ఫిల్టర్ చేసుకొని హనీ, లేదా పంచదార, నిమ్మకాయ కలపుకుని తాగవచ్చు. ఇందులో తురిమిన అల్లం కూడా వేసుకోవచ్చు. -
అల్లం టీ పెట్టిన సీఎం.. మురిసిపోయిన జనం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోవైపు సీఎం నిరాడంబరతను చాలామంది మెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన నైనిటాల్లో బస చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక పని ప్రజల దృష్టిని ఆకర్షించింది.ధామీ క్రమంతప్పక మార్నింగ్వాక్ చేస్తుంటారు. తాజాగా ఆయన మార్నింగ్ వాక్ సమయంలో రోడ్డు పక్కగా ఉన్న ఒక టీ దుకాణాన్ని గమనించారు. తరువాత అక్కడికి వెళ్లి, స్వయంగా అల్లాన్ని తరిగి టీ పెట్టారు. దీనిని గమనించిన అక్కడున్న వారంతా సీఎం చుట్టూ చేరారు. సీఎం వారిని కుశలప్రశ్నలు వేశారు. ఇంతటి సింప్లిసిటీ కలిగిన సీఎం దొరకడం తమకు లభించిన వరమని అంటూ అక్కడున్నవారంతా మురిసిపోయారు. అనంతరం సీఎం ఆ పక్కనే మైదానంలో ఆడుకుంటున్న క్రీడాకారులను పలుకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. -
లెమన్గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!
మనం ఎన్నో రకాల టీల గురించి విన్నాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటి పలు పానీయాలు గురించి కూడా విన్నారు. అలాంటి కోవకు చెందిన నిమ్మగడ్డి టీ గురించి విన్నారా. దీని వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. జీర్ణక్రియ దగ్గర నుంచి బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు ఈ టీ. అలాంటి ఈ లెమన్గ్రాస్ టీని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభలేంటో సవివరంగా తెలుసుకుందామా..!లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం..కావాల్సినవి:నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!. మధుమేగ్రస్తులు బెల్లం ఉపయోగించొచ్చు లేదా వేయకుండా తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు..దీనిలో ఉండే సిట్రల్ జెరేనియల్ గుండె జబ్బులు, స్ట్రోక్లు వంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ కేన్సర్ సామర్థ్యాలను కలిగి ఉంది. లెమన్ గ్రాస్లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్తో పోరాడటంలో సహాయపడతాయి. సెల్ డెత్కు కారణమయ్యే వాటిని నివారించేలా రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్తో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల నిమ్మరసం మూత్ర ఉత్పత్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుందిబరువు తగ్గడంలో సహాయపడుతుంది జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. రుతుక్రమంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం వంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది. ఇది ఎంత సురక్షితమైనదైనప్పటికీ అతిగా తాగితే దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు. అవేంటంటే..తల తిరగడంఆకలి పెరగటంనోరు పొడిబారడంతరుచుగా మూత్రవిసర్జన అలసటదద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భవతిగా ఉన్నట్లయితే, వాళ్లలో తక్కువ హృదయ స్పందన రేటు లేదా తక్కువ పొటాషియం స్థాయిని కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో లెమన్గ్రాస్ టీని తాగకూడదు.(చదవండి: హెయిర్ పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా? నిపుణులు వార్నింగ్) -
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్లో రెస్టారంట్ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా? -
కాఫీ, టీలకు బ్రేక్: ఇలా ట్రై చేద్దామా..!
ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు చాలామందికి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి. తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, యాపిల్, బీట్రూట్ లాంటివాటితో జ్యూస్ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్లవద్దు. వీటిల్లో ఫైబర్ ఉండదు,పైగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జింజర్ టీ, హెర్బల్ టీపొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అల్లం, తులసి, పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్. జింజర్ టీతాగవచ్చు. కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్ను బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి. తాగకూడనివిసోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి. -
కేన్సర్ను జయించే టీ పార్టీలు
ముంబైలో విజి వెంకటేశ్ నిర్వహించే టీ పార్టీలకు నలుగురూ ఉత్సాహంగా వస్తారు. కారణం– కొన్ని కబుర్లు నడుస్తాయి. దాంతోపాటు కేన్సర్ను నివారించే జీవన విధానం తెలుస్తుంది. కేన్సర్ బాధితులకు అండగా నిలిచే వీలూ దొరుకుతుంది. 71 ఏళ్ల విజి వెంకటేశ్ గత రెండు దశాబ్దాలుగా కేన్సర్పై చైతన్యం కలిగిస్తోంది. విజి వేంకటేశ్ కృషి....‘కేన్సర్ అంటే ఇంకా జనంలో భయం పోలేదు. మాట్లాడటానికి జంకుతారు. టీ అందరికీ ఇష్టం. తాగుతూ కబుర్లు చెప్పుకున్నంత సాధారణంగా కేన్సర్ గురించి మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, బాధితులకు చేయదగ్గ సాయాన్ని గుర్తు చేయడం గురించే నేను టీ పార్టీలు– చాయ్ ఫర్ కేన్సర్ నిర్వహిస్తున్నాను’ అని తెలిపారు విజి వెంకటేశ్. ముంబైకి చెందిన 72 ఏళ్ల ఈ సేవా కార్యకర్త దక్షిణ ఆసియాలో కేన్సర్ బాధితుల సహాయానికి పని చేస్తున్న ‘ది మ్యాక్స్ ఫౌండేషన్’కు ప్రధాన బాధ్యతలు నిర్వరిస్తోంది. ‘మేము చాలా హాస్పిటల్స్తో మాట్లాడాము. దిగువ ఆదాయ వర్గాల్లో కేన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా ఛారిటబుల్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కాని సమస్య ఏమిటంటే... ఆ పేషెంట్లు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి దారి ఖర్చులు వారి వద్ద ఉండవు. మందులు కొనుక్కోవడానికి, తగిన ΄ûష్టికాహారం తినడానికి వీలుండదు. అలాంటి వారికి సహాయం అందించడమే నా లక్ష్యం. అందుకు టీ పార్టీలకు స్నేహితులను పిలుస్తాను. వారి సహాయం కోరుతాను’ అంది విజి వెంకటేశ్.కార్మికులను చూసి...విజి వెంకటేశ్ ముందు ఒక సాధారణ కార్యకర్తగానే సేవా రంగంలోకి వచ్చింది. ముంబైలోని కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ కోసం నాలుగు చందాలు వసూలు చేసి పెట్టడం ఆమె పని. చిన్న చిన్న వాడల్లోకి వెళ్లి చందాలు అడిగితే వాళ్లు తమ దగ్గర ఉన్నదాంట్లో ఇరవై రూపాయలో, ముప్పై రూపాయలో ఇచ్చేవారు. మరోవైపు వారంతా కార్మికులు కనుక ధూమపానం వల్ల, ఇతర అలవాట్ల వల్ల ఎక్కువగా కేన్సర్ బారిన పడటం విజి గమనించింది. ‘ఒక కేన్సర్ పేషెంట్తో టెస్ట్లు చేయించుకుని, మందులు తీసుకోవచ్చు కదా అనంటే అతను దాని బదులు నా పిల్లలకు పాలు కొనివ్వగలిగితే నాకు ఎక్కువ సంతోషం అన్నాడు. ఆ జవాబు నన్ను కదిలించింది. ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులకు జీవితాంతం సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను’ అని తెలిపింది విజి.చాయ్ పార్టీ 4 లక్షలువిజి తన టీ పార్టీలకు స్నేహితులను, బంధువులను పిలుస్తుంది. ఆమె సంస్థ, కృషి గురించి విన్న అపరిచితులు కూడా వచ్చి టీ పార్టీలో కూచుంటారు. కేన్సర్ అవగాహన కార్యక్రమం ఉంటుంది. దాంతో పాటు సరదా పాటలు, మాటలు నడుస్తాయి. చివరలో విజి దిగువ ఆదాయ వర్గాల కేన్సర్ బాధితుల కోసం చందాలు కోరుతుంది. ‘ప్రతి టీ పార్టీలో కూడా విశేష స్పందన వస్తుంది. అప్పటికప్పుడు వారికి తోచింది ఇస్తారు. ఒకోసారి 4 లక్షల రూపాయల వరకూ వస్తాయి. అక్కడ ఉన్నవారు వేరే ఫ్రెండ్స్కు కాల్ చేసి మరీ డబ్బులు వేయిస్తారు’ అని తెలిపింది విజి.18 వేల మందికివిజి తన సంస్థ ద్వారా ముంబై, మహరాష్ట్రలోని 18 వేల మంది కేన్సర్ బాధితులకు సహాయం అందిస్తోంది. వారి చికిత్సకు, మందులకు, పరీక్షలకు డబ్బు ఏర్పాటు చేస్తుంది. ఒకోసారి కుటుంబ పరిస్థితి కూడా గమనించాల్సి ఉంటుంది. ‘తగిన వైద్యం అందితే చాలామటుకు కేన్సర్ నుంచి బయటపడొచ్చు. ఆ వైద్యం అందే పరిస్థితుల కోసం మనందరం తలా ఒక చేయి వేయాలి’ అందామె.ప్రస్తుతం దేశంలో 30 చోట్ల విజి సంస్థ కోసం టీపార్టీలు జరుగుతున్నాయి. మిగిలినప్రాంతాల్లో కూడా ఇలాంటివి నిర్వహించి నిధులు కేన్సర్ బాధితులకు అందేలా చేయొచ్చు. -
'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..
చాలామంది రోజుని ఓ కప్పు 'టీ'తో ప్రారంభిస్తారు. చక్కగా పాలతో చేసుకునే 'టీ' అంటేనే చాలమంది ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. అయితే ఈ 'టీ'ని తయారీలో చాలామంది మంచి చిక్కటి 'టీ' కోసం అదేపనిగా మరిగిస్తుంటారు. కాస్త మరిగిన 'టీ'నే మంచి రుచి అని చాలామంది ఫీలింగ్. అయితే ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి చిక్కటి టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరీ ఎలా ప్రిపేర్ చేసుకుని తాగితే మంచిదంటే..ప్రతి ఒక్కరూ టీని పలు విధాలుగా తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. కొందరూ 'టీ'ని ఆకులతో చేయడానికి ఇష్టపడతారు. మరికొందరూ కొద్దిగా పాలను, చక్కెరను జోడించి తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేసేటప్పుడూ బాగా మరిగిస్తుంటారు. కొందరూ చల్లారిపోవడం వల్ల మరేదైన కారణం వల్లనో తరుచుగా అదేపనిగా వేడిచేసి తాగుతుంటారు. ఇలా కూడా అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా బాగా మరిగిపోయిన చిక్కటి 'టీ' తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా 'టీ' తాగడం వల్ల బరువు తగ్గుతారు, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడైతే అదే పనిగా కెఫిన్ పానీయాన్ని ఇలా వేడి చేస్తుంటామో అది మన ఆరోగ్యాన్నికి హానికరంగా మారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. 'టీ'లో టానిన్లు ఉంటాయి. దీనిలో పాలీఫెనోలిక్ జీవ అణువులు ఉంటాయి. అది ప్రోటీన్లు, సెల్యులోజ్, పిండి పదార్థాలు, ఖనిజాలతో బంధించే పెద్ద అణువులు. ఎప్పుడైతే టీని మరిగిస్తామో ఇవి కరగని పదార్థాలుగా మారి శరీరంలోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అసలు బాగా మరిగించిన 'టీ' తాగడం వల్ల తలెత్తే దుష్ప్రభావాలేంటంటే..పోషకాల నష్టంటీని నిరంతరం ఉడకబెట్టడం వల్ల పాలలో ఉండే కాల్షియం, విటమిన్లు B12, సీవంటి పోషకాలు క్షీణిస్తాయి.రుచి మార్పుపాలను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల మాడిన వాసనలాంటి రుచిలా ఉంటుంది. అజీర్ణంఅతిగా ఉడకబెట్టడం వల్ల పాలలోని ప్రొటీన్ల డీనాటరేషన్కు దారి తీస్తుంది, వాటి నిర్మాణాన్ని మారుస్తుంది. ఫలితంగా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తి కడుపునొప్పి, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.అసిడిటీ సమస్య..టీని మరిగించడం వల్ల దానిలో ఉండే పీహెచ్ మారుతుంది. మరింత ఆమ్లంగా మారుతుంది. హానికరమైన మిశ్రమాలుఅధిక ఉష్ణోగ్రత కారణంగా మెయిలార్డ్ వంటి హనికరమైన మిశ్రమాలను ఏర్పరుస్తుంది.క్యాన్సర్ కారకాలుమరిగిన టీలో యాక్రిలామైడ్ వంటి మిశ్రమాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. ఎంతలా మరిగిస్తే అంతలా ఈ క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి.టీ తయారీకి సరైన వ్యవధి..కచ్చితంగా చెప్పాలంటే టీ తయారీకి జస్ట్ ఐదు నిమిషాలు చాలు. ఎక్కువసేపు కాయడం వల్ల టీలోని గుణాలు ఆక్సీకరణం చెందుతాయి. దీని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. ఉత్తమ పద్ధతి..టీ అనంగానే పాలు పంచదారు, టీ పొడి వేసి మరిగించడం కాదంటున్నారు నిపుణులు. సరైన మార్గం ఏంటంటే..?. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసుకుని, అందులో ఒక టీస్పూన్ టీ పొడి లేదా ఆకులను వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించాలి. దానిలో కొద్దిగా వేడి చేసిన పాలు, చక్కెర వేసి..కప్పు టీని చక్కగా ఆస్వాదించండి. ఇలా చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కూడా. (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..) -
అలసిన దేహానికో'టీ'..! భారత్లో మొదటిసారిగా..
పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. తాగాల్సిందే టీ అంటూ టీ ప్రియులు చెబుతున్నారు. చెమటలు కక్కే వేడిలోనూ పొగలుకక్కే చాయ్ తాగుతున్నారు. చాయ్ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఆస్వాదిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గ్లాసు మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇవ్వాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు టీ అత్యంత ఇష్టమైన పానీయం. అలాంటి టీకి ఒక రోజు ఉంది. 2005 నుంచి ఏటా మే 21న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.1793 నుంచే..అలిసిన మనసుకు, దేహానికి ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం టీ. అరె భాయ్ చటుక్కున తాగరా చాయ్.. అంటూ ఓ సినీగేయ రచయిత టీ గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట రాశాడు. ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చాయ్ అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. మొట్టమొదటగా మన దేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్ గార్డెన్లో లార్డ్ మెకార్డి టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంటింటికీ టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్దే. అంతర్జాతీయంగా 30శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వినియోగిస్తున్నారు.సహజమైన పానీయం..టీ సహజమైన పానీయం. ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాదలో మొదట చేరిపోయేది ‘టీ’. స్నేహితులు కాలక్షేపానికి టీ పాయింట్కు చేరాల్సిందే. సమావేశాల్లోనూ తేనీటిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం బయట రకరకాల కేఫ్లు వెలుస్తున్నాయి. టీలలో కూడా చాలా రకాలు తయారు చేస్తున్నారు. అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, కరోనా టీ రకరకాల టీలను టీ ప్రియులు ఆస్వాదిస్తున్నారు. మండల కేంద్రాల్లో సైతం ప్రస్తుతం వివిధ కంపెనీలు వివిధ పేర్లతో టీ పాయింట్లు ఏర్పాటు చేసి ఒక కప్పు చాయ్కు రూ.10లకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. కానీ పలువురు టీ వ్యాపారులు ఇప్పటికీ రూ.5లకే టీ విక్రయిస్తున్నారు.ఇవి చదవండి: నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ! -
అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
ప్రతి ఏడాది మే 21వ తేదీ అంతర్జాతీయ టీ దినోత్సవం( International Tea Day! జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019న తీర్మానించింది. దీంతో ఏటా ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీని ఘనంగా నిర్వహిస్తున్నాయి. టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.చరిత్రఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5వేల ఏళ్ల క్రితం చైనాలో మొదటిసారిగా టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్లను నిర్వహిస్తూ సమావేశమవుతాయి.పొద్దుపొద్దునే వేడి వేడి చాయ్ కడుపులో పడితేగానీ హాయిగా ఉండదు చాలామందికి. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది టీ. చుట్టాలు వచ్చినా ముందుగా గుర్తొచ్చొది టీ. అలాంటి టీలో ప్రపంచం నలుమూలల ఉన్న వెరైటీలు ఏంటో చూద్దామా..మాచా, జపాన్: గ్రీన్ టీ ఆకులతో ప్రాసెస్ చేసిన టీ పొడి. ఆకుపచ్చరంగులో ఉండే టీ. జపాన్లో ఈ టీ బాగా ఫేమస్. ఇది మట్టి రుచిని కలిగి ఉంటుంది. ముందు సిప్ చేస్తే చేదుగా ఉండి రానురాను మాధుర్యంగా ఉంటుంది. దీన్ని ఐస్డ్ టీ, ఐస్క్రీమ్లు, ఇతర డెజర్ట్లలో కూడా ఉపయోగించింది.టెహ్ తారిక్, మలేషియా: టెహ్ తారిక్ అనేది మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ వేడి పాల టీ పానీయం. సాధారణంగా నురుగుతో ఉంటుంది. 'తే తారిక్' అనే పేరుకు "తీసి తీసిన టీ" అని అర్ధం. ఈ తీపి టీలో ఉడికించిన, స్ట్రాంగ్ బ్లాక్ టీ, ఆవిరైన క్రీమర్, పాలు ఉంటాయి. మరింత రుచిగా ఉండేలా ఏలకులను కూడా జోడించవచ్చు. చా యెన్, థాయిలాండ్: చా యెన్ ఒక ప్రసిద్ధ థాయ్ ఐస్డ్ టీ. ఇది మంచి రిఫ్రెష్ నిచ్చే పానీయం. ఇది బ్లాక్ టీ, రూయిబోస్ టీ, స్టార్ సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, పాలు, పంచదారతో తయారు చేసే పానీయం. ఇది తీపి, క్రీము, సుగంధ రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొబ్బరి పాలను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు. చా యెన్ని ఐస్ముక్కలతో సర్వ్ చేస్తారు.మసాలా చాయ్: భారతదేశం ఇది చాలా ఫేమస్. చాలా మంది భారతీయులు తమ రోజును ప్రారంభించేందుకు లేదా సాయంత్రం విశ్రాంతి తీసుకోనే టైంలో ఈ మసాలా చాయ్ని ఆస్వాదిస్తారు. ఇది బిస్కెట్లు, రొట్టెలు లేదా పకోరస్ వంటి భారతీయ స్నాక్స్తో కూడా బాగా జత చేస్తుంది. మసాలా చాయ్ని మొదటగా వేడినీటిలో ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, అల్లం, సోపు గింజలు వంటి మొత్తం మసాలా దినుసులను టీ ఆకులు వేసి బాగా మరిగిస్తారు. ఆ తర్వాత పాలు జోడించి, కావాల్సిన రంగు వచ్చేలా టీని తయారు చేసుకోవాలి. చాలా మంది ప్రజలు తమ కప్పు మసాలా చాయ్ను ప్రిపేర్ చేసేందుకు చక్కెర లేదా బెల్లం కూడా కలుపుతారు.సిలోన్ బ్లాక్ టీ, శ్రీలంక: సిలోన్ అనేది శ్రీలంకకు పూర్వపు పేరు, దీనిని ఇప్పటికీ టీ వ్యాపారంలో ఉపయోగిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఈ బ్లాక్ టీ స్ట్రాంగ్ రుచిని కలిగి ఉంటుంది. ఇది పూల వాసనలా ఉండి గొప్ప రంగును కలిగి ఉంటుంది. దీన్ని కూల్గా లేదా వెచ్చగా ఆస్వాదించవచ్చు. మీరు దీన్ని ఐస్డ్ టీ లేదా వెచ్చని బ్లాక్ టీగా ఆస్వాదించవచ్చు. -
అలాంటి పదబంధాలను ఉపయోగించొద్దు! నటి పద్మాలక్ష్మి
ఇటీవల మన తెలుగు వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవొకగా చేరిపోయాయి. మనం కూడా వాటికే అలవాటు పడిపోయాం. తెలుగు, ఆంగ్లం మిక్స్ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో కొన్ని అర్థరహితమైన పదబంధాలను వినియోగిస్తున్నాం. వాటినే గుర్తు చేసి అవి ఎంత అర్థ రహితమో వివరిస్తున్నారు భారత సంతతి అమెరికన్, రచయిత్రి టీవీ నటి పద్మాలక్ష్మి. తప్పుగా ఉపయోగిస్తున్న గమ్మత్తైన పదబంధాలేంటో చూద్దామా..!చాలామంది 'చాయ్ టీ'కి పోదామా అంటుంటారని పద్మాలక్ష్మి చెబుతున్నారు. అస్సలు ఇది ఎంత చెత్త పదబంధమో ఒక్కసారి చూడండంటూ వాటి అర్థం గురించి వివరించారు. నిజానికి చాయ్ అంటే టీ మళ్లీ దానికి టీ అనే పదాన్ని కూడా జోడిస్తున్నాం. అంటే టీ టీ అని అర్థం వస్తుంది. అందుకే చాయ్ టీ వద్దు. ఆ పదం లేదు. అని సవివరంగా చెప్పారు. అలాగే ఘుమఘమలాడే 'అల్లం టీ' కావాలంటే మసాలా టీ అనండి చాలు అంటున్నారు. అలాగే చాలామంది 'గీ బట్టర్' అని అంటారు ఇది కూడా తప్పే ఎందుకంటే.. వెన్న, నెయ్యి వేరువేరు అది గుర్తించుకోండి అని చెబుతున్నారు పద్మాలక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తాము కూడా విన్న అలాంటి పదబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్ చాలామంది ఏటీఎం మిషన్ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు పదబంధం. ఏటీఎం అంటేనే(ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్). అలాంటప్పుడు మళ్లా మిషన్ ఎందుకు వ్యాఖ్యానించడం అని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మరో నెటిజన్ ఇలాంటి తప్పు పదబంధాలు భారత్లోని స్టార్బక్స్ మెనూలో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అక్కడ ఆహార మెనులో ఇలానే 'చాయ్ టీ' ఉండటం విచారకరం అంటూ పోస్ట్ పెట్టాడు. (చదవండి: బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!) -
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
మన దేశంలో టీ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. తేనీరులో అనేక రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రుచి అంటే ఇష్టం. ఏదిఏమైనా టీ లేకుండా చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక ప్రేమ జంట విక్రయిస్తున్న టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ప్రేమ జంట తయారు చేసే టీ, వారు ఏర్పాటు చేసిన టీ స్టాల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటూ, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జార్ఖండ్లోని రాంచీలో వీరు ఈ వినూత్న టీ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రేమ జంట మనీష్, పుతుల్ కుమారి ఇద్దరూ కలసి ఈ టీ స్టాల్ను ప్రారంభించారు. ఓ కంపెనీలో కలుసుకున్న వీరు ఈ రోజు సొంతగా టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.మనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను శారదా గ్లోబల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశానని, ఆ తర్వాత గోద్రెజ్ టెక్ మహీంద్రాలో పనిచేశానని తెలిపారు. అదే సమయంలో పుతుల్ను కలిశానని, తాము ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నామన్నారు. తాము ఏదో ఒక వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని ఈ టీ స్టాల్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం రాంచీలోని తమ స్టాల్ ఎంతో ఆదరణ పొందుతున్నదని, ఇక్కడికి టీ తాగడానికి చాలామంది వస్తుంటారని తెలిపారు.తమ పాకెట్ మనీతో ఈ స్టాల్ ఓపెన్ చేశామని మనీష్ తెలిపారు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి, క్రమంగా దానిని విస్తరించాలనుకున్నామన్నారు. తాము మట్టి కుండలో రకరకాల టీలను అందిస్తామని తెలిపారు.ప్రస్తుతం తాము రోజూ సాయంత్రం టీ దుకాణం తెరిచి, 500 కప్పుల టీలు విక్రయిస్తున్నామని తెలిపారు. రాంచీలో మరిన్ని టీ స్టాల్స్ తెరవాలనేది తమ కల అని, ఏ పని అయినా ప్రాణం పెట్టి చేస్తే విజయం సాధిస్తామని మనీష్ తెలిపారు. తాము ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామని, భవిష్యత్తులో ఈ సంబంధాన్ని కొనసాగిస్తామని మనీష్ పేర్కొన్నారు. -
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
పనివేళ్లల్లో కాస్త 'టీ బ్రేక్' ఎంతో హాయినిస్తుంది. కడుపులో కాసింత టీ పడగానే హమ్మాయ్యా..! అనిపిస్తుంది. వెంటనే ఉత్సాహంగా పనిచేసుకుంటాం. కాస్త సమోసాలు, పేస్ట్రీలు, వంటి ఇతర స్నేక్స్ ఐటెమ్స్ ఏం తిన్నా.. ఆ తర్వాత కచ్చితంగా 'టీ' సిప్ చేయాల్సిందే. అలాంటి చాయ్లను ఎన్నో రకాలుగా తయారు చేసి అందిస్తున్నాయి పలు కేఫ్లు. వాటిల్లో 'ఇరానీ చాయ్' టేస్ట్ మాత్రం అందరి మనసులను దోచుకుంది. సరదాగా బయటకు వెళ్లి తాగాలనుకుంటే ఇరానీ చాయ్ సిప్ చేస్తే చాలు అనుకుంటారు చాలామంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. మరీ ఆ ఇరానీ చాయ్ ఎక్కడ నుంచి మన నగరానికి వచ్చింది..? దాని మూలం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!ఇరానీ చాయ్ హిస్టరీ..జొరాస్ట్రియన్ ఇరానియన్లు పర్షియా దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చినప్పుడూ..ఈ చాయ్ పరిచయమయ్యిందని చెప్పొచ్చు. వీళ్లు మన దేశానికి 18, 19వ శతాబ్దాలలో వచ్చారట. అయితే 18వ శతాబ్దంలో వచ్చినవారిని పార్సీలు అనిపిలిచేవారట. వారు గుజరాత్, బొంబాయిలలో స్థిరపడిపోయారు. అయితే 19వ శతాబ్దంలో వచ్చిన వాళ్లు మాత్రం వివిద ప్రాంతాలకు చెదిరిపోయారు. పార్సీలు ప్రధానంగా గుజరాతీ మాట్లాడుతుండగా, తర్వాత వచ్చినవారు మాత్రం ప్రధానంలో పార్సీలోనే సంభాషించడంతో వాళ్లని ఇరానియన్లు లేదా ఇరానీలుగా గుర్తించారు. వారు వస్తూ..వస్తూ..తమ మాతృభూమికి సంబధించిన ప్రత్యేకమైన చాయ్ రుచిని చూపించారు. అలా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఈ వలసదారులు కేఫ్లను ఏర్పాటు చేయడంతో దీని రుచి ప్రజలకు పరిచయమయ్యింది. వాళ్లు మొదట బొంబాయి,పూణే నుంచి హైదరబాద్కు వలస రావడం జరిగింది. అలా మన హైదరాబాద్ ఈ ఇరాన్ కేఫ్లకు సెంటర్గా మారింది. అందువల్లే దీన్ని హైదరాబాదీ చాయ్ లేదా ఇరానీ దమ్ చాయ్ అని పిలుస్తారు. ఇక హైదరాబాద్లో ది బెస్ట్ ఇరానీ చాయ్లు ఏవంటే..ది బెస్ట్ ఇరానీ చాయ్లు..గ్రాండ్ హోటల్హైదరాబాద్లోని కోటీలో 1935లో ఈ హోటల్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రద్దీగా ఉండే ఫేమస్ హోటల్గా స్థిరపడిపోయింది. ఈ హోటల్ బిర్యానీతో సహా అనేక స్థానిక డిలైట్లకు ప్రసిద్ధి చెందింది. ఈ చాయ్ని వారు సంప్రదాయ పద్ధతిలో చిక్కటి క్రీమ్ మాదిరిగా తయారు చేస్తారు. ధర వచ్చేసి రూ. 150/-కేఫ్ నీలోఫర్ఇరాన్కు చెందిన నిజాం కోడలు ఈ కేఫ్కి నామకరణం చేసిందట. ఇది 1978 నుంచి ప్రసిద్ధ బ్రేక్ఫాస్ట్లకు ఫేమస్. ఇక్కడ తాజాగా కాల్చిన బన్ మాస్కా తోపాటు రిచ్ మలైతో కూడిన కడక్ చాయ్ లభిస్తుంది. ఇక్కడ ఇరానీ చాయ ధర రూ. 100/-కేఫ్ బహార్ఇది రంజాన్ సమయంలో బిర్యానీ, హలీమ్లకు ప్రసిద్ధి. ఇక్కడ ఉస్మానియా బిస్కెట్లు, క్రీమ్ బన్స్,రుచికరమైన కబాబ్లతో కూడిన తాజా టీ వంటి వాటి కోసం ప్రజలు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ కూడా ఇరానీ చాయ ధర రూ. 150/-బ్లూ సీ టీ అండ్ స్నాక్స్..నగరంలో మరొక ప్రసిద్ధ ఇరానీ బ్లూ సీ 1989లో ప్రారంభమైంది. ఇది దిబెస్ట్ టీ కేఫ్లో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ సర్వ్ చేసే ఇరానీ చాయ్ చాలా చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఎగ్ పఫ్లు, సమోసాలు, పేస్ట్రీలు, జామ్ రోల్స్ వంటివి కూడా దొరుకుతాయి. అయితే ఇక్కడ మాత్రం ఇరానీ చాయ్ కేవలం రూ. 50/-నిమ్రా కేఫ్ఓల్డ్ సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. నాంపల్లి రైల్వేస్టేషన్కి సమీపంలో ఉంటుంది. ఇది ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా ఇరానీ చాయ్ ధర రూ. 100/-(చదవండి: మెట్ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్! ఏకంగా 163 మంది..) -
National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులకు కొరత లేదు. ఇందులో గ్రీన్టీ, బ్లాక్ టీ ఇలా రకరకాల టీలు చాయ్ ప్రియులను ఉల్లాస పరుస్తుంటాయి. మరి బుబుల్ టీ అని ఒక ‘టీ’ ఉంది. దీని గురించిఎపుడైనా విన్నారా? ఈ రోజు(ఏప్రిల్ 30) నేషనల్ బబుల్టీ డే అట. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు. దీని వలన లాభాలేంటో ఒకసారి చూద్దామా..?బబుల్ టీ.. ఈ పేరే కొత్తగా ఉంది కదా. బబుల్ టీని బోబా లేదా పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో ముఖ్యంగా తైవాన్లో బాగా పాపులర్. అధిక ప్రోటీన్తో నిండి ఉంటుంది కనుక చైనా ధనవంతుల్లో దీనికి డిమాండ్ ఎక్కువ.బబుల్ టీని పాలు, పండ్లు, పండ్ల రసాలతో టీ కలిపి, చివర్లో టేపియోకా ముత్యాలను కలిపి సేవిస్తారు. దీన్ని శీతాకాలంలో వేడిగా, వర్షాకాలంలో చల్లగా సేవిస్తారు.అయితే, బబుల్ టీలో చక్కెర, కొవ్వులు ,సాధారణ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా మరియు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. మధుమేహం ,గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకని మితంగా తీసుకోవడమే ఉత్తమం.బబుల్ టీలో ఉపయోగించే టపియోకా ముత్యాలు కాసావా రూట్ నుండి తయారవుతాయిపైగా వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి అంతర్గతంగా అనారోగ్యకరమైనవి కానప్పటికీ, అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఈటీలో చేరతాయి.కేలరీల గని ఈ బబుల్ టీ. కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని రోజువారీ పానీయంగా కాకుండా అప్పుడప్పుడు తీసుకునే స్పెషల్ ట్రీట్గా మాత్రమే భావించాలి. సాధ్యమైనప్పుడు తక్కువ చక్కెర లేదా చక్కెరలేని స్వీట్నెర్లను, అలాగే క్యాలరీ ,కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు టపియోకా ముత్యాలకు బదులుగా ఫ్రూట్ జెల్లీలు లేదా అలోవెరా వంటి టాపింగ్స్ను వాడుకోవచ్చు. -
అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!
ఎన్నో విలాసవంతమైన వస్తువులను చూసుంటాం. వాచ్ల దగ్గర నుంచి హ్యండ్ బ్యాగ్లు, వ్యాలెట్ వరకు అత్యంత ఖరీదు పలికిన బ్రాండ్లు చూశాం. ఓ సాధారణ టీ కప్పు అత్యంత ఖరీదైనదిగా ఉంటుందంటే నమ్ముతారా. మహా అయితే రూ. 30 వేల నుంచి రూ. లక్ష రూపాయాల విలవు చేసే ప్రత్యేకమైన మెటీరియల్తో చేసి ఉండొచ్చు. అంతేగానీ మరీ ఇంత రేంజ్లో ధర ఉండదు. అంత ఖరీదైన టీకప్పు ఎక్కడ ఉందంటే.. జపనీస్ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ తకాషిమయాలో అత్యంత ఖరీదైన టీ కప్పు ఉంది. దీని ధర ఏకంగా రూ. 56 లక్షలు. దీన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంలో తయారు చేశారట. అమ్మకానికి వివిధ బంగారు వస్తువులను ప్రదర్శనగా ఉంచగా ఈ టీకప్పు దురదృష్టవశాత్తు అపహరణకు గురయ్యింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ వస్తువుని జేబులో వేసుకుని పారిపోతున్నట్లు వీడియో ఫుటేజ్లో కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. ఈ ప్రదర్శనలో దాదాపు వెయ్యికి పైగా టీవేర్ టేబుల్ వేర్ వంటి కళఖండాలు ఉన్నాయని, వాటిల్లో ఈ టీ కప్పు త్యంత ఖరీదైనదని అన్నారు తకాషిమయా స్టోర్ ప్రతినిధి. "తాము ఆ వస్తువులను అమ్మకానికి పారదర్శకమైన అన్లాక్ పెట్టేలో ఉంచామని, దీన్ని పసిగట్టిన కస్టమర్లు సులభంగా బయటకు తీసి ఉండొచ్చు. సీసీఫుటేజ్లో ఓ వ్యక్తి టీ కప్పుని తన బ్యాగ్లో వేసుకుని పారిపోతున్నట్లు మేము చూశాం. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తి కనిపెట్టే పనిలో ఉన్నారు. అయినప్పటకీ తమ స్టోర్ అమ్మకాల ప్రదర్శన నిరాటకంగా కొనసాగుతుందని, పైగా భద్రతను కూడా మరింత పటిష్టం చేస్తామని చెప్పారు." స్టోర్ ప్రతినిధులు. (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
దూసుకుపోతున్న ‘చదువురాని చాయ్వాలా’
దేశంలో టీ దుకాణాలకు మంచి డిమాండ్ ఉంది. ఎక్కడ కొత్తగా టీ దుకాణం ఏర్పాటైనా అది విజయవంతం అవుతుందనే మాట వినిపిస్తుంటుంది. తాజాగా బీహార్లో వినూత్న టీ దుకాణం ఏర్పాటయ్యింది. దాని పేరు వినగానే ఎవరికైనా వింతగా అనిపిస్తుంది. మాధేపురాలోని సింగేశ్వర్కు చెందిన రోహిత్ ‘అన్పఢ్ చాయ్వాలా’ (చదువురాని చాయ్వాలా) పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఐదు రకాల టీలు లభిస్తాయి. అయితే ఇక్కడ టీ బాగోలేదని ఎవరైనా వినియోగదారుడు అంటే రోహిత్ వారికి డబ్బు వాపసు చేస్తాడు. విద్యార్థులకు టీపై ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తుంటాడు. రోహిత్ తన దుకాణంలో టీని రూ. 10కే అందిస్తున్నాడు. మొదట్లో తన దుకాణం పేరు బాగోలేదని చాలామంది అన్నారని, అయితే ఆ పేరు అలాగే ఉంచాలని అనుకున్నానని రోహత్ తెలిపాడు. తాను ఎటువంటి డిగ్రీ చదవలేదని, పెద్దగా ఏమీ చదువుకోలేదని అందుకే అన్పఢ్ చాయ్వాలా అని దుకాణానికి పేరు పెట్టానని రోహిత్ వివరించాడు. ఇప్పుడు తన టీ దుకాణం పేరు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోందని, తాను ప్రతిరోజూ 400 నుండి 500 కప్పుల టీ విక్రయిస్తున్నానని రోహిత్ తెలిపాడు. విద్యార్థులకు 10శాతం తగ్గింపు ధరకే టీ ఇస్తున్నానని, దీనివలన చదువుకుంటున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుందని రోహిత్ తెలిపాడు. యూట్యూబ్లో పలు టీ దుకాణాల వీడియోలను చూశాక, తాను ‘అన్పఢ్ చాయ్వాలా’ పేరుతో సొంత స్టార్టప్ను ప్రారంభించానని అన్నాడు. తాను వినియోగారులకు మసాలా టీ, ప్లెయిన్ టీ, స్పెషల్ టీ, అల్లం టీ, కాఫీ టీ అందిస్తున్నానని తెలిపాడు. -
అంజీర్ పండ్లే కాదు.. ఆకులతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు
అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా. వీటిని పచ్చిగానూ, డ్రై ఫ్రూట్స్గానూ కూడా వాడతారు. ఈ పండ్లతో పాటు వీటి ఆకులు కూడా అద్భుత పోషకాల గని అని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం. అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు. అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో అంజీర్ ఆకు రసం హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని తేలింది. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. హైపర్గ్లైకేమియా (రక్తంలో శాశ్వతంగా అధిక స్థాయి గ్లూకోజ్),హైపోగ్లైసీమియా (తక్కువ గ్లూకోజ్ లెవల్స్) ఈ రెండు పరిస్థితుల్లోనూ పనిచేసి, గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుందని తేలింది. వీటి రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంజీర్ ఆకులతో టీ వీటి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకుని, కావాలనుకుంటే రుచికి కొద్దిగా తెనె కలుపుకుని టీలా వేడిగా తీసుకోవాలి. ఎండబెట్టి పొడి చేసుకుని అంజీర ఆకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడి చేసి నిల్వం ఉంచుకోవచ్చు. దీనిని అవసరమైనపుడు,నీటిలో వేసుకుని టీ లాగా మరిగించి తీసుకోవచ్చు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి వీటిల్లో పుష్కలంగా లభించే పొటాషియం, కాల్షియంతో ఎముకల సాంద్రతను బలోపితం చేసేందుకు కూడా వాడవచ్చు. అంజీర ఆకుల్లోని ఒమేగా 3 ఒమేగా 6 లక్షణాలు గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. ఈ ఆకుల కషాయం లేదా టీతో గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది. నోటి బాక్టీరియాతో బాధపడేవారు అంజీర్ను సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్గా ఉపయోగించ వచ్చు. అంజీర్ ఆకు రసం యాంటీ ఫంగల్గా పనిచేస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. టీబీ నివారణలో అంజీర్ ఆకుల రసం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ (క్షయవ్యాధి బ్యాక్టీరియా)కు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే మలేషియాలో క్షయవ్యాధి నివారణచికిత్సలో వాడతారు. -
అంబ'టి'
-
"టీ" మాస్టర్ గా మారిన మంత్రి అంబటి..
-
రిఫ్రెష్ అవుదామని టీ తెగ తాగేస్తే..ఆ శక్తి తగ్గిపోతుంది!
అలసిన శరీరాన్ని సేదతీర్చడంలోనూ, మనసును సాంత్వన పరచడంలోనూ టీ ని మించింది లేదని అందరూ అంటారు. అలాగని టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగితే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందంటున్నారు. టీలో అధికంగా ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీ లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. జీర్ణ సమస్యలు ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. గుండెల్లో మంట ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. దీని కారణంగా ఆహార నాళంలో యాసిడ్ ఏర్పడి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో పాటు పుల్లని తేన్పులు, వికారం కలుగుతాయి. నిద్ర సమస్యలు... కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు టీ తాగడం అలవాటు. అయితే ఇది వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన సమస్యను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీ కి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. పేగులపై దుష్ప్రభావం... అధికంగా తాగే టీ మన పేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫిన్, టానిన్ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. -
Pomegranate Peel Tea దానిమ్మ తొక్కల టీ, అద్భుత ప్రయోజనాలు
#PomegranatePeelTea దానిమ్మ గింజలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగు పరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారికి దానిమ్మ గింజల జ్యూస్ బాగా ఉపయోగడపతాయి. అలాగే దానిమ్మ తొక్కలతో చేసిన టీ రెగ్యులర్గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి దానిమ్మ టీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానిమ్మ తొక్కల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుతో దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బాడీలోని మలినాల్ని బైటికి పంపించేందుకు, జలుబు దగ్గు, చర్మ సమస్యలు, జుట్టు రాలడానికి చికిత్స చేయడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు ఇంకా మధుమేహం, రక్తపోటు , కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దానిమ్మ తొక్కల టీ తయారీ: దానిమ్మ కాయనుంచి వలిచిన తొక్కల్ని శుభ్రంగా కడిగి తొక్కలను ఎండబెట్టాలి. ఇతర సందర్భాల్లో, మైక్రోవేవ్ ఉపయోగించి వేడి చేయవచ్చు. ఆ తరువాత, పీల్స్ బాగా చూర్ణం చేయాలి. దీన్ని తడి లేని సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు. ఒక కప్పు నీటినిలో టీస్పూన్ దానిమ్మ తొక్కలను వేసి బాగా మరిగించాలి. దీన్ని చక్కగా వడకట్టి, రుచికి తగినట్టుగా తేనె కలుపుకొని తాగాలి. ఈ టీని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాడీ డీటాక్సిఫై: విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని నెగిటివ్ టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వైరల్ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి , సాధారణ జలుబు నివారణలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన దంతాలు: దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీ తాగడం వల్ల చిగుళ్లు, దంత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: దానిమ్మ తొక్కల్లో టానిన్లుతో పేగుల్లో మంట తగ్గుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. కాబోయే తల్లులకూ మేలు చివరగా, గర్భిణీ స్త్రీలకు దానిమ్మ తొక్క చాలా మంచిదట. ముఖ్యంగా గర్భధారణ ప్రారంభంలో దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణం పాలీఫెనోలిక్ సమ్మేళనాలు ఫోలిక్ యాసిడ్ , విటమిన్ సీ ఎదుగుతున్న పిండానికి సరైన పోషకాహారాన్ని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. ఇంకా పిగ్మెంటేషన్, జుట్టు రాలడం సమస్య ఉన్నవారు కూడా దానిమ్మతొక్కల టీని సేవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
వాహ్! ఐస్ టీ వాహ్!
బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది. కాని మంచు సెలయేటిలో కూచుని మంచుని కరిగించి టీ కాచుకుంటే? అదీ బాగుంటుందని 78 మిలియన్ల వ్యూస్ చెబుతున్నాయి. కశ్మీర్కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు. వైరల్ అయ్యారు. చల్లటి ప్రాంతంలో అందరూ తాగే ద్రవం టీ. చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు గక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు. రాహుల్ యాదవ్ అనే ట్రావెలర్ ఇన్స్టాలో ‘ట్రాహులర్’ అనే అకౌంట్లో తన ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. జనవరి 29న అతను తన ఇద్దరు మిత్రులతో ఒక వీడియో పెట్టాడు. అది విపరీతంగా జనానికి నచ్చేసింది. కారణం... కశ్మీర్లో నిర్మానుష్యమైన లోయలో, గడ్డ కట్టిన సెలయేటి మధ్యలో కూచుని ఆ మిత్రులు ‘టీ తయారు చేశారు’. మామూలుగా కాదు. టీ గిన్నెలో అక్కడున్న మంచును వేసి మరీ! క్యాంప్ స్టవ్ మీద ఆ మంచు నిండిన టీ గిన్నె కాసేపటికి వేడి నీరుగా మారింది. అందులో కొంత టెట్రా మిల్క్ వేశారు. ఆ పై టీయాకును, చక్కరను వేస్తే చిక్కటి రంగులో ఘుమఘుమలాడే టీ తయారైంది. ఇటీవల విడుదలైన ‘డంకీ’లోని పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉండగా ఆ ముగ్గురూ మనకు ఈర్ష్య కలిగేలా టీ తాగారు. ఈ వీడియో రెండు వారాల్లో 7 కోట్ల 8 లక్షల మంది చూశారు. ‘మేం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా తాగకపోతామా?’ అని కొందరంటే ‘సేఫేనా?’ అని కొందరన్నారు. బ్యాక్టీరియా ఉంటుందేమో అని మరికొందరు సందేహం వెలిబుచ్చారు. బాగా వేడి చేశారు కనుక బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. అయినా స్వచ్ఛమైన మంచు టీ తయారు చేసుకుని తాగే ముందు ఈ సందేహాల గోల ఏల? -
ఓ సారి ఇటు చూడండి బ్రదర్..! మీకోసమే ఈ చాయ్..!!
మారుతున్న కాలానుగుణంగా మానవ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఏదైనా కొత్తగా, వింతగా, తక్కువ ఖర్చు, సులభంగా ఉండేట్లుగా ఆలోచిస్తున్నారు. విషయంలోకి వెళితే.. టీ తాగని వారు.., ఆ రుచి ఇష్టపడని వారు కూడా ఈ సరికొత్త టీ-స్టాల్ని చూశారో ఓసారైనా ట్రై చేద్దామనుకుంటారు. ఇక అదేంటో చూసేద్దాం! వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్ద కంపెనీలు ప్రవేశించి జిల్లాలు, మండలాల వారీగా ప్రాంచైజీలు ఇస్తున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ మొబైల్ టీ స్టాళ్లూ ఏర్పాటువుతున్నాయి. ఈమేరకు పాత ఆటోలను మొబైల్ టీ స్టాళ్లుగా హైదరాబాద్లో సిద్ధం చేయించిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్తూ ఖమ్మంలో ఆగారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియం వద్ద ఆపిన ఈ టీ స్టాల్ వాహనాలను పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇవి కూడా చదవండి: పాత జీన్స్ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా? -
‘సాక్షి’లో ఏం రాశారు..?
కౌటాల(సిర్పూర్): కౌటాల మండలంలో బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో గల ఓ టీస్టాల్లో ఆయన కాసేపు సాక్షి పేపర్ చదివా రు. ప్రతిరోజూ దినపత్రికలు చదవడం అలవాటని ఆయన తెలిపారు. అనంతరం స్థానికులు, కార్యకర్తలతో మాట్లాడారు. వ్యాపారం ఎలా ఉందని టీస్టాల్ యజమాని శర్మను అడిగి తెలుసుకున్నారు. తనకు ఇల్లు లేదని, ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని శర్మ కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. -
వైరల్: అవునండీ... ఇది బిర్యానీ టీ
వేడి వేడిగా బిర్యానీ తింటే ఎంత మజా? ఆ తరువాత వేడి వేడిగా టీ తాగుతుంటే ఎంత మజా! ఆ మజాను ఈ మజాను మిక్స్ చేసి ‘బిర్యానీ టీ’ తయారుచేసింది ‘మాస్టర్ చెఫ్ 4’ విజేత నేహాదీపక్షా. టీ ఆకులు, దాల్చిన చెక్క, సోంపు, నల్లమిరియాలు, యాల కులు... మొదలైన వాటితో నేహా తయారు చేసిన ఈ ‘బిర్యానీ టీ’ చవులూరిస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా నెటిజనులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఆహో ఓహో!’ అని పొగడ్తల దండకం అందుకుంటే, మరి కొందరు ‘బిర్యానీ టీ అంటే ఏమిటో కాదు వేడి వేడి బిర్యానీని వేడి వేడి టీలో కలపడం’ అని జోక్ చేస్తున్నారు. ఐస్క్రీమ్ రోల్ మేకర్ కూలింగ్ పాన్ను ఉపయోగించి ఒక చెఫ్ తయారుచేసిన ‘స్క్రీమ్టీ’కూడా ఈమధ్య నెట్లోకంలో హల్చల్ చేసింది. -
'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!?
భారతీయులు ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. శీతాకాలంలో చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేకరకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది జలుబు దగ్గు సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ లవంగాల టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే సుగుణాలు గొంతునొప్పి, కఫం వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి.. కొంతమందిలో వాతావరణంలోని తేమ పరిమాణాలు తగ్గడం పెరగడం కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జ్వరం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే చలికాలంలో తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లవంగాలతో తయారుచేసిన టీని తాగాల్సి ఉంటుంది. దగ్గు నుంచి ఉపశమనం.. శీతాకాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి.. ఈ దగ్గు కారణంగా చాలామంది ఊపిరితిత్తుల సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలో కఫాన్ని తొలగించేందుకు కూడా సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. కొంతమందిలో చలి కారణంగా సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో చాలామందిని వేధించే సమస్య జీర్ణ క్రియ మందగించడం. అయితే దీనికి కారణంగా చాలామందిలో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తీసుకోండి. ఇవి చదవండి: నడుము నొప్పా? సింపుల్గా ఇలా తగ్గించుకోండి! -
ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్మెంట్ని చూపించిన ప్రదాని మోదీ!
జనవరి 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజుల భారతదేశ పర్యటనలో ఉన్నారు. ముందుగా జైపూర్ రోడ్ షోలో పాల్గొని కొండపై ఉన్న అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్ అబ్జర్వేటరీ హవా మహల్లను కూడా సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ గురువారం పింక్ సిటీ రోడ్షోలో నరేంద్రమో మోదీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లారు. నగరం నడిబొడ్డున చిన్న మార్గం గుండా పయనమవ్వుతూ ..తొలుత జంతర్మంతర్ నుంచి పప్రారంభమయ్యి అలా 18వ శతాబ్దపు ఖగోళ అబ్జర్వేటరీ వరకు సాగింది. వారిద్దరూ వాహనంలో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ..ఆ మార్గంలో కనిపించేవారికి అభివాదం చెబుతూ సాగిపోయారు. ఇక మోదీ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం తదనంతరం జైపూర్లో చేసిన తొలి పర్యటన ఇది. ఇక ఆయ ప్రసిద్ధ ప్రదేశాలను సందరర్శించిన తదనంతరం ఇరువురు నాయకులు ఆ హవా మహల్ ముందు ఉన్న దుకాళంలో మసాల్ చాయ్ సిప్ చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఆ షాపు యజమానికి డిజటల్ చెల్లింపు చేసి భారత్లో ఇది ఎంత సర్వసాధారణం అన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. అంతేగాదు ఇక్కడకు వచ్చే సందర్శకులు ఇలా డిజిటల్ చెల్లింపులే చేస్తారని ప్రధాని మోదీ మాక్రాన్కు తెలియజేశారు. అంతేగాదు మోదీ మాక్రాన్ కోసం అక్కడే ఉన్న ఒక దుకాణంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఓ ప్రతిమను కూడా కొనుగోలు చేశారు. ఇక మోదీ గ్లోబల్ ఫోరమ్లలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామీగా ఉందని పదేపదే నొక్కి చెబుతుండేవారు. పైగా భారత్ డిజిటల్ పరివర్తన గురించి తన ప్రశంగంలో ప్రశంసిస్తుండేవారు కూడా. కాగా, మాక్రాస్ తిరుగు ప్రయాణంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ కొండపై పర్యాటక ప్రదేశంగా అలరారుతున్న అంబర్ కోటను కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియో తెగ నెట్టింట వైరల్ అవుతోంది. #WATCH | Rajasthan: Prime Minister Narendra Modi and French President Emmanuel Macron visited a tea stall and interacted with each other over a cup of tea, in Jaipur. French President Emmanuel Macron used UPI to make a payment. pic.twitter.com/KxBNiLPFdg — ANI (@ANI) January 25, 2024 (చదవండి: ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ టెక్నిక్ ఫాలో అయితే త్వరగా చేసేయొచ్చు!) -
ఉజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగిన మోదీ
అయోధ్య: ‘ఉజ్వల పథకం’ 10 కోట్లవ లబ్దిదారు మీరా మంఝీతో మోదీ అన్న మాటలివి! అయోధ్య రైల్వేస్టేషన్ ప్రారంభించాక విమానాశ్రయానికి వెళ్తూ మార్గ మధ్యంలో లతా మంగేష్కర్ చౌక్ కూడలి సమీపంలో ఆయన హఠాత్తుగా ఆగారు. సమీప వీధిలోని మీరా ఇంటికెళ్లి వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. స్వయానా ప్రధాని తన ఇంటికి రావడంతో ఉబ్బి తబ్బిబ్బైన మీరా బహుశా ఆ కంగారులో ఆయనకు కలిపిచి్చన టీలో కాస్తంత చక్కెర ఎక్కువేశారు. ఆ చాయ్ తాగుతూ తీపి ఎక్కువైందని మోదీ సరదాగా స్పందించారు. ఉజ్వల పథకం 10 కోట్లవ లబ్ధిదారు కావడంతో ఆమె కుటుంబాన్ని కలిసేందుకు మోదీ ప్రత్యేకంగా వారింటికి వెళ్లారు. ‘‘ఉజ్వలతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వచి్చంది. కేంద్ర గృహ నిర్మాణ పథకంతో ఉచితంగా ఇల్లూ వచి్చంది’’ అంటూ మీరా ఆనందం వెలిబుచ్చారు. ఆమె కుటుంబ యోగక్షేమాలను మోదీ అడిగి తెల్సుకున్నారు. మీరా కుమారుడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి వందేమాతరం అని రాసిచ్చారు. అక్కడి చిన్నారులతో సెల్ఫీ దిగారు. ‘‘పాత ప్రభుత్వాలు ఐదు దశాబ్దాల్లో కేవలం 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లిస్తే మేం పదేళ్లలో ఏకంగా 18 కోట్ల కనెక్షన్లు అందించాం. వాటిలో పది కోట్లు ఉచిత కనెక్షన్లే’’ అని మోదీ అన్నారు. -
సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్ యాదవ్ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్ యాదవ్ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్లో అందరికీ ఉచితంగా టీ అందించారు. మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఇది కూడా చదవండి: లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు! -
చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే!
ప్రపంచంలో ఎక్కడైనా చాయ్ తాగాలంటే జేబులో డబ్బులుంటే సరిపోతుంది. చైనాలోని హువాషాన్ టీహౌస్లో చాయ్ తాగాలంటే మాత్రం జేబులో డబ్బులే కాదు, తగినంత గుండెధైర్యం, సాహసం కూడా ఉండాలి. ఎందుకంటే, ఇక్కడ చాయ్ తాగాలంటే, కొండ ఎక్కాల్సిందే! చైనాలోని షాంగ్జి ప్రావిన్స్లో ఉన్న హువా పర్వతం మీదకు వెళ్లే దారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కొండ దారుల్లో ఒకటిగా పేరుమోసింది. ఈ కొండ మీద ఉన్న హువాషాన్ ఆలయానికి అనుబంధంగా చాయ్ హోటల్ ఉంది. తావో మతస్థులకు ఇది పవిత్ర ఆలయం. భక్తితో పాటు ధైర్యసాహసాలు ఉన్న తావో మతస్థులు ఈ కొండపైకెక్కి, ఇక్కడ వేడి వేడి చాయ్ సేవించి, సేదదీరుతుంటారు. సముద్ర మట్టానికి 2,154 మీటర్ల ఎత్తున ఉన్న పర్వత శిఖరం మీద వెలసిన ఈ చాయ్ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న హోటల్గా ప్రసిద్ధి పొందింది. (చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్మఠ్ టెంపుల్ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!) -
టీ ఉత్పత్తికి సిద్ధమైన పాపులర్ కూల్ డ్రింక్ బ్రాండ్
'కోకా-కోలా' (Coca-Cola) అనగానే అందరికి గుర్తొచ్చేది కూల్ డ్రింక్స్. ఈ సంస్థ ఇప్పుడు కొత్త విభాగంలో ప్రవేశించడానికి సిద్దమైనట్లు తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్ విభాగంలో పాపులర్ బ్రాండ్గా ఎదిగిన కోకా కోలా ఇండియా టీ పానీయాల విభాగంలోకి ప్రవేశించడానికి సన్నద్ధమైంది. హానెస్ట్ టీ పేరుతో కొత్త ప్రొడక్ట్స్ను తీసుకురానున్నట్లు కోకాకోలా ఇండియా ఇటీవల వెల్లడించింది. ఈ ఉత్పత్తిని కోకా కోలా అనుబంధ సంస్థ 'హానెస్ట్' తీసుకురానున్నట్లు సమాచారం. కోకా-కోలా టీ ఉత్పత్తి కోసం కంపెనీ లక్ష్మీ టీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన మకైబారి టీ ఎస్టేట్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సంస్థ త్వరలోనే 'ఆర్గానిక్ ఐస్డ్ గ్రీన్ టీ'ని తీసుకురానుంది. కోల్కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఏడవ ఎడిషన్లో రెండు కంపెనీల మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! తమ కస్టమర్లకు టీ పానీయాలను అందించడంలో భాగంగానే కోకా-కోలా ఇండియా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ టీని ఐస్డ్ గ్రీన్ టీ లెమన్-తులసి, మ్యాంగో ఫ్లేవర్స్లో తీసుకురానున్నట్లు సమాచారం. దీని కోసం పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలో ప్రత్యేకంగా లక్ష్మీ గ్రూప్ మకైబారి ఎస్టేట్ నుంచి సేకరించనున్నారు. త్వరలోనే కంపెనీ ఈ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. -
చాయ్ బిజినెస్కు ఫుల్ డిమాండ్.. ఏమి'టీ'క్రేజ్ అనుకుంటున్నారా?
ఒకప్పుడు టీ తాగడమనేది చాలా చిన్న విషయం. ఏ చిన్న కొట్టు దగ్గరికో వెళ్లి.. అర్జెంటుగా టీ తాగి వెంటనే కప్పు అక్కడ పెట్టి వచ్చిన దారిన వెళ్లిపోయేవారు. అయితే, కాలం మారింది. పద్ధతులూ మారాయి. అన్నింటా ఎం‘జాయ్’ కోరుకుంటున్న జనం టీ సేవనమూ అదే రీతిలో ఉండాలని భావిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా టీ కొట్లూ మారిపోయాయి. ఆధునిక హంగులు సంతరించుకున్నాయి. సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలో ఒకప్పుడు టీ తాగాలంటే ఎక్కడ దొరుకుతుందా అని వెతకాల్సిన పరిస్థితి. కానీ, నేడు అలా కాదు. ప్రతి ఏరియాలోనూ టీ కేఫ్లు ఏర్పాటయ్యాయి. అదీ విశాల ప్రాంగణాల్లో. శివారు ప్రాంతాల్లో అయితే ఆధునిక హంగులతో పెద్దపెద్ద కేఫ్లు జనాన్ని ఆకర్షిస్తున్నాయి. తీరిగ్గా కూర్చొని..అలా కబుర్లు చెప్పుకుంటూ టీ/కాఫీ తాగేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వీటి వద్ద రద్దీ ఎక్కువగా కని్పస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు సైతం ఖాళీ సమయం దొరికితే చాలు కేఫ్ల బాట పడుతున్నారు. కొన్ని కేఫ్ల వద్ద కార్లు, బైకుల రద్దీని చూస్తే ఏమి‘టీ’ మార్పు అని ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం వరల్డ్కప్ క్రికెట్ సీజన్ నడుస్తుండడంతో కేఫ్లు మరింత రద్దీగా మారాయి. ఒక్క అనంతపురం నగరంలోనే కాకుండా..ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురం, కదిరి తదితర పట్టణ ప్రాంతాలు, చివరకు మండల కేంద్రాల్లో సైతం టీ కేఫ్ల సంస్కృతి విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీస్టాళ్లు, కేఫ్లు కలిపి ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు అంచనా. అభిరుచికి అనుగుణంగా.. ఒకప్పుడు టీ, కాఫీ అంటే ఆయా పొడులతో చేసేవే ఉండేవి. కానీ, నేడు వాటిలోనూ వివిధ రకాలు లభిస్తున్నాయి. సాధారణ టీతో పాటు అల్లం టీ, గ్రీన్ టీ, ఇరానీ ఛాయ్, పెప్పర్మెంట్ టీ, మసాలా టీ, లెమన్ టీ, లావెండర్ టీ.. ఇలా పలు రకాలు విభిన్న రుచుల్లో లభ్యమవుతున్నాయి. టీ మాత్రమే కాకుండా వివిధ రకాల కాఫీలు, రాగిమాల్ట్ వంటివి కూడా అందుబాటులో ఉంటున్నాయి. జనాన్ని ఆకర్షించేందుకు ఆయా దుకాణదారులు కొత్తదారులు అన్వేíÙస్తున్నారు. ఫ్రీ వైఫై అంటూ యువతను ఆకర్షిస్తున్నారు. పెద్ద పెద్ద టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆకట్టుకునేలా కుర్చీలు ఉంచుతున్నారు. టీ/కాఫీ అందించే కప్పులూ విభిన్నంగా ఉంటున్నాయి. బ్రాండ్లూ వచ్చేశాయి! టీ కేఫ్లకు లభిస్తున్న ఆదరణ చూసి కొందరు వాటినీ ‘బ్రాండ్’లుగా మార్చేస్తున్నారు. ‘ప్రాంచైజీలు’ ఇస్తూ చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. వారు నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఔట్లెట్ డిజైన్ చేయించడంతో పాటు వివిధ రకాల టీలు, కాఫీలు తయారుచేయడానికి వీలుగా మెటీరియల్ సరఫరా చేస్తున్నారు. వాటి తయారీలో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ కేఫ్లు ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలిశాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారుల పక్కన ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ‘ఉపాధి’ మార్గం చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా టీ కేఫ్లను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి వ్యయం, మంచి మాస్టర్లు దొరికితే నిర్వహణ సులువు కావడం, ఆదాయం కూడా తగినంతగా ఉండడంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ యువత ఎక్కువగా ఉంటున్నారు. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ ప్రత్యామ్నాయ ఆదాయం కోసం టీ కేఫ్లు నిర్వహించే వారూ ఉన్నారు. ‘చర్చా’వేదికలు కేఫ్లు కేవలం పిచ్చాపాటి కబుర్లతో టీ, కాఫీ సేవనానికే పరిమితం కాలేదు. ‘చర్చా’వేదికలుగానూ మారాయి. ఇక్కడ రాజకీయ చర్చలు వేడీవేడిగా సాగుతుంటాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నడుస్తుంటాయి. ఉద్యోగ సంబంధ కార్యకలాపాలూ జరుగుతుంటాయి. పెళ్లి సంబంధాలూ కుదిరిపోతుంటాయి. ఇలా ఒకటేమిటి అనేక వ్యవహారాలకు టీ కేఫ్లు అడ్డాగా మారాయి. టీ కేఫే జీవనాధారం ఇంటర్ చదువుతున్నప్పుడు ఓ టీ కేఫ్లో వర్కరుగా పనిచేసేవాణ్ని. అదే కేఫ్నకు ఓనర్గా ఎదిగా. ఇది నా కుటుంబానికి జీవనాధారంగా మారింది. పలు రకాల టీ తయారు చేస్తున్నా. ఆశించిన స్థాయిలో వ్యాపారం అవుతోంది. ఉపాధికి ఢోకా లేదు. నాన్న కూడా నాకు సహాయంగా ఉంటున్నారు. – ధనుంజయ, టీ కేఫ్ నిర్వాహకుడు, రాయదుర్గం స్నేహం బలపడే వేదిక టీ కేఫ్లు స్నేహం బలపడే వేదికలనడంలో అతిశయోక్తి లేదు. కాలేజీకి బంక్ కొట్టినా.. లేదా తోటి స్నేహితులందరం కలుసుకునేందుకు అడ్డాగా టీ కేఫ్లే ఉంటున్నాయన్నది వాస్తవం. ఇక్కడే కొత్త స్నేహాలు కూడా చిగురిస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తీరిక సమయాల్లో కేఫ్లలో కాలక్షేపం చేస్తూ ప్రపంచం గురించి చర్చించుకుంటుంటారు. – కార్తీక్, డిగ్రీ విద్యారి్థ, తాడిపత్రి ఆదరణ పెరుగుతోంది ప్రతి విషయాన్ని చర్చించుకోవడంతో పాటు ప్రపంచంలోని విషయాలన్నింటిపై మాట్లాడుకునేందుకు గతంలో రచ్చబండలు వేదికగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరి నుంచి పదుల సంఖ్యలో కూడుకుని మాట్లాడేందుకు వేదికగా టీ కేఫ్లు మారాయి. ఫలితంగా వీటికి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాపారంపై చాలా మంది యువత సైతం ఆసక్తి చూపుతున్నారు. – రవి, టీ మాస్టర్, తాడిపత్రి మిత్రులతో మాట్లాడే అవకాశం టీ తాగడానికి బాగా అలవాటు పడ్డాం. గతంతో పోలి్చతే ఇప్పుడు నగరంలో చాలా టీ స్టాల్స్, కేఫ్లు వెలిశాయి. మిత్రులతో కలసి ఛాయ్ తాగి కాసేపు కబుర్లు చెప్పుకునేందుకు కేఫ్లు వేదికగా మారాయి. – సూర్యనారాయణ, రెవెన్యూ కాలనీ, అనంతపురం -
కప్పు 'టీ'తో మధుమేహాన్ని నియంత్రించొచ్చా?
ప్రస్తుత రోజుల్లో మధుమేహం చాలా సర్వసాధారణమైపోయింది. ప్రతి ఇంటిలోనూ ఒకరో ఇద్దరో డయాబెటిస్ పేషెంట్లు ఉంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధే తప్ప తగ్గేది కాదు. షుగర్కి సంబంధించినవి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుని అదుపులో పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అలాంటి డయాబెటిస్ వ్యాధి ఓ కప్పు టీతో క్యూరో అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆయా పరిశోధనల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కప్పు టీతో ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపోవడమే గాక ఒక్కసారిగా ఈ విషయం చాలా హాట్టాపిక్గా మారిపోయింది. ఇంతకీ ఆ టీ ఏంటి? ఎలా గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది తెలుసుకుందాం!. చైనాలో ప్రత్యేకంగా తయారు చేసే..పులియబెట్టిన టీ మధుమేహాన్ని అదుపులో ఉంచుతోందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఇతర టీల అన్నింటిలో విభిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా శాస్త్రవేత్తల్లో ఈ అంశం ఓ నూతన ఉత్తేజాన్ని ఇచ్చి పలు అధ్యయనాలకు పురిగొల్పింది. ఇది ఎంత వరకు నిజం? అనే దిశగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం, చైనాల సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించేందుకు దారితీసింది. వారు నిర్వహించిన అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం చైనాలో వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న దాదాపు రెండు వేల మందిపై పరిశోధనలు నిర్వహించారు. వారిలో డయాబెటిస్ లేనివారు, డయాబెటిస్ ఉన్న వ్యక్తుల ఉన్నారు. ఐతే వారి ఆహారపు అలవాట్లను తెలుసుకుని మరీ ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ టీ తాగిని వారి యూరిన్లో గ్యూకోజ్ స్థాయిలు పరీక్షించగా తక్కువగా ఉండటమే కాకుండా కొందరికి ఫీల్టర్ అయ్యి యూరిన్ నుంచి గ్లూకోజ్ వెళ్లడం లేదని గమనించారు. నిజానికి టీ తాగితే మూత్రంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కానీ ఈ డార్క్టీ మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. ఈ టీని సేవించని వారితో పోలిస్తే ఆయా వ్యక్తుల్లో ప్రీ డయాబెటిస్ వచ్చే ప్రమాదం సుమారు 15% తగ్గగా, టైప్2 మధుమేహం వచ్చే అవకాశం దాదాపు 28% తగ్గిందన్నారు. ఈ మేరకు అడిలైడ్ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్ టోంగ్జి మాట్లాడుతూ..ఈ టీపై నిర్వహించిన పరిశోధనలు ఆశ్చర్యకరమైన రీతీలో ఫలితాలిచ్చాయన్నారు. ఈ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను మెరుగ్గా నియంత్రించిందన్నారు. బహుశ ఆ టీ తయరీలో ఉపయోగించే కిణ్వన ప్రక్రియ ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చన్నారు. చైనాలో ఉన్న ఆరు ప్రధాన రకాల టీల్లో ఈ డార్క్ టీ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. ఇందులో ప్రధానంగా సూక్ష్మజీవుల కిణ్వన ప్రక్రియ ఉంటుంది. అదే ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ టీలో ఉన్న శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్సూలిన్ తీరును మెరుగుపరిచి గట్ మైక్రోబయోమ్ను ప్రోత్సహిస్తుందన్నారు. శరీరంలో సోడియం, గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్(ఎస్జీఎల్టీ)-2 ఇన్హిబిటర్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తత్ఫలితంగా మూత్రపిండాలు మరింతగా గ్లూకోజ్ను విసర్జించేలా చేయడంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గుండె, మూత్రపిండాల తీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది ఈ డార్క్ టీ. మన పాత కాల సంప్రదాయ పానీయమైన డార్క్ టీ గొప్పతనాన్ని ఈ అధ్యయనాలు వెల్లడించాయన్నారు. ప్రజలు ప్రతిరోజు డార్క్ టీ తీసుకోవడం వల్ల తమ ఆరోగ్యాన్ని సులభంగా మెరుగుపరుచుకోవడమే గాక శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోగలుగుతారని నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
షాకింగ్: టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్
ముంబై: వైద్యులను దేవుడితో పోలుస్తున్నారు. ఆ దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటుంటారు. కేవలం డబ్బుల కోసమే కాకుండా, మానవతా హృదయంతో తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షిస్తున్న ఘనత వైద్యులకే దక్కుతుంది. అయితే ఇటీవల పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే తేడా లేకుండా వైద్యవవస్థ వ్యాపారంగా మారింది. అలాంటి ఓ షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృత్తి ధర్మం మరిచిన ఓ వైద్యుడు రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యహరించాడు. డ్యూటీ చేస్తుండగా తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు సదరు వైద్యుడు. నాగ్పూర్లోని మౌడ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 3న జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మౌడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఎనిమిది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నలుగురు మహిళలకు ఆపరేషన్ చేసిన వైద్యుడు తేజ్రంగ్ భలవి.. మిగిలిన వారికి కూడా సర్జరీ చేసేందుకు ముందుగా అనస్తీషియా ఇచ్చాడు. అయితే ఆసుపత్రి సిబ్బందిని ఓ కప్ చాయ్ తీసుకురావాలని వైద్యుడు కోరాడు. కానీ ఎవరూ అతనికి టీ తీసుకోని రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన డాక్టర్ భల్వాయి.. మిగతా నలుగురికి కు.ని శస్త్రచికిత్స చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై వెంటనే ఆసుపత్రి సిబ్బంది జిల్లా వైద్యాధికారికి ఈ విషయం తెలపగా.. ఉన్నపళంగా మరో వైద్యుడిని మహిళలకు సర్జరీలు చేసేందుకు పంపించారు. అనంతరం క్టర్ భలవి ప్రవర్తనపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసి వైద్యుడిపై విచారణ చేపట్టినట్లు నాగ్పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్య శర్మ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నివేదిక వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు -
‘మద్యం చాయ్’.. ప్రయోగాలకు పరాకాష్ట అంటున్న జనం!
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి టీ తయారీలో వినూత్న ప్రయోగం చేయడాన్ని చూడొచ్చు. ఆ వ్యక్తి ఒక చిన్న కుండలో మద్యం పోసి, దానితో టీ తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది యూజర్లు తెగ రియాక్ట్ అవుతున్నారు. ఒక యూజర్.. ‘సోదరా, మనం ఇకపై ఈ భూమిపై జీవించాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించాడు. మరొక యూజర్ ఎప్పుడూ టీతోనే ఎందుకు ప్రయోగాలు జరుగుతాయి?’ అని ప్రశ్నించాడు. ఈ వీడియో చూసిన కొందరు ఆ టీ తయారీదారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో దేశీమోజిటో అనే ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షకు పైగా వీక్షణలు దక్కాయి. ఇప్పుడే కాదు గతంలోనూ టీపై పలు ప్రయోగాలు జరిగాయి. ఈ జాబితాలో ఎగ్ టీ, ఫ్రూట్ టీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: పారిస్ ఎయిర్ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం! Old monk chai peelo fraans:) pic.twitter.com/HTYZsCJmGX — desi mojito 🇮🇳 (@desimojito) November 7, 2023 -
టీని మళ్లీ వేడి చేసి తాగుతున్నారా? డేంజర్లో పడ్డట్లే
పొద్దున లేవగానే ఓ కప్పు గరం చాయ్ గొంతు దిగందే పనిలో దిగరు చాలామంది. అది గ్రీన్ టీ అయినా లెమన్ టీ అయినా సరే ఏదో ఒక టీ గొంతులో పడాల్సిందే. పనిలో అలసిపోయినా, కాస్త సేదదీరాలాన్న ‘‘టీ తాగొద్దాం పద’’ అంటారు స్నేహితులు. ఇలా టీ అనేది దినచర్యలో భాగమైపోయింది. టీని ఫ్రెష్గా కాచి తాగితేనే మంచిది. పైగా ఫ్రెష్ టీ ఫ్లేవరు, రుచే వేరు. చాలామంది ఒకేసారి టీ పెట్టేసుకుని ఫాస్కులో పోసుకుని ఆరారగా తాగుతుంటారు. ఇంకొంతమంది టీ కాచి దాన్ని అలాగే ఉంచి వేడి చేసుకుని తాగుతుంటారు. కానీ అలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగటం మంచిది కాదట.. నాలుగు గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాచి అలా ఉంచేసిన టీలో ఫంగస్ ఏర్పడుతుంది. బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది. దీంతో రుచి కూడా మారిపోతుంది. కానీ టేస్ట్ మారింది ఏంటో అనుకుంటాం గానీ కారణం మాత్రం ఇదే. కాబట్టి టీని వేడి చేసి తాగటం మంచిది కాదు. అదే హెర్బల్ టీని అయితే మరోసారి వేడి చేసి తాగకూడదు. అలా వేడి చే చడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు, ఖనిజాలు నశించిపోతాయి. అది తాగినా తాగకపోయినా ఒక్కటే. గ్రీన్ టీ అయితే వేడి చేసి తాగటం ఏమాత్రం మంచిది కాదు. టీని ఎక్కువసేపు నిల్వ ఉంచితే టానిన్ అధికంగా విడుదల అవుతుంది. ఇది టీని చేదుగా మార్చేస్తుంది. దీంతో అలా వేడి చేసిన టీ తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు అతిసారానికి దాని తీయవచ్చు. కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి టీ తాగాలనుకుంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగితే మంచిది. రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యమూ బాగుంటుంది. ఆరోగ్యం కోసమో ఉల్లాసం కోసమో టీ తాగాలనుకున్నప్పుడు మరిగి పోయి ఉన్న టీ తాగడం వల్ల ఉత్సాహం మాటెలా ఉన్నా, ఉన్న ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. అటువంటి చెడు ఫలితాలు పడకుండా ఉండాలంటే ఫ్రెష్ టీ తాగడం మేలు. -
వీధి కుక్కల దాడిలో ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత!
వీధి కుక్కల దాడితో ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ కన్నుమూశారు. అక్టోబర్ 15న మార్నింగ్ వాక్కు వెళ్లిన పరాగ్ దేశాయ్ను వీధి కుక్కలు వెంబడించాయి. ఆపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన కిందపడినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా, అహ్మదాబాద్లోని జైదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెదడులో రక్తస్రావం వల్ల కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆస్పత్రిలో మరణించినట్లు వాఘ్ బక్రీ టీ గ్రూప్ కంపెనీ వెల్లడించింది. పరాగ్ మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంకితభావానికి కేరాఫ్ అడ్రస్ వ్యాపార రంగంలో సరికొత్త ఆవిష్కరణలకి, అంకితభావానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు పరాగ్ దేశాయ్. భారత్లోనే అతిపెద్ద 3వ ప్యాకేజ్డ్ వాఘ్ బక్రీ టీ’ గా అవతరించడంలో విశేషంగా కృషి చేశారు. వారసత్వ వ్యాపారంలో అడుగు వాఘ్ బక్రీ టీ కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పరాగ్ దేశాయ్ అమెరికా లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏని ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం, వారసత్వంగా వస్తున్న టీ’ వ్యాపారంలో అడుగు పెట్టారు. తన తండ్రి రసేష్ దేశాయ్ స్థాపించిన వాఘ్ బక్రీ టీ సంస్థలో అమ్మకాలు, మార్కెటింగ్, ఎగుమతి విభాగాల్లో కీలక పాత్ర పోషించారు. రూ.2,000 కోట్ల టర్నోవర్ 1892లోవాఘ్ బక్రీ గ్రూప్ను పరాగ్ తండ్రి నరన్దాస్ దేశాయ్ ప్రారంభించారు. అయితే పరాగ్ దేశాయ్ నేతృత్వంలో వాఘ్ బక్రీని భారతదేశపు మూడవ అతిపెద్ద ప్యాకేజ్డ్ టీ బ్రాండ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, వారసత్వం,సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ కొత్త కొత్త వ్యాపార వ్యూహాలతో ముందుకు సాగారు. తన దూరదృష్టి తో వాఘ్ బక్రీ టీ పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్లగలిగారు. ఈ వాఘ్ బక్రీ టీ ఒక్క మనదేశంలోనే ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇంటి పేరుగా మారింది. నేడు ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.2,000 కోట్లు. -
రజనీ చాయ్
సూపర్స్టార్ రజనీకాంత్ ఒక్కోసారి విసుగుపుట్టి హిమాలయాలకు వెళుతుంటారు. ఈసారి కొచ్చిన్లో టీ అమ్ముకుంటున్నారా? అవుననే కొంతమంది కంగారు పడ్డారు. తీరా చూస్తే ‘దక్కేది దక్కకుండా పోదు... దక్కనిది ఎప్పటికీ దక్కదు’ అని డైలాగ్ కొడుతూ తనకు దక్కిన టీ స్టాల్ను నడుపుకుంటున్న ఓ వ్యక్తి... ఇంకేముంది... నెట్లో హల్చల్. కొచ్చిన్లో ఏదో షూటింగ్ కోసం వెళ్లిన సినిమా యూనిట్ వారు అతణ్ణి చూసి ఆగిపోయారు. రజనీకాంత్! టీ అమ్ముతూ. రజనీకాంత్ సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని అందరికీ తెలుసు. కొంపదీసి టీ అమ్ముతున్నాడా? పరిశీలించి చూశారు. కాదు. రజనీకాంత్లానే ఉన్నాడు. పలకరిస్తే అచ్చు రజనీకాంత్లానే నవ్వుతున్నాడు. పేరు సుధాకర్ ప్రభు. ఫోర్ట్ కొచ్చిన్ పట్టాలం రోడ్డులో ‘వెంకటేశ్వర హోటల్’ అనే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నడుపుతున్నాడు. లెమన్ టీ చేయడంలో దిట్ట. మొన్న మొన్నటి వరకూ ఎవరూ అతణ్ణి రజనీకాంత్తో పోల్చలేదు కాని ఈ మధ్య గెడ్డానికి రంగేయడం మాని, కళ్లద్దాలు మార్చేసరికి అచ్చు రజనీ గెటప్లోకి వచ్చేశాడు. నాదిర్షా అనే మలయాళం డైరెక్టర్ ఇతణ్ణి ఫేస్బుక్లో పెట్టేసరికి వైరల్ అయ్యాడు. అప్పటినుంచి ఇతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేరళలో ఇతణ్ణి ఫంక్షన్స్కు కూడా ఆహ్వానిస్తున్నారు. ‘మా పిల్లలు పెద్దగా పట్టించుకోరుగాని నేను రజనీ అన్ని సినిమాలు చూస్తుంటా’ అంటాడు. ఈ పాపులారిటీ పెరిగి అతని హోటల్కు కస్టమర్లు పెరిగితే అదే పది ప్లేట్లు. -
భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా?
చాలామంది ఆహారం తిన్న వెంటనే తేలిగ్గా తీసుకుని చేసే పనులే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం. భోజనం తిన్న వెంటనే చల్లటి పదార్థాలు గానీ లేదా పండ్లు తీసుకుంటుంటాం. అలాగే బాగా స్పైసీ ఫుడ్ తినేసి హెర్బల్ టీలు వంటివి తాగేస్తుంటారు కొందరూ. నిజానికి ఇలాంటి అలవాట్లు చాలా ప్రమాదం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణలు. మన జీర్ణ వ్యవస్థ పాడవడ్డానికి ఆ అలవాట్లే ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే పండ్లు తింటే.. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతారంటే భోజనం కాగానే పండ్లు తినడం వల్ల అందులోని ఎంజైమ్లు విచ్ఛిన్నమై ఆహారంతో కలిసిపోయి పొట్టలో సమస్యలను కలిగిస్తాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి నీరు.. ప్రస్తుతం చాలా మంది ఆహారం తీసుకున్న వెంటనే రిఫ్రిజిరేటర్లో.. కొందరైతే మరీ డీప్ ఫ్రీజర్లో ఉంచిన చల్లని నీరు తాగుతున్నారు. ఇలా చల్లటి తాగడం వల్ల కడుపులో ఉత్పత్తి అయ్యే డైజెస్టివ్ ఎంజైమ్లు పొట్టను చల్లగా చేసి, జీర్ణక్రియ వ్యవస్థను స్తంభింపజేస్తాయి. అంతేకాదు, శరీరం ఆహారంలోని పోషకాలను గ్రహించడం మానుకుంటుంది. దీని కారణంగా పోషకలోపం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తిన్న వెంటనే చల్లటి నీటిని తాగడం మానుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్పైపీ ఫుడ్ తీసుకున్న తర్వాత టీ తీసుకుంటే.. వేడి ఆహారాలు తీసుకున్న తర్వాత హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పొట్టలో ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతాయి కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే బాగా వేడిగా ఉండే కాఫీ, టీ వంటి పానీయాలు తాగడం మానుకోవాలి. (చదవండి: స్పైసీ ఫుడ్స్తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!) -
పిచ్చి పీక్స్ అంటే ఇదే.. పచ్చిగుడ్డుతో వెరైటీ టీ
మనలో చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. ఎన్ని పనులున్నా మొదట టీ తాగిన తర్వాతే ప్రారంభించే వాళ్లు బోలెడు మంది ఉన్నారు. నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఒక్క టీ అయినా పడాల్సిందే అనేలా ఫీల్ అవుతుంటారు. అంతగా మనోళ్లు ఛాయ్కి ప్రాధాన్యత ఇస్తారు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ లాంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎగ్ టీ గురించి మీకు తెలుసా? ఈ వెరైటీ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా టీ తయారు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ ఓ యూట్యూబర్ తయారు చేసిన వింత టీ గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఈ టీ టేస్ట్ సంగతి అటు ఉంచితే, దీన్ని తయారు చేయడం చూస్తేనే కడుపులో తిప్పేస్తుంది. ఎందుకంటే ఈ టీని పచ్చిగుడ్డుతో, పండ్లతో తయారు చేస్తారు. సాధారణంగా ఎగ్ టీ అనేది వెస్ట్రన్ దేశాల్లో బాగా ఫేమస్. వియత్నాం, స్వీడన్ వంటి దేశాల్లో గుడ్డును తరచూ టీ, కాఫీల్లో కలుపుకొని తాగేస్తారు. ఇంకెందుకు ఆలస్యమని ఇప్పుడు అదే ట్రెండ్ను మనవాళ్లూ ట్రై చేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ షేర్ చేసిన ఎగ్ టీ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆమె ఏం చేసిందంటే.. ముందుగా టీ గిన్నె పెట్టుకుని అందులో షుగర్, టీ పొడి వేసి వేయించింది. ఇప్పుడు యాపిల్ ని ముక్కలుగా కోసి వేసి వేయించింది. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసి కాసేపు మరగ బెట్టింది. కాసేపు అయ్యాక పచ్చి గుడ్డును పగుల కొట్టి ఆ టీలో కలిపేసింది. ఆ తర్వాత ఫైనల్ టచ్ కోసం యాలకులు, దాల్చిన చెక్క వేసి మళ్లీ మరిగించి ఓ కప్పులో సర్వ్ చేసింది. ప్రస్తుతం ఈ వెరైటీ ఎగ్ టీకి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ఈ టీని తాగిన వాళ్లు బతికే ఉన్నారా? ఇలాంటి పిచ్చి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీ తాగే ముందు, లేదా తర్వాత వెంటనే పండ్లను, గుడ్డును తినకూడదంటూ డైటీషియన్లు చెబుతున్న వీడియోలను కొందరు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఎంత వెస్ట్రన్ కల్చర్ను ఫాలో అవుతున్నా, కొన్ని మన ఆరోగ్యానికి కూడా నప్పేలా ఉండాలి, ప్రతీది ఇలా కాపీ కొట్టందంటూ హితవు పలుకుతున్నారు. -
మనిషి అవసరం లేకుండానే.. 24 గంటలూ ‘చాయ్’! మొదటి ‘టీ’ ఏటీఏం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్ ఓపెన్క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు. ఈ సందర్భంగా జెమ్ ఓపెన్క్యూబ్ సీఈఓ పి.వినోద్ కుమార్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్ టీ, బాదం పాలు, బిస్కెట్లతో సహా మంచి నీటి బాటిల్లను అందించే ‘డిజిటల్ చాయ్’ లేదా ‘చాయ్ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. జెమ్ ఓపెన్క్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, ప్రకాష్ వేలుపుల, త్రిలోచన్ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఓయ్.. గరమ్ చాయ్
నెల్లూరువాసులు ఆహార ప్రియులు.. కొత్త రుచులను స్వాగతించడంలో వీరికి సాటి లేరు. నిద్ర లేచింది మొదలు రాత్రి భోజనం పూర్తి చేసిన తరువాత కూడా టీ తాగందే నిద్రపోని వ్యక్తులు ఉన్నారు. స్నేహితులతో ముచ్చట్లు పెట్టాలన్నా.. తోటి ఉద్యోగులతో పిచ్చాపాటి మాట్లాడాలన్నా.. వ్యాపారులు తమ లావాదేవీలపై.. నాయకులు రాజకీయాలపై చర్చించాలన్నా చాయ్ కేఫ్లు కేరాఫ్ అడ్రస్గా మారాయి. అలాగే మహా నగరాలకే పరిమితమైన ఇరానీ చాయ్ కేఫ్లు ఇప్పుడు నెల్లూరు వాసులను తమ రుచితో ఆకర్షిస్తున్నాయి. నెల్లూరు సిటీ: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా చాయ్ సెంటర్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. ప్రతి ప్రాంతంలో కనీసం రెండు నుంచి మూడు కేఫ్లు ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల చాయ్ సెంటర్లు, కేఫ్లు ఉంటాయని అంచనా. మహా నగరాల్లో ఉండే వివిధ రకాల చాయ్ సెంటర్లు ప్రస్తుతం నెల్లూరులో వెలుస్తున్నాయి. ఆయా కంపెనీల ఫ్రాంచైజీలను నగరవాసులు కొంత మొత్తం చెల్లించి నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మహా నగరాలకు మాత్రమే పరిమితమైన ఇరానీ చాయ్ ఇప్పుడు నెల్లూరు వాసులను తన రుచితో కట్టిపడేస్తోంది. అయితే కొందరు టీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటుంటారు. అలాంటి వారి కోసం లెమన్ టీ, బ్లూ టీ, గ్రీన్ టీ, బాదం టీ లాంటి వాటిని కూడా కేఫ్ నిర్వాహకులు అందిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు.. ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గరమ్ చాయ్ని ఇష్టపడుతూ చాయ్ కేఫ్లను ఆదరిస్తున్నారు. క్వాలిటీలో తగ్గేదేలే.. నెల్లూరు వాసులు రుచికి, క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. రుచి బాగుంటే అమితంగా ఆదరిస్తారు. దీంతో ఆ వ్యాపారం సైతం అంతే స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అయితే రుచిలో, నాణ్యతలో ఎలాంటి తేడా జరిగినా నగరవాసులు అటువైపు కూడా చూడరు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది వ్యాపారులు ఎదుర్కొన్నారు కూడా. గ్రాండ్గా సెలబ్రిటీలతో ప్రారంభించినా, ఆఫర్లు ఇచ్చినా, పెద్దగా పట్టించుకోరు. కేవలం రుచికి, నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు సైతం షుగర్ లెస్ ఇరానీ చాయ్ సైతం పలు చాయ్ కేఫ్లలో అందుబాటులో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోటాపోటీగా.. గతంలో నెల్లూరు నగరంలోని ప్రధాన సెంటర్లలో మాత్రమే టీ కేఫ్లు ఉండేవి. జనాభా పెరుగుదలతోపాటు ప్రజలు టీ, కాఫీలకు బాగా అలవాటు పడడంతో చాయ్ సెంటర్లకు ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. కొందరు చాయ్ సెంటర్ల నిర్వాహకులు పోటాపోటీగా ఇతర రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండే చాయ్ రుచులను సైతం నెల్లూరు వాసులకు పరిచయం చేస్తున్నారు. నగరంలోని రామలింగాపురం, అన్నమయ్య సర్కిల్, మాగుంటలేఅవుట్, వీఆర్సీ సెంటర్, ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ సెంటర్, వేదాయపాళెం, మూలాపేట, సంతపేట, కేవీఆర్ పెట్రోల్ బంక్ తదితర ప్రాంతాల్లో కొత్త రుచులతో టీ కేఫ్లు, ఇరానీ చాయ్ సెంటర్లు నూతనంగా వెలిశాయి. అయితే వాటిలో కొన్ని కేఫ్లు మాత్రమే రుచితో, నాణ్యతతో చాయ్ అందిస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఒక్క టీ చాలు నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నా వెంటనే చాయ్ సెంటర్కు వెళ్లి ఒక్క చాయ్ తాగితే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజుకు కనీసం నాలుగు టీలు తాగుతాను. ధమ్ టీ, ఇరానీ చాయ్ నాకు చాలా ఇష్టం. – భాను, రామలింగాపురం స్నేహితులతో కలిసి.. రోజూ చిల్డ్రన్స్ పార్క్లో వాకింగ్కు వస్తుంటాను. వాకింగ్ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి చాయ్ సెంటర్కు చేరుకుంటాం. రుచికరమైన చాయ్ని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటాం. స్నేహితులతో అలా కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. – రాము, చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతుంటారు. ఈ క్రమంలో మైండ్ను ఫ్రెష్ చేసుకునేందుకు సహచర ఉద్యోగులతో కలిసి ఓ టీ తాగుదామని చాయ్ కేఫ్లకు వస్తున్నారు. అలాగే స్నేహితులు వివిధ రకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ సాయంత్రం అయిందంటే చాయ్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. స్నేహితులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చాయ్ని సిప్ చేస్తూ తమ టెన్షన్లను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన టీని ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో చాయ్ సెంటర్ల నిర్వాహకులు కొత్త రుచులను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. -
బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ అరుదైన ఘనత
బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించింది. విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్టివ్ బిల్బోర్డ్ను ఆవిష్కరించడంతో ఈ ఘనతను సాధించింది. 'మేఘ్ సంతూర్' పేరుతో 2250 చదరపు అడుగుల బిల్బోర్డ్ను ప్రదర్శించింది. దీనిని ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో రూపొందించారు. 50 మంది నిపుణుల బృందంతో 6 నెలల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన ఈ బిల్ బోర్డ్ విజయవాడ నగర వాసుల్ని సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టేలా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దీంతో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ తాజ్ మహల్ టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అందించారు. -
‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’కి భారీ ఊరట
ప్రముఖ దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ సంస్థకు భారీ ఊరట లభించింది. ‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ హెచ్యూఎల్పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, ఆ కేసును కోల్కతా హైకోర్టు కొట్టిపారేసింది. సంస్థ యాజమాన్యం నిర్ధోషులని తీర్పిచ్చింది. కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)కు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హిందుస్థాన్ యూనిలివర్ సంస్థపై, ఆ కంపెనీ (ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు) యాజమాన్యం రెడ్ లేబుల్ టీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ క్రిమినల్ కేసు నమోదు చేశారు. హెచ్యూఎల్ సంస్థ ఆహార కల్తీ నిరోధక చట్టం సెక్షన్ 38, సెక్షన్ 39ని ఉల్లంఘించందని ఆరోపించారు. దీంతో తప్పుగా బ్రాండింగ్ చేస్తున్నందుకు హెచ్యూఎల్ ఉన్నతాధికారులు దోషులని మునిసిపల్ మేజిస్ట్రేట్ నిర్ధారించింది. రూ. 5,000 జరిమానాతో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ శిక్షను కోల్కతా జిల్లా కోర్టు (సెషన్స్ కోర్టు) కొట్టివేసింది. అయితే, తీర్పును మళ్లీ పరిశీలించాలని మున్సిపల్ మేజిస్ట్రేట్కు తిరిగి పంపించింది. సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీపై తప్పుడు ప్రచారం చేసిందనే మున్సిపల్ కార్పొరేషన్ అభిప్రాయంపై స్పందించింది. తప్పుడు ప్రచారం అంటూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నిరూపించడానికి ట్రయల్ కోర్టు (అప్పీలేట్ కోర్టు) ముందు కేఎంసీ విభాగం ఎప్పుడూ హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా హిందుస్థాన్ యూనిలీవర్ తన ఉత్పత్తిని ఎందుకు తప్పుగా బ్రాండ్ చేసిందనే కారణాల్ని వివరించలేదని కోర్టు తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్, ఆ సంస్థ అధికారులపై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవని జస్టిస్ సుభేందు సమంతా గుర్తించారు. కేసును కొట్టివేసి నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ తరఫున న్యాయవాదులు సబ్యసాచి బెనర్జీ, అనిర్బన్ దత్తా, అభిజిత్ చౌదరి, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ తరపున న్యాయవాదులు గౌతమ్ దిన్హా ,అనింద్యసుందర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇమ్రాన్ అలీ, దేబ్జానీ సాహులు తమ వాదనల్ని వినిపించారు. -
ఎంతో ఇష్టంగా తాగే చాయ్లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా!
ఓ కప్పు 'టీ' తాగితే హమ్యయ్య అనిపిస్తుంది. అంతెందుకు పనివాళ్ల దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అబ్బా ఓ కప్పు 'టీ' పడితే ప్రాణం సుఖంగా ఉంటుంది. హుషారుగా పనిచెయ్యొచ్చు అనుకుంటారు. చాలామంది టీ తాగితే చాలు ఆకలి తీరిపోయిందనుకుంటారు. అంతలా చాయ్కి అతక్కుపోయారు కొందరూ. అలాంటి టీలో ఒకప్పుడూ పాలు కలిపేవారే కాదట. మధ్యలోంచే మొదలైంది. అక్కడనుంచి టీని పాలు కలిపి తయారు చేయడం ప్రారంభించారట. అంతేగాని ముందుగా ఓన్లీ డికాషన్ తప్ప పాలు కలపేవారే కాదట. అసలెప్పుడూ అలా చేయడం ప్రారంభమైంది? ఎలా వచ్చింది? తదితరాలు గురించే ఈ కథనం. మన దేశంలో ఎవరైన వస్తే ముందుగా టీ తాగుతారా అని అడుగుతారు. ఇంట్లో ఏం లేకపోయిని జస్ట్ ఓ టీ కప్పు, కొన్ని బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి చాయ్లో పాలు కలపడం అనే ప్రక్రియ భారత్ నుంచి ప్రారంభం కాలేదట. మన వరకు వచ్చేటప్పటికీ.. బ్రిటీస్ వాళ్లు టీ తోటలు పెంచేంత వరకు మనకు చాయ్ గురించి తెలియనే తెలియదు. బ్రిటీష్ వాళ్లకు కూడా టీ గురించి 17వ శతాబ్దం వరకు తెలియదట. టిబెట్లో ప్రజలు టీ పొడితో పాలు కలిపి తయారు చేసేవారట. అలా చైనా నుంచి మంగోలియాకు టీ తయారీ విధానం విస్తరించిందట. ఇక 1800 మధ్య కాలం నుంచి బ్రిటీష్వారు టీ పొలాలు ఏర్పాలు చేసి దుకాణాలు పెట్టి విక్రయించేంతవరకు టీ పెట్టే అలవాటు మనకు లేనేలేదట. కాబట్టి మనకు టీలో పాలు కలపడం గురించి బ్రిటీష్ వాళ్లు అలవాటు చేసిందే గానీ ముందుగా భారత్లో మాత్రం లేదు. టీలో పాలు కలపడం వెనుక కారణం.. పశ్చిమ ఐరోపాలో పర్యటించేటప్పుడూ సుదీర్ఘ సముద్ర ప్రయాణాలు ఉండేవి. ఆ టైంలో కాస్త నకీల టీల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో టీని ఆసక్తికరంగా రుచిగా ఉండేలా తయారు చేసే విధానాలపై దృష్టి పెట్టారు అప్పటి ప్రజలు. ఆ క్రమంలో పాలు జోడించటం జరిగింది. సాధారణ 'టీ' డికాషన్ చేదుగా ఉండటంతో పాలు జోడించి మరింత రుచిగా తాగేలా చేయడమ ప్రారంభించారు. అలానే మరో కారణం కూడా ఉంది. అదేంటంటే..యూరోపియన్ పింగాణి పాత్రలు చాలా సున్నితమైనవి, ఖరీదైనవి. దీంతో వేడివేడీ టీ పోయగానే అవి పగలిపోయేవి. కప్పులు పగలకుండా లేదా పగళ్లు రాకుండా ఉండేలా చల్లటి పాలు పోసి ఆ తర్వాత వేడివేడి టీ డికాషిన్ పోసేవారట. అలా పాలతో టీ సర్వ్ చేయడం ప్రారంభమైందట. పాలతోనే రుచిగా ఉటుందని ఎప్పుడూ తెలిసిందంటే.. టిబెటియన్లు పోషకాహారాన్ని పెంచెందుకు ఈ టీ తయారీకి పాలు జోడించారట. అలాగే బ్రిటన్ పారిశ్రామిక విప్లవం సమయంలో శ్రామిక తరగతి ప్రజలు టీలో పాటు జోడించేవారట. వారు దానిని బిల్డర్స్ టీ అని పిలిచేవారట. సుదీర్ఘ పనిదినాల్లో టీ విరామంలా దీన్ని సేవించి తిరిగి నూతన ఉత్తేజంతో పనిచేశేవారట. టీలో ఉండే టానిన్లు కారణంగా చేదుగా ఉంటుంది. పాలుతో కాకుండా నేరుగా తాగితే నోరు పొడిబారినట్లు అవుతుంది. అదే ఇలా పాలతో తీసుకుంటే టానిన్ల ప్రభావాన్ని తగ్గించి చక్కటి రుచితో బాటు కాస్త నోరు తేమగా ఉండేలా చేస్తుంది. పాలు ఉపయోగించడంతో తక్షణమే ఒంట్లోకి శక్తి వచ్చి కాస్త బలంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటి నుంచి ఇలా పాలను టీ పోడితో జోడించి రుచిగా తయారు చేయడం ప్రారంభమైందట. అలాగే మరో కారణం కూడా చెబుతుంటారు కొందరూ. టీని పాలతో తీసుకునే అలవాటు ఫ్రెంచ్ ఉన్నత వర్గానికి చెందిన వారి నుంచి మొదలైందని కొందరి వాదన. 1685లో, ఫిలిప్ సిల్వెస్ట్రే డుఫోర్ పాలతో దగ్గు, జీర్ణ రుగ్మతలకు విరుగుడుగా ఇలా టీని తయారు చేశాడని అంటారు. కలోనియల్ బోస్టన్లోకి దిగుమతి చేసుకున్న చైనీస్ బ్లాక్ టీలు తప్పనిసరిగా పాలతో బాగా రుచిగా ఉండేవి. వారు కాంటన్ నుంచి లండన్ మీదుగా తమ సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసే సమయానికి టీ పాతబడిపోయి రుచిగా ఉండేది కాదు. దీంతో పాలు జోడించగానే రుచిగా ఉండేది. ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక కెన్యాలో ప్రస్తుతం ఉత్పత్తి చేయబడిన టీలో ఎక్కువ భాగం పాలతో కలిపి తాగడానికి తయారు చేసిన టీనే ఉత్పత్తి చేస్తోంది. (చదవండి: పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్ మంచివే ఎందుకంటే..) -
కరోడ్పతి చాయ్వాలా: ఐఐ‘టీ’యన్ చాయ్ కహానీ..
దేశంలో ఉన్నత చదువులు చదివిన కొంత మంది యువత ఉద్యోగాలు దొరక్క టీ దుకాణాలు ప్రారంభించి ఉపాధి పొందడం చూస్తున్నాం. ఇలా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. అయితే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం అదీ అమెరికన్ జాబ్ మానేసి మరీ చాయ్ బిజినెస్ పెట్టిన వాళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? అమెరికాలో ఉద్యోగం చాలా మందికి కల. కానీ అది కొందరికే దక్కుతుంది. ఇంతటి క్రేజ్ ఉన్న యూఎస్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఐఐటీయన్ నితిన్ సలూజా (Nitin Saluja) వదులుకున్నాడు. చాయోస్ (Chaayos) అనే పేరుతో టీ బిజినెస్ను ప్రారంభించాడు. నితిన్ సలూజా ప్రారంభించిన చాయోస్ వ్యాపారంలో మొదట్లో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కానీ నితిన్ పట్టుదల, సంకల్పంతో కంపెనీని విజయ శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. స్టార్బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా వంటి కాఫీ షాపుల ఆధిపత్యంలో ఉన్న దేశంలో చాయోస్ తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. భారతదేశంలోని ప్రముఖ చాయ్ కేఫ్గా మారింది. చాయ్ బిజినెస్ను స్థాపించి, రూ. 100 కోట్ల వ్యాపారంగా మార్చిన నితిన్ సలూజా కథను తెలుసుకుందాం. మెకానికల్ ఇంజనీర్ నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తన చదువు పూర్తయిన తర్వాత, సలుజా అమెరికాలోని ఒక పెద్ద సంస్థలో కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా చేరారు. రూ.లక్షల్లో జీతం. ఒక రోజు నితిన్, తన భార్యతో కలిసి టీ తాగుదామనుకున్నారు. కానీ కనుచూపు మేరలో టీ షాప్ కనిపించలేదు. అప్పుడే నితిన్ ఓ ఆలోచన వచ్చింది. టీ కేఫ్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఉద్యోగాన్ని మానేసి ఇండియాకి తిరిగొచ్చేశాడు. టీ వ్యాపారానికి ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించాడు. చాయోస్ పుట్టిందిలా.. నితిన్ అమెరికాలో ఉన్నప్పుడు టీ బూత్ల నుంచి టీ కొనడం సవాలుగా ఉందని గమనించాడు. టీ తాగడానికి ఒక హై-ఎండ్ టీ షాప్ ఏర్పాటు చేయగలిగితే అది అద్భుతంగా ఉంటుందని భావించాడు. భారత్లో రకరకాల కాఫీని అందించే కేఫ్లు చాలా ఉన్నాయి కానీ విభిన్న టీని అందించేవి ఏవీ లేవని గుర్తించాడు. దేశంలో ప్రత్యేకమైన టీ తాగే సంస్కృతి ఉంది. భారతీయులు అనేక రకాల టీలను తయారుచేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న నితిన్.. ఇండియాలో టీ తాగేవాళ్లకు ఉపయోగపడే టీ కేఫ్ను ప్రారంభించాలని భావించాడు. 2012లో తన స్నేహితుడు రాఘవ్తో కలిసి చాయోస్ని స్థాపించాడు. గురుగ్రామ్లో తమ మొదటి కేఫ్ ప్రారంభించారు. రూ. 100 కోట్ల ఆదాయం ఇంతో ఇష్టంగా చాయోస్ను ప్రారంభించిన నితిన్ కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం మొదలు పెట్టాడు. ప్రారంభంలో కొన్నేళ్లు మూలధనం, పెట్టుబడి సమస్యలతో మనుగడ కోసం కష్టపడ్డాడు. తానే స్వయంగా ఆర్డర్లు తీసుకోవడం, టీ తయారు చేయడం, సర్వ్ చేయడం వంటివి చేసేవాడు. ప్రతి కస్టమర్కూ ప్రత్యేకమైన టీని అందిస్తూ ఆకట్టుకునేవాడు. ఇలా వ్యాపారం వేగం పుంజుకుంది. అవుట్లెట్లు విస్తరించాయి. కాగా కోవిడ్ సమయంలో అన్ని వ్యాపారాల లాగే చాయోస్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత 2020లో మళ్లీ పుంజుకుంది. తొలినాళ్ల కష్టాల తర్వాత నితిన్ శ్రమకు ప్రతిఫలం దక్కింది. కంపెనీ 2020లో రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చివరికి ముంబై, బెంగళూరు, చండీగఢ్, పుణేలలో చాయోస్ స్టోర్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా చాయోస్ కేఫ్లు ఉన్నాయి. -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
గిన్నిస్ రికార్డ్: టీపాట్ ధర రూ. 24 కోట్లు! దీని సృష్టికర్త మనోడే..
World most valuable teapot Guinness World Records: సాధారణంగా అందరి ఇళ్లలోనూ టీపాట్లు వాడుతూ ఉంటారు. వీటి ధర ఎంత ఉంటుంది? రూ.1000 వరకు ఉంటుంది. మరీ ప్రత్యేకమైనవైతే ఇంకొంచెం ఎక్కువ ధర ఉంటుంది. కానీ ఓ టీపాట్ ధర ఏకంగా రూ.24 కోట్లు. ఇది అత్యంత ఖరీదైన టీపాట్గా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. బ్రిటన్కు చెందిన ఎన్ సేథియా ఫౌండేషన్, లండన్లోని న్యూబీటీస్ సంయుక్తంగా తయారు చేయించిన ఈ టీపాట్ను ఇటాలియన్ స్వర్ణకారుడు ఫుల్వియో స్కావియా రూపొందించారు. 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన ఈ టీపాట్ చుట్టూ వజ్రాలను పొదిగారు. వాటి మధ్యలో 6.67 క్యారట్ల రూబీలను అమర్చారు. ఈ టీపాట్ తయారీలో మొత్తం 1658 వజ్రాలు, 386 థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారు. ఈ అద్భుతమైన టీపాట్కు ‘ది ఇగోయిస్ట్’ (The Egoist) అని పెట్టారు. 2016లోనే దీని విలువ 3 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.24 కోట్లు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్గా గిన్నిస్ బుక్ తాజాగా గుర్తించింది. ఈ టీపాట్ ఫొటోలను, వివరాలను ట్విటర్లో షేర్ చేయగా యూజర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చేయించింది మనోడే! ఈ అత్యంత ఖరీదైన టీపాట్ను తయారు చేయించింది భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం. బ్రిటిష్-ఇండియన్ బిలియనీర్ నిర్మల్ సేథియా స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎన్ సేథియా ఫౌండేషన్ ఈ టీపాట్ను తయారు చేయించింది. మరో విశేషం ఏంటంటే దీని డిజైన్ను నిర్మల్ సేథియా స్వయంగా రూపొందించారు. టీ వ్యాపారి అయిన నిర్మల్ సేథియా ప్రపంచంలోని అత్యుత్తమ టీలకు అంకితమిచ్చేలా ఒక టీపాట్ను సృష్టించాలనుకుని దీన్ని తయారు చేయించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. This is the most valuable teapot in the world. Owned by the N Sethia Foundation in the UK, the teapot is made from 18-carat yellow gold with cut diamond covering the entire body and a 6.67-carat ruby in the centre. The teapot's handle is made from fossilised mammoth ivory. It… pic.twitter.com/TFZZF63YiW — Guinness World Records (@GWR) August 9, 2023 -
టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్
అమృత్సర్ పేరు వినబడగానే ‘స్వర్ణ దేవాలయం’ గుర్తుకు వస్తుంది. ఈ పవిత్ర నగరంలో ఒక విశేషమైన టీ స్టాల్ ఉంది. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అనే ఈ టీ స్టాల్లో టీ ఉచితంగా ఇస్తారు. ఎనభై సంవత్సరాల అజిత్సింగ్ ఎన్నో సంవత్సరాలుగా ఒక పెద్ద చెట్టు ఊడల మధ్య ఈ టీ స్టాల్ను నిర్వహిస్తున్నాడు. అజిత్సింగ్ను అందరూ ‘బాబాజీ’ అని పిలుస్తారు. ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎప్పుడైనా ఉచితంగా టీ తాగవచ్చు. గతంలో ఈ టీస్టాల్లోని వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. అయినప్పటికీ బాబాజీ ఉచిత టీ ఇవ్వడం ఆపలేదు. -
అలాంటి వాళ్లకు ఈ కాఫీ మేకర్ భలే ఉపయోగపడుతుంది..
ప్రతి ఇంట్లో మిక్సీలు, గ్రైండర్లు, కుకర్లలానే.. కాఫీ, టీ మేకర్స్ కూడా నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. ఇప్పుడంతా కాఫీ అయినా టీ అయినా.. స్విచ్ నొక్కి నచ్చిన ఫ్లేవర్ అందిపుచ్చుకోవడమే కదా! అలాంటి వారికి ఈ మెషిన్ భలే ఉపయోగడుతుంది. లాటే, కాపుచినో, కోల్డ్ వంటి ఆప్షనల్ బటన్స్ డివైస్కి కుడివైపు ఉంటాయి. ఎడమవైపు మినీ వాటర్ ట్యాంకర్ ఉంటుంది.ఇందులో ఆరుగురికి, ఎనిమిది మందికి, పది మందికి లేదా పన్నెండు మందికి ఒకేసారి కాఫీ లేదా టీని సిద్ధం చేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ రీయూజబుల్ కాఫీ ఫిల్టర్ లాంటిది. చల్లని లేదా వేడి పాల నురుగుని తయారుచేస్తుంది. దీన్ని శుభ్రం చేయడమూ తేలికే. కప్పులు, మగ్గులు.. డివైస్ ముందువైపు పెట్టుకుంటే, అందులోకే కాఫీ లేదా టీ వచ్చి చేరుతుంది. బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు ఈ కాఫీ మేకర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కాఫీ మేకర్ ధర 229 డాలర్లు(రూ.18,844) -
బ్లూ టీ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
చాలామందికి పొద్దున లేవగానే టీ తాగనిదే రోజు గడవదు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న టీ బ్లూ టీ. అపరాజిత పూలతో ఈ టీని తయారు చేస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ బ్లూ టీని ఒక్కసారి తాగితే మళ్లీ విడిచిపెట్టరట. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి? బ్లూ టీతో కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ► బ్లూ టీనే బటర్ఫ్లై పీ ఫ్లవర్ టీ, శంఖు పువ్వు అని కూడా పిలుస్తారు. ఇది నీలం రంగులో ఉంటుంది. ► బ్లూ బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ను నీటిలో మరిగించి ఈ హెర్బల్ టీని ప్రిపేర్ చేస్తారు. ► ఇందులోని ఆంథోసైనిన్ సమృద్దిగా ఉండటం వల్ల ఈ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ► యాంటీ యాక్సిడెంట్లు బ్లూ టీలో ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ టీని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ► బ్లూ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు ► బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంఉటంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. ► బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ► షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ టీ కాకుండా బ్లూ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ► అలసట, చికాకుగా ఉన్నప్పుడు ఈ బ్లూ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ► బ్లూ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి రోజుకు రెండుసార్లు అయినా హ్యాపీగా ఈ టీని తీసుకోవచ్చు. ► ఈ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. ► డిప్రెషన్, యాంక్సైటీగా అనిపించినప్పుడు బ్లూ టీ ఓ కప్పు తాగితే వెంటనే మూడ్ ఛేంజ్ అయ్యి యాక్టివ్ అవుతారట. -
'టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్' వృద్ధుని దుకాణంపై ఆనంద్ మహీంద్ర పోస్ట్..
'టీ ' అంటే మనందరికీ ఇష్టమే. ఉదయం లేచిన దగ్గర నుంచి టీ తాగకుండా ఇంకే పని మొదలుపెట్టము. పనిలో కాస్త ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఓ కప్ టీ తాగి మళ్లీ ఫ్రెష్గా ప్రారంభిస్తాము. అందుకే ఏ సందులో చూసినా టీ షాప్ ఉంటుంది. ఇది ఎందరికో జీవనోపాధిని కల్పిస్తుంది. అయితే.. తాజాగా అమృత్సర్లో ఓ వృద్ధుడు కొనసాగిస్తున్న టీ షాప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 45 ఏళ్లుగా వృద్దుడు ఓ మర్రి చెట్టు మొదలులో టీ షాప్ని నడిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. 'అమృత్సర్లో చాలా ప్రదేశాలు చూశాను. కానీ వీడియోలో కనిపిస్తున్న ఈ టీ షాప్ని ఎప్పుడూ చూడలేదు. ఈ సారి అమృత్సర్ వెళ్లినప్పుడు ఈ దుకాణాన్ని తప్పుకుండా చూస్తాను. గత 40 ఏళ్లుగా ఓ వృద్ధుడు నడిపిస్తున్న టీ షాప్ని 'టెంపుల్ ఆప్ టీ సర్వీస్' గా పేర్కొంటూ' ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆలోచిస్తే మన హృదయమే దేవాలయం అని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. There are many sights to see in Amritsar. But the next time I visit the city, apart from visiting the Golden Temple, I will make it a point to visit this ‘Temple of Tea Service’ that Baba has apparently run for over 40 years. Our hearts are potentially the largest temples.… pic.twitter.com/Td3QvpAqyl — anand mahindra (@anandmahindra) July 23, 2023 ఈ వీడియోలో 80 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వృద్ధుడు ఓ భారీ వృక్షం సందులో టీ షాప్ని నిర్వహిస్తున్నాడు. గత 45 ఏళ్ల నుంచి తను ఒకటే పనిని కొనసాగిస్తున్నారు. అందరూ అతన్ని బాబాగా పిలుస్తారు. స్థానికంగా అతనంటే తెలియని వారుండరు. ఈ టీ విక్రయదారునికి పని పట్ల ఉన్న నిబద్ధత, విధేయత, ఆసక్తి నెటిజన్లను ఆకర్షించింది. Amidst the timeless charm of Amritsar, under the embracing canopy of a majestic tree, a venerable man gracefully serves the elixir of Indian Tea. With every cup poured, he weaves a tapestry of tradition, warmth, and hospitality, earning the title of the "Temple of Tea Service 😊 — Rahul Verulkar (@verulkar_rahul) July 23, 2023 The city has a lot of magnetic qualities. Truly Golden city.....City with the legendary Golden temple and seems to have lovable human beings like Babaji too 😍👏🥳🙏..... — Sunil Balachandran (@Sunil_bchandran) July 23, 2023 ఇదీ చదవండి: రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్ -
టీ తెచ్చిన తంటా..
కర్నూలు: టీ స్టాల్లో టీ ఆర్డర్ ఆలస్యమైందని మొదలైన వాగ్వాదం చివరకు పోలీసు స్టేషన్కు చేరింది. ఈ ఘటన డోన్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐలు శరత్ కుమార్రెడ్డి, నగేష్ తెలిపిన వివరాల మేరకు.. తారకరామనగర్కు చెందిన ఈశ్వర్గౌడ్, రమేష్ గౌడ్ సొంత అన్నదమ్ములు. వీరు స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో టీ స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం అదే కాలనీకి చెందిన ఎరుకలి తిరుపతి అనే వ్యక్తి వచ్చి స్పెషల్ టీ కోసం ఆర్డరు ఇచ్చాడు. టీ ఇవ్వడం ఆలస్యం కావడంతో మాట మాట పెరగడంతో పరస్పరం దాడికి పాల్ప డ్డారు. తిరుపతికి గాయాలు కాగా చికిత్స నిమి త్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తనను కులం పేరుతో దూషించారని బాధితుడి ఫిర్యాదు మేరకు టీస్టాల్ నిర్వాహకులపై ఎస్సీ, ఎస్టీ కేసును, తమపై దాడి చేశాడని టీకొట్టు యజమానుల ఫిర్యాదు మేరకు తిరుపతిపై కౌంటర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐలు తెలిపారు. -
అతిగా 'టీ' తాగుతున్నారా! ఈ సమస్యలు ఎదుర్కొనక తప్పదు
'టీ' అంటే ఇష్టపడని వారుండరు. చల్లటి ఈ వర్షాకాలంలో ఓ కప్పు చాయ్ ఎంత హాయిగా ఉంటుంది. ఏం తినకపోయిన పర్వాలేదు కానీ.. ఆకలేసినప్పుడల్లా వేడివేడి 'టీ' సిప్ చేస్తుంటూ కొందరికి చాలా హాయి అనిపిస్తుంది. ఆ టీ గొంతులో పడగానే శరీరంలో కాస్త ఉత్సాహం వచ్చి మళ్లీ తమ పనులు యథావిధిగా చేసుకోగలుగుతారు. కప్పు టీ పడితే చాలు అబ్బా} ప్రాణం హాయిగా ఉంది అంటారు చాలామంది. ఇలా భావించే కొందరూ..రోజుకు రెండు మూడు కప్పుల చాయ్ తాగేస్తుంటారు. ఇది చాలా దుష్ప్రభావాలకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉండే కెఫిన్, టానిన్ కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనక తప్పదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. టీ తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.. ఐరన్ లోపం.. టీలో కెఫిన్, టానిన్లు అధికంగా ఉంటాయి.అందువల్ల దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఐరన్ శోషించుకోనీకుండా చేస్తుంది. దీని వల్ల నిద్రలేమి ఏర్పడి తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుందంటున్నారు నిపుణలు. టానిన్లు కొన్ని ఆహారాలలో ఉండే ఇనుమును బంధిస్తాయి. దీంతో మీ జీర్ణవ్యవస్థ శోషించుకునే సమయంలో ఐరన్ని అందుబాటులో లేకుండా చేస్తుంది. దీంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత సాధారణ పోషకాహార లోపాల్లో ఒకటని చెబుతున్నారు నిపుణులు. అలాగే మీరు గనుక శాఖహారులైతే మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే 'టీ' టానిన్లు జంతు ఆధారిత ఆహారాల కంటే మొక్కల మూలాల నుంచి ఇనుమును ఎక్కువగా గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి ఏర్పడుట టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్ర చక్రానికి అంతరాయ ఏర్పడుతుంది. మెదుడును నిద్రకు ఉపక్రమించేలా చేసే మెలటోనిన్ అనే హార్మోన్ని నిరోధిస్తుంది. ఫలితంగా మంచి నిద్ర పట్టదు. సరిపోని నిద్ర కారణంగా అలసటగా అనిపిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గి..అనేక రకాల మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమి కారణంగా ఊబకాయం వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా ఉండదు. ఈ కెఫిన్ గుండెల్లో మంటకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. చాలామంది వ్యక్తులలో యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని అంటున్నారు. ఈ కెఫిన్ మీ అన్నవాహికను, మీ కడుపును వేరు చేసే స్పింక్టర్ను నెమ్మదించేలా చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. తద్వారా కడుపులో ఉత్ఫన్నమయ్యే ఆమ్లాలు అన్నవాహికలోకి సులభంగా వెళ్తాయి. రోజంతా టీ సిప్ చేస్తూ ఉన్నవారు దీర్ఘకాలిక తీవ్రమైన తలనొప్పితో బాధపడతారట. సోడా లేదా కాఫీ వంటి ఇతర కెఫిన్ పానీయాల కంటే టీలో కెఫిన్ తక్కువే అయినా కొన్ని రకాల టీలు ఒక కప్పు టీకి సుమారు 60 మిల్లీ గ్రాముల కెఫిన్ అందిస్తుందని, ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..) -
ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా? ఒక్కసారి ఇది తెలుసుకోండి..
మీకు పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటుందా? అయితే ఈ స్టోరీ మీకోసమే.. మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ లేనిదే రోజు మొదలవదు. టీ తాగకపోతే ఏదో అయిపోయింది అన్నట్లు ఫీల్ అవుతుంటారు. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ఎసిడిక్ సమతుల్యత దెబ్బతింటుంది. నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో బెడ్ కాఫీలు, బెడ్ టీలు తాగడం వల్ల హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం టీ లేదా కాఫీ తీసుకున్నవారిలో నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుందని ఇది నోట్లో యాసిడ్ స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. మరి టీ కాఫీలు ఏ సమయంలో తీసుకోవాలి? ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ► ఉదయాన్నే టీ తాగితే రిఫ్రెష్గా ఉంటుందనుకుంటారు చాలామంది. కానీ దీని వల్ల లాభాల కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ► పొద్దున్నే పరిగడుపున టీ, కాఫీలు తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయట. ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయట. ► కొంతమంది పళ్లు తోముకోకుండా పొద్దున్నే బెడ్ కాఫీ, టీలు తాగుతారు. ఇలా చేయడం వల్ల నోట్లోని చెడు బాక్టీరియా పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుందని, అతిగా తాగడం వల్ల పళ్లు కూడా దెబ్బతినే అవకాశం ఉందట. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కెఫీన్ మోతాదు పెరిగి మానసిక ఆందోళన, ఒత్తిడి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు టీలో దాదాపు 11 నుండి 61 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుందట. ► ఎక్కువగా టీ, కాఫీలు తాగడం వల్ల నీళ్లు తాగాలనిపించదు.ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీ హైడ్రేైషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. ► చాలామంది రాత్రి, పగలు తేడా లేకుండా టీ, కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు టీ తాగడం వల్ల నిద్రలేమితో బాధపడతారని నిపుణులు సూచిస్తున్నారు. ఏ సమయంలో టీ,కాఫీలు తాగాలి? ♦ సాధారణంగా వ్యాయామం చేసే ముందు కాఫీ తాగడం మంచిది. ఇది ఇన్స్టంట్గా ఎనర్జీతో పాటు అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ♦ పొద్దున్నే టీ తాగాలనుకునేవారు పరిగడుపున కాకుండా, టిఫిన్ తిన్న గంట తర్వాత టీ తాగడం మంచిదట. ఏదైనా మితంగా తీసుకుంటే సమస్య లేదంటున్నారు నిపుణులు. రోజుకు రెండుకప్పులు టీ, కాఫీలు తాగొచ్చని, అంతకుమించి మాత్రం తీసుకోవద్దని చెబుతున్నారు. -
ఒక్కరోజు ఛాయ్ వాలా అయిన మమతా బెనర్జీ
-
చాయ్ వాలాగా మారిన సీఎం మమతా.. ఇదంతా అందుకోసమే!
కోల్కతా: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతలు ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అవుతుంటారు. ఇందుకోసం లీడర్లు చిత్రవిచిత్రాలు చేస్తుంటారు. రానున్న పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఛాయ్ వాలా అవతారమెత్తారు. రోడ్డు పక్క ఉన్న ఓ హోటల్లో స్వయంగా టీ తయారు చేసి, అక్కడున్న వారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం మమతా ఉత్తర బెంగాల్లోని కూచ్ బెహార్ నుండి జూలై 8 పంచాయతీ ఎన్నికల కోసం.. పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. కాషాయ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను బీఎస్ఎప్ భయపెడుతోందని, ఈ క్రమంలో వారి కార్యకలాపాలపై నిశితంగా పరిశీలించాలని పోలీసులను కోరారు. పంచాయతీ ఎన్నికలకు ముందు, కొంతమంది బీఎస్ఎఫ్ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఓటర్లను బెదిరించి, ఓటు వేయవద్దని బలవంతం చేస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. వారి బెదిరిపులకు భయపడకుండా ఎన్నికలలో నిర్భయంగా పాల్గొనాలని ఆమె ప్రజలను పిలుపునిచ్చారు. మూడంచెల గ్రామీణ ఎన్నికలలో తృణమూల్ బీజేపీని ఓడిస్తుందని మమతా నొక్కి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి, దేశంలో అభివృద్ధి ఆధారిత ప్రభుత్వాన్ని తీసుకువస్తామన్నారు. జూలై 8న ఒకే దశలో ఎన్నికలు జరుగనుండగా, జూలై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | West Bengal CM Mamata Banerjee makes tea and serves it to people at a tea stall in Jalpaiguri's Malbazar, as a part of her campaign for upcoming Panchayat polls pic.twitter.com/s2TiVIdyET — ANI (@ANI) June 26, 2023 చదవండి: 'సల్మాన్ ఖాన్ను చంపేస్తాం' ప్రముఖ గ్యాంగ్స్టర్ బెదిరింపులు.. -
వాట్ ఏ క్రియేషన్! కప్పులో దీపాలు!
కప్పులో టీ కామన్.. టీ కప్పులో తుఫాను.. ఒక ఎక్స్ప్రెషన్! టీ కప్పు దీపాలు.. ఇక్కడ విశేషం!! ఇప్పుడు ఇంటి అలంకరణలో ఈ టీ కప్పు దీపాలూ కాంతులీనుతున్నాయి! ఎలాగంటే.. మైనం రంగులు: టీ, కాఫీల్లో ఎన్ని రకాల రుచులు ఉంటాయో.. అన్ని రకాల రంగులు ఉంటాయి. ఆ థీమ్తోనే మైనాన్ని తీసుకొని, కొన్ని రంగులను జత కలిపి.. కప్పులో పోస్తున్నారు. వాటిలో వత్తి వేసి, అందంగా ముస్తాబు చేస్తున్నారు. సువాసనల దీపం: మైనం రంగుల ఎంపికలే కాదు.. వీటికి రకరకాల సువాసనలను జోడిస్తున్నారు. దీంతో ముచ్చటైన వెలుగులు.. ఆ వేడికి కరిగిపోతూ వెదజల్లే రోజ్, జాస్మిన్.. ఫ్లోరల్ పరిమాళాలనూ ఆఘ్రాణించవచ్చు. రీ యూజ్: కప్పులు పాత బడిపోయినా, పగుళ్లు బారినా వాటిని పడేస్తుంటాం. అభిరుచికి పదునుపెడితే పాత టీ కప్పులను మైనపు దీపాలుగా మార్చుకోవచ్చు. డిజైన్ బట్టి ధర: పింగాణీ కప్పుల ధర, ఎంపిక చేసుకున్న పరిమళాలు.. వెలుగులను బట్టి వీటి ధరలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెట్లోనూ కొనుక్కునే వీలుంది. (చదవండి: ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు) -
టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు
భారతదేశంలో టీ లేదా చాయ్కున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అంతేకాదు చాయ్ అమ్మి సక్సెస్ అయిన స్టోరీలు కూడా చాలా ఉన్నాయి. అయితే అనుభవ్ దూబే, ఆనంద్ విజయగాథ మాత్రం కాస్త డిఫరెంట్. ముఖ్యంగా 23 ఏళ్ల అనుభవ్ దూబే సీఏ పరీక్షలో ఫెయిలయ్యాడు. వ్యాపారవేత్త కావాలనుకుని ఏఐఎస్ డ్రీమ్స్ను వదిలేసుకున్నాడు. టీ వ్యాపారిగా 150కోట్లు సంపాదిస్తున్నాడు. మధ్యప్రదేశ్, రేవాకు చెందిన అనుభవ్ దూబే ఆనంద్ నాయక్ చిన్ననాటి స్నేహితులు. అనుభవ్ తండ్రి వ్యాపారవేత్త అయినప్పటికీ తన కొడుకును వ్యాపారిగా కాకుండా ఏఐఎస్ ఆఫీసర్ అధికారి కావాలని కోరుకున్నాడు. అప్పటికే సీఏ పరీక్షలో ఫెయిలైన కొడుకు అనుభవ్ దూబేని యూపీఎస్సీకి ప్రిపేర్ కావడాని ఢిల్లీకి పంపించాడు. తండ్రి కోరిక మేరకు అనుభవ్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పటికీ ఎందుకో ఉద్యోగంలో తన లైఫ్ సెటిల్ కాదని వ్యాపారమే కరెక్ట్ అని డిసైడయ్యాడు. ఫలితం కోట్ల విలువ చేసే కంపెనీ చాయ్ సుత్తా బార్కు కో ఫౌండర్గా మారిపోయాడు. కేవలం అయిదేళ్లలో 3 లక్షల నుండి 150 కోట్లకు ఎదిగాడు. 2016లో స్నేహితుడు ఆనంద్ నాయక్తో తన ప్లాన్గురించి చర్చించాడు. ఆలోచన బానే ఉందిగానీ ఇద్దరి దగ్గరా సరిపడా నిధులు లేవు. కానీ వ్యాపారవేత్త కావాలనుకున్న వాటి పట్టుదల ముందు అదిపెద్ద సమస్యగా తోచలేదు. ఎలాగోలా రూ. 3 లక్షలు సమకూర్చుకుని , తమ తొలి టీ అవుట్లెట్ను అమ్మాయిల హాస్టల్కు ఎదురుగా షురూ చేశాడు. తరువాతి కాలంలో వీరిద్దరితో రాహుల్ కూడా జత కలిశాడు. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) అసలే లో-బడ్జెట్. ఇక మార్కెటింగ్, ఇంటీరియర్ డిజైన్, బ్రాండింగ్ వంటి వాటి డబ్బులు ఎలా వస్తాయని అనుభవ్,ఆనంద్ మదనపడ్డారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలే. తోటి స్నేహితుల దగ్గర అప్పు చేసి, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్తో ఇండోర్లోని హాస్టల్కు ఆనుకుని తొలి అవుట్ లెట్ని డిజైన్ చేసుకున్నారు.అంతేకాదు ఆఖరికి బ్యానర్ను ప్రింట్ చేయడానికి డబ్బు లేకపోవడంతో, ఒక చెక్క ముక్కను తీసుకుని, చేతితో "చాయ్ సుత్తా బార్" అని రాశారు. ఈ టీ స్టాల్ పేరు, ఆలోచన, ఆశయం యువతను బాగా ఆకట్టుకున్నాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అనుభవ్ ,ఆనంద్ దేశంలోని 195 నగరాల్లో చాయ్ సుత్తా బార్ 450కిపైగా అవుట్లెట్లను ప్రారంభించారు. దుబాయ్, యుకె, కెనడా , ఒమన్ వంటి దేశాలతో సహా విదేశాలకు కూడా ఛాయ్ సుత్తా బార్ తన సత్తా చాటుకుంటోంది. చాయ్ సుత్తా బార్ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.150 కోట్లు. అనుభవ్ దూబే నికర విలువ దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా. మట్టి కప్పులు, 250 కుటుంబాలకు ఉపాధి చాయ్ సుత్తాబార్లో మట్టి కప్పులు, కుల్హాద్లు ప్రధాన ఆకర్షణ. దీనికి 250 కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించారు. మట్టి పాత్రనే వాడుతూ తద్వారా వృత్తి నిపుణులైన కుమ్మరి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇద్దరితో మొదలై చాయ్సుత్తా బార్లో ఇపుడు ఎంబీఏ చదివినవారు, ఇతర ఇంజనీర్లతో సహా ఈరోజు 150 మందికి పైగా పని చేస్తున్నారంటే వీరి వ్యాపార దక్షతను అర్థం చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడి సిబ్బంది దాదాపు అందరూ వికలాంగులు లేదా ఆర్థికంగా పేద నేపథ్యం నుండి వచ్చినవారు కావడం విశేషం. 7 రకాల టీ, పలు రకాల కాఫీలు, ఫాస్ట్ ఫుడ్లను విక్రయిస్తారు. ఇక్కడ టీ 10 రూపాయలకే టీ లభిస్తుంది. అనుభవ్ కష్టాలు, జీవిత పాఠం 2016: స్థానిక గూండాల దాడి 2017: నార్కోటిక్స్ దాడి 2020: కోవిడ్ హిట్; అవుట్లెట్లు మూసివేత 2020: వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన వ్యక్తి 2021: టైప్ 1 డయాబెటిస్ నిర్ధారణ 19 ఏళ్ళపుడు సీఏ వదిలి సివిల్ సర్వీసెస్కి 21 ఏళ్ళ వయసులో యూపీఎస్సీకి గుడ్బై 20వ దశకం ప్రారంభంలో ఏం చేయాలో తెలియని అయోమయం కట్ చేస్తే.. 3 లక్షల నుండి 150 కోట్లకు రాకింగ్ స్టార్గా అనుభవ్ దుబే ‘‘మీ ప్రయత్నాన్ని వదలవద్దు.. విజయం మీ కోసం వేచి ఉంది! ఆపొద్దు ప్రయత్నిస్తూ ఉండు!’’ అంటారు అనుభవ్ దూబే What's the craziest business idea you've ever had? pic.twitter.com/bfKdifIa5i — Anubhav Dubey (@tbhAnubhav) May 15, 2023 -
‘ఆడి చాయ్వాలా’ ఏమైంది భయ్యా? వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మనం ఇప్పటివరకు టీ అమ్ముతూ రూ.4 కోట్ల టర్నోవర్ సాధించిన ఎంబీయే చాయ్వాలా, బీటెక్ అమ్మాయి..బుల్లెట్ బండిపై పానీ పూరీ అమ్మిన స్టోరీలు చదివాం కదా. తాజాగా 'ఆడి చాయ్వాలా' హాట్టాపిక్గా నిలిచాడు.విలాసవంతమైన కారులో రోడ్డు పక్కన టీ అమ్ముతున్న వ్యక్తికి చెందిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆశిష్ త్రివేది అనే యూజర్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో లగ్జరీ వైట్ ఆడి కారులో టీ అమ్ముతున్న వ్యక్తిని చూడవచ్చు.కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి ఇదో స్మార్ట్ పద్ధతి అనుకున్నాడో ఏమోకానీ ఖరీదైన కారులో టీ అమ్మడం విశేషంగా మారింది. అయితే ఆడి చాయ్వాలా ఇన్వెంటివ్ మార్కెటింగ్ వ్యూహం అంటూ యూజర్ల కమెంట్ చేశారు. ఇంకొంత మంది ఈఎంఐ కవర్ చేయడానికి టీ విక్రయిస్తున్నాడని ఒకరు, టీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో మెర్సిడెస్-బెంజ్ జీ వాగన్ను కొనాలకి ఇంకొకరు, టీ అమ్మి ఆడి కారును కొనుగోలు చేశారా? లేక ఆడి కారు కొన్నాక టీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందా అని మరికొందరు, చాయ్ అమ్మి దేశ ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్నాడు అంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఈ వీడియోకు ఇప్పటివరకు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్, 3,లక్షల 72 వేలకు పైగా లైక్లు వచ్చాయి. View this post on Instagram A post shared by A S H I S H T R I V E D I (@ashishtrivedii_24) -
షాకింగ్.. ‘టీ’ చల్లారిందన్న అత్తను.. కోడలు ఏం చేసిందంటే?
తమిళనాడు: ఇటీవల క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొన్ని వాటిలో చిన్న చిన్న గొడవలే హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వేడి వేడి ‘టీ’ అడిగిన అత్తను కోడలు ఇనుప రాడ్తో కొట్టి హత్య చేసిన ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో జరిగింది. మలైక్కుడిపట్టికి చెందిన వేల్, పళనియమ్మాళ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. పళనియమ్మాళ్ కుమారుడు సుబ్రమణ్యన్ వద్ద ఉంటోంది. మంగళవారం రాత్రి బయటి నుంచి వచ్చిన పళనియమ్మాళ్.. కోడలు కనుకును పిలిచి టీ పెట్టాలని కోరింది. కోడలు పెట్టిన టీ చల్లారిపోవడంతో ఆమె.. కోడలిని మందలించింది. దీంతో ఆగ్రహించిన కనుకు.. ఇనుప రాడ్డు తీసుకుని అత్త తలపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పళనియమ్మాళ్ను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించింది. అయితే సుబ్రమణియన్ తల్లి పళనియమ్మాళ్, కనుకు మధ్య సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. నిందితురాలు చాలాకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోందని తెలిపారు. చదవండి: నవీన్తో బ్రేకప్ అయ్యాకే హరి దగ్గరయ్యాడు: నిహారిక! -
Health Tips: సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి!
భారతీయ జనాభాలో 64 శాతం మంది రోజూ టీ తాగడానికి ఇష్టపడతారు, అందులో 30 శాతం మంది సాయంత్రం పూట తాగుతున్నారు. అయితే... సాయంత్రం పూట టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య శాస్త్రం ప్రకారం మంచి నిద్ర, సరైన లివర్ డిటాక్స్, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం పడుకోవడానికి కొద్దిగంటల ముందు కెఫీన్ ను నివారించడం ఉత్తమం. టీ చెడ్డది కాదు.. కానీ.., అది పాలతో తాగాలా, ఎక్కువ తాగాలా.. తక్కువ తాగాలా.. ఏ సమయంలో తాగాలి.. అనేది చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విదేశాలలో చాలా మంది బ్లాక్ టీనే తాగుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, థైరోఫ్లేవిన్, థైరోబిసిన్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి–ఇవన్నీ ఆరోగ్యకరమైనవే. మనదేశంలో మాత్రం పాలు, చక్కెరను జోడించి టీ తయారు చేసుకొని తాగుతారు. అయితే ఇది అంత మంచిది కాదు. అందువల్ల మన టీరు తెన్నులు మార్చుకోవడం మంచిది. ♦ రాత్రి షిఫ్టులో పనిచేసే వ్యక్తులు ♦ ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్య లేని వ్యక్తులు ♦ ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కలిగిన వారు ♦ నిద్ర సమస్య లేని వారు ♦ ప్రతిరోజూ సమయానికి భోజనం చేసేవారు ♦ సగం లేదా కప్పు కంటే తక్కువ టీ తాగే వారు.. వీరంతా ఎప్పుడు తాగినా ఫరవాలేదు. సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి! ♦ నిద్రలేమికి గురయ్యే వారు ♦ ఆందోళనతో బాధపడేవారు, ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపేవారు ♦ అధిక వాత సమస్యలు ఉన్న వ్యక్తులు (పొడి చర్మం,పొడి జుట్టు) ♦ బరువు పెరగాలనుకునే వారు ♦ ఆకలి సరిగా లేని వారు ♦ హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు ♦మలబద్ధకం / ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య. ♦జీవక్రియ, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారు. ♦ తక్కువ బరువు కలవారు ♦ ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోరుకునే వారు. ఇక ఏ టీ, ఎప్పుడు తాగాలో మీరే తేల్చుకోండి. నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో టీ తాగేందుకు నిరాకరించారు ఎస్పీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. పోలీసులపై తనకు ఏ మాత్రం నమ్మకం లేదన్నారు. టీలో విషం కలిపి ఇస్తారేమో? అని వ్యాఖ్యానించారు. తాను బయటి నుంచి టీ తెప్పించుకుంటానని అన్నారు. అవసరమైతే కప్పు మాత్రం తీసుకుంటానన్నారు. ఆదివారం ఉదయం లక్నోలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లి అఖిలేశ్ ఇలా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. #WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने पुलिस मुख्यालय में चाय पीने से इंकार किया। उन्होंने कहा,"हम यहां की चाय नहीं पियेंगे। हम अपनी (चाय) लाएंगे, कप आपका ले लेंगे। हम नहीं पी सकते, ज़हर दे दोगे तो? हमें भरोसा नहीं। हम बाहर से मंगा लेंगे।" (वीडियो सोर्स: समाजवादी पार्टी) pic.twitter.com/zwlyMp8Q82 — ANI_HindiNews (@AHindinews) January 8, 2023 సమాజ్వాదీ పార్టీ ట్విట్టర్ ఖాతాను హ్యాండిల్ చేసే మనీశ్ జగన్ అగర్వాల్ను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మనీశ్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలేశ్ యాదవ్ పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అతడ్ని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చదవండి: 'ఉత్తరాదిలో జెండా పాతేస్తాం.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..' -
చాయ్ ఎంత పనిచేయించింది..డ్రైవర్ని తిట్టిపోస్తున్న నెటిజన్లు!
భారతీయులకు చాయ్ అంటే ఎంత మక్కువ అనేది చెప్పనవసరం లేదు. అదీకూడా ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి అల్లం టీ సిప్ చేస్తే ఉండే ఆనందమే వేరు. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక డ్రైవర్ ఆ చాయ్ మీద ఇష్టం కొద్ది ఏం చేశాడో వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఖాయం. వివరాల్లోకెళ్తే...ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీఓ) బస్సు డ్రైవర్ టీ కోసం ఏకంగా రద్దీగా ఉండే రహదారి మధ్యలో బస్సును ఆపేశాడు. దీంతో రోడ్డుపై ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతలో టీ కప్పుతో బయటకు వచ్చిన డ్రైవర్ దీన్ని గమనించి..ర్యాంగ్ ప్లేస్లో పార్క్ చేసినట్లు ఉన్నానుకుంటూ.. గబగబ టీకప్పుతో బస్సు వద్దకు వచ్చి స్టార్ట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని శుభ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో పేరుగాంచిన సుదామా టీ స్టాల్ అని, అందుకే డ్రైవర్ అక్కడ బస్సు ఆపాడని ఒక వాయిస్ ఓవర్ వస్తోంది. దీంతో నెటిజన్లు సదరు డ్రైవర్పై మండిపడుతూ.. అతని డ్రైవింగ్ లైసెన్స్ని రద్దు చేయాలని ఒకరు, మరోకరేమో అతన్ని ఎందుకు తిడుతున్నారు, సుదామా టీస్టాల్ కారణంగానే ఇది జరగిందంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. men😭☕ pic.twitter.com/EDOSmxlnZC — Shubh (@kadaipaneeeer) January 2, 2023 (చదవండి: ఉద్యోగం నుంచి తీసేశారని..యజమానిపై కాల్పులు జరిపిన మాజీ ఉద్యోగి) -
చాయ్, సమోసా రూ.490.. షాకవుతున్న నెటిజన్లు..!
వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే టీ తాగాల్సిందే లేదంటే ఏం తోచదు. ఇంట్లో అయినా, బయట అయినా రోజుకు నాలుగు కప్పుల టీ అయినా లాగించేస్తుంటారు. ఇక చాయ్, సమోసా ఆ కాంబినేషనే వేరు. చాలా మంది టీ తాగిన తర్వాత స్నాక్స్లా సమోసా తింటుంటారు. సాధారణంగా వీటి ధర కూడా ఎంతనుకున్న రూ. 50కు మించదు. అయితే ముంబై ఎయిర్పోర్ట్లో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్ వేశారు.. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. డిసెంబర్ 28న రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్ టీ, ఒక వాటర్ బాటిల్ ధర 490’ గా పేర్కొంది. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే 2014 లోక్సభ ఎన్నికల సమయంలో 'అచ్ఛే దిన్ ఆనే వాలే హై' (మంచి రోజులు రాబోతున్నాయి' అని మోదీ చేసిన నినాదాన్ని గుర్తు చూస్తూ వ్యంగ్యంగా జర్నలిస్ట్ ఈ విధంగా క్యాప్షన్ జోడించింది. Two samosas, one chai and one water bottle for 490 Rs at Mumbai airport!! Kafi ache din aa gae hain. #Vikas pic.twitter.com/aaEkAD9pmb — Farah khan (@farah17khan) December 28, 2022 ఇందులో ఇందులో సాధారణ సైజ్ కలిగిన రెండు సమోసాలు ఒక చాయ్ కప్పు కనిపిస్తోంది. చాయ్ సమోసాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా వేలల్లో లైక్లు వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్లు ‘ముంబై కండివాలీ రైల్వే స్టేషన్లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకొందరు ‘ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ రూ.490నా’ అంటూ షాక్ అవుతున్నారు. చదవండి: ‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’ -
దారుణం.. టీ పెట్టలేదని భార్యను చపాతీ పీటతో కొట్టి చంపిన భర్త
ఉజ్జయిని: టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో దుర్మార్గుడైన ఓ భర్త కట్టుకున్న భార్యను చపాతీ పీటతో కొట్టి కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా ఘటియా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(41) టీ తయారు చేసి ఇవ్వలేదనే కోపంతో భార్య(40)ను చపాతీ పీటతో కొట్టాడు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విద్యుత్ షాక్కు గురైందని వైద్య సిబ్బందితో అబద్ధమాడాడు. కొద్ది సేపటి తర్వాత భార్య చనిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోస్టుమార్టంలో విషయం బయటపడగా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: ఫ్రెండ్స్తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
కోచింగ్ ఫీజు కోసం.. రాత్రిపూట టీ అమ్ముతూ...
ఎందరో స్ట్రీట్ లైట్ల కింద చదువుకుని చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్లను చూశాం. మరికొందరూ చదవుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఇంకొందరూ తమ చదువుకు అయ్యే ఖర్చు తల్లిదండ్రులను అడగకుండా స్వశక్తితో సంపాదించుకోవాలనుకుంటారు. మరికొందరూ ఇంట్లో పరిస్థితులు సహకరించక తాము అనుకున్న విద్యను అభ్యసించేందకు రకరకాల మార్గాల్లో కష్టపడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడే చోటు చేసుకుంది. ఇక్కడొక విద్యార్థి కోచింగ్ ఫీజు కోసం అని రాత్రిపూట టీ అమ్ముతుంటాడు. ఆ విద్యార్థి పేరు అజయ్. అతను పగటి పూట చదువుకుంటూ రాత్రిపూట సైకిల్పై టీ అమ్ముతూ కోచింగ్ డబ్బులు కూడబెట్టుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని గోవింద్ గుర్జార్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు స్పూర్తిదాయకం, ఇలాంటి యువతకు ఆర్థిక సాయం అందిస్తే చక్కగా చదువుకుంటారంటూ సదరు విద్యార్థిని ప్రశంసిస్తూ చేస్తూ ట్వీట్ చేశారు. #साइकल_वाली_चाय इंदौर.. हमारे आदिवासी भाई अजय से मिलोगे..! अजय दिन में पढ़ाई करता है और रात को चाय बेचता है ताकि कोचिंग,रहने,खाने का खर्चा निकल से..! सच में अजय भगवान करे कभी बड़ा आदमी बन गया तो चाय बेचने वाला ये वीडियो अजय के संघर्ष का जीता जागता सबूत साबित होगा. pic.twitter.com/N2LnR6mo2T — Govind Gurjar (@Gurjarrrrr) December 23, 2022 (చదవండి: వాట్ ఏ మాస్క్..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు) -
విజయవాడ: క్రిస్మస్ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: క్రిస్మస్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తేనేటి విందు ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) విజయవాడకు వెళ్లనున్నారు. ఏప్లస్ కన్వెన్షన్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సీఎం జగన్తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. -
విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న తెలుగోడు!
జీవితం ఎప్పుడు ఏ మలుపుకు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం చేసే కొన్ని పనులు ఆ క్షణంలో చూసేవారికి తప్పుగా అనిపించినా, కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఈ వాఖ్యాలు ఆస్ట్రేలియాలోని ఓ ఆంధ్రా విద్యార్థికి సరిగ్గా సరిపోతాయి. విదేశాలలో ఓ యూనివర్సిటీలో చదివి ఆపై లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకి వెళ్లాక ఏం జరిగిందో గానీ చదువుని మధ్యలోనే పక్కన పెట్టాడు. చివరికి అదే అతని జీవితాన్ని ములుపు తిప్పింది. కేవలం ఏడాది వ్యవధిలోనే మిలియన్ డాలర్ల కంపెనీకి యజమానిగా మార్చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళితే.. అందరిలానే ఎన్నో కలలతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన కొండా సంజిత్ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువు కోసం ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ మధ్యలో అకస్మాత్తుగా అతను తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి కాలేజ్ డ్రాప్ అవుట్గా పేరు తెచ్చుకున్నాడు. అతను ఉంటున్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం కాఫీకి ప్రసిద్ధి. చిన్నప్పటి తనకీ కూడా టీ అంటే మక్కువ ఎక్కువ. ఈ రెంటిని జత కలుపుతూ ఒక ఐడియా అతని మెదడులో మెదిలింది. అప్పుడే‘డ్రాప్అవుట్ చాయ్వాలా’కు పునాది పడింది. అయితే మొదట్లో టీ షాపు అనగానే తన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనైనా, సొంత వ్యాపారం పెడుతున్నానని వారికి నచ్చజెప్పాడు. తన సంకల్పానికి తోడుగా అస్రార్ అనే ఒక ఎన్ఆర్ఐ తన ప్రాజెక్టుపై నమ్మకం ఉంచి.. ఏంజెల్ ఇన్వెస్టర్గా మారడానికి ఒప్పుకున్నారు. అలా ‘డ్రాప్అవుట్ చాయ్వాలా’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో అన్ని రకాల కాఫీలు, టీలు సమోసాలు అందుబాటులో ఉంచాడు. అక్కడి రుచులకు భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు సైతం ఫిదా అయ్యారు. అక్కడి భారతీయులకు ‘బాంబే కటింగ్’ టీ అంటే ఇష్టపడుతుండగా, ఆస్ట్రేలియన్లు ‘మసాలా చాయ్’, పకోడాలంటే ఆసక్తి చూపుతున్నారు. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆదాయం పన్నులు పోగా 1 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ( భారత కరెన్నీ ప్రకారం దాదాపు రూ.5.2 కోట్లు)కు చేరనుంది. చదవండి: Snapchat కొత్త ఫీచర్: వారికి గుడ్ న్యూస్, నెలకు రూ. 2 లక్షలు -
షాకింగ్ వీడియో: ట్రైయిన్లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్...
ట్రైయిన్లో మనకు రకరకాల పదార్థాలు అమ్ముతుంటారు. ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో లాంగ్ జర్నీ ఐతే అక్కడ ఏం అమ్ముతుంటే అవి కొనుక్కుని తినక తప్పదు. జనాలు ఎక్కువగా తాగేది టీ లేదా కాఫీ. ఎందుకంటే కాసేపు రిలాక్స్ అవ్వడానికి చిన్న కప్పు టీ పడితే చాలు అని చాలా మంది భావిస్తారు. కానీ ఇప్పుడూ ఈ సంగతి గనుక వింటే ట్రైయిన్లో టీ తాగడానికి కచ్చితంగా జంకుతారు. వివరాల్లోకెళ్తే....ఒక ట్రైయిన్లో టీ అమ్మే వ్యక్తి ఎలా టీని వేడి చేస్తున్నాడో ఇద్దరు ప్రయాణకులు చూసి వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యక్తి టీని వేడి చేయడం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్ని ఉపయోగించి వేడి చేశాడు. అక్కడ అతను చేసే విధానం చూస్తే వాంతు వచ్చేలా ఉంది. ఈ ఘటన సబరి ఎక్స్ప్రెస్లో చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు సబరి ఎక్స్ప్రెస్లో విక్రయించే ఆహరపానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెబుతున్నారు.ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో. దీంతో నెటిజన్లు ఇలాంటి కాంట్రాక్టును రద్దు చేసి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. View this post on Instagram A post shared by ꧁VISHAL༆ (@cruise_x_vk) (చదవండి: రోడ్డుపై చిరుత కలకలం... భయపెట్టించేలా పరుగు తీసింది) -
టీ పొడి అనుకొని పురుగులమందు.. చాయ్ తాగి అయిదుగురు దుర్మరణం
లక్నో: విష రసాయనాలు కలిసిన టీ (చాయ్) తాగి ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా నగ్లా కన్హాయ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామమూర్తి అనే మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడిగా పొరపడి, పొలంలో పిచికారీ చేసిన పురుగులమందు డబ్బాలోని పౌడర్ను వేసి టీ కాచింది. దానిని భర్త శివనందన్(35), కుమారులు శివాంగ్(6), దివ్యాన్ష్5)తోపాటు తన తండ్రి రవీంద్ర సింగ్(55), పొరుగునుండే సొబ్రాన్(42)లకు ఇచ్చిది. తాగిన తర్వాత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోగా మిగతా ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఎస్పీ చెప్పారు. చదవండి: కదులుతున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు...సీన్ కట్ చేస్తే... -
‘టీ’ చేయటంలో గిన్నిస్ రికార్డ్.. మీరూ ప్రయత్నిస్తారా?
కేప్టౌన్: చాయ్ అంటే ఒక పానీయమే కాదు అది చాలా మంది జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉదయం లేవగానే కప్పు టీ లేకుండా ఉండటాన్ని ఊహించలేని స్థాయిలో దానికి ఆదరణ లభించింది. ఇంటికి ఎవరైనా బంధవులచ్చినప్పుడు ముందుగా టీ తాగుతారా? అని అడుగుతారు. క్షణాల్లోనే తీసుకొచ్చి ఇస్తుంటారు. అయితే.. అదే టీ చేసి గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చని మీకు తెలుసా? ఓ మహిళ చేసి చూపించారు. ఒక్క గంటలోనే ఎక్కువ కప్పుల టీ చేసి ఈ ప్రపంచ రికార్డును తన పేరు లిఖించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని వుప్పెర్థల్ ప్రాంతానికి చెందిన ఇంగర్ వలెంటైన్ అనే మహిళ ఈ ఫీట్ను సాధించారు. స్థానికంగా లభించే ‘రూయ్బోస్’ అనే టీని తయారు చేయటం ద్వారా తమ దేశ పర్యటక, ట్రావెల్ రంగాలను బలోపేతం చేయాలని భావించి ఈ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్లో ఇంగర్ వలెంటైన్ మూడు రకాల రుచులు వెన్నిల, స్ట్రాబెర్రీ, ఒరిజినల్ టీని ఉపయోగించారు. రికార్డు సాధించేందుకు గంట సమయంలో 150 కప్పుల టీని తయారు చేయాల్సి వచ్చింది. ఇందులో ఓ మెలిక సైతం ఉంది. ఒకే టీ తయారీ పాత్ర ఉపయోగించాలి, కొన్ని కప్పులు వాడాలి. దీంతో ఆమె ఓ స్ట్రాటజీని వాడి.. ఈ ఫీట్ను పూర్తి చేశారు. పాత్రలో ఒకేసారి నాలుగు టీ బ్యాగులు వేసి రెండు నిమిషాల పాటు వాటిని కరిగించారు. దానిని నాలుగు కప్పుల్లో పోశారు. ఆ తర్వాత మళ్లీ రిపీట్ చేశారు. ఆమెకు స్థానిక విద్యార్థులు సైతం సాయంగా నిలిచారు. చేసిన టీ చేసినట్లు తాగుతూ కప్పులు కడిగి మళ్లీ ఇంగర్కు అందించే వారు. ఇలా ఒక్క గంట సమయంలోనే 249 కప్పుల టీని తయారు చేయటమే కాదు.. దానిని విద్యార్థులు తాగేలా చేశారు. అంటే ఒక్క నిమిషానికి నాలుగు కప్పుల టీని తయారు చేసినట్లన్నమాట. Here's what you missed on the latest episode of Stumbo Record Breakers 👇@stumbopopssa @etv https://t.co/SnOAnSHa1E — Guinness World Records (@GWR) October 18, 2022 ఇదీ చదవండి: మోడ్రన్ కృష్ణుడు.. తన మ్యూజిక్తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్ -
‘ఇకాగో’..చాయ్ని చల్లారనివ్వదు
పని చేసుకుంటూ టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటే! పనిలో నిమగ్నమైపోయి కొద్ది నిమిషాలు పక్కనే ఉంచిన టీ లేదా కాఫీని పట్టించుకోకపోతే, అవి చల్లారిపోతాయి. చల్లారిన చాయ్ లేదా కాఫీ అంతగా రుచించవు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఇకాగో హీట్ కోస్టర్’ ఉంటే, అలాంటి సమస్య ఉండదు. ఎంతసేపైనా కప్పులో పోసిన పానీయం వేడిగానే ఉంటుంది. ఇందులో విశేషం కప్పులో కాదు, దాని అడుగున ఉన్న స్మార్ట్ టేబుల్ టాప్ కోస్టర్లో ఉంది. చిన్న ట్రే సైజులో ఉండే దీనిని పనిచేసే చోట టేబుల్ మీద సులువుగా పెట్టేసుకోవచ్చు. దీని ప్లగ్ పెట్టుకుని, స్విచాన్ చేసుకుంటే చాలు. దీనిపైన పెట్టిన కప్పులోని టీ లేదా కాఫీ రెండు గంటల వరకు చల్లారిపోకుండా ఉంటాయి. దీంతో మనం తాగాలనుకునే పానీయం వేడిని గరిష్ఠంగా 175 డిగ్రీల ఫారెన్హీట్ (79.4 సెల్సియస్) వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండు గంటల తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్లీ వేడి చేసుకోవాలనుకుంటే, తిరిగి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఇకాగో’కు చెందిన డిజైనర్లు దీనిని రూపొందించారు. -
ఝన్ఝన్వాలా తరువాత నేనే! కట్ చేస్తే..ఓ టీస్టాల్ కుర్రోడి వైరల్ స్టోరీ
బెంగళూరుకు చెందిన ఒక టీ స్టాల్ ఓనర్ ఏకంగా క్రిప్టో కరెన్సీ చెల్లింపులను యాక్సెస్ చేయడం సెన్సేషన్గా మారింది. అది కూడా 'ఫ్రస్ట్రేటెడ్ డ్రాప్ అవుట్' టీ స్టాల్ నిర్వహిస్తూ బిట్కాయిన్ లావాదేవీలు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనంగా మారిన 22 ఏళ్ల శుభమ్ సైనీ వైరల్ స్టోరీ.. శుభమ్ సైనీ రేవారి, ఇందిరా గాంధీ యూనివర్సిటీ నుంచి బీసీఏ డ్రాప్ అవుట్. ఇంటర్నషిప్ చేద్దామని బెంగళూరు వచ్చాడు. అతనికి స్టాక్ మార్కెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో క్రిప్టో ప్రపంచం అతనికి పరిచయమైంది. రాకేష్ ఝన్ ఝన్వాలా అంతటివాడిని కావాలని కలలు కన్నాడు. అలా 2020లో, మార్కెట్ 60శాతం క్రాష్ అయిన సమయంలో లాభాలను ఆర్జించాలనే ఆశతో క్రిప్టో మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. రూ. 1.5 లక్షలపై వెయ్యి శాతం లాభాలు గడించాడు. అలా రూ. 30 లక్షల మేర లాభాలు రావడంతో గాల్లో తేలిపోయాడు. 2021 మార్కెట్ పతనంతో ఆ ఆనందం గాల్లోనే కలిసిపోయింది. ఎక్కడ నుంచి మొదలయ్యాడో అక్కడికే చేరాడు. కానీ అక్కడితో కుంగిపోలేదు. ఏమైనా చేయాలనే పట్టుదలతో కేవలం 30వేల పెట్టుబడితో ఆరు నెలల క్రితం టీ దుకాణం ప్రారంభించాడు. మట్టికప్పులో రూ. 20 లకి టీని విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా క్రిప్టో లావాదేవీలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. 'చాయ్ విత్ క్రిప్టో' దుకాణం చాయ్ లవర్స్ హ్యాంగ్అవుట్గా మారిపోయింది. ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ఝన్వాలా తరువాత నేనే అనుకున్నా. కానీ అనుకున్నట్టుగా జీవితం సాగుదుగా. అనుకోని నష్టాలతో కంగిపోలే.. ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఎదగాలని భావించాను. అందుకే చిన్నగా టీ స్టాల్ మొదలు పెట్టాను. ముఖ్యంగా పర్యావరణహితంగా మట్టి కప్పులనే వాడుతున్నాను. వారానికి సగటున 20-30 లావాదేవీలు జరుగుతాయనీ, తన పేమెంట్ సిస్టం యూజర్లకు బాగా నచ్చుతోందని శుభమ్ చెప్పారు. యూపీఐ లాంటి నగదు లావాదేవీలతోపాటు కస్టమర్లు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు తన వద్ద చేయవచ్చని తెలిపాడు. దీంతోపాటు నార్త్ ఇండియా వంటకాలతో ‘క్లౌడ్ కిచెన్’ తో మరింత ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు అతిపెద్ద గ్రీన్ అండ్ సక్సెస్పుల్ కేఫ్ బ్రాండ్ యజమానిగా ఎదగాలని శుభమ్ సైనీ భావిస్తున్నాడు. దీంతో నెటిజనులంతా ఆల్ ది బెస్ట్ బ్రో అంటు విషెస్ అందిస్తున్నారు. -
Hyderabad: కొండపల్లి బొమ్మల కనువిందు (ఫొటోలు)
-
బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బల్మరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే బ్రిటన్ రాణి వాడిపడేసి ఒక టీబ్యాగ్ గురించి ఒక కథనం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాజ కుటుంబికులుకు సంబంధించిన వస్తువులు బయటకు రావడం అనేది అసాథ్యం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ వారు ఉపయోగించే వస్తువులు గురించి బయట వ్యక్తులకు తెలిసి ఉండే అవకాశమే అరుదు. అలాంటిది ఆమె వాడిపడేసి టీ బ్యాగ్ ఏంటీ? అది నిజంగా ఆమె ఉపయోగించినదేనా అనే సందేహాలు రావడం సహజమే. కానీ ఔను! ఇది నిజం అని చెప్పే ఆధారాలను కూడా పొందుపరిచారు. అసలేం జరిగిందంటే....70 ఏళ్లు సుదీర్ఘ పాలనతో రికార్డు సృష్టించిన క్విన్ ఎలిజబెత్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక బ్రిటన్ ప్రజలు ఆమె పాలనను గుర్తు చేసుకుంటూ ఆమె ఉపయోగించని వస్తువులను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ టీ బ్యాగ్ గురించి ఒక కథనం బయటపడింది. 1998లో విండ్సర్ కాజిల్ అనే వ్యక్తి దీన్ని అక్రమంగా బయటకు తరలించినట్లు సమాచారం. ఇది దివగంత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రెజీనా బ్రిటానియా టీ బ్యాగ్గా నివేదిక పేర్కొంది. ఇది ఇప్పుడు 'ఈబే' అనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆన్లైన్ విక్రయాల జాబితాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వస్తువు ఆన్లైన్లో సుమారు రూ. 9 లక్షలకు విక్రయించబడింది. ఈ టీ బ్యాగ్ని యూఎస్కి చెందిన జార్జియా కొనుగోలు చేశారు. ఈ టీబ్యాగ్కి 'రాయల్ ఆర్ట్ఫాక్ట్'తో పాటు 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికేట్స్ ఆఫ్ అథెంటిసిటీ' జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ ఉందని చెప్పారు. ఇది నిస్సందేహంగా బ్రిటన్ రాణి వినియోగించిన టీ బ్యాగేనని జార్జియా చెబుతున్నారు. అలానే గతంలో 1985లో గ్రేట్ వెస్ట్రన్ రైల్వే 150వ వార్షికోత్సవం సందర్భంగా క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ సంతకాలతో కూడిన ఒక పుస్తకం దాదాపు రూ. 19 లక్షలకు విక్రయించబడినట్లు ఈబే కామర్స్ సంస్థ పేర్కొంది. (చదవండి: ఎలిజబెత్ 2 వివాహానికి ఖరీదైన్ డైమెండ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇచ్చిన నిజాం నవాబు) -
కోమాలో నుంచి కోలుకున్నానని వెరై‘టీ’ విందు
సాక్షి, చిల్పూరు: కోమలోనుంచి కోలుకున్న ఓ వ్యక్తి గ్రామస్తులకు వెరై‘టీ’ విందు ఇచ్చారు. 12 రోజులపాటు రోజుకు వంద మందికి ఇస్తానని ప్రకటించాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన గుగులోతు భిక్షపతి ఉప్పరి పని మేస్త్రీ. జూలై 13న ఇంట్లో సజ్జపైనున్న వస్తువును తీస్తూ జారిపడ్డాడు. తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్లాడు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరు రోజుల తరువాత కోమానుంచి తేరుకున్నాడు. 51 రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్ అయి అతను స్వగ్రామం చేరుకున్నాడు. ఇది తనకు పునర్జన్మని, దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు 12 రోజుల పాటు రోజుకు వందమందికి చాయ్ అందిస్తానని ప్రకటించాడు. గ్రామంలోని రవి హోటల్ వద్ద ఈ ‘టీ’ విందును సర్పంచ్ రూప్లానాయక్ చేతుల మీదుగా ప్రారంభించాడు. (క్లిక్: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి) -
కృషి: ఇప్పపూల లడ్డు పసుపు మసాలా పానీయం
అడవి నుంచి దూరమయ్యాం.. పల్లె నుంచి పట్టణవాసంలో కరెన్సీ కోసం నిత్యం కసరత్తులు చేస్తున్నాం. కానీ, అడవి పంచే ఔషధం.. పల్లె ఇచ్చే పట్టెడన్నమే మనకు అమ్మ చేతి గోరుముద్దంత ప్రేమను అందిస్తుంది. అలాంటి ప్రేమకు వారధిగా నిలుస్తున్నారు గుంటూరు వాసి షేక్ రజియా. ఛత్తీస్గడ్లోని అటవీ ప్రాంతాల్లో గిరిజనుల స్థావరాలను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆహారపు అలవాట్లు తెలుసుకుని, ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్’ పేరుతో సంస్థను నెలకొల్పి అక్కడి మహిళల చేత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయిస్తున్నారు. వాటికి పట్టణాల్లోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ విలువనూ.. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలనూ పెంచుతున్నారు. ఆరేళ్లుగా రజియా చేస్తున్న ఈ కృషి గురించి అడిగితే ఆమె ఎన్నో అడవి ముచ్చట్లను ఆనందంగా పంచుకున్నారు. ‘‘జగ్దల్పూర్లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ మెయిన్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి దంతెవాడ, బస్తర్లోనూ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆదివాసీలున్న చోటును వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడి ఒక యూనిట్ని తయారు చేస్తాను. అలా ఇప్పటివరకు పదికి పైగా యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆదివాసీల ఆహార ఉత్పత్తులను నాణ్యంగా తయారు చేయిస్తుంటాను. వాటిని పట్టణవాసులకు మార్కెటింగ్ చేస్తుంటాను. వీటిలో.. మహువా (ఇప్పపూల) లడ్డూ, టీ పొడి, కుకీస్, పసుపు మసాలా, చింతపండు సాస్, ఇన్స్టంట్ చింతపండు రసం పౌడర్, చాక్లెట్స్, తేనె, సేంద్రియ బియ్యం, కారం, బెల్లం.. ఇలా 22 ఉత్పత్తులు ఉన్నాయి. ఆంధ్రా నుంచి ఛత్తీస్గడ్ మా నాన్నగారు గుంటూరులో ఉండేవారు. వ్యాపారరీత్యా ఛత్తీస్గడ్లో స్థిరపడ్డారు. అమ్మ, ఇద్దరు తమ్ములు, బాబాయ్ కుటుంబ సభ్యులు ..అందరం కలిసే ఉంటాం. అలా నా చదువు అంతా అక్కడే సాగింది. మైక్రోబయాలజీలో డిగ్రీ చేశాను. స్వచ్ఛమైన అడవి సౌందర్యం గురించి నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ అడవి బిడ్డల జీవనశైలి మీద నా చూపు ఉండేది. నా చదువులో భాగంగా మొక్కల పరిశోధనకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి, గిరిజనులను కలిశాను. అప్పుడు అక్కడి గ్రామాల్లో కొంతమంది మహిళలు మహువా (ఇప్పపూల) లడ్డూలను తయారుచేస్తున్నారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇప్పపూలలో ఉండే పోషకాలను అడిగి తెలుసుకున్నాను. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఇప్పపూలలో తలనొప్పి, విరేచనాలు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. చర్మ, కంటి సమస్యలతో సహా చాలా వ్యాధులకు ఔషధంగా వాడచ్చు. వంటకాలకు సహజమైన తీపిని అందిస్తాయి. దీంతో పోషకాహార నిపుణులు, మరికొంత మంది సాంకేతి నిపుణులు, ఆరుగురు గిరిజన మహిళలతో కలిసి అన్ని అనుమతులతో 2017లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ ప్రారంభించాను. సవాళ్లను ఎదుర్కొంటూ... ముందు ఈ బిజినెస్కి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. ‘ఎందుకు కష్టం. ఉద్యోగం చూసుకోక’ అన్నారు. బ్యాంకులను సంప్రదిస్తే లోన్ ఇవ్వలేదు. మహువా లడ్డూలను రుచిగా తయారు చేయడంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. చాలా మంది ‘ఎందుకు ఇదంతా వృథా... ఇది ఫెయిల్యూర్ బిజినెస్’ అన్నారు. దీనికి కారణం లేకపోలేదు. చాలాకాలంగా మన దేశంలో ఇప్పపూలను మద్యం తయారీలోనే వాడతారని తెలుసు. ఆదివాసీలే వీటిని ఉపయోగిస్తారు మనకెందుకు అనే అభిప్రాయమే ఉంది. వీటిలోని సానుకూల కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. అనుమతి కోసం చాలా మంది అధికారులను సంప్రదించాను. 2018లో ఒక ఐఎఎస్ ఆఫీసర్ రెండు నెలల ప్రోగ్రామ్కు అనుమతి ఇచ్చారు. లడ్డూల నాణ్యత పెంచడానికి చాలా ప్రయోగాలు చేశాం. మహువా లడ్డూల తయారీ మార్కెటింగ్ చేస్తే రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేర్చుకునేవారికి శిక్షణాలయం బస్తర్ ఫుడ్ ఫర్మ్ని ఇన్స్టిట్యూట్లా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆదివాసీల ఆహారాలు ఏవున్నాయో వాటిని బయటి ప్రపంచానికి చూపించాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం లండన్ కంపెనీతో కలిసి పని చేయబోతున్నాం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ బిజినెస్ మోడల్గా రాబోయే తరానికి తెలియాలి. ఈ ఆలోచనతోనే ఆసక్తి గలవారు ఒక ఏడాది పాటు ఈ కోర్సు ప్రత్యక్షంగా నేర్చుకునేలా రూపొందించాను. నేర్చుకోవాలంటే ఇక్కడ చాలా పని ఉంది. మరో రెండేళ్లలో ఇన్స్టిట్యూట్ సిద్ధం అవుతుంది. ఇప్పటికే స్టూడెంట్స్ గ్రూప్స్గా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆసక్తిగలవారు నేర్చుకోవడానికి మా సంస్థను సంప్రదిస్తున్నారు’’ అని ఆనందంగా వివరించారు రజియా. పల్లెవాసుల మధ్య పని చేయాలని, కొత్త మార్గాలను అన్వేషించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, అనుకున్నంతగా ఆచరణలో పెట్టలేరు. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ పల్లెకు–పట్టణానికి వారధిగా నిలుస్తున్న రజియా లాంటివారు యువతరానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సమస్యలను అధిగమిస్తూ! ‘ఈ కన్సల్టెన్సీ మీద కొంత ఆదాయం వస్తుంది. దానిని పని చేస్తున్న మహిళలకే పంచుతాం. ఇక్కడి మహిళలకు పని వచ్చు కానీ మార్కెటింగ్ తెలియదు. ఊరు దాటి బయటకు వెళ్లలేరు. చదువుకున్న వారికి పట్టణ వాతావరణం గురించి తెలియదు. వారి ప్రతిభకు మేం సపోర్ట్గా ఉన్నాం. నక్సలైట్స్ సమస్యలూ వస్తుంటాయి. అడవుల్లోని మారుమూల పల్లెలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి ఫుడ్ దొరకదు. అక్కడి ఆదివాసీలు త్వరగా అర్థం చేసుకోరు. వారి భాష మనకు రాదు. వాళ్ల భాషల్లోనే విషయం చెప్పాలన్నా కొంచెం సమస్యే. కానీ, వాటిని అధిగమిస్తేనే ఏదైనా చేయగలం. ఒక్కసారి వారికి అర్థమైతే మాత్రం మనమంటే ప్రాణం పెట్టేస్తారు. అంతబాగా చూసుకుంటారు. వాళ్లదగ్గర ఉన్న ప్రతిభను పట్టణానికి పంచే పనిని చేస్తున్నాను.’ పల్లెకు–పట్టణానికి వారధి ‘ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్కి అనుకూలంగా ఉందనుకుంటే అక్కడకు మా యూనిట్ కూడా మారుతూ ఉంటుంది. నా టీమ్ మెంబర్స్ పది మంది ఎప్పుడూ నాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెట్రో సిటీస్లో ప్రమోషన్స్ కోసం చురుగ్గా ఉండాలి. అందరికీ పల్లె ఉత్పత్తులు ఇష్టమే. కానీ, అందరికీ అవి లభించేదెలా? అందుకే, నేను పల్లెకు–పట్టణానికి వారధిగా మారాను. నేను చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల యుఎస్ వెళ్లడానికి ఫెలోషిప్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కలిసి పని చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఉత్పత్తులకు మరింత ఎక్స్పోజర్ పెరిగింది. మంచి పేరు వచ్చింది.’ – నిర్మలారెడ్డి -
Health Tips: పరగడుపున ఇవి తింటే చాలా డేంజర్! జాగ్రత్త
మెరుగైన ఆరోగ్యం కావాలంటే.. ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఏ ఆహార పదార్థాలు ఎప్పుడు తినాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పరగడుపున కొన్ని రకాల పదార్థాలు తింటే అనారోగ్యం పాలవుతారు. మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వైద్యనిపుణుల ప్రకారం పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. ►అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపులో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం. వేయించిన చిరుతిళ్లు.. ►ఉదయం వేళల్లో మసాలా లేదా వేయించిన చిరుతిళ్లు తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అతి వద్దు! ►అదే విధంగా పీచు పదార్థాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి. ఛాతీలో మంట.. ►కొంతమందికి బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉంటుంది. తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల శరీరానికి తీవ్రనష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. పూర్తిగా ప్రమాదకరం ►పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు. చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! -
సాక్షి కార్టూన్ 14-7-2022
...షోకాజ్లు ఇస్తున్నారని ఇప్పుడే నిప్పుల మీద నుంచి తీసిన చాయ్ ఇచ్చాన్సార్! -
సీఎంకు చల్లటి చాయ్.. అధికారికి నోటీసులు
భోపాల్: ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రొటోకాల్ ఉల్లంఘన పేరిట జారీ అయిన ఆ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రికి అందించిన టీ బాగోలేదని, పైగా చల్లగా ఉందంటూ మధ్యప్రదేశ్లో ఓ కిందిస్థాయి అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కాన్హౌ ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఉన్నతాధికారుల ఆరోపణ. ఈ మేరకు ఛాతర్పూర్ జిల్లా రాజ్నగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్(ఎస్డీఎం) డీపీ ద్వివేది.. రాకేశ్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సోమవారం ఖజురహో ఎయిర్పోర్ట్లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వాళ్లకు టిఫిన్తో పాటు టీ అందించారు అధికారులు. అయితే టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఆ కార్యక్రమ వ్యవహారాలను చూసుకున్న జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్కు నోటీసులు పంపించారు. నాసికరం, పైగా చల్లారిన టీ అందించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే ఏకపక్షంగా చర్యలు కఠినంగానే తీసుకుంటామని ఎస్డీఎం ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
ఛాయ్, బన్లు అందిస్తున్న లంక మాజీ క్రికెటర్
Ex Lankan Cricketer Serves Tea, Buns: శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పలు హింసాత్మక అల్లరుల తదనంతరం శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక కొత్త ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది కూడా. అదీగాక విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా కష్టంగా మారింది. అంతేకాదు ఇంధన సంక్షోభాన్ని సైతం ఎదుర్కొంటుంది. దీంతో అక్కడ ప్రభుత్వం అనవసర ప్రయాణాలను సైతం తగ్గించుకోమని ప్రజలకు సూచించింది కూడా. ఈ మేరకు శ్రీలంకలో పెట్రోల్ బంక్ల వద్ద జనాలు ఇంధనం కోసం క్యూలో నిలుచుని పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా పెట్రోల్ బంక్ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...క్యూలో ఉన్నవాళ్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. పైగా అంతసేపు నుల్చుని ఉండటంతో ఆకలిగా కూడా ఉండోచ్చు. అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన సమయం ఇది. అందుకే ఇలా చేశానని చెప్పాడు. అలాగే ప్రతిఒక్కరిని తమ కోసం కాకపోయిన మన పక్కవారి కోసమైన ఏమైన ఆహార పదార్థాలు తీసుకువెళ్లడం మంచిది. ఎవరికైన బాగోకపోతే అత్యవసర నెంబర్ 1990కి కాల్ చేయండి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉంటూ..మద్దతు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ క్రికెటర్ రోషన్ మహానామా తాను ప్రజలకు సర్వ్ చేసిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేస్తూ నెటిజన్లతో ఈ విషయాలను పంచుకున్నారు. We served tea and buns with the team from Community Meal Share this evening for the people at the petrol queues around Ward Place and Wijerama mawatha. The queues are getting longer by the day and there will be many health risks to people staying in queues. pic.twitter.com/i0sdr2xptI — Roshan Mahanama (@Rosh_Maha) June 18, 2022 (చదవండి: ‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’) -
ప్లీజ్.. ఛాయ్ తాగడం తగ్గించండి: పాక్ మంత్రి
Pak import tea on loan: పాకిస్తాన్లోని ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న పౌరులకు...పాక్ స్థానిక మంత్రి ఒకరు తాజాగా ఒక సలహ ఇచ్చారు. టీ వినియోగాన్ని తగ్గించాలని పాక్ మంత్రి ప్రజలను కోరారు. టీని కూడా అప్పుగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ప్రజలను టీ తాగడం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పాక్లో విదేశీ మారక నిల్వలు తగ్గడంతో.. దిగుమతుల బిల్లును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నగదు కొరతతో సతమతమవుతున్న టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలను కోరాడు ఆయన. అదీగాక 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాక్ సుమారు రూ.2 వేల కోట్ల టీని వినియోగించిందని తేలడంతో పాక్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఈ విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో టీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన పాక్ టీని దిగుమతి చేసుకోవడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పారు. గతేడాది కంటే రూ. 4 వందల కోట్ల టీని పాక్ అధికంగా దిగుమతి చేసుకుందని తెలిపారు. ఐతే పాక్ మంత్రి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ...నెటిజన్లు పాక్ ప్రభుత్వ తీరుని, ఆయన్ను విమర్శిస్తూ తమదైన శైలిలో చురకలు అట్టించారు. అంతేకాదు ఆయన గతంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు రాత్రి 8.30 గంటలకు మార్కెట్లను మూసివేయాలని వ్యాపారులను కోరినట్లు ప్రణాళిక మంత్రి తెలిపారు. పైగా ఇది పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి బిల్లును తగ్గించడానికి సహాయపడుతుందని ఇక్బాల్ అన్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక ఆర్థిక వ్యవస్థలా మారిపోతుందంటూ హెచ్చరించారు. (చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!) -
నయా ట్రెండ్.. తందూరీ ఛాయ్.. భలే టేస్టీ గురూ
టీ.. దీనికి అభిమానులు కోట్లలో ఉన్నారు. పనిఒత్తిడి నుంచి స్వాంతన కోసం టీ తాగుతుంటారు. పనిలో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని పొందేందుకు చాలామందికి చాయ్ ఔషధం. బెల్లం టీ, అల్లం టీ, లెమన్ టీ, మిరియాల టీ ఇలా టెస్ట్ చేసి ఉంటారు. మార్కెట్లోకి కొత్త రకం చాయ్ వచ్చింది. అదే తందూరీ టీ.. నెల్లూరులో దీనికి అభిమానులు పెరుగుతున్నారు. నెల్లూరు(మినీబైపాస్): టీ.. ఇది తాగాకే రోజును ప్రారంభించే వారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. స్నేహితులతో కేఫ్ల్లో కూర్చొని సరదాగా గడిపేందుకు.. పనిఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. తలనొప్పి నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామందికి టీ కావాలి. టీ లవర్స్ కోసం మార్కెట్లోకి కొత్త రకం వచ్చింది. అదే తందూరీ టీ.. పెద్ద సిటీలకే పరిమితమైన ఈ చాయ్ రుచిని ఇప్పుడు నెల్లూరులో కూడా చూడొచ్చు. నగరంలోని కొందరు వ్యాపారులు టీ అభిమానుల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు. దీని ఎక్కువేమి కాదు. ధర రూ.20 మాత్రమే.. ఏంటిదీ.. తందూరీ అనే పదం మాంస ప్రియులకు బాగా పరిచయం ఉంటుంది. హోటళ్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి తందూరీగా కస్టమర్లకు అందిస్తారు. ఈ చాయ్ని కూడా నిప్పులపైనే చేస్తారు కాబట్టి తందూరీ టీగా పేరొచ్చింది. ఎలా చేస్తారంటే.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమిలా ఏర్పాటు చేస్తారు. ఇందులో బొగ్గులు వేసి మండించి బట్టీల్లో ఇటుకల్లా కాలుస్తారు. పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి టీ తయారు చేసి దానిని జార్లో పోసి కొలిమి వద్దకు తీసుకొస్తారు. కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఇత్తడి పాత్రలో ఉంచుతారు. అందులో చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టి పాత్ర వేడికి పొగలు చిమ్ముతూ నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్కు తందూరీ రుచి.. వాసన వస్తుంది. రుచి.. అదుర్స్ ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే.. మరికొన్నింటిని రుచి కోసమే చేస్తున్నారు. ఈ రెండింటికీ డిమాండ్ అధికంగా ఉంది. టీ లవర్స్కు వినూత్న రుచిని అందించేందుకు కొందరు వ్యాపారులు తందూరీ టీ స్టాల్స్ను ప్రారంభిస్తున్నారు. -
International Tea Day: ఆసక్తికరమైన ఈ సంగతులు తెలుసా?
-
చాయ్ లవర్స్ కోసం: కూల్గా ఉంటే హాట్గా, హాట్గా ఉంటే కూల్గా!
మీరు కూల్గా ఉంటే.. హాట్గా హాట్గా ఉంటే కూల్గా క్షణాల్లో మార్చేస్తుంది. అంతేనా వాన కురిసినా.. ఫ్రెండ్స్తో గాసిప్ టైం అయినా..తలనొప్పి వచ్చినా... పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నా.. అంతెందుకు పొద్దున లేవగానే మన బుర్రలో వచ్చే ఏకైక థాట్ టీ. ఫ్రెష్గా వేడి వేడి టీ పడందే రోజు మొదలుకాదు చాలా మందికి. టీ అంటే కేవలం ఒక రిఫ్రెష్ డ్రింకే మాత్రమేనా. కానే కాదు..అదొక సెంటిమెంట్..ఎమోషన్. ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు మే నెలలోనే ఈ డేను ఎందుకు జరుపుకుంటారు? దీని వెనకాల హిస్టరీ ఏంటి? మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని టీ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచన మేరకు భారత ప్రభుత్వం యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి ప్రతిపాదించింది.అలా తొలి ఇంటర్నేషనల్ టీ దినోత్సవాన్ని 2005లో ఢిల్లీలో నిర్వహించారు.ఎందుకంటే చాలా దేశాలలో ఈ నెలలోనే టీ ఉత్పత్తి సీజన్ ప్రారంభమవుతుంది. తేయాకు కార్మికుల సురక్షిత పని పరిస్థితులు, సరైన వ్యాపార నిర్వహణతోపాటు తేయాకు ఉత్పత్తిని మెరుగుపరిచే పరిస్థితులపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతి ఏడాది మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయ టీ దినోత్సవం అనేది సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్య ప్రయోజనాలు, టీ ఆర్థిక ప్రాధాన్యతను సెలబ్రేట్ చేసుకోవడం, తేయాకుఉత్పత్తిని రక్షించి, దాని ప్రయోజనాలను ముందు తరాలకు అందించేలా 'ఫీల్డ్ నుండి కప్పు వరకు' అనే నినాదంతో ఈ డేను నిర్వహిస్తారు. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే వాటిల్లో టీ కూడా ఒకటి. 2007లో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారత దేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం టీలో 80 శాతం ఇండయన్సే వినియోగిస్తున్నారు. ఇక్కడ 5వేల సంవత్సరాలకు పైగా టీ మూలాలు విస్తరించి ఉన్నాయట. టీ అంటే ఒక భావోద్వేగం. సంతోషమైనా, ఉత్సాహమైనా, అలసిపోయినా సందర్భం ఏదైనా బెస్ట్ ఫ్రెండ్ టీ. దానికి చిట పట చినుకుల్లో పకోడీ తోడైతే ఆహా ఆ రంగు రుచి వాసనలతో మరో ప్రపంచంలో విహరిస్తాం. లక్షల మందికి ఉపాధినందిస్తున్న ఈ తేనీటిని సందర్భాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి దీనిని అనేక విధాలుగా తయారు చేయవచ్చు. వీటిలో కొన్ని కాశ్మీరీ కహ్వా, అల్లం టీ, తులసి టీ, సులైమాని టీ, రోంగా టీ, మసాలా టీ, లెమన్గ్రాస్ టీ, గ్రీన్ టీ. బెల్లం, మిరియాల టీ, అబ్బో.. ఈ లిస్ట్ చాలా పెద్దది. మన బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా రకరకాల టీలు ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాల సంపూర్ణ మిశ్రం టీ. హల్దీ టీ రోగనిరోధక శక్తిని పెంచి, కాలేయాన్ని శుభ్రపరిస్తే.. తేనె నిమ్మకాయ అల్లం దట్టించిన టీ గొంతు నొప్పి , జలుబుకు చక్కటి చిట్కా. అలాగే హనీ లెమన్ జింజర్ టీ, ఆమ్లా అల్లం టీ ద్వారా విటమిన్ సీ దొరుకుతుంది. దీంతో బరువు తగ్గించుకోవచ్చు. డిటాక్స్ డైట్లో అల్లం అజ్వైన్ లెమన్ టీ, జింజర్ అజ్వైన్ లెమన్ టీ చేర్చుకుంటే బరువు తగ్గే ప్రక్రియ వేగవంత మవుతుందని నిపుణులు కూడా నమ్ముతున్నారు. మరోవైపు సాహసికుడు,టీ ప్రేమికుడు, ఆండ్రూ హ్యూస్ చరిత్రలో అత్యధిక టీ పార్టీని నిర్వహించిన ఘనత సాధించారు. బ్లాక్ , గ్రీన్ టీ, పిప్పరమెంటు, చమోమిలే వంటి టీలను ఆయన అందించారట. నేపాల్లోని మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ 2, మే 5, 2021న 6,496 మీటర్ల ఎత్తులో, ఆండ్రూ 15 మంది అధిరోహకుల బృందంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మరి మీరు కూడా మంచి టీ పార్టీతో మీ స్నేహితులతో ఇంటర్నేషనల్ టీ డేని ఎంజాయ్ చేయండి. -
వైరల్ చాయ్వాలీ ప్రియాంక.. దుకాణం బంద్!
పాట్నా: నిరుద్యోగంపై ఎదురు తిరిగి.. చివరకు సొంతంగా చాయ్ దుకాణం పెట్టిన ప్రియాంక కథ.. ఇంటర్నెట్లో ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. రెండేళ్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంతంగా ఆమె టీ స్టాల్ పెట్టుకుని.. గ్రాడ్యుయేట్ చాయ్వాలీగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇప్పుడామె ఆ స్టాల్ను మూసేసింది. ఆగండి.. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. అయితే ఈ గ్రాడ్యుయేట్ చాయ్వాలీ కథనం.. ఓ వ్యక్తిని కదిలించిందట. అందుకే ప్రియాంక తన బిజినెస్ను విస్తరించుకునేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియాంకకు ఫుడ్ ట్రక్ను అందించారు. దీంతో టీ స్టాల్ను ఎత్తేసిన ప్రియాంక.. ఫుడ్ ట్రక్ను కొందరు స్టాఫ్తో కలిసి నడిపిస్తోంది. తక్కువ టైంలో ఎదిగిన ఆమె కథతో సోషల్ మీడియా పవరేంటో మరోసారి నిరూపితమైంది. Bihar: Priyanka Gupta, an economics graduate sets up a tea stall near Women's College in Patna I did my UG in 2019 but was unable to get a job in the last 2 yrs. I took inspiration from Prafull Billore. There are many chaiwallas, why can't there be a chaiwali?, she says pic.twitter.com/8jfgwX4vSK — ANI (@ANI) April 19, 2022 -
హాట్ అండ్ కూల్ ట్రావెలింగ్ రిఫ్రిజిరేటర్.. ధర 6 వేలు!
Hot And Cool Traveling Refrigerator: ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. దూర ప్రాంతాలకు వెళ్తున్నపుడు నాలుగు జతల బట్టలతో సహా ఆ నాలుగు రోజులకు సరిపడా ఫుడ్ కూడా వెంట తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. పండ్లు, కూరగాయలు, వండుకున్న పదార్థాలను నిలవ ఉంచుకోవాలన్నా.. కాలానికి తగ్గట్టు చల్లటి పానీయాలు, వేడివేడి కాఫీలు అందుబాటులో పెట్టుకోవాలన్నా.. ఇలాంటి మినీ కూలర్ అండ్ వార్మర్ను మీ లాగేజ్లో భాగం చేసుకోవాల్సిందే. దీన్ని బెడ్ రూమ్లో, ఆఫీస్ క్యాబిన్లో, ప్రయాణాల్లో ఎక్కడైనా చక్కగా వినియోగించుకోవచ్చు. దీని పైభాగంలో ప్రత్యేకమైన హ్యాండిల్ కూడా ఉంటుంది. దాంతో ఎక్కడికైనా సులభంగా మోసుకుని వెళ్లొచ్చు. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డివైజ్. దీని కూలింగ్ రేంజ్ 20 డిగ్రీల సెల్సియస్. హీటింగ్ రేంజ్ 60 డిగ్రీల సెల్సియస్. దాంతో వేసవిలో చల్లని శీతలపానీయాలను, శీతాకాలంలో వేడివేడి కాఫీలను అందిస్తుంది. ఇందులో కావాల్సిన టాబ్లెట్స్, బ్యూటీ కాస్మెటిక్స్ ఇలా అన్నింటినీ స్టోర్ చేసుకోవచ్చు. పైగా ఇది స్టైలిష్ టెంపర్డ్ గ్లాస్ ప్యానెల్ కలిగి ఉండటంతో దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా తేలిక. అవసరాన్ని బట్టి ఇందులో బాస్కెట్స్ను అమర్చి, చిన్న చిన్న విభాగాలుగా మార్చుకుని, చాలా రకాలు స్టోర్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మధ్యలో పెట్టుకునే ర్యాక్స్ లేదా బాస్కెట్స్ను తొలగించి.. పొడవాటి డ్రింక్ బాటిల్స్ వంటివి పెట్టుకోవచ్చు. దీనికి రెండు పవర్ మోడ్స్ లభిస్తాయి. ఒకటి ఇంట్లో పవర్ సాకెట్కి అమర్చుకునేది. మరొకటి కారులో కనెక్ట్ చేసుకునేది. భలే ఉంది కదూ! ధర: 80 డాలర్లు (రూ.6,101) చదవండి: Ice Cream Maker: 10 నిమిషాల్లో ఐస్క్రీమ్ రెడీ.. ధర రూ.2,215! -
బంగారం కలిపిన టీపొడితో చేసిన ఛాయ్.. ఇండియాలోకి ఎంట్రీ!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ హౌజ్గా పేరున్న లండన్ టీ ఎక్సేంజ్ (ఎల్టీఈ) ఇండియాలోకి ఎంట్రీ ఇస్తోంది. వ్యాపార విస్తరణలో భాగంగా ప్రపంచంలోనే అతి పెద్ద టీ మార్కెట్గా ఉన్న ఇండియాలో తమ ఛాయ్ రుచులు పంచేందుకు రెడీ అవుతోంది. ప్రిన్స్ ఛార్లెస్తో మొదలు బ్రిటీ రాజవంశానికి చెందిన ప్రిన్స్ ఛార్లెస్ 1552లో పోర్చగీస్కి చెందిన ప్రిన్సెస్ కెథరీన్ బంగాజాను వివాహం చేసుకున్న సందర్భంబంగా లండన్ టీ ఎక్సేంజ్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంపన్న శ్రేణికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉపయోగించే టీ హౌజ్గా ఎల్టీఈకి గుర్తింపు ఉంది. ఐదు వందల ఏళ్లలో అనేక యాజమన్యాలు మారినా ఎల్టీఈ ప్రత్యేకత చెక్కు చెదరలేదు. కాగా తాజాగా ఎల్టీఈ ఇండియాలో భారీ ఎత్తున విస్తరించే ప్రణాళికను అమలు చేస్తోంది. కోల్కతా మూలాలు ఇండియాలో ముందుగా ఢిల్లీ లేదా బెంగళూరులో తొలి టీ హౌజ్ను ఆరంభించే యోచనలో ఉన్నట్టు ఎల్టీఈ ఇండియా వ్యవహరాలు చూస్తోన్న రహ్మాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎల్టీకీ గ్లోబల్ సీఈవోతో పాటు ఇండియాలో మాస్టర్ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నారు. రహ్మన్ పూర్వీకులు కొల్కతకు చెందిన వారు కావడంతో ఎల్టీఈని ఇండియాలో విస్తరించే యోచనలో ఉన్నారు. ఫ్రాంచైజీలు బోయే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 200 స్టొర్లను అందుబాటులోకి తేవాలని లండన్ టీ ఎక్సేంజ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటి ఏడాదే 50 స్టోర్లను ప్రారంభిస్తామని ఎల్టీఈ ప్రతినిధులు జాతీయ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఢిల్లీ/బెంగళూరు తర్వాత ముంబై, హైదరాబాద్, చెన్నైలలో స్టోర్లు ప్రారంభించనున్నారు. ఎల్టీఈ స్టోర్ ఫ్రాంచైజీ దక్కించుకోవాలంటే పోష్ ఏరియాలో లోకేషన్ చూసుకోవడంతో పాటు సగటున కోటిన్నర రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కేజీ రూ. 13 కోట్లు లండన్ టీ ఎక్సేంజీ (ఎల్టీఈ) స్టోర్లలో టీ ప్రారంభం ధర రూ.120 ఉంటుందని అంచనా.. ఇక ఎల్టీఈకే ప్రత్యేకమైన బంగారంతో చేసిన ప్రత్యేక టీ పొడి ఖరీదు కేజీ రూ. 13 కోట్లు ఉంటుందట! ఈ టీని ఖరీదు చేస్తే స్థోమత సామాన్యులకు లేనట్టే. కాబట్టి ఈ బంగారం కలిసిన టీ పొడిని స్టోర్లలో ప్రదర్శనకు పెట్టినా.. అమ్మడం కష్టమేనంటున్నారు. ముందు నుంచి కూడా రికార్డులు కోరుకునేవారు, సూపర్ రిచ్ పీపుల్స్ దీన్ని భరించగలరంటున్నారు ఎల్టీఈ ప్రతినిధులు. చదవండి👉 Gautam Adani: వారెన్ బఫెట్కు భారీ షాక్! రికార్డులన్నీ తొక్కుకుంటూ పోతున్న అదానీ! -
మంచి కాఫీలాంటి స్టోరీ.. కాఫీ తాగని దేశం..కాఫీ లవర్గా మారిందెలా?
ఉదయం నిద్ర లేవగానే మనలో చాలా మందికి టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కొందరు టీ రుచిని ఆస్వాదిస్తే ఇంకొందరు కాఫీ ఘుమఘుమలను ఇష్టపడతారు. అయితే వేల సంవత్సరాలుగా టీని అభిమానించి.. దాన్నే తాగడానికి అలవాటుపడిన ఓ దేశాన్ని ఒక కంపెనీ కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే కాఫీ లవర్స్లా మార్చేసింది. అదెలా సాధ్యమైంది.. ఆ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా మరి. టీని ప్రేమించే దేశం... ప్రముఖ బహుళజాతి కంపెనీ నెస్లే గురించి తెలుసుగా... స్విట్జర్లాండ్కు చెందిన ఈ సంస్థ ఆహార, పానియాల తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ప్రత్యేకించి ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తుల తయారీలో దిగ్గజం. కానీ ఈ సంస్థ 1970లలో జపాన్లో తమ ఇన్స్టంట్ కాఫీని విక్రయించేందుకు పడరాని పాట్లు పడింది. ఒక్క కప్పు కాఫీ కూడా అమ్మలేక చతికిలపడింది. ఇందుకు కారణం.. జపాన్ వేల సంవత్సరాలుగా టీని ఇష్టపడే దేశం కావడమే. ఇలాంటి మార్కెట్లో నెస్లే అడుగు ఎలా పెట్టింది? అక్కడి సంస్కృతిని అర్థం చేసుకొని.. ఇందుకోసం నెస్లే గట్టి కసరత్తే చేసింది. సంస్కృతిలో భాగంగా కొన్ని వస్తువులతో ప్రజలు ఏర్పరుచుకొనే ప్రత్యేక అనుబంధంపై పరిశోధనలు చేయడంలో పేరుగాంచిన సైకోఅనలిస్ట్, ఫ్రాన్స్ జాతీయుడైన క్లోయ్టెర్ రాపిల్లేను తన మార్కెటింగ్ కన్సల్టెంట్గా నియమించుకుంది. జపాన్పై అధ్యయనం చేపట్టిన క్లోయ్టెర్... నెస్లే కాఫీ రుచులను ముందుగా జపాన్ పిల్లలకు అలవాటు చేయడానికి ఓ వ్యూహం సూచించాడు. క్లోయ్టెర్ చెప్పిందే తడవుగా మొదటి దశలో భాగంగా నెస్లే జపాన్ మార్కెట్ను కాఫీ రుచితో కూడిన స్వీట్లు, చాక్లెట్లతో ముంచెత్తింది. పిల్లలకు ఇవి తెగ నచ్చాయి. నెమ్మదిగా జపాన్కు కాఫీ రుచి తెలిసొచ్చింది. చదవండి👉అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ మాట కలిపిన ఇంజనీరింగ్ యువతి నేటి పిల్లలే రేపటి వినియోగదారులు కాఫీ రుచి కలిగిన క్యాండీలు ప్రవేశపెట్టిన పదేళ్ల తర్వాత నెస్లే కొత్త రకం కాఫీ ఉత్పత్తులతో తిరిగి ఆ దేశంలో అడుగుపెట్టింది. అప్పటికి నెస్లే ‘క్యాండీ వినియోగదారుల్లో’ చాలా మంది పెద్దవాళ్లయ్యారు. ఉద్యోగాలు చేస్తున్నారు.. దీంతో వారంతా ఈ కాఫీ ఉత్పత్తులను తాగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నెస్లే తెచ్చిన ఇన్స్టంట్ కాఫీ అనతికాలంలోనే మార్కెట్ను హస్తగతం చేసుకుంది. తర్వాత 2012లో నెస్లే సంస్థ వివిధ ఆఫీసులకు నెస్కెఫే తయారీ మెషీన్లను సరఫరా చేయడంతోపాటు తమ సహచరులకు కాఫీ తయారు చేసి ఇవ్వగల ‘నెస్కెఫే అంబాసిడర్’లను నియమించింది. పని ప్రదేశాల్లో రుచికరమైన కాఫీ లభించేందుకు ఈ ప్రచారం దోహదపడింది. అలాగే ప్రజలు సామాజికంగా దగ్గరై సరదాగా గడిపేలా చేసింది. కాఫీ మెషీన్లు విక్రయించేందుకు, కాఫీ కాచి వినియోగదారులకు అందించేందుకు నెస్లే 2014లో హ్యూమనాయిడ్ రోబో ‘పెప్పర్’ను రంగంలోకి దించింది. జపాన్ రాజధాని టోక్యోలో నెస్లే 2019లో ప్రత్యేకంగా ఒక స్లీప్ కేఫ్ను తెరిచింది. ఈ కేఫ్కు వచ్చే వారు మెత్తటి పరుపులపై చిన్నపాటి కునుకుతీసి కాఫీ తాగేలా ఏర్పాట్లు చేసింది. టీ టు కాఫీ ఫైనల్గా ఏం జరిగిందో తెలుసా? ఒకప్పుడు కనీసం కాఫీని తాగడానికి ఇష్టపడని జపాన్.. 2020 నాటికి ప్రపంచంలోకెల్లా 7వ అతిపెద్ద కాఫీ దిగుమతిదారుగా తయారైంది. ఈ దేశం ఏటా జపాన్ 43 లక్షల టన్నుల కాఫీని వినియోగిస్తోంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఉద్యోగం లేదు.. బ్యాంకులు లోన్ ఇవ్వలేదు.. అయినా..
'Why can't there be chaiwali?': అనుకున్న కాలేజీలో సీటురాలేదనో, అకడమిక్ ఇయర్ ఫెయిల్ అయ్యామనో, ఉద్యోగం రాలేదని క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థులున్న ఈ రోజుల్లో.. ‘‘అనుకున్నది జరగకపోతే జీవితం అంతటితో అయిపోయినట్లు కాదు, ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్కమ్ చెబుతుంది. ఆ దారిలో కూడా వెళ్లవచ్చు’’ అని నిరూపించి చూపిస్తున్నారు కొంతమంది విద్యార్థులు. ఈ కోవకు చెందిన ప్రియాంక గుప్తా.. ‘మనస్సు ఉంటే మరో మార్గం తప్పకుండా ఉంటుంది’ అని పెద్దలు చెప్పిన మాటను చేతల్లో చేసి చూపిస్తోంది. ప్రియాంక అనుకున్న ఉద్యోగం రాలేదని, నిరుత్సాహపడకుండా, సొంతంగా టీస్టాల్ పెట్టుకుని ఎంతోమంది గ్రాడ్యుయేట్లకు ఉదాహరణగా నిలుస్తోంది. బీహార్లోని పూర్ణియ జిల్లాకు చెందిన ప్రియాంక గుప్తా మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్లో కామర్స్ డిగ్రీ చదివింది. 2019లో డిగ్రీ పూర్తయినప్పటి నుంచి బ్యాంకింగ్ ఉద్యోగంకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రెండేళ్లపాటు సీరియస్గా ప్రయత్నించినప్పటికి బ్యాంక్ ఉద్యోగి కాలేకపోయింది. దీంతో ‘ఇంకెంత కాలం ఇలా ప్రిపేర్ అవుతాం. ఉద్యోగం చేసినా, ఇంకేదైనా పనిచేసినా డబ్బులు సంపాదించడం కోసమే కదా’ అనుకుంది. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పి టీసాŠట్ల్ పెట్టడానికి అనుమతి తీసుకుంది. ‘చాయ్వాలి’ పేరిట పాట్నా ఉమెన్స్ కాలేజీ ముందు టీస్టాల్ను ప్రారంభించింది. ఏప్రిల్ పదకొండున ప్రారంభించిన చాయ్వాలి స్టాల్ పంచ్ కొటేషన్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ‘పీనా హై పఢేగా’, సోచ్ మత్.. చాలు కర్ దే బాస్’ వంటి కోట్స్తో తన స్టాల్స్కు కస్టమర్లను రప్పించుకుంటోంది ప్రియాంక. కుల్దా టీ, మసాలా టీ, పాన్ టీ, చాక్లెట్ టీలతో పాటు కొన్ని రకాల కుక్కీలు, స్నాక్స్ను రూ.15 నుంచి రూ.20లకే విక్రయిస్తుండడంతో విద్యర్థులు చాయ్వాలికి ఎగబడి వస్తున్నారు. ప్రియాంక టీస్టాల్ పెట్టాలనుకున్నప్పుడు ముద్ర లోన్తోపాటు, ఇతర రకాల రుణాల కోసం కూడా ప్రయత్నించింది కానీ దొరకలేదు. కొన్ని బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ ఆమెకు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. కొంతమంది రకరకాల డాక్యుమెంట్స్ అడిగి ఇబ్బంది పెట్టారేగానీ, రుణం మాత్రం ఇవ్వలేదు. చివరికి తన స్నేహితులు తలా కొంత సాయం చేయడంతో జమ అయిన కొద్ది మొత్తంతో టీస్టాల్కు కావాల్సిన వస్తు సామగ్రిని కొనుక్కుని స్టాల్ను ప్రారంభించింది. -
చాయ్వాలీ ప్రియాంక: రెండేళ్ల ప్రయత్నాల తర్వాత..
ఎంతసేపు.. ప్రభుత్వాలు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విమర్శించే బదులు.. స్వతహాగా ఏదో ఒక పనిలో దిగిపోవడం ఉత్తమమని సలహా ఇస్తోంది ప్రియాంక. రెండేళ్లపాటు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆమె అది ఫలించకపోవడంతో టీ దుకాణం తెరిచింది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. రెగ్యులర్ టీతో పాటు పాన్, మసాలా, చాక్లెట్ టీ, బిస్కెట్లు అమ్ముతోందామె. అంతేకాదు అక్కడ బ్యానర్ల మీద స్ఫూర్తినిచ్చే ఎన్నో కొటేషన్లు సైతం ఉంచింది. -
తల్లిదండ్రులే ఆమె పిల్లలు
కడుపున పుట్టిన వాళ్లు తరిమేసిన తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేసి పసి పిల్లల వయసుకు చేరుకున్న ఆ వృద్ధులను ఎవరు ఆదుకోవాలి? ‘నేను మీ తల్లిని’ అంది రాజేశ్వరి. నీలగిరులకు ఎవరైనా ఆహ్లాదం కోసం వెళతారు. కాని పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు. ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ రోజు రామమూర్తి తన ఇంటికి ఒక వృద్ధురాలిని తీసుకుని వచ్చాడు. భార్య రాజేశ్వరితో ‘ఇవాళ నుంచి ఈమె మనతోనే ఉంటుంది’ అన్నాడు. రాజేశ్వరి ‘ఎవరు.. ఏమిటి’ అని భర్తని ఒక్క మాట కూడా అడగలేదు. ‘అలాగే’ అంది. అయితే ఆ వృద్ధురాలు లెప్రెసీ పేషెంట్. ఆమెకు ఆ వ్యాధి ఉందనో, మరే కారణం చేతనో అయినవారు ఆమెను వదిలేశారు. రామమూర్తి, రాజేశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారు. ‘లెప్రసీ అంటువ్యాధి ఏమీ కాదు కదా.. అదేం పర్వాలేదులే’ అన్నాడు రామమూర్తి. దానికి కారణం– అతడు హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండటమే. లెప్రసీ పేషంట్స్తో ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అలా నీలగిరి జిల్లాలో కూనూరుకు పక్కనే ఉండే తెనాలి అనే చిన్న ఊళ్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెర లేచింది. తలుపు తట్టండి... తెరవబడును మరో రెండు రోజులకే రామమూర్తి తలుపు తట్టబడింది. రాజేశ్వరి తెరిచి చూస్తే ఎదురుగా మరో వృద్ధురాలు. ‘మా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ ఇంట్లో చోటు ఇవ్వండమ్మా’... రాజేశ్వరి గడప నుంచి పక్కకు జరిగి ఆమెను లోపలికి రానిచ్చింది. మరో వారంలో ఇంకో వృద్ధురాలు వచ్చింది. అప్పటికి రాజేశ్వరి భర్తతో మాట్లాడింది. ‘మన ఇంట్లో చోటు చాలదు. మన టీ గార్డెన్లో పెడదాం’ అంది. నీలగిరి జిల్లా టీ తోటలకు ప్రసిద్ధి. రాజేశ్వరికి కూడా చిన్న టీ తోట ఉంది. అందులోనే ఒక గదిలో ఆ ముగ్గురు స్త్రీలను ఉంచారు. చిన్న ఊరు తెనాలి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకంతా పాకిపోయింది. రామమూర్తికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. రాజేశ్వరి వారిని అక్కున చేర్చుకునేది. ఇవాళ్టికి దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. రామమూర్తి రిటైర్ అయ్యాడు. వాళ్ల పెద్దమ్మాయి మెడిసిన్ చేసి డాక్టర్గా ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటూ ఉంది. అయినప్పటికీ రాజేశ్వరి తన సొంత పిల్లలకు కాకుండా ఇంకో అరవై మందికి తన హోమ్లో తల్లిగా ఉంటూ సేవ చేస్తోంది. నగలు కుదువ పెట్టి హోమ్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రిజిస్టర్ చేసి నడపడం తప్పని సరి అని శ్రేయోభిలాషులు చెప్తే ‘ఎంఎన్ ట్రస్ట్’ పేరుతో రిజిస్టర్ చేసి అర ఎకరాలో రెండు షెడ్స్ వేసి అన్ని విధాలా అనుకూలమైన షెల్టర్ హోమ్ను నిర్మించారు రామమూర్తి, రాజేశ్వరి. ‘ఇది అనాథ గృహం కాదు. పిల్లల చేత గెంటివేయబడగ దిక్కులేనివారైన తల్లిదండ్రులకు ఆత్మీయ గృహం’ అంటుంది రాజేశ్వరి. ఇది నడపడం ఎలాగా? ‘మన టీ తోట మీద వచ్చే ఆదాయం దీనికే పెడదాం’ అంది రాజేశ్వరి. ఉద్యోగంలో ఉండగా, ఇప్పుడు పెన్షన్ నుంచి రామమూర్తి సగం ఆదాయం ఈ హోమ్కే. డాక్టర్గా ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక ముప్పై వేల వరకూ పంపుతుంది. మొత్తం మీద నెలకు 70 లేదా ఎనభై వేలు సొంత ఖర్చుల మీదే ఈ భార్యాభర్తలు హోమ్ను నడుపుతున్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం మా హోమ్ను గుర్తించింది కాని వాళ్ల నుంచి ఏమీ ఫండ్స్ రావు. ఈ హోమ్స్ కూడా లోన్ తీసుకుని, నా నగలు కుదువ పెట్టి కట్టాం’ అంటుంది రాజేశ్వరి. ఇప్పుడు హోమ్లో 60 మంది ఉన్నారు. అతి తక్కువ వయసు అంటే 47. ఎక్కువ వయసు అంటే 90. ‘ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు చెప్పిన వెంటనే మాట వింటారు. మరికొందరు మొండిగా ఉంటారు. ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వస్తాను’ అంటుంది రాజేశ్వరి. సొంత తల్లిలా హోమ్లో ఉన్న సభ్యులకు మూడు పూట్లా టీ ఉంటుంది. సాయంత్రం పలహారం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరేసరి. నీలగిరి చల్లటి ప్రాంతం కాబట్టి ఎప్పుడూ వేణ్ణీళ్ల ఏర్పాటు ఉంటుంది. వెచ్చటి దుస్తులను ఇస్తుంది రాజేశ్వరి. రెండు పూటలా యోగా చేయిస్తారు. ఉల్లాసం కోసం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ‘వంట పని దాదాపుగా నేనే చూస్తాను’ అంటుంది రాజేశ్వరి. హోమ్ కోసం ఒక వ్యాన్, ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ‘రెగ్యులర్గా హాస్పిటల్కు తీసుకెళతాం. అందరికీ ఆధార్ కార్డ్లు ఇప్పించాం. ఎవరైనా పోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాం’ అంటుందామె. ఇంత పని ఎందుకోసం చేస్తున్నారు ఈ భార్యాభర్తలు. బహుశా ఇది చూపదగ్గ మానవత్వం అనుకోవడం వల్ల కావచ్చు. భావితరాలకు పాఠం వీరి హోమ్కు రెగ్యులర్గా కొంతమంది వచ్చి విరాళాలు ఇస్తారు. కొందరు స్కూల్ పిల్లలు పుట్టినరోజులు జరుపుకోవడానికి వస్తారు. ‘మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టొద్దు’ అని చెబుతుంది రాజేశ్వరి వారికి. పిల్లల్ని పెద్ద చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. వారిని నిరాకరించి పిల్లలు మరిన్ని కష్టాల్లో నెడతారు. నీలగిరిలో రాజేశ్వరి ఉంది. మీ ఊళ్లో ఎవరున్నారు? -
టీ, కాఫీ తాగిన తర్వాత కప్పును తినేయండి.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా?
సాక్షి,సిద్దిపేట: టీ, కాఫీ తాగిన తర్వాత కప్పును తినేయండి అంటున్నారు సిద్దిపేటలోని పలు టీస్టాల్స్ యజమానులు. అదేంటి ప్లాస్టిక్ గ్లాస్ను తినడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అది ప్లాస్టిక్ కప్పు కాదండోయ్ బిస్కెట్తో తయారు చేసిన కప్పు. వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజమండి.. దీని గురించి తెలుసుకోవాలంటే మనం జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు వెళ్లాల్సిందే. చాయ్ తాగిన తర్వాత ప్లాస్టిక్, పేపర్ కప్పులు అయితే పడేస్తారు. పింగాణీ అయితే కడిగి మళ్లీ వినియోగిస్తారు. ఈ ప్లాస్టిక్, పేపర్ కప్పుల ద్వారా కుప్పలుగా ప్లాస్టిక్ పేరుకుపోవడంతో పర్యావరణాకి ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన సిద్దిపేటకు చెందిన నలుగురు యువకులు వినూత్న ఆలోచనతో ఈ బిస్కెట్ టీ కప్పుల తయారీకి శ్రీకారం చుట్టారు. వినూత్న ఆలోచనతో.. సిద్దిపేట పట్టణానికి చెందిన దావత్ అఖిల్ కుమార్, అల్లె రమేశ్, బుక్క శివ కుమార్, కందుకూరి శివ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. పర్యావరణానికి çహానీ చేయని పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు టీ స్టాల్ దగ్గర టీ కప్పుల కుప్పలు చూశారు. వీటి ద్వారా పర్యావరణానికి హానీ కలుగుతుందని గుర్తించారు. టీ తాగిన తర్వాత వృథాగా పడేయకుండా ఉండేందుకు కప్పును తినేవిధంగా తయారు చేయాలని ఓ ఐడియాకు వచ్చారు. తొలుత బిస్కెట్తో తయారు చేసిన ఐస్క్రీం కప్పులో టీ తాగి చూశారు. బెంగళూరులోని కప్పులు తయారు చేసే పరిశ్రమకు వెళ్లి పరిశీలించారు. ఏ మెటీరియల్ను వినియోగిస్తున్నారో తెలుసుకున్నారు. చిన్న సైజు కప్పును తయారు చేసిన దానిలో టీ ని అందిస్తే తాగిన తర్వాత తినే విధంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. అనంతరం అక్కడి నుంచి తమకు కావాల్సిన విధమైన మిషన్ను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. చదవండి: వరిచేలలో రామ్ చరణ్ చిత్రం.. షార్ట్ ఫిలిం డైరెక్టర్ అభిమానం 6 నిమిషాల్లో 40 తయారీ రాగి, మైదా, మొక్కజొన్న పిండి, చక్కెర, తెనేలను బాగా మిక్స్ చేసి ఒక డై లో మొదట ఆ మిశ్రమంను పొస్తారు. తర్వాత మిషనరీలో ఉన్న టీ కప్పు డై లో ఈ మిశ్రమంను వేస్తారు. సుమారుగా 6 నిముషాల పాటు అందులోనే ఉంచుతున్నారు. హీటర్ల ద్వారా వేడి అయి గట్టి పడుతుంది. డై ని ఓపెన్ చేసి కప్పులను తీస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని పలు టీస్టాల్లకు ఈ కప్పులను సరఫరా చేస్తున్నారు. ఒక్కో టీ కప్పు రూ.3.5 విక్రయిస్తున్నారు. ఈ కప్పుల్లో టీ తాగిన ప్రజలు తర్వాత వాటిని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. పర్యావరణానికి రక్షగా సిద్దిపేటలో మున్సిపాలిటీ, మంత్రి హరీశ్రావు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నారు. మా వంతు కృషిగా బిస్కెట్ టీ కప్పులను తయారు చేస్తున్నాం. ప్రస్తుతానికి సిద్దిపేటలోనే సరఫరా చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రొడక్షన్ పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తాం. మేము నలుగురమే తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాం. – అఖిల్, రమేశ్, శివ కుమార్ -
టీ అమ్మిన చేతులతో నాడిపట్టేలా..
సాక్షి, ఒంగోలు: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం..కన్నబిడ్డలను కష్టపడి చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. బిడ్డలకు కూడా కష్టం అంటే ఏమిటో తెలియజేస్తోంది. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చదువులో రాణించటం మొదలు పెట్టారు. ఆ కష్టం కాస్తా ఫలించింది. కుమారుడు మెడిసిన్కు సంబంధించి నీట్ ఎంట్రన్స్ పరీక్షలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని నింపాడు. దీంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. స్థానిక ధారావారితోటలో నివాసం ఉంటూ..ప్రకాశం భవన్ ముందు టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దాసరి పిచ్చయ్య, మాధవిల కుమారుడు దాసరి వంశీకృష్ణ ఈ అరుదైన ఘనత సాధించాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన వంశీకృష్ణ చదువుకుంటూనే టీ కొట్టులో కూడా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చివరకు మొన్నటి మెడిసిన్ నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సిలింగ్లో విశాఖపట్నంలోని గాయత్రీ విద్యాపీఠం మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పిచ్చయ్య ఎస్సీ కార్పొరేషన్లో రూ.లక్ష రుణం తీసుకొని జీవనం సాగిస్తూ తన కుమారుడు, కుమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమార్తె వైష్ణవి కూడా బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వైష్ణవి చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహకారం అందుతోంది. ప్రత్యేకంగా అభినందించిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్లో సీటు సాధించిన దాసరి వంశీకృష్ణను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు చంద్రయ్య నగర్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం వచ్చిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్ సీటు సాధించిన వంశీకృష్ణను వెన్ను తట్టి ప్రోత్సహించారు. సాధారణ టీకొట్టు నడుపుకుంటున్న వ్యక్తి కుమారుడు ఎంబీబీఎస్ సీటు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. యువత కష్టపడి చదువుకోవాలని బాలినేని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాసరి వంశీకృష్ణ పడిన కష్టం గురించి మంత్రికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్ వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద టీ అమ్ముకుంటూ కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి పథకం ద్వారా వంశీకృష్ణ చెల్లెలు వైష్ణవి చదువుకుందని, అదేవిధంగా బీటెక్లో చేరాక జగనన్న విద్యా దీవెన పథకం కూడా వచ్చిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ సీటు వచ్చిన ఆర్డర్ను మంత్రి బాలినేని చేతుల మీదుగా వంశీకృష్ణకు అందజేశారు. -
జెలెన్ స్కీకి అరుదైన గౌరవం.. భారత్లో ఆయన పేరుతో..
దిస్పూర్: ఉక్రెయిన్లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. కాగా, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధ రంగంలోకి దిగి సైన్యాన్ని ముందుకు నడిపిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆయనను బాహుబలి అని కొందరు ప్రశంసించారు. ఇప్పుడు జెలెన్ స్కీ వరల్డ్వైడ్ ఎంతో ఫేమస్ అయిపోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా జెలెన్ స్కీ పేరుతో ఇండియాలో సైతం మారుమోగుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ బ్రాండ్ పేరుతో టీ పౌడర్ మార్కెట్లో విడుదలైంది. బ్లాక్ టీ పౌడర్ను అసోం స్టార్టప్ కంపెనీ అరోమిక్ టీ మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్లీ స్ట్రాంగ్.. స్ట్రాంగ్ అస్సాం బ్లాక్ టీ అంటూ క్యాప్షన్స్ కూడా పెట్టింది. కాగా, జెలెన్స్కీ పేరుపై టీ పౌడర్ మార్కెట్లోకి విడుదల కావడం హాట్ టాపిక్గా మారింది. A new Assam tea blend called Zelenskyy, Really Strong has been released by startup @AromicaTea This shows how globally people are appreciating the exceptional courage & valour of President @ZelenskyyUa of #Ukraine️ #UkraineWar #UkraineRussiaWar pic.twitter.com/JHrA4QYenI — Joydeep Phukan (@joyphukan) March 16, 2022 ఈ నేపథ్యంలో అరోమిక్ టీ డైరెక్టర్ రంజిత్ బారువా మాట్లాడుతూ.. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన ధైర్యం చూపుతున్న జెలెన్ స్కీకి గౌరవార్థం ఆయన పేరు మీదుగా ఇలా టీ పౌడర్ను విడుదల చేసినట్టు తెలిపారు. ఆయన వ్యక్తిత్వాన్ని తమ టీ పౌండర్తో పోల్చుతూ క్వాలిటీని ప్రతిబింబించేలా చూస్తామన్నారు. త్వరలో ఆన్లైన్ సైతం టీ పౌడర్ దొరుకుతుందని వెల్లడించారు. కాగా, కిలో టీ పౌడర్ వెల రూ. 450గా నిర్ణయించినట్టు తెలిపారు. మరో వైపు ఉక్రెయిన్ ఈ సంవత్సరంలో భారత దేశం నుంచి 1.73 మిలియన్ కిలోల టీ పొడిని దిగుమతి చేసుకోగా.. రష్యా 34.09 మిలియన్ కిలోల టీ పౌడర్ను దిగుమతి చేసుకుంది. -
సామాన్యులకు మరో షాక్..వీటి ధరలు భారీగా పెరిగాయ్!
పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు పడింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగంలో దిగ్గజ కంపెనీలైన హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్), నెస్లే ధరల పెంపును ప్రకటించాయి నేషనల్ మీడియా కథనం ప్రకారం..నెస్లే ఇండియా మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచగా.. మిల్క్,కాఫీ ఫౌడర్ ధరలు పెరిగాయి. 70 గ్రాముల మ్యాగీ మసాలా నూడిల్స్ రూ.12 నుంచి రూ.14 పెరిగింది. ♦140 గ్రాముల మ్యాగీ మసాల నూడిల్స్ 12.5శాతంతో ధర రూ.3 పెరిగింది. ♦560 గ్రాముల ప్యాకెట్ ధర 9.4 శాతంతో రూ.96 నుంచి రూ.105కి పెరిగింది. ♦నెస్లే ఏప్లస్ ఒకలీటర్ కార్టన్ ధర 4శాతంతో రూ.75 నుంచి రూ.78కి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ కాఫీ ఫౌడర్ ధర 3 నుంచి 7శాతానికి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ 25 గ్రాముల ప్యాకెట్ 2.5శాతంతో రూ.78 నుంచి రూ.80కి పెరిగింది. ♦నెస్ కెఫె క్లాసిక్ 50 గ్రాముల ప్యాకెట్ 3.4శాతంతో రూ.145 నుంచి రూ.150కి పెరిగింది. ♦హెచ్యూఎల్ సైతం టీ, కాఫీ ఫౌడర్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.అదే సమయంలో బ్రూ కాఫీ ధర 3 నుంచి 7శాతం, తాజ్ మహల్ టీ 3.7 శాతం నుంచి 5.8శాతం పెరిగాయి. ♦ బ్రూక్ బ్రాండ్ 3 రోజెస్ వేరియంట్ ధర 1.5 నుంచి 14శాతానికి పెరిగింది. ఇక ఈ పెరిగిన ధర ఫ్రిబవరి నుంచి తయారువుతున్న ఉత్పత్తులపై పడనున్నాయి. చదవండి: వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్! -
టీ పెట్టారు.. రూ.లక్షలు కొట్టారు
మాదాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం తెలంగాణ టీ చాంపియన్ షిప్ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ఆనరరీ కాన్సుల్, రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా ఫర్ తెలంగాణ, సుచరిండియా ఏపీ సీఈఓ లయన్ కిరమ్, నిలోఫర్ కేఫ్ చైర్మన్ ఎ.బాబురావు, గోద్రేజ్ జెర్సీ సీఈఓ భూపేంద్రసూరి, మల్లారెడ్డి హెల్త్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మాడిశెట్టి రాజ్గోపాల్లతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలతో టీ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులన్నారు. గతంలో ఎన్నడూ లేని సరికొత్త విధానంతో రకరకాల టీలను పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. పోటీల్లో 104 Ðమంది పాల్గొన్నారు. ప్రథమ బహుమతి కింద లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, ముగ్గురు రన్నరప్లకు రూ.25 వేల చొప్పున మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. -
గుడ్న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. గరుడ, రాజధాని బస్సుల కోసం బస్స్టేషన్లలో ఎదురు చూసే ప్రయాణికులకు సాయంత్రం 4 నుంచి చివరి బస్సు వరకు కాఫీ, టీ, స్నాక్స్, తాగునీరు అందజేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మియాపూర్ క్రాస్రోడ్స్, కేపీహెచ్బీ, ఎస్సార్నగర్, టెలిఫోన్ భవన్, కాచిగూడ, ఎల్బీనగర్ డిమార్ట్ ఎదురుగా చింతలకుంట పల్లవి గార్డెన్స్ తదితర బస్టాపులలో ఈ సదుపాయం ఉంటుంది. చదవండి: (తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!) -
చాయ్ తాగుతూ గ్లాస్ మింగేశాడా? పొట్టలోకి అది ఎలా వెళ్లింది, డాక్టర్లు ఏం చెప్పారు?
పట్నా: చిన్న పిల్లలు తెలిసి తెలియక నాణేలు, చిన్న చిన్న వస్తువులు మింగుతుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. ఈ మధ్యకాలంలో కొందరు బంగారం, మొబైల్ ఫోన్లను కూడా కడుపులో దాచేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా ఓ వ్యక్తి ఏకంగా గ్లాస్నే మింగేశాడనే వార్త వైరల్గా మారింది. ఈ విచిత్రమైన సంఘటన బిహార్లో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తి ఆసుపత్రిలో చేరగా.. అతన్ని పరిశీలించిన వైద్యులు అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. 55 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పితో ఆదివారం బీహార్లోనిని ముజఫర్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. వెంటనే వైద్యులు ఎక్స్రే తీయగా బాధితుడి కడుపులో గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా పురీషనాళం నుంచి గ్లాస్ను బయటకు తీసేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో ఆపరేషన్ చేసి బయటకు తీశారు. అయితే అది కడుపులోకి ఎలా వెళ్లిందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చదవండి: Singer Parvathi: ఒక్క పాటతో కదిలిన యంత్రాంగం.. వెంటనే ఊరికి బస్సు తీసుకొచ్చింది గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లిందనే విషయంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా తాను చాయ్ తాగేటప్పుడు గ్లాస్ను కూడా మింగినట్లు బాధితుడు చెబుతుండగా.. అది నమ్మశక్యంగా లేదని వైద్యులు కొట్టిపారేశారు. ఆహారనాళంలో గ్లాస్ పట్టదని, మలద్వారం నుంచే వెళ్లి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. బాధితుడు వైశాలి జిల్లాలోని మహువాకు చెందినవాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: 62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు -
రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చెన్నై–కోల్కతా జాతీయ రహదారి. రాజమహేంద్రవరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరు. ప్రపంచ నర్సరీ రంగంలో ప్రత్యేక స్థానం పొందిన ఆ ఊరి పేరు కడియం. అలాంటి పూలవనంలో విరబూసిన ఓ యువకుడు టీకొట్టు బడ్డీలకు బ్రాండింగ్ చేసి మరోసారి ఆ గ్రామ పేరు ప్రఖ్యాతలను దేశం నలుమూలలా విస్తరింపజేస్తున్నాడు. మూడు పదుల వయసులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విదేశాల్లో రూ.లక్షల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి.. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముందడుగు వేశాడు. చదవండి: ఆ ‘వెలుగు’ దేశానికే ఆదర్శం రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు 2017లో రాజమహేంద్రవరంలో హైటెక్ హంగులతో ‘టీ టైమ్’ పేరిట బడ్డీని ప్రారంభించిన తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ (బాలు) దానికి బ్రాండింగ్ చేశారు. అదే పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. తాజాగా వారణాసిలో ప్రారంభించిన ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 1,500 ‘టీ టైమ్’ ఔట్లెట్లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా 25 వేల మందికి బాలు ఉపాధి చూపుతున్నాడు. మొదట్లో రూ.10 వేలతో ప్రారంభించిన ‘టీ టైమ్’ బ్రాండ్ ఐదేళ్లలో రూ.10 కోట్ల టర్నోవర్తో నడుస్తోంది. రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు జాతీయ రహదారి వెంబడి పలుచోట్ల టీ టైమ్ అవుట్లెట్లే కనిపిస్తాయి. ప్రాథమిక విద్య కడియం, కరైకల్, పాండిచ్చేరిలో ఇంటర్, హైదరాబాద్లో బీటెక్ చేసిన బాలు తండ్రి దివంగత వీరభోగవసంతరావు దక్షిణాది రాష్ట్రాల్లో క్లాస్–1 కాంట్రాక్టర్. ఈ క్రమంలో బాలు దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగుతూ పలు భాషలపై పట్టు సాధించారు. చదవండి: కోటిస్తే.. బడికి మీరు చెప్పిన పేరు బ్రాండ్కే మోజు బీటెక్ తరువాత దుబాయ్లో డాలర్లు కురిపించే ఉద్యోగం చేస్తున్నప్పుడు స్నేహితులతో కలిసి కాఫీ షాపునకు వెళ్లారు బాలు. అక్కడ టీ, కాఫీ ఖరీదు రూ.500 కంటే ఎక్కువ ఉండటం చూసి ఆశ్చర్యపోయానని బాలు చెప్పారు. టీ కప్పు లో ఉన్న ఇంగ్రిడియెంట్స్ (పదార్థాలు) విలువ రూ.30 కూడా ఉండవు. టీ విలువ రూ.30 పోను మిగిలిన విలువ అంతా బ్రాండ్కే అనే వాస్తవాన్ని గుర్తించి ‘టీ టైమ్’ను ప్రారంభించారు. టీ టైమ్ వ్యాపారాన్ని చేయాలన్నది వేరెవరో ప్రేరేపించింది కాదంటారాయన. సామాన్యుడికి నాణ్యత కలిగిన టీ అందించాలనే తపన నుంచే ‘టీ టైమ్’ ఆవిష్కరణ జరిగిందని బాలు చెప్పారు. సామాన్యులతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో సంపన్నులతో సమానంగా వారిని చూడాలనుకున్నానని.. దానిని నెరవేర్చుకుంటూ ముందుకెళుతున్నానని బాలు వెల్లడించారు. చదవండి: ప్రపంచాన్ని మెప్పించిన పాతికేళ్ల కుర్రాడు.. కడప బాహుబలి ప్రణాళిక ముఖ్యం.. వచ్చే మూడేళ్లలో కనీసం మరో 10 వేల అవుట్లెట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు బాలు చెప్పారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనేది జీవితాశయమని వెల్లడించారు. ఇప్పటివరకు తాను నిర్దేశించుకున్న లక్ష్యంలో 10% మాత్రమే విజయం సాధించానన్నారు. నేటి వ్యాపార సరళిపై మాట్లాడుతూ.. ఎవరికైనా ఆలోచన వస్తే దానిని కాగితంపై రాసుకుని తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు పరితపించాలని.. పటిష్టమైన వ్యూహం, క్షేత్ర స్థాయిలో అవగాహన, లావాదేవీల్లో గణాంకాలపై పట్టు సాధించడం ద్వారానే ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రణాళిక బలంగా ఉన్నప్పుడు ఫలితాలు వాటంతటవే వస్తాయంటున్నారు బాలు. -
అక్కడ ప్రజలు టీతోపాటు టీ కప్పులను కూడా తినేస్తారట!
పేదవాడు దగ్గర నుంచి ధనవంతుడు వరకు ప్రతి ఒక్కరు కాస్త రిలీఫ్ అయ్యేందకు ఒక కప్పు టీని సిప్ చేయలనుకుంటారు. పైగా కాస్త తలనొప్పిగా ఉన్న లేదా పని ఒత్తిడితో అలిసినట్లు అనిపించినప్పుడు కాస్త టీ తీసుకుంటే గానీ ఒక పట్టాన కుదుటపడలేం అన్నంతగా ఫీలవుతారు చాలామంది. అయితే మధ్యప్రదేశ్లోని షాహ్దోల్ జిల్లా వాసులు మాత్రం టీ తోపాటుగా టీ కప్పులను కూడా తినేస్తారట. పైగా ఇలా చేయడం వల్ల చెత్త సమస్య కూడా ఉండదంటున్నారు. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) అసలు విషయంలోకెళ్తే...షాహ్దోల్ జిల్లా హెడ్క్వార్టర్స్లోని మోడల్ రోడ్డు పక్కన టీ అమ్ముకునే వ్యక్తి ఒక సరికొత్త టీని కనుగొన్నాడు. ఇక్కడ చక్కటి టీతోపాటు కప్పుని కూడా తినేసేలా తయారు చేశాడు. దీంతో అక్కడి ప్రజలు చక్కగా టీని ఆస్వాదిస్తూ కప్పుని కూడా తినేస్తారట. అయితే అతను ఆ కప్పు గాజు లేదా సిరామిక్ లేదా ప్లాస్టిక్తో తయారు చేసింది కాదు. ఆ టీ కప్పుని బిస్కెట్ పొరలతో తయారు చేస్తారు. పైగా ఆ కప్పు టీ ధర కేవలం రూ 20 మాత్రమే. అయితే ఆ షాపు యజమాని తమ షాపులో ఒక కప్పు టీతోపాటు కప్పు కూడా తినేయడమే ప్రత్యేకత అని చెబుతుంటాడు. ఏదిఏమైన ఇది ఒకరకంగా పర్యావరణాన్ని సంరక్షించుకునేలా చెత్త రహితంగా ఉంచడంలో ఉపకరిస్తోంది. (చదవండి: వరల్డ్ స్ట్రాంగెస్ట్ గర్ల్: దెబ్బ పడితే ఖతమే!) -
వెరైటీ 'అవ్వ'.. 30 ఏళ్లుగా చాయ్తోనే
చండూరు: ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం.. రాత్రి భోజనం.. మూడు పూటలా తింటున్నా.. మధ్యలో స్నాక్స్ అని.. ఏవేవో లాగించే రోజులివి. కానీ ఓ వృద్ధురాలు 30 ఏళ్లుగా భోజనం చేయకుండా కేవలం చాయ్ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన కొండూరి సుగుణమ్మ (60)కు కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త మృతి చెందారు. సుగుణమ్మకు 30 ఏళ్ల వయసున్నప్పుడు కడుపులో నొప్పి రావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స జరిగిన కొన్నిరోజుల తర్వాత అన్నం తింటే జీర్ణం కాక వాంతులయ్యాయి. దాంతో ఇక అన్నంపై విరక్తి పెంచుకున్న ఆమె.. కేవలం చాయ్ తాగడం మొదలు పెట్టింది. క్రమేణా అదే అలవాటుగా మార్చుకుంది. ఇప్పటికీ సుగుణమ్మ రోజూ ఒకేసారి చాయ్ చేసుకోవడం.. ప్లాస్క్లో నింపుతుంది. ఆకలేసినప్పుడల్లా చాయ్ తాగుతూ క్షుద్బాధ తీర్చుకుంటుంది. అప్పుడప్పుడు చాయ్లో మరమరాలు వేసుకుంటుంది. సుగుణమ్మ కూతురికి పెళ్లికాగా, కుమారుడు వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నాడు. -
రాయితీలు.. ఇంకా రాలే..
►సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు గోమతి కాటన్ ఇండస్ట్రీస్ ఆరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా రూ.10 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయినా నేటికీ నయాపైసా విడుదల కాలేదు. ►కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన మన్నె జానకి 2017లో ఉపాధి కోసం జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీల రాయితీలకు ఉద్దేశించిన ‘టీ ప్రైడ్’కింద రూ.6.91 లక్షలు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీ ఇవ్వాలని 2018 అక్టోబర్లో కమిటీ సిఫారసు చేసింది. అయినా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. సబ్సిడీ అందకపోవడంతో అప్పులపై వడ్డీ భారం పెరుగుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రేండ్లపల్లి కాంతమ్మ వాహనం కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోగా 2018లో యూనిట్ మంజూరైంది. రుణం కోసం బ్యాంకును ఆశ్రయించగా, పరిశ్రమల శాఖ నుంచి పెట్టుబడి సబ్సిడీ విడుదలైతేనే రుణం మంజూరు చేస్తామని షరతు విధించింది. అటు బ్యాంకు, ఇటు పరిశ్రమల శాఖ తీరుతో తనకు ఉపాధి లేకుండా పోయిందని కాంతమ్మ వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబ డులతో వచ్చే వారికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు అందడం లేదు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా.. పరిశ్రమల యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకుంటున్నా విడుదల కావడం లేదు. గత నవంబర్ వరకు రాష్ట్రంలో 43 వేలకుపైగా యూనిట్లకు రూ.3,389.95 కోట్లు రాయితీలు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటివరకు 72 పర్యాయాలు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపినా ఫలితం శూన్యమే. నవంబర్ 30న జరిగిన 72వ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం 369 యూనిట్లకు సంబంధించి మరో రూ.47.67 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించింది. జనరల్ కేటగిరీలో 2016–17 నుంచి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 2018–19 నుంచి రాయితీలు పెండిం గులో ఉన్నాయి. కరోనాతో కార్యకలాపాలు దెబ్బతినడంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఊరటనిస్తాయ ని పారిశ్రామికవర్గాలు భావించాయి. దీనికితోడు బ్యాంకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం కూడా అమలుకాకపోవడంతో ఇటు రుణాలపై వడ్డీ, అటు ప్రోత్సాహకాలు అందక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఊరటనివ్వని ‘టీ ఐడియా’, ‘టీ ప్రైడ్’ పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ.26.46 లక్షల కోట్ల పెట్టుబడులతో 18వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 21 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలుగట్టారు. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం 2014లో ‘టీ ఐడియా’, ‘టీప్రైడ్’పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. జనరల్ కేటగిరీకి టీ ఐడియా ద్వారా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ‘టీ ప్రైడ్’ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. వీటికింద రాయితీ, స్టాంప్ డ్యూటీ, సేల్స్ టాక్స్, భూమి ధర, విద్యుత్ బిల్లులు, పావలావడ్డీ తదిరాలకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇదిలాఉంటే సీనియారిటీ ప్రకారం బకాయిలు విడుదల కావాల్సి ఉండగా, సిఫారసు లేఖలు తెచ్చిన 24 మెగా కంపెనీలకు గత నవంబర్లో రూ.250 కోట్లు విడుదలైనట్లు సమాచారం. బడ్జెట్లో కేటాయించినా..! రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు రూ.3,389 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను ప్రతిపాదించి, అందులో రూ.2,500 కోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలకే కేటాయించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అంతకుముందు బడ్జెట్లో రాయితీల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే విడుదలైనట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆశలు ఆవిరై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉసూరుమంటున్నాయి. -
తందూరీ టీ.. దీని కథేంటీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా..?
కొత్తపేట/రావులపాలెం(తూర్పుగోదావరి జిల్లా): బెల్లం టీ, అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మిరియాల టీ వంటి వివిధ రకాల టీల గురించి విన్నాం.. తాగుతున్నాం.. భిన్న రుచులను ఆస్వాదిస్తున్నాం. కానీ ఈ తందూరీ చాయ్ (టీ) ఏమిటనుకుంటున్నారా! ఇదో కొత్త రకం చాయ్.. సహజంగా అందరికీ తందూరీ అనే పదం చికెన్ వంటకాల్లో వింటాం. కోడి మాంస ప్రియులకు ఈ పదం గురించి బాగా తెలుస్తుంది. రెస్టారెంట్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి వండి తందూరీగా అందిస్తారు. మరి ఇక్కడ చాయ్లో తందూరీ ఏమిటనే సందేహం కలుగుతుంది కదా... చాయ్ను కూడా నిప్పుల పైనే తయారు చేస్తారు. దీని కథా కమామీషు ఏమిటో తెలుసుకోవాలంటే రావులపాలెం అక్షర సినిమా థియేటర్స్ సమీపాన తందూరి చాయ్ సెంటర్కు వెళ్లాల్సిందే. చదవండి: ఆరేసుకోబోయి పారేసుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్ ఇలా చేస్తున్నారు.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమి మాదిరిగా ఏర్పాటు చేశారు. దీనిలో బొగ్గులు వేసి రోజంతా మండేలా తయారు చేశారు. ఎర్రగా బట్టీల్లో ఇటుకలా కాలుస్తుంటారు. సాధారణ టీ మాదిరిగానే పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి తయారు చేసి దానిని జార్లోకి తీసుకుని కొలిమి వద్దకు తీసుకువస్తారు. కొలిమిలో ఎర్రగా కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఒక ఇత్తడిపాత్రలో ఉంచుతారు. ఎర్రటి మట్టి గ్లాసులోకి ఆ చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టిపాత్ర వేడికి పొగలు చిమ్ముతూ, నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్కు తందూరి రుచి.. వాసన వస్తుంది. ఆ పాత్ర నుంచి మళ్లీ మట్టి గ్లాసులో పోసి విక్రయిస్తున్నారు. దీనిని తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. మంచి టేస్ట్ రిలాక్స్గా.. యాంత్రిక జీవనంలో పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కోసం చాలా మంది చాయ్ తాగుతుంటారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడు చురుకుదనం, ఉత్సాహాన్ని పొందేందుకు చాలా మందికి చాయ్ని ఆస్వాదించడం అలవాటు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల చాయ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే, కొన్ని రుచి కోసమే తయారు చేస్తున్నారు. ఫిల్టర్ టీ, కాంటినెంటల్ టీ, స్ట్రాంట్ టీ, ధమ్ టీ పేర్లతో రకరకాలుగా అందిస్తున్నారు. రావులపాలెంలో యువకులు కొత్తగా ఆలోచించి ఉత్తరాది తందూరి చాయ్ను ఇక్కడ తయారుచేస్తూ స్థానికులను, టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. ఇదేవిధంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొందరు తందూరీ చాయ్ తయారు చేస్తూ టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. -
దుప్పలపూడి కేంద్రంగా కల్తీ టీ పొడి దందా
-
గ్లోబల్ ట్రేడ్లో ఇలా రుణం తీర్చడం ఇదే ఫస్ట్ టైం!
వస్తు మార్పిడి.. తెలియని విషయమేం కాదు. పాతరోజుల్లో బాగా ఆచరణలో ఉండేది. కరెన్సీ వాడకంలోకి వచ్చాక.. క్రమంగా తగ్గిపోయింది. అయితే దేశాల మధ్య రుణ ఒప్పందాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి కదా. ఈ క్రమంలో గ్లోబల్ ట్రేడింగ్లో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక, ఇరాన్ నుంచి కొన్ని ఏళ్లుగా ఆయిల్ను దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు నాలుగేళ్లుగా 251 మిలియన్ డాలర్ల విలువైన రుణం పేరుకుపోయింది. దీనిని తీర్చేందుకు సంచలన ప్రకటన చేసింది ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం. రుణాన్ని ధన రూపేణ కాకుండా.. వస్తుమార్పిడి రూపంలో తీరుస్తామని, ఈమేర విలువ చేసే సిలోన్ టీ ఉత్పత్తులను ఇరాన్కు అందిస్తామని పేర్కొంది. గత యాభై ఏళ్లలో విదేశీ వాణిజ్యంలో ఈ తరహా ప్రకటన చేసిన దేశం శ్రీలంకే కావడం విశేషం!. ఇందుకు సంబంధించి శ్రీలంక మంత్రి రమేశ్ పాథిరానా అధికారికంగా ఓ ప్రకటన చేశారు. జనవరి నుంచి ప్రతీ నెలా 5 మిలియన్ డాలర్ల విలువ చేసే తేయాకు ఉత్పత్తులను ఇరాన్కు అందిచనున్నట్లు తెలిపారు. ఆయిల్ ఉత్పత్తుల విషయంలో ఇరాన్కి పడ్డ రుణం నాలుగేళ్లుగా పేరుకుపోతోంది. ఈ తరుణంలోనే లంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదా? ఇదిలా ఉంటే యూఎన్, యూఎస్ ఆంక్షల పరిధిలో ‘టీ’ కూడా ఉంది. అయితే మానవతా కోణం దృష్ట్యా(ఎమర్జెన్సీ సందర్భాల్లో) టీ అనేది ఫుడ్ జాబితాలో ఉందని గుర్తు చేస్తోంది లంక ప్రభుత్వం. అంతేకాదు ఇరాన్ బ్యాంక్ల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు లంక ప్రకటించుకుంది. మరోవైపు శ్రీలంక గత కొంతకాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ వస్తోంది. విదేశీ మారకద్రవ్య సంక్షోభం, కరోనా ప్రభావంతో టూరిజం నిలిచిపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక ప్రతీ ఏడాది 340 మిలియన్ కేజీల టీని ఉత్పత్తి చేస్తోంది. కిందటి ఏడాది 265 మిలియన్ కేజీల టీని ఎగుమతి చేయగా.. 1.24 బిలియన్ డాలర్లు సంపాదించింది. దేశం మొత్తం మీద ఐదు శాతం జనాభా తేయాకు ఆధారిత పనులతో జీవనం కొనసాగిస్తోంది. చదవండి: బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్! -
టీ గారూ.. తమరు సూపరు!
చలి వేయి కత్తులతో వస్తుంది. ఒక్క కప్పు టీ అడ్డు నిలుస్తుంది. చలి మంచు వల విసురుతుంది. తేయాకు గుడగుడ ఉడికి దానిని తెంపుతుంది. చలి పళ్లు టకటకలాడించాలని చూస్తుంది. టీ గ్లాసులు టింగుటంగుమని మోగి న్యూట్రల్ గేర్ వేస్తాయి. జనులు చలికాలంలో అవస్థ పడతారని ప్రకృతి టీ కాచింది. టీ అంటే ఉత్త తేయాకు, పాలు, చక్కెర కాదు. దానితో కలగలిసిన మనుషులు కూడా. ‘టీ పోసిన మనుషులను’ తలుచుకునే కాలం ఇది. కిరోసిన్ స్టవ్ నీలిమంట చాలా అందంగా ఉంటుందా మలి చీకటిలో. ‘బజ్జ్’మని దాని సౌండ్. మీద పాల దబర. పూర్తిగా మూసి ఉన్న మూతను కొంచెం నెడితే మెలి తిరుగుతూ పైకి లేస్తున్న పొగలు కనిపిస్తాయి ఆ చలి చీకటిలో. జంటగా ఉన్న స్టౌ మీద సత్తు జగ్గులో తేయాకు నీళ్లు కుతకుతలాడుతుంటాయి చలి మీద కాలు దువ్వుతూ. తెల్లవారుజాము ఐదు గంటలంటే చలి తన ఆఖరు దళాన్ని ఆయుధాలతో మొహరించి ఉంటుంది. ఆరున్నర ఏడు దాకా ఆ దళాల కవాతు సాగుతుంది. మఫ్లర్లు? వాటికి లోకువ. ఉన్ని టోపీలను? లెక్క చేయవు. స్వెటర్లను అగోచరంగా చీల్చి పారేస్తాయి. అర చేతులను నిస్సహాయంగా రుద్దుకోక తప్పదు. అప్పుడొక హీరో కావాలి. ‘రక్షించండి’ అని పొలికేక వేయకముందే నిలువు గీతల గాజు గ్లాసులో పొగలు గక్కుతూ ప్రత్యక్షం కావాలి. ఎస్. స్ట్రాంగ్ టీ. చలి విలన్ భరతం పట్టే హీరో. ముఖానికి దగ్గరగా పెట్టుకుంటే వెచ్చదనం. గొంతులోకి దిగితే ఇంధనం. చలికాలంలో సంజీవని. జేగురు రంగు దివ్య రక్షణ. టీ. చలిపులి పై చర్నాకోల. ఈ టీ గారు లేకుంటే ఈ కాలం ఎలా గడవను? ఐకమత్యం టీ టీలు రెండు రకాలు. ‘విడి టీలు’. ‘ఐకమత్యం టీలు’. విడి టీ అంటే టీపొడి విడిగా, పాలు విడిగా, చక్కెర విడిగా... ఇలా విడివిడిగా ఉంటూ ఆఖరు నిమిషంలో కలుస్తాయి. ఐకమత్యం టీ అంటే హంస ముక్కు ఉన్న సత్తు కెటిల్లో టీ పొడి, పాలు, చక్కెర కలగలిసి ఒకేసారి ఉడుకుతాయి. విడి టీలో చాయిస్ ఉంటుంది. లైట్, స్ట్రాంగ్, మీడియం... కాని హంసముక్కు ఐకమత్యం టీలో లోపల ఏది తయారైతే అది. ఎలా తయారైతే అది. కెటిల్ హ్యాండిల్కు దళసరిగా కట్టిన గుడ్డ టీ మాస్టర్ పట్టగా పట్టగా నలుపెక్కి చేయి కాలనంతగా రాటు దేలి ఉంటుంది. లోపల టీ బాగా ఉడికిన మరు నిమిషం మాస్టర్ వరుసగా గ్లాసులు పేర్చి హ్యాండిల్ పట్టుకుని హంస ముక్కును వొంచుతాడు. దుముకుతూ టీ. ధారగా టీ. రుచి రంగులో టీ. అందరికీ ఒకేలాంటి టీ. అందరికీ ఒకే లాంటి శుభోదయమూ. టీ కోసమే నిదుర లేవాలి చలికాలంలో నిదుర లేవాలంటే తాయిలం ఏమిటి? టీయే. చలికాలంలో పనులు మొదలవ్వాలంటే ఒంటికి ఏం పడాలి? టీయే. ఇంట్లో పిల్లలు నిదుర పోతుంటారు. పెద్దవారు ముసుగుతన్ని ఉంటారు. ఇంటామె, ఇంటాయన మార్నింగ్ వాక్కు బయలుదేరే ముందు ఆ వెలుతురు రాని చీకటిలో కిచెన్లో లైటు వేసి చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటూ టీ కాచుకుంటూ ఫిల్టర్తో కప్పుల్లో ఒంచుకుంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఉంటే... తక్కిన కాలాల్లో ఏమో కాని చలికాలంలో ఆ దృశ్యం సుందరంగా ఉంటుంది. స్త్రీకి పురుషుడు... పురుషుడికి స్త్రీ తోడుగా ఉండాల్సింది ఇందుకే అనిపిస్తుంది. మీ చేతుల్లో టీ కప్పులు పట్టుకోండి... మీరు సంపూర్ణం అవుతారు అంటుంది టీ. అల్లం బంధువు... యాలకులు స్నేహితులు పాలకూ టీ పొడికి జోడి కుదిరింది. బంధువులు లేకపోతే ఎట్లా? నన్ను రెండు చిన్ని తుంటలు చేసి మీతో కలుపుకోండి.. బాగుంటాను అని అల్లం వచ్చిందట. నా నెత్తిన నాలుగు మొత్తి మీ తోడు చేసుకోండి ఆహ్లాదం పెంచుతాను అని యాలకులు అన్నాయట. అదిగో ఆనాటి నుంచి అల్లం బంధువు.. యాలకులు స్నేహితులు అయ్యాయి. చలికాలంలో మామూలు టీ. గొప్ప. అల్లం టీ. ఓకే. యాలకుల టీ. సరే. కాని ఈ కాలంలో తెల్లవారు జామున లెమన్ టీ తాగాలనుకునేవారికి టీ శాస్త్రంలో మన్నన లేదు. లెమన్ టీ మరే కాలంలో అయినా సరే. చలికాలంలో మాత్రం కాదు. అరె.. పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసే సన్నివేశం ఆ ఒణికే చలిలో ఎంత బాగుంటుంది. టీ మనుషులు టీతో పాటు మనుషులు గుర్తుంటాయి. సందర్భాలు కూడా. చలిలో కారు ప్రయాణం. తెల్లవారుజామున రోడ్డెక్కితే ఎక్కడో ఒకచోట వేడి వేడి టీ దుకాణం. ‘సార్ టీ’ అంటూ అద్భుతంగా టీ చేసి ఇచ్చిన ఆ మనిషి గుర్తుంటాడు. వీధి చివర రోజూ టీ అమ్మే మాస్టర్. మనం ఇంత దూరం ఉండగానే చక్కెర తక్కువ అడగకనే అలవాటును గుర్తు పెట్టుకుని రెడీ చేస్తాడు. గుర్తుంటాడు. బంధువులు ఎందరో ఉంటారు. కాని ఒక్కరే టీ భలే పెడతారు. గుర్తుంటారు. కేరళ టూరుకు వెళ్లి తేయాకు కానుకగా తెస్తారు ఒకరు. గుర్తుంటారు. అస్సాం టీ పౌడర్ వాడుతున్నాం అంటారు. గుర్తుంటారు. లంసా టీ రుచే వేరే. అది ఇచ్చిన ఇల్లు గుర్తుంటుంంది. పాలు విరిగాయి. అయినా మేనేజ్ చేశా అని ఒక అక్క అంటుంది. గుర్తుంటుంది. చక్కెర లేదు బెల్లం ముక్క వేశా అని పిన్ని అంటుంది. గుర్తుంటుంది. కొంచెం టీ పౌడర్ అంటూ తప్పక అప్పు చేసే ఇరుగామె ఉంటుంది. గుర్తుంటుంది. భుజాల మీద చేతులు వేసుకుని పంచెలు పైకి కట్టి నవ్వుకుంటూ వెళ్లి టీ తాగిన సందర్భాలు?... ఆ స్నేహితులందరికీ గుర్తుంటాయి. వేసవిలో మల్లెల్ని శ్లాఘించాలి. నిజమే. చలికాలంలో టీ కాకుండా ఎవరికి కిరీటం పెడతాం? చెప్పండి. -
Tea Powder: అరే ఏంట్రా ఇది.. టీ పౌడర్ని కూడా వదలరా..?
నిర్మా పౌడర్.. జీడి తొక్కల పొట్టు.. సుద్ద మట్టి.. రంపపు పొట్టు.. కాదేదీ టీ పొడి తయారీకి అనర్హం అన్నట్టుగా ఉంది టీ పొడి తయారీ కేంద్రాల్లో పరిస్థితి. తేయాకుతో తయారు చేయాల్సిన టీ పొడిని.. ప్రజల ఆరోగ్యానికి తూట్లు ‘పొడి’చేలా తయారు చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. లూజ్ టీ పొడి పేరుతో గలీజు వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశంతో టీస్టాల్ నిర్వాహకులు, పేదలు వీటిని వినియోగిస్తూ తమ గొంతుల్లో గరళాన్ని నింపుకొంటున్నారు. సాక్షి, మండపేట: ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్.., ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్.., ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్.. అంటూ ఓ సినీ కవి ఛాయ్(టీ) గొప్పదనాన్ని ఎంతో బాగా వివరించారు. నిజమే.. ఎందుకంటే చాలా మందికి వేడివేడి టీ తాగనిదే పొద్దు గడవదు.. నిత్యజీవితంలో భాగమైన ఈ టీ అమ్మకాల ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. మరోవైపు టీకి ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని లూజ్ టీపొడి మాటున కల్తీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు కొందరు. కల్తీ టీ పొడి తయారీకి వినియోగిస్తున్న సుద్దమట్టి జిల్లాలో లైసెన్సుడ్ టీపొడి తయారీ కేంద్రాలు రాజమహేంద్రవరం, మండపేట తదితర చోట్ల కేవలం 11 మాత్రమే ఉన్నాయి. వీరు కేరళ, అస్సాం, కోల్కతా నుంచి లూజ్ టీ పొడి తీసుకువచ్చి వాటిని 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు తదితర కేటగిరీలుగా ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తుంటారు. అయితే ఏ విధమైన అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అనధికార కేంద్రాలు కూడా జిల్లాలోని రాజమహేంద్రవరం, మండపేట, అనపర్తి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నకిలీ ముఠాలు స్థానిక అధికార యంత్రాంగానికి ముడుపులు ముట్టచెప్పుతుండడంతో వారు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి. చదవండి: (మార్కాపురం కోర్టుకు హీరో సుమంత్, సుప్రియ) కల్తీకి అడ్డదారులెన్నో.. రాజమహేంద్రవరంలో రూ.40 నుంచి రూ.50లకు లభ్యమయ్యే నాసిరకం లూజ్ టీపొడి తీసుకువచ్చి వాటిలో రంగు, రుచి, వాసన కోసం డిటర్జెంట్ పౌడర్, జీడిపిక్కల పొట్టు, చింతపిక్కల పొడి, రంపం పొట్టు, సుద్ద మట్టి, కెమికల్స్ను కలుపుతూ కల్తీ టీ పొడి తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ టీ పొడి కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉండగా ఈ లూజ్ టీ పొడి కేవలం రూ.150కు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో టీ స్టాళ్లు, పేదవర్గాల వారు దీనినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పట్టణాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై కల్తీ టీపొడి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కల్తీ టీ పొడి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు జిల్లా నుంచి వ్యాపారులు లూజ్ టీ పొడి తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీని నాణ్యతపై అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా ఉంది. ఇటీవల బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేటలో ఫుడ్ సేఫ్టీ, పోలీసు అధికారులు నిర్వహించిన దాడుల్లో విస్మయం కలిగించే విషయాలు వెలుగుచూశాయి. ప్రజారోగ్యానికి చేటు చేసే కెమికల్స్, డిటర్జెంట్స్తో నాలుగేళ్లుగా కల్తీ టీపొడి తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు. పలు లైసెన్సుడ్ కేంద్రాల్లోనూ టీ పొడిలో రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నారు. చదవండి: (బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనే ఎక్కువ!) ఆరోగ్యానికి చేటు ప్రమాదకర కెమికల్స్ను కలపడం వలన కల్తీ టీపొడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్సర్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందంటున్నారు. కల్తీ టీ పొడికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కల్తీని ఇలా గుర్తించవచ్చు టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. కేసుల నమోదు ఆహార పదార్థాల్లో కల్తీలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. కల్తీ టీ పొడి తయారీపై ఏడాది కాలంలో జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేశాం. ఎక్కడైనా ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ను ల్యాబ్కు పంపుతున్నాం. కల్తీ ఉన్నట్టు నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – బి. శ్రీనివాస్, సహాయ నియంత్రణ అధికారి, కాకినాడ కల్తీని ఇలా గుర్తించవచ్చు టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. -
Tea: చాయ్ గరీబుకు విందురా భాయ్
జీవితంలో చాయ్ (టీ) ఓ భాగమైపోయింది. నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్ కడుపులో పడితే గాని ఏ పని చేయలేం. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా ఓ కప్పు చాయ్ కావాల్సిందే. దోస్తులు కలిసినా.. అతిథి వచ్చినా తేనీటి విందు తప్పనిసరి. భారత ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమానికి ‘చాయ్ పే చర్చ’ అనే పేరు పేట్టారంటే టీ ఎంతలా మనలో స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. జనంలో అత్యంత ఆదరణ ఉండడంతో టీని జాతీయ పానీయంగా గుర్తించారు. అయితే ఇక్కడ చాయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు ‘ఇంటర్నేషనల్ టీ డే’ కాబట్టి. సాక్షి, హైదరాబాద్: నాలుగో శతాబ్దంలో ఓ చైనా వైద్యుడికి కొంత సుస్తిగా ఉండగా, వైద్య పరీక్షల్లో భాగంగా కొన్ని ఆకులను తీసుకొని ఎండబెట్టాడు. వేడి నీటిలో వాటిని నానబెట్టగా వచ్చిన డికాషన్ను తాగాడు. దీంతో అతడు ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. ► 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నల్లమందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేది. 1823లో బ్రిటన్కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టిట్టారు. అప్పటి నుంచి భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది. ► 1860 నాటికి భారతదేశంలోని టీ ప్లాంటేషన్ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ టీ ఉత్పత్తి సుమారు 10లక్షల కేజీలు ఉండేది. నేడు పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ టీని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందాయి. చదవండి: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి..