దేశ రాజధాని ఢిల్లీ వరుస అగ్ని ప్రమాదాలతో హడలెత్తింది.
35 అగ్ని నిరోధక వాహనాలు మంటలను ఆపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మ్యూజియంను సందర్శించిన కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మ్యూజియం దేశపు ఆస్తి అని మంటలకు ఇంకా కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ప్రధాన మ్యూజియంలలో ఉన్న భద్రతాపరమైన చర్యలపై నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. 1978లో స్థాపించిన ఈ మ్యూజియంను నిత్యం అనేక మంది విద్యార్థులు సందర్శిస్తుటారు. ప్రమాదం తెల్లవారు జామున సంభవించడంతో పెను ప్రమాదమే తప్పింది.