ఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 58 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యకర్మానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. దివంగత ధీరూభాయ్ అంబానీకి పద్మవిభూషన్ అవార్డును ప్రదానం చేశారు. ఆయన భార్య కోకిలా బెన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు.. 5 మందికి పద్మవిభూషన్, 8 మందికి పద్మభూషన్, 45 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం
Published Mon, Mar 28 2016 12:41 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement
Advertisement