Padma awards
-
‘బండి సంజయ్.. నువ్వు కార్పొరేటర్ కాదు కేంద్రమంత్రి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుడు బండి సంజయ్ కార్పొరేటర్ కాదు.. కేంద్రమంత్రి అని గుర్తు పెట్టుకోవాలని చురకలంటించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇదే సమయంలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కేంద్రమంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడటానికి ఆయనేం కార్పొరేటర్ కాదు. పద్మశ్రీ అవార్డుల విషయం పార్లమెంట్ జీరో అవర్లో లేవనెత్తుతాను. అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ నేతలను ఎంపీలుగా గెలిపించారు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు?. జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలన్నారు. కేంద్రం బీహార్, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు. అందుకే బడ్జెట్లో మొండి చేయి చూపిస్తున్నారు. కిషన్ రెడ్డి దావోస్ పర్యటనను, కంపెనీలపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లారో కేటీఆర్ను అడిగితే వ్యంగ్యంగా చెప్పాడు. ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని రాష్ట్రానికి పెద్దన్నలాగా ఉండమన్నారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లైఫ్ లైన్ ఆర్ఆర్ఆర్కు 45వేల కోట్లు అవసరం. ఆర్ఆర్ఆర్, మెట్రోతో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు. నల్లగొండలో రైతులు ఎవ్వరు కేటీఆర్ ధర్నాను పట్టించుకోలేదు. మూసీ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ఎంపీలందరూ పార్లమెంట్లో కొట్లాడాలి. మహారాష్ట్ర కంటే మన రాష్ట్రం ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పన్నులు కడుతోంది. పదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది. హరీష్ రావు ముందు కేసీఆర్ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?'
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం (జనవరి 25న) పద్మ అవార్డులు (Padma Awards 2025) ప్రకటించింది. వీటిలో ఏడు పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మ శ్రీ పురస్కారాలున్నాయి. వీటిని అందుకున్నవారిలో ఏడుగురు తెలుగువారు ఉన్నారు. వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అందుకున్నారు. కేఎల్ కృష్ణ (విద్యా సాహిత్యం) , మాడుగుల నాగఫణి శర్మ (కళా రంగం), మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మిరియాల అప్పారావు (కళారంగం), వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించాయి. కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్కు ఎంపికయ్యారు.తెలుగువారికి ఏడు పద్మ పురస్కారాలుఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli సోషల్ మీడియా వేదికగా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 'ఈసారి తెలుగువారికి ఏడు పద్మ అవార్డులు రావడం సంతోషకరం. పద్మ భూషణ్కు ఎంపికైన నందమూరి బాలకృష్ణగారికి అభినందనలు. పద్మ పురస్కారం గెల్చుకున్న తెలుగువారితో పాటు, ఇతర భారతీయులకు శుభాకాంక్షలు అని రాసుకొచ్చాడు. మరో ట్వీట్లో బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్, తమిళ స్టార్ అజిత్ను ప్రశంసించాడు.బేధాలు దేనికి?ఇది కొంతమందికి అస్సలు మింగుడుపడలేదు. తెలుగువారు అని ప్రత్యేకంగా వర్ణించడం దేనికని విమర్శిస్తున్నారు. 'తెలుగువారు దేశంలో భాగం కాదా? ఎందుకని ప్రాంతాల మధ్య అడ్డుగోడ కడుతున్నారు?', 'తెలుగుప్రజలు భారతీయులు కాదా?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాల గురించి చర్చే లేదు. కానీ మీలాంటివాళ్లు మాత్రం ఈ అంశాన్ని బాగా వాడుకుంటారు. నార్త్ జనాలు మీ సినిమాలకు ఎందుకు సపోర్ట్ చేస్తారో నాకిప్పటికీ అర్థం కాదు. మనమంతా భారతీయులం అని చెప్పే ధైర్యం లేని వాళ్లకు మద్దతు దేనికి?' అని హిందీ ఆడియన్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.పుట్టిన గడ్డ తర్వాతే ఏదైనా..ఈ ట్రోలింగ్ చూసిన తెలుగు సినీ ప్రియులు, అభిమానులు వారికి ధీటుగా రిప్లై ఇస్తున్నారు. పుట్టిన గడ్డ ఎవరికైనా తల్లితో సమానం. మొదటగా ప్రాంతం.., తర్వాతే దేశం వస్తుంది. అయినా రాజమౌళి తన ట్వీట్లో నార్త్, సౌత్ అని ఎక్కడా తేడా చూపించలేదు. తన మాతృభాషకు చెందిన వారికి అవార్డులు వస్తే సంతోషపడ్డాడంతే.. మీ హాఫ్ నాలెడ్జ్తో ఆయన్ను విమర్శించకండి అని బుద్ధి చెప్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.7 Padma Awards for Telugu people this time… 👏🏻👏🏻👏🏻👏🏻Heartiest congratulations to Nandamuri Balakrishna garu on being honored with the Padma Bhushan! Your journey in Indian cinema is truly commendable… Also, congratulations to all the other distinguished Telugu & other…— rajamouli ss (@ssrajamouli) January 25, 2025 చదవండి: క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు -
పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: పద్మ పురస్కారాలపై వివాదం నెలకొన్న వేళ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకే మాత్రమే ఇస్తుందని అన్నారు. ఈ క్రమంలో గద్దర్(Gaddar)కు అవార్డు రాకపోవడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) ఆరోపణలకు దిగారు. ఈ ఆరోపణలకు బండి సంజయ్ కౌంటర్గా స్పందించారు. ‘‘పద్మ అవార్డులు(Padma Awards Row) స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్కు ఎలా ఇస్తాం? ఆయన భావజాలం ఏంటి?. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం?. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం?. బరాబర్ ఇవ్వం’’.. అని అన్నారాయన. పద్మ అవార్డుల జాబితాలో అర్హులకే అవార్డు లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుంది. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు అని బండి సంజయ్ పేర్కొన్నారు. మాకు భేషజాలు లేవుతెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana) అభివృద్ధికి సహకరిస్తుంది. తెలంగాణకు కేంద్రం గత పదకొండేళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేది లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.. ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. పేదలకు ఇడ్లు ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.. కేవలం పేరు కోసమే పాకులాడుతోంది. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే పథకాలను అమలు చేయడం ఎంటి ?. మండలంలో మిగతా గ్రామాల పరిస్థితి ఎంటి ?. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు.. ఉన్న పైసలు ఢిల్లీ లో కప్పం కట్టడానికే సరిపోతోంది. తెలంగాణలో 14 శాతం కమీషన్ల ప్రభుత్వం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మాకు బేషజాలు లేవు.. కి కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు వస్తున్నాయా ?. పేరు కోసం పాకులాడి గతంలో కేసీఆర్ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు. 2 లక్షల 40 వేల ఇళ్లను కేంద్రం తెలంగాణకు కేటాయిస్తే.. పేరు కోసం లబ్ధిదారులకు ఇవ్వలేదు. తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని బండి సంజయ్ అన్నారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్బండి సంజయ్ వాఖ్యలు ఈ మధ్య విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇంధిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. బండి వ్యాఖ్యలు గద్దర్ను అవమానించేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా?. నక్సలైట్ భావాజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. నక్సలైట్లకు ఎంపీ ,ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వొచ్చు కాని అవార్డులకు పనికి రారా?. లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. ఈటల ఆ పదవికి అనర్హుడా?. దీనికి బండి సంజయ్ చెప్పాలి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డు ల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. -
పద్మ అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి : పద్మ అవార్డు గ్రహీతలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి.. భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025 పద్మా అవార్డుల ప్రకటన గణతంత్ర దినోత్సవం (Republic Day ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవరి25) ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.వారిలో ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ నుంచి కళల విభాగంలో పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతోపాటు కవి, పండితుడు, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కె.ఎల్. కృష్ణ, మిరియాల అప్పారావు (మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాల్లో 23 మంది గ్రహీతలు మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్కు ఐదు అవార్డులు లభించాయి. -
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాపై సీఎం రేవంత్ అసంతృప్తి
-
Padma awards 2025: పారిశ్రామిక పద్మాలు
ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma awards 2025) ప్రకటించింది. వీరిలో వాణిజ్యం, పరిశ్రమల విభాగం నుంచి 10 మంది ఉన్నారు. జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీని (మరణానంతరం) పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. తమిళనాడుకు చెందిన టెక్స్టైల్ పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి చెట్టి, జైడస్ లైఫ్సైన్సెస్ చైర్మన్ పంకజ్ పటేల్ పద్మ భూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యతోపాటు ఓంకార్ సింగ్ పాహ్వా (అవాన్ సైకిల్స్), పవన్ గోయెంకా (మహీంద్రా), ప్రశాంత్ ప్రకాశ్ (యాక్సెల్ పార్ట్ న ర్స్), ఆర్జీ చంద్రమోగన్ (హట్సన్ ఆగ్రో ప్రొడెక్ట్స్), సజ్జన్ భజంకా (సెంచురీ ప్లైబోర్డ్స్), సాలీ హోల్క ర్కు (రేష్వా సొసైటీ) పద్మశ్రీ అవార్డు వరించింది.ఒసాము సుజుకీ1930 జనవరి 30న జపాన్లోని గేరోలో జన్మించారు. సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో మారుతీ సుజుకీ ఇండియాగా కంపెనీ అవతరించింది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి విదేశీ కంపెనీ కూడా ఇదే. భారత ప్రభుత్వం ఒసాము సేవలు గుర్తించి 2007లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2024 డిసెంబర్ 25న మరణించారు.నల్లి కుప్పుస్వామి చెట్టితమిళనాడుకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త. కాంచీపురంలో 1940 నవంబర్ 9న జన్మించారు. రామకృష్ణ మిషన్ స్కూల్ విద్యాభ్యాసం చేశారు. వాషింగ్టన్ వర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా అందుకున్నారు. వారసత్వ వ్యాపారమైన నల్లీ సిల్క్ పగ్గాలను 1958లో చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 2000లో కలైమమణి అవార్డు, భారత ప్రభుత్వం నుంచి 2003లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పంకజ్ పటేల్1953లో జన్మించారు. తండ్రి స్థాపించిన క్యాడిలా హెల్త్కేర్లో (ప్రస్తుతం జైడస్ లైఫ్సైన్సెస్) 1976లో చేరారు. క్యాడిలా ఫ్యాక్టరీకి ఎనమిదేళ్ల వయసు నుంచే తండ్రితో కలిసి వెళ్లే వారు. కంపెనీ తయారీ షుగర్ఫ్రీ, ఎవర్యూత్ బ్రాండ్లు ప్రాచుర్యం పొందాయి. 70కిపైగా దేశా లకు కంపెనీ విస్తరించింది. భారత్లో అయిదవ అతిపెద్ద ఫార్మా సంస్థగా ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. 2024 అక్టోబర్లో ఫోర్బ్స్‘భారత 100 మంది సంపన్నుల’ జాబితాలో 10.2 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో 24 ర్యాంకులో నిలిచారు.అరుంధతీ భట్టాచార్య సేల్స్ఫోర్స్ ఇండియా చైర్పర్సన్, సీఈవోగా ఉన్నా రు. 1977లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరారు. 2013లో ఎస్బీఐ చైర్పర్సన్గా పదవీ బాధ్య తలు చేపట్టారు. 200 ఏళ్ల ఎస్బీఐ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా వినుతికెక్కారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు ప్రసూతి లేదా పెద్దల సంరక్షణ కోసం రెండేళ్ల విశ్రాంతి సెలవు విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక రంగంలో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆమె సొంతం. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల’ జాబితాలో చోటు సంపాదించారు. -
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్లో మెకానిక్ అప్రెంటిస్గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్గా తన కెరీర్ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్కి శేఖర్ కపూర్ని ఓ బ్రాండ్గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
డా. నాగేశ్వర్రెడ్డికి పద్మ విభూషణ్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ నుంచి కళల విభాగంలో పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతోపాటు కవి, పండితుడు, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కె.ఎల్. కృష్ణ, మిరియాల అప్పారావు (మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికిగాను శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాల్లో 23 మంది గ్రహీతలు మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్కు ఐదు అవార్డులు లభించాయి.జాబితాలో మట్టిలో మాణిక్యాలు దేశ సామాజిక, సాంస్కృతిక పురోగతికి తమ సేవల ద్వారా తోడ్పడుతున్నప్పటికీ పెద్దగా గుర్తింపునకు నోచుకోకుండా మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన 30 మందిని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించింది. వారిలో గోవా స్వాతంత్య్ర పోరాట యోధుడైన వందేళ్ల లిబియో లోబో సర్దేశాయ్, పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళా డోలు కళాకారిణి గోకుల్ చంద్ర దే (57) తదితరులు ఉన్నారు. దేశం గర్విస్తోంది: మోదీ పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాల్లో అసమాన విజయాలు సాధించిన వ్యక్తులను గౌరవించేందుకు దేశం గర్విస్తోందన్నారు. ఆయా రంగాలకు వారు అందిస్తున్న సేవలు, పనిపట్ల చూపుతున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు.తెలంగాణకు అవమానం: సీఎంసాక్షి, హైదరాబాద్: పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్రం పరిగణనలోకి తీసుకోకవడం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి చర్చించారు. అదే సమయంలో తెలంగాణ, ఏపీ నుంచి ఎంపికైన ప్రముఖలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాల్లో అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ల్లో డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (68) ఒకరు. కర్నూల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చదివిన ఆయన 18 మార్చి 1956న విశాఖపట్నంలో జన్మించారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేరిట ఆయన నెలకొల్పిన వైద్య సంస్థ దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సంస్థగా పేరు గడించింది. గ్యాస్ట్రో ఎంటరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రఖ్యాత వైద్య సంస్థ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో, ప్రొఫెసర్గా గుంటూరు మెడికల్ కాలేజీలో విద్యార్థులకు వైద్యవిజ్ఞానాన్ని బోధించారు. తన కెరీర్లో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. వినమ్రంగా స్వీకరిస్తున్నా: నాగేశ్వరరెడ్డి ‘పద్మవిభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. ఇది నాకొక్కడికే దక్కినది కాదు... ప్రతిరోజూ నాలో నూతన స్ఫూర్తిని నింపే మా పేషెంట్స్, ఏఐజీ టీమ్, మా వైద్య సిబ్బందికి దక్కిన గౌరవం. తమ వ్యథాభరితమైన, అత్యంత క్లిష్టమైన క్షణాల్లో సైతం మమ్మల్ని పూర్తిగా విశ్వసించి, మాలో పట్టుదలను, సేవానిరతిని రగిలించే మా పేషెంట్స్కు అత్యుత్తమ వైద్యసేవలందించడంలో మేమెప్పుడూ ముందుంటాం. భారతీయుడిగా, ఈ తెలుగుగడ్డ మీద పుట్టిన వాడిగా ప్రజలందరికీ ఆరోగ్య సేవలందించడానికి పునరంకితమవుతున్నాను. నా దేశాన్ని ఆరోగ్యకరంగా, మరింతగా బలోపేతం చేయడానికి అనునిత్యం శ్రమిస్తాను’ అని నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సహస్రావధానానికి సిసలైన బిరుదు మాడుగుల నాగఫణి శర్మ.. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, ద్వి సహస్రావధాని. 1959, జూన్ 8న అనంతపురం జిల్లా, తాడిపత్రి తాలూకా, పుట్లూరు మండలంలోని కడవకొల్లు గ్రామంలో జన్మించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఢిల్లీ ర్రాష్టీయ సంస్కృత సంస్థాన్ నుంచి ‘శిక్షాశాస్త్రి’ పట్టా పొందారు. తిరుపతి ర్రాష్టీయ విద్యా పీఠం నుంచి పీహెచ్డీ పట్టా పొందిన మాడుగుల.. 1985- 90 మధ్య కాలంలో కడప రామకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృతోపన్యాసకుడిగా, 1990ృ92 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు అదనపు కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్ బర్కత్పురలో చాలాకాలంగా సరస్వతీ పీఠాన్ని నిర్వహిస్తున్నారు. అవధాన విద్యలో ఆరితేరిన నాగఫణి శర్మ మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి శంకర్దయాళ్ శర్మ వంటి వారి సమక్షంలో ఆశువుగా... అలవోకగా అవధానాలు నిర్వహించి వారి ప్రశంసలు సైతం పొందారు. తన విద్యతో నాగఫణిశర్మ అవధాన సహస్రఫణి, బృహత్ ద్వి సహస్రావధాని, శతావధాని సమ్రాట్, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ వంటి అనేక బిరుదులు పొందారు. ఇటీవలే ఆయన విశ్వభారతం అనే సంస్కృత మహాకావ్యాన్ని రచించారు. ప్రొఫెసర్.. రచయిత సయ్యద్ ఐనుల్ హసన్ రాయదుర్గం: ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్.. విద్యాపరంగా ప్రొఫెసర్, సాహిత్యపరంగా రచయిత. ఆయన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో 15 ఫిబ్రవరి 1957లో జన్మించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని పర్షియన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్ ప్రొఫెసర్గా పనిచేశారు. కాటన్ కాలేజ్ స్టేట్ యూనివర్సిటీలోనూ విధులను నిర్వహించారు. ఆయన 23 జూలై 2021లో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) వైస్చాన్స్లర్గా నియమితులయ్యారు. ఇండోృఇరాన్ రిలేషన్స్, లిటరేటర్, కల్చర్ స్టడీస్, ఇండోలోజీ గ్లోబలైజేషన్, ఎడ్యుకేషన్ అంశాలపై ఆయన ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఆయనకు సతీమణి అర్షియాహసన్, పిల్లలు కమ్రాన్బద్ర్, అర్మాన్ హసన్ ఉన్నారు. ఉద్యమ ప్రస్థానం నుంచి... సాక్షి, హైదరాబాద్: మందకృష్ణ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం న్యూశాయంపేట గ్రామంలో 1965, జులై 7న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మంద చిన్న కొమురయ్య, కొమురమ్మ. మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్)ని స్థాపించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలోని కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో 1994 జులై 7న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుంచి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశాన్ని ప్రచారం చేసి మాదిగలు, ఉపకులాల ప్రజలను చైతన్యపర్చారు. ఎస్సీ, ఎస్టీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేయొచ్చని, ఈమేరకు వర్గీకరణ చేపట్టాలని, ఈ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఇచ్చిన తీర్పు ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి భారీ ఊరట అందించినట్లైంది.ఆర్థికవేత్తల రూపశిల్పి సాక్షి, అమరావతి: ప్రొఫెసర్ కొసరాజు లీలా కృష్ణ.. కేఎల్గా, కేఎల్కేగా సుప్రసిద్ధులు. ఆర్థిక శాస్త్రం ఆచార్యులైన ఆయన అనేకమంది విద్యార్థులను ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్ది దేశానికి అందించారు. షికాగో యూనివర్సిటీలో చదివిన ఆయన.. ప్రస్తుతం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇండియా కేఎల్ఈఎంఎస్ ప్రొడక్టివిటీ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా అప్లైడ్ ఎకనామిక్స్, ఇండ్రస్టియల్ ఎకనామిక్స్, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక ఉత్పాదకత, సైద్ధాంతిక వాణిజ్యం తదితర సబ్జెక్టులు విద్యార్థులకు బోధించడమే కాకుండా, ఆ విభాగాల్లో విస్తృత పరిశోధనలూ చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సుదీర్ఘకాలం ఆర్థిక శ్రాస్తాన్ని బోధించారు. ఇండియన్ ఎకనామిక్ సొసైటీకి 1996ృ97లో అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997లో ఆయన రచించిన ఎకనోమెట్రిక్ అప్లికేషన్స్ ఇన్ ఇండియా గ్రంథాన్ని ఆర్థిక శాస్త్రంలో ప్రధాన విభాగాల్లో అధ్యయనానికి దిక్సూచిలా ఆర్థికవేత్తలు భావిస్తారు.బుర్రకథ టైగర్ మిరియాల తాడేపల్లిగూడెం: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మిరియాల అప్పారావు బుర్రకథలో ప్రఖ్యాతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఆయన 1949 సెప్టెంబరు 9న మిరియాల వెంకట్రామయ్య, తిరుపతమ్మల రెండో సంతానంగా జన్మించారు. చక్కని రాగాలాపనతో పద్యాలు, పాటలు పాడటంతో రాగాల అప్పారావుగా పేరుగాంచారు. 1969లో బుర్రకథ రంగంలో అడుగు పెట్టారు. తొలి ఏడాదిలోనే తన చాతుర్యంతో అందరినీ అబ్బురపరిచి నడకుదురులో సువర్ణ ఘంఠా కంకణం పొందారు. 1974లో రేడియోలో పలు కార్యక్రమాలు చేశారు. 1993లో దూరదర్శన్లో బుర్రకథలు చెప్పారు. బుర్రకథ చెప్పడంలో నాజర్ను స్ఫురణకు తెచ్చే అప్పారావు గాన కోకిల, బుర్రకథ టైగర్ వంటి బిరుదులు సాధించారు. చింతామణి నాటకంలో బిళ్వమంగళుడు, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడు వంటి పాత్రలను పోషించారు. ఈ ఏడాది జనవరి 15న ఆయన తుది శ్వాస విడిచారు.సంస్కృత పండితుడుసాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వాదిరాజ్ పంచముఖి ప్రఖ్యాత సంస్కృత పండితుడు, ఆర్థికవేత్త. 1936 సెప్టెంబర్ 17న కర్ణాటకలోని «బాగల్కోట్లో జన్మించారు. కర్ణాటక, బాంబే విశ్వవిద్యాలయాలతో పాటు, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో విద్యనభ్యసించారు. ఆర్థిక రంగంలో విశేష కృషి చేసి అనేక పరిశోధన వ్యాసాలు రాశారు. అవి అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సంస్కృతంలో అనేక పుస్తకాలు, కవితలు రచించారు. తిరుపతిలోని ర్రాష్టీయ సంస్కృత విద్యా పీఠ్ చాన్స్లర్గా రెండు పర్యాయాలు సేవలందించారు. టీటీడీ బోర్డ్ మెంబర్గా పనిచేశారు. సంస్కృతంలో రాష్ట్రపతి ప్రసంశ పత్రంలో పాటు అనేక అవార్డులను అందుకున్నారు. -
పద్మ అవార్డు కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదు: నరేశ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులపై సినీ నటుడు నరేశ్ (VK Naresh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 46 సినిమాలను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల (Vijaya Nirmala) అని, కానీ ఇంతవరకు తనకు పద్మ పురస్కారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మకు పద్మ అవార్డు రావాలని ఢిల్లీదాకా వెళ్లి ప్రయత్నించాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో పద్మ పురస్కారం కోసం అమ్మ పేరును రికమండ్ చేశారు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.పద్మ పురస్కారం కోసం పోరాడతాబీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు పురస్కారాలు ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఎంజీఆర్ గారు బతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. మరణానంతరం ఇచ్చే పురస్కారంగా అయినా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అందుకు అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పులేదు. మళ్లీ ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం -
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
Padma Awards 2024: అసామాన్య పద్మశ్రీలు
స్త్రీలు జీవానికి జన్మనివ్వడమే కాదు.. జీవాన్ని కాపాడతారు కూడా! ఈసారి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీలలో కొందరు అసామాన్యమైన స్త్రీలు తమ జీవితాన్ని కళ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కలు వీటన్నిటిలోని జీవాన్ని కాపాడుకుంటూ రావడం కనిపిస్తుంది. ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పర్బతి బారువా... లక్షలాది మొక్కలు నాటి ఆకుపచ్చదనం నింపిన చామి ముర్ము... విస్మరణకు గురైన ఔషధ మూలికలకు పూర్వ వైభవాన్ని తెచ్చిన యానుంగ్... కొబ్బరి తోటలు తీయటి కాయలు కాచేలా చేస్తున్న అండమాన్ చెల్లమ్మాళ్... గోద్నా చిత్రకళకు చిరాయువు పోసిన శాంతిదేవి పాశ్వాన్... వీరందరినీ పద్మశ్రీ వరించి తన గౌరవం తాను పెంచుకుంది. ఏనుగుల రాణి భారతదేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆమె పరిచయం. ఇది సంతోషించదగ్గ విషయం. అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కడైనా అటవీ ఏనుగులు అదుపు తప్పి, తల తిక్కగా వ్యవహరిస్తూ ఉంటే పర్బతి బారువాకు పిలుపు వచ్చేది... వచ్చి వాటిని కాస్త పట్టుకోమని, మాలిమి చేయమని. ఇన్నేళ్లకు 69 ఏళ్ల వయసులో ఈ ‘ఏనుగుల రాణి’కి, ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన రుషికి భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ‘ స్వీకరించమని పిలుపు వచ్చింది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రమాదస్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణకు, వాటిని ఎలా కనిపెట్టుకోవాలో తెలిపే జ్ఞానాన్ని సముపార్జించి పంచినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇవ్వడం సంతోషించాల్సిన సంగతి. కళ్లు తెరవగానే ఏనుగు ‘నాకు ఊహ తెలిసిన వెంటనే నా కళ్ల ఎదురుగా ఏనుగు ఉంది’ అంటుంది పర్బతి. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన గౌరిపూర్ సంస్థానం పర్బతి కుటుంబీకులది. పర్బతి తండ్రి రాజా ప్రతాప్ చంద్ర బారువా సంస్థానం మీద వచ్చే పరిహారంతో దర్జాగా జీవిస్తూ 40 ఏనుగులను సాకేవాడు. అంతేకాదు అతనికి ఏనుగులతో చాలా గొప్ప, అసామాన్యమైన అండర్స్టాండింగ్ ఉండేది. వాటి ప్రతి కదలికకూ అతనికి అర్థం తెలుసు. మహల్లో ఉండటం కన్నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని అడవుల్లో నెలల తరబడి ఉండటానికి ఇష్టపడే రాజా ప్రతాప్ తన తొమ్మిది మంది సంతానంలో ఒకతైన పర్బతికి ఏనుగుల మర్మాన్ని తెలియచేశాడు. 9 ఏళ్ల వయసు నుంచే పర్బతి ఏనుగులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల వయసులో మొదటిసారి అటవీ ఏనుగును పట్టి బంధించగలిగింది. అది చూసి తండ్రి మెచ్చుకున్నాడు. కష్టకాలంలో ఏనుగే తోడు 1970లో భారత ప్రభుత్వం (విలీనం చేసుకున్న) సంస్థానాలకిచ్చే భరణాన్ని ఆపేయడంతో పర్బతి తండ్రి పరిస్థితి కష్టాల్లో పడింది. రాబడి లేకపోవడంతో ఏనుగులే అతని రాబడికి ఆధారం అయ్యాయి. ఏనుగులను అమ్మి, టింబర్ డిపోలకు అద్దెకిచ్చి జీవనం సాగించాడు. ఆ సమయంలో పర్బతి ఏనుగుల గురించి మరింత తెలుసుకుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగు కళ్లను చూసి దాని మనసులో ఏముందో చెప్పే స్థితికి పర్బతి చేరుకుంది. ఏనుగుల ప్రవర్తనకు సంబంధించిన ఆమె ఒక సజీవ ఎన్సైక్లోపిడియాగా మారింది. క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీబీసీ వారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ పేరుతో పర్బతి మీద డాక్యుమెంటరీ తీయడంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఉదయం నాలుగున్నరకే లేచి ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యే పర్బతి దినచర్యను చూసి సలాం చేయాల్సిందే. ‘ఏనుగును మాలిమి చేసుకోవాలంటే ముందు దాని నమ్మకం, గౌరవం పొందాలి. లేకుంటే ఏనుగులు మావటీలను చంపేస్తాయి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక ఏనుగు తనను ఇబ్బంది పెడుతున్న మావటిని అతను నిద్రపోతున్నప్పుడు వెతికి మరీ చంపింది’ అంటుంది పర్బతి. కాని నమ్మకం పొందితే ఏనుగుకు మించి గొప్ప స్నేహితుడు లేదని అంటుంది. ‘ఒకో ఏనుగు రోజుకు 250 కిలోల పచ్చగడ్డి తింటుంది. దానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే ఆరోగ్యం కుదుటపడుతుందో ఆ మొక్కను వెతికి తింటుంది. అది తినే మొక్కను బట్టి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం చేయించాలి’ అంటుందామె. ‘ఎవరికైనా విశ్రాంతి ఉంటుంది కాని మావటికి కాదు. మావటి పని డ్రైవర్ ఉద్యోగం కాదు. కారు గ్యారేజ్లో పెట్టడానికి. జీవంతో నిండిన ఏనుగుకు మావటి అనుక్షణం తోడు ఉండాలి’ అంటుందామె. అస్సాం అటవీశాఖలో ‘చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్’గా పని చేసిన ఆమె ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం పని చేస్తోంది. నారియల్ అమ్మ దక్షిణ అండమాన్లోని రంగచాంగ్కు చెందిన 67 ఏళ్ల కామాచీ చెల్లమ్మాళ్ సేంద్రియ కొబ్బరి తోటల పెంపకంలో చేసిన విశేష కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. దక్షిణ అండమాన్లో ‘నారియల్ అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం తరువాత నేలలో తేమను సంరక్షించడానికి కొబ్బరి ఆకులు, పొట్టు మొదలైన వాటితో సేంద్రియ ఎరువు తయారుచేసింది. ‘నాకు పద్మశ్రీ ప్రకటించారు అని ఎవరో చెబితే నేను నమ్మలేదు. అయోమయానికి గురయ్యాను. అండమాన్లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే నాకు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ ఎందుకు ప్రకటిస్తారు అనుకున్నాను. ఆ తరువాత నేను విన్న వార్త నిజమే అని తెలుసుకున్నాను’ అంటున్న చెల్లమ్మళ్ ఆగ్రో–టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. తమ ప్రాంతంలోని రకరకాల పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపకం...మొదలైనవి ఆగ్రో–టూరిజానికి ఊతం ఇస్తాయి అని చెబుతుంది చెల్లమ్మాళ్. అవమానాలను అధిగమించి గోద్నా చిత్రకళలో చేసిన విశేష కృషికి బిహార్లోని మధుబని జిల్లా లహేరిఆగంజ్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి పాశ్వాన్ ఆమె భర్త శివన్ పాశ్వాన్లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గోద్నా చిత్రకళ ద్వారా ఈ దంపతులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా నుంచి జపాన్ వరకు వీరి చిత్రాలను ప్రదర్శించారు. తన కులం కారణంగా ఎన్నో అవమానాలకు గురైన శాంతిదేవి, వాటిని అధిగమించి జీ20 సదస్సులో పాల్గొనే స్థాయి వరకు ఎదిగింది. శాంతిదేవి, శివన్ పాశ్వన్ దంపతులు ఇరవైవేల మందికి పైగా గోద్నా చిత్రకళలో శిక్షణ ఇచ్చారు. ఆది రాణి అరుణాచల్ప్రదేశ్కు చెందిన యానుంగ్ జమెహ్ లెగో ఆది తెగ సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. అరుణాచల్ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన 58 సంవత్సరాల యానుంగ్ను అభిమానులు ‘ఆది రాణి’ అని పిలుచుకుంటారు. లక్షమందికి పైగా ఔషధమూలికలపై అవగాహన కలిగించించిన యానుంగ్ ఏటా 5,000 ఔషధ మొక్కలను నాటుతుంది. ప్రతి ఇంటిలో హెర్బల్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తోంది. ఆర్థికపరిమితులు ఉన్నప్పటికీ విస్మరణకు గురైన ఆది తెగ సంప్రదాయ వైద్య వ్యవస్థను, సాంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేసింది యానుంగ్. మొక్కవోని ఆత్మస్థైర్యం ‘మొక్కలు నాటడానికి నువ్వు ఏమైనా కలెక్టర్ వా!’ అని ఊరి మగవాళ్లు చామిని వెక్కిరించేవాళ్లు. మొక్కలు నాటడం అనే పుణ్యకార్యం వల్ల ఉత్త పుణ్యానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన చామి కూలి పనులు చేసుకుంటూనే 36 ఏళ్ల రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఝార్ఖండ్కు చెందిన చామి ముర్ము ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది.... తన గ్రామం భుర్సాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సమావేశానికి హాజరు కావడం ద్వారా పర్యావరణ కార్యకర్తగా చామీ ముర్ము ప్రయాణం ప్రారంభమైంది. ‘మా ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములు కనిపించేవి. బాధగా అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. అయితే మొక్కలు నాటడం మా ఊరిలోని మగవాళ్లకు నచ్చలేదు. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవల వల్ల సోదరుడి ఇంటికి వెళ్లాను. అతడితో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఒకవైపు జీవనోపాధిపై దృష్టి పెడుతూనే మరోవైపు ప్రకృతికి మేలు కలిగించే పనులు చేయడం ప్రారంభించాను’ అంటుంది చామీ ముర్ము. పదో తరగతి వరకు చదువుకున్న చామి మొక్కలు నాటడం, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నందుకు కొంతమందికి అకారణంగా శత్రువు అయింది. 1996లో చామి నాటిన మొక్కలను ధ్వంసం చేశారు కొందరు. ‘ఇక ఆపేద్దాం. ఎందుకు లేనిపోని గొడవలు’ అని కొందరు మహిళలు చామిని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే చామి మాత్రం ఆనాటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉత్సాహం ముందు ప్రతికూలశక్తులు తోకముడిచాయి. ‘నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. నేను నాటిన 28 లక్షలకుపైగా మొక్కలు నా బంధువులే’ అంటుంది చామి. ఝార్ఖండ్లోని వెనబడిన జిల్లా అయిన సరైకెలా ఖరావాన్లో రైతులు వ్యవసాయం కోసం వర్షంపై ఆధారపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి అవసరాల కోసం వాటర్షెడ్లను నిర్మించడానికి చామి కృషి చేస్తోంది. 2,800 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా, సొంత వ్యాపారం ప్రారంభించేలా చేసింది. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ స్పృహతో మొదలైన నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది చామి. ఒంటరిగా అడుగులు మొదలు పెట్టినప్పటికీ అంకితభావం కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల ప్రభావం చూపించగలరు అని చెప్పడానికి చామీ ముర్ము ప్రయాణం బలమైన ఉదాహరణ. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చామీ ముర్ము పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. టింబర్ మాఫియాపై పోరాడిన చామీ ముర్మును ‘లేడీ టార్జన్ ఆఫ్ ఝార్ఖండ్’ అని అభిమానులు పిలుచుకుంటారు. -
క్రీడారంగంలో పద్మ పురస్కారాలు వీరికే..
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రద్మ పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ ఏడాది క్రీడారంగం నుంచి మొత్తం ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వెటరన్ టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్, పూర్ణిమా మహతో (ఆర్చరీ), సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్పాండేలను (మల్లఖంబ-కోచ్) పద్మశ్రీ అవార్డులు వరించాయి. -
తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు!
Foxconn CEO Young Liu: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ సీఈఓ 'యంగ్ లియు' (Young Liu) ను కూడా పద్మభూషణ్ వరించింది. 66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) చైర్మన్ 'యంగ్ లియు' నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లియుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. యంగ్ లియు స్థాపించిన మూడు కంపెనీలలో యంగ్ మైక్రో సిస్టమ్స్ అని పిలువబడే మదర్బోర్డ్ కంపెనీ (1988), నార్త్బ్రిడ్జ్ అండ్ సౌత్బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ (1995), ఐటీఈ టెక్ అండ్ ఏడీఎస్ఎల్ ఐసీ డిజైన్ కంపెనీ (1997) ఉన్నాయి. తైవాన్కు చెందిన యంగ్ లియు 1978లో తైవాన్లోని నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. భారతదేశంలో ఫాక్స్కాన్ ఉనికి భారతదేశంలో.. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు, వెంచర్లతో తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్కాన్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమిళనాడులో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 40000 మంది పనిచేస్తున్నారు. ఫాక్స్కాన్ సంస్థ బెంగళూరు శివార్లలో యూనిట్ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కోసం 1.6 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని విస్తృతం చేయబోతున్నట్లు ఫాక్స్కాన్ సీనియర్ అధికారి గత సంవత్సరం తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఫాక్స్కాన్ దేశంలో విస్తృత సేవలను అందించనున్నట్లు సమాచారం. పద్మ అవార్డ్స్ 2024 కేంద్రం ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. విదేశీయులకు పద్మ అవార్డులు ఎందుకిస్తారంటే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డ్స్ వెబ్సైట్ ప్రకారం.. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన లేదు. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సేవలందించిన ఎవరికైనా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్, సీఎం రేవంత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్వర్క్: తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్కాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్కాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్సంగ్ హీరోస్’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. పద్మ అవార్డుల వివరాలివీ.. పద్మ విభూషణ్ (ఐదుగురికి): వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ–బిహార్), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). పద్మభూషణ్ (17 మందికి): ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్ జీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్), సీతారాం జిందాల్ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్), రాంనాయక్ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం–గుజరాత్), ఓలంచెరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూ అలియాస్ రాజ్ దత్ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్), ప్యారేలాల్ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం–బిహార్), ఉషా ఉతుప్ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్కాంత్ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) – పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. బాధ్యతను పెంచింది ‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ – ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్ పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు. -
మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్కు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీకి చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరికి పద్మ శ్రీ పురస్కారం వరించింది. తెలంగాణకు చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య కు పద్మశ్రీ అవార్డు లభించింది. #PadmaAwards2024 | Somanna, a Tribal Welfare Worker from Mysuru, tirelessly working for the upliftment of Jenu Kuruba tribe for over 4 decades, to receive Padma Shri in the field of Social Work (Tribal PVTG) pic.twitter.com/zZl6Sge1tE — ANI (@ANI) January 25, 2024 తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇదీ చదవండి: రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య, కర్పూరి ఠాకూర్ ప్రస్తావన -
నేను అలా అన్నందుకు నామీద తిరగబడ్డారు : గరికపాటి నరసింహారావు
-
పద్మశ్రీ అవార్డు అందుకున్న కానీ..!
-
Padma Awards 2024: ‘పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి’
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి, వారి గొప్పదనం, విజయాలు పద్మ అవార్డులతో సత్కరించడానికి అర్హులను భావించినట్లయితే ఆ పేర్లను సిఫారసు చేయాలని ప్రజలను సోమవారం కేంద్రం కోరింది. 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లు, ప్రతిపాదలను 2023 మే ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పద్మ అవార్డుల సిఫారసులకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 15. ప్రతిపాదనలను ఆన్లైన్లో https://awards.gov.in ద్వారా పంపాలని కోరింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవిస్తుంది. -
‘మోదీజీ.. ఇది అస్సలు ఊహించలేదు’
రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికర సంభాషణ ఒకటి జరిగింది. కర్ణాటకకు చెందిన హస్త కళాకారుడు ఒకరు.. బీజేపీ ప్రభుత్వం నుంచి ఇది అస్సలు ఊహించలేదంటూ ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. దానికి ప్రధాని మోదీ కూడా నవ్వులు చిందించడం విశేషం. కర్ణాటకకు చెందిన బిద్రీ కళాకారుడు రషీద్ అహ్మద్ ఖ్వాద్రీకి పద్మశ్రీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిన్న(బుధవారం) జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. అయితే.. అవార్డుల విజేతలను ప్రధాని మోదీ అభినందించే క్రమంలో.. ఖ్వాద్రీ ముచ్చటించారు. ‘‘మోదీజీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పద్మ అవార్డు నాకు వస్తుందని అనుకున్నా. కానీ, రాలేదు. మీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో.. ఈ ప్రభుత్వం నాకు ఎలాంటి అవార్డు ఇవ్వదని అనుకున్నా. కానీ, అది తప్పని మీరు నిరూపించారు. మీకు నా కృతజ్ఞతలు అని ఖ్వాద్రీ, ప్రధాని మోదీతో అన్నారు. ఆ దిగ్గజ కళాకారుడి మాటలు వినగానే ప్రధాని మోదీ రెండు చేతులు జోడించి నమస్తే పెట్టి.. చిరునవ్వు నవ్వారు. కాస్త దూరంగా నిల్చున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం చిరునవ్వులు చిందించారు. Indian Muslim artist from #Karnataka #RasheedAhmedQuadri after winning #PadmaShri. 'I used to think #BJP never gives anything to #Muslims,but #Modi proved me wrong.' A moment of dialogue between the awardee & PM Modi, with mutual respect and appreciation from both sides. TQ🇮🇳🫡 pic.twitter.com/EO5h2FyEGw — سعود حافظ | Saud Hafiz (@saudrehman27) April 6, 2023 -
పద్మశ్రీ అవార్డు అందుకున్న కీరవాణి.. సుధామూర్తికి పద్మభూషణ్ ప్రధానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురికి పద్మ అవార్డులు ప్రధానం చేశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్కు ప్రకటించిన పద్మ విభూషణ్ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. సామాజిక సేవ చేసినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. అలాగే చినజీయర్ స్వామి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరైంది. అలాగే సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి బుధవారం వీటిని ప్రధానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోనే ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
Padma Awards: అట్టహాసంగా 2023 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
సాక్షి, ఢిల్లీ: 2023 ఏడాదికిగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇవాళ(బుధవారం మార్చి 22) సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కర్తో పాటు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ అందుకోగా.. ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, సింగర్ సుమన్ కళ్యాణ్పూర్లు పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. పాండ్వానీ సింగర్ ఉషా బర్లే, చునారా కమ్యూనిటీకి చెందిన కళంకారీ కళాకారుడు భానుభాయ్ చితారా, త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా(దివంగత.. బదులుగా ఆయన తనయుడు సుబ్రతా దెబ్బర్మా), కాంతా ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ ప్రీతికాకా గోస్వామి, ప్రముఖ బయాలజిస్ట్ మోడడుగు విజయ్ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త.. ప్రముఖ కళాకారుడు దిల్షద్ హుస్సేన్, పంజాబీ స్కాలర్ డాక్టర్ రతన్ సింగ్ జగ్గీ, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్ఝున్వాలా(దివంగత.. బదులుగా ఆయన సతీమణి రేఖా ఝున్ఝున్వాలా అవార్డును అందుకున్నారు), మ్యూజిక్ ఆర్టిస్ట్ మంగళ కాంతా రాయ్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి చింతల పాటి వెంకట పతి రాజు( కళారంగం), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం), తెలంగాణకి చెందిన పసుపులేటి హనుమంతరావు (మెడిసిన్ ), బి.రామకృష్ణరెడ్డి (సాహిత్యం) పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. #WATCH | Former Union Minister SM Krishna receives the Padma Vibhushan from President Droupadi Murmu. pic.twitter.com/WqA5b0YH1i — ANI (@ANI) March 22, 2023 LIVE: President Droupadi Murmu presents Padma Awards 2023 at Civil Investiture Ceremony-I at Rashtrapati Bhavan https://t.co/jtEQQtx1DP — President of India (@rashtrapatibhvn) March 22, 2023 -
భారత రత్న ఇవ్వాలి!
ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించారు కానీ దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించలేదు. ఎన్నో త్యాగాలూ, సేవలూ చేసినవారికి ప్రదానం చేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రతి ఏడాదీ ప్రకటించి వారిని గౌరవించుకోవడం మన విధి. 1954 నుండి భారత రత్న పురస్కారాన్ని ఇస్తున్నారు. ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును అందించారు. చివరిసారిగా 2019లో ముగ్గురికి ఇచ్చారు. సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపేన్ హజారికా (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత రత్నకు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ అవార్డుకు వ్యక్తులను సిఫార్సు చేసే ప్రక్రియ ప్రధాన మంత్రి నుంచి మొదలవుతుంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు. కులం, వృత్తి, జెండర్... ఇలా ఎలాంటి భేదం లేకుండా ఎవరి పేరునైనా భారత రత్నకు పరిశీలించొచ్చు. ప్రతి ఏటా ముగ్గురికి భారత రత్న ఇవ్వొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మ పురస్కారాలను ప్రకటించినట్లుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం లేదు. అలా ప్రకటించాలని ప్రత్యేక నిబంధనలు ఏమీ లేకపోయినప్పటికీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ ఏడాది దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయులకూ గొప్ప సంఘ సంస్కర్తలైన ఫూలే దంపతులకూ, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య వంటి త్యాగ ధనులకూ, ధ్యాన్ చంద్ వంటి క్రీడాకారులకూ భారతరత్న పురస్కారం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజా భివృద్ధి కోసం పాటుపడిన విశిష్ట వ్యక్తులకు భారతరత్నను ప్రదానం చేయడం ద్వారా వారి త్యాగాలను ఈ తరానికి మరొక్కసారి పరిచయం చేసినట్లు అవుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఎం. రాం ప్రదీప్, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా -
Mann ki Baat 2023: వారి జీవితాలు స్ఫూర్తిదాయకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారి జీవితాలు, వారు సాధించిన ఘనత గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2023 పద్మ అవార్డుల్ని పీపుల్స్ పద్మగా అభివర్ణించారు. సామాన్యుల్లో అసామాన్యులుగా ఎదిగిన వారిని గుర్తించి గౌరవిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా ప్రధాని ఆదివారం ఆకాశవాణి మన్కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. గిరిజనులు, వారి అభ్యున్నతికి కృషి చేసిన వారినే అత్యధికంగా పద్మ అవార్డులతో సత్కరిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘ పద్మ పురస్కారాలు పొందినవారి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. గిరిజన భాషలైన టోటో, హో, కూయి వంటి వాటిపై అవిరళ కృషి చేసిన వారు, ఆదివాసీల సంగీత పరికరాలు వాయించడంలో నిష్ణాతులకి ఈ సారి పద్మ పురస్కారాలు వరించాయి.. నగర జీవితాలకి , ఆదివాసీ జీవితాలకు ఎంతో భేదం ఉంటుంది. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లుంటాయన్నారు. అయినప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఎంతో పోరాటం చేస్తుంటారు’’ అని ప్రధాని కొనియాడారు. పెరుగుతున్న దేశీయ పేటెంట్ ఫైలింగ్స్ ఈ దశాబ్దం సాంకేతిక రంగంలో దేశీయ టెక్నాలజీస్ వాడకం పెరిగి ‘‘టెకేడ్’’గా మారాలన్న భారత్ కలను ఆవిష్కర్తలు, వాటికి వచ్చే పేటెంట్ హక్కులు నెరవేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. విదేశాలతో పోల్చి చూస్తే దేశీయంగా పేటెంట్ ఫైలింగ్స్ బాగా పెరిగాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్లో భారత్ ఏడో స్థానంలో ఉంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లలో అయిదో స్థానంలో ఉందని ప్రధాని వెల్లడిచారు. గత అయిదేళ్లలో భారత్ పేటెంట్ రిజిస్ట్రేషన్లు 50శాతం పెరిగాయని, ప్రపంచ ఆవిష్కరణల సూచిలో మన స్థానం 40కి ఎగబాకిందన్నారు. 2015 నాటికి 80 కంటే తక్కువ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇండియన్ ఇనిస్టి్యూట్ ఆఫ్ సైన్సెస్ 2022లో 145 పేటెంట్లను దాఖలు చేసి రికార్డు సృష్టిస్తుందన్నారు. భారత్ ‘‘టెకేడ్‘‘కలని ఆవిష్కర్తలే నెరవేరుస్తారని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మన్కీ బాత్లో తెలుగువారి ప్రస్తావన మన్కీబాత్లో ఇద్దరు తెలుగు వారి గురించి మోదీ ప్రస్తావించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే ఆంధ్రప్రదేశ్కు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి, తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి మాట్లాడారు. ‘‘నంద్యాల జిల్లాకు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి చిరు ధాన్యాలు పండించడం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగం మానేశారు. తల్లి చేసే చిరు ధాన్యాల వంటకం రుచి చూసి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వాటి ప్రయోజనాలను అందరికీ వివరిస్తున్నారు’’ అని కొనియాడారు. నమో యాప్లో ఇ–వేస్ట్ గురించి రాసిన తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి ప్రస్తావించిన ప్రధాని మొబైల్, ల్యాప్టాప్, టాబ్లెట్లు నిరుపయోగమైనప్పుడు ఎలా పారేయాలో వివరించారు. -
పాములు పట్టే వారికి పద్మశ్రీ.. వీరిద్దరూ వరల్డ్ ఫేమస్!
సాక్షి, చెన్నై: తమిళనాడు నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికైన వారిని గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ గురువారం అభినందించారు. వివరాలు.. 2023 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి పురస్కారాలు లభించాయి. వీరిలో గాయని వాణీ జయరాంకు పద్మ విభూషణ్ దక్కింది. మిగిలిన ఐదుగురిని పద్మశ్రీ వరించింది. అలాగే, కల్యాణ సుందరం పిళ్లై (కళ) వడివేల్ గోపాల్, మాసి సడయన్ (సామాజిక సేవ), పాలం కల్యాణ సుందరం (సామాజిక సేవ), గోపాల్ స్వామి వేలుస్వామి (వైద్యం) ఉన్నారు. ప్రస్తుతం పద్మశ్రీతో ఇద్దరు వ్యక్తులు తమిళనాడు ప్రముఖులుగా తెర మీదకు వచ్చారు. ఆ ఇద్దరు పాములు పట్టడంలో దిట్టగా ఉండటం విశేషం. పాములను పట్టే ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం చెంగల్పట్టు నుంచి అమెరికా వరకు విషపూరిత పాములను పట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వెనుక బడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని పద్మశ్రీ వరించింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాలు.. చెంగల్పట్టు జిల్లా సెందురి గ్రామానికి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన వడివేల్ గోపాల్, మాసి సడయన్ పాములు పట్టాడాన్నే వృత్తిగా కొనసాగిస్తున్నారు. వంశ పారంపర్యగా వస్తున్న నేర్చుకున్న విద్యతో ఈ ఇద్దరు అమెరికా వరకు తమ సేవలను అందించారు. ప్రస్తుతం పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికై ఉండడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో పాములు పట్టే శిక్షణ ఇచ్చే స్థాయికి వీరు ఎదిగి ఉన్నారు. అమెరికా ఫ్లోరిడాలో కొండ చిలువలను పట్టే ప్రముఖ నిపుణుడు రోమ్లస్ విక్టోరికర్ బృందంలో ఈ ఇద్దరు సభ్యులుగా ఉండడం వెలుగులోకి వచ్చింది. కాగా తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై వడివేల్ గోపాల్ మాట్లాడుతూ ఈ ఘనత అందుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. అమెరికా, థాయ్ల్యాండ్ వంటి దేశాలలో తాము పాములు పట్టామని, అధిక విషం కలిగిన పాములు ఎన్ని పట్టామో తనకే తెలియదని పేర్కొన్నారు. మాసి సడయన్ మాట్లాడుతూ పద్మశ్రీ రావడం గొప్ప ఘతన అని ఈ ఆనందానికి మాటలు లేవని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: వైద్యంలో అతడి సేవలు అమోఘం.. వరించిన పద్మశ్రీ -
1971 యుద్ధంలో సేవలు.. రెండు రూపాయల డాక్టర్కు పద్మశ్రీ.. ఆయన ఎవరంటే?
దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. కాగా, పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో ఓ ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే డాక్టర్ ఎమ్సీ దావర్. మధ్యప్రదేశ్కు చెందిన దావర్(77)ను స్థానికులు 20 రూపాయల డాక్టర్ అని కూడా పిలుస్తారు. దావర్.. అతని వద్దకు వచ్చిన పేషంట్స్కు కేవలం రూ.20 మాత్రమే ఫీజు తీసుకుని వారికి వైద్యం అందిస్తుంటారు. అందుకే దావర్కు 20 రూపాయల డాక్టర్ అనే పేరు వచ్చింది. దావర్ వివరాలు ఇవే.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఎమ్సీ దావర్ పద్మశ్రీ దక్కించుకున్నారున. అయితే, డాక్టర్ దావర్ జనవరి 16, 1946న పాకిస్థాన్లోని పంజాబ్లో జన్మించారు. దేశ విభజన తర్వాత భారత్లోకి వచ్చారు. 1967లో దావర్ జబల్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారత సైన్యంలో దావర్ సుమారు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. ఆ తర్వాత 1972 నుండి జబల్పూర్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పేషంట్స్ వద్ద నుంచి కేవలం రూ.2 మాత్రమే తీసుకుని వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం తన ఫీజును రూ.20కి పెంచి అందరికీ వైద్యం అందిస్తున్నారు. కాగా, పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా దావర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దావర్ మీడియాతో మాట్లాడుతూ..‘కష్టపడితే కొన్నిసార్లు ఆలస్యమైనా ఫలితం మాత్రం ఉంటుంది. దాని ఫలితంగానే నేను ఈ అవార్డును అందుకున్నాను. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. అందుకే పేషంట్స్ వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం లేదు. విజయం ప్రాథమిక మంత్రం ఏంటంటే.. ఓపికగా పనిచేస్తే కచ్చితంగా విజయం దక్కుతుంది. అలాగే గౌరవం కూడా అందుతుంది’ అని కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో దావర్ కుమారుడు రిషి కూడా తన తండ్రికి పద్మ పురస్కారం అందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా పరపతి ఉంటేనే అవార్డులు ఇస్తారని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ, ప్రభుత్వం మా లాంటి వారిని కూడా గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి వారిని గుర్తించి సత్కరిస్తున్న తీరు చాలా మంచి విషయం. మా నాన్నకు ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఇది మాకు, మా కుటుంబానికి, మా నగరానికి చాలా గర్వకారణమని దావర్ కోడలు సుచిత అన్నారు. -
పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: పద్మ అవార్డు గ్రహీతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విశేష ప్రతిభతో అవార్డులు గెలుచుకోవడం గర్వించదగిన విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 91 మందికి పద్మశ్రీ, 9 మందికి పద్మభూషణ్, ఆరుగురికి పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ఏడుగురికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. చదవండి: (‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి) -
‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి
సాక్షి, న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి ఆరుగురికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ దక్కింది. 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ దివంగత నేత ములాయంసింగ్ యాదవ్తో పాటు ప్రముఖ తబల వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ గ్రహీతల్లో ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, సుధామూర్తి, గాయకురాలు వాణీ జయరాం తదితరులు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరిలో ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్ సహా ఏడుగురు, తెలంగాణ నుంచి సాహితీవేత్త బి.రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం ముగ్గురున్నారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కమలేశ్ డి.పటేల్కు కూడా తెలంగాణ కోటాలో పద్మభూషణ్ దక్కడం విశేషం. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా దూదేకుల ఖాదర్ వలీకి కర్నాటక కోటాలో పద్మశ్రీ లభించింది. పద్మ అవార్డుల విజేతల్లో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి చెందినవారున్నారు. పద్మ పురస్కారాల విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషి సాటిలేనిదంటూ ప్రశంసించారు. ప్మద అవార్డుల గ్రహీతలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్ ములాయంసింగ్ యాదవ్ (మరణానంతరం), జాకీర్ హుస్సేన్, ఎస్ఎం కృష్ణ, ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషీ (మరణానంతరం), ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలనబిస్ (మరణానంతరం), ఇండో–అమెరికన్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్ పద్మభూషణ్ చినజీయర్ స్వామి (ఆధ్యాత్మిక రంగం), కుమారమంగళం బిర్లా (వాణిజ్యం, పరిశ్రమలు), వాణీ జయరాం (కళ), సుధామూర్తి (సామాజిక సేవ), కమలేష్ డి.పటేల్ (ఆధ్యాత్మిక రంగం), ఎస్ఎల్ భైరప్ప (కళ), దీపక్ధర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సుమన్ కల్యాణ్పుర్ (కళ), కపిల్ కపూర్ (సాహిత్యం–విద్య) పద్మశ్రీ ఏపీ నుంచి: సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (కళ), సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), గణేశ్ నాగప్పకృష్ణరాజనగర (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సీవీ రాజు (కళ), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ), ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం–విద్య). తెలంగాణ నుంచి: మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం–విద్య). పద్మశ్రీ దక్కిన ప్రముఖుల్లో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలీతో పాటు స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేశ్ ఝున్ఝున్వాలా (మరణానంతరం), సినీ నటి రవీనా టాండన్ తదితరులున్నారు. -
‘పద్మ’ నామినేషన్లకు ఆఖరు తేదీ 15
న్యూఢిల్లీ: పద్మ అవార్డులు–2023కు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్లైన్ పోర్టల్ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది. ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్ ఇన్ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్ గోపాలరత్న–2022కు, నేషనల్ వాటర్ అవార్డ్స్కు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్–2023కి అక్టోబర్ 31 చివరి తేదీ అని వివరించింది. -
‘పద్మ’ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం–2023 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లను ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు https://padmaawards.gov.in పోర్టల్ ద్వారా స్వీకరిస్తామని తెలిపింది. వివిధ కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజాసంబంధాలు, సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమ మొదలైన రంగాలు, విభాగాలలో విశిష్టమైన, అసాధారణ విజయాలు, సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు. -
పద్మభూషణ్ అందుకున్న కృష్ణ ఎల్ల దంపతులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో సేవలు చేసినవారికి అందజేసే పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతిభవన్లో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. సోమవారం 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం పద్మజారెడ్డి, రామచంద్రయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తనకు మహాశివుడు ఇచ్చిన వరమని, దీనిని తన నాట్య గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నానని పద్మాజారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆదివాసీ కథలే తనను ఈ స్థాయికి తెచ్చాయని సకిని రామచంద్రయ్య అన్నారు. (చదవండి: గూర్ఖాల్యాండ్ డిమాండ్ను వదిలిన మోర్చా) -
ఘనంగా ‘పద్మ పురస్కారాల ’ ప్రదానోత్సవం (ఫోటోలు)
-
భారత ప్రజలారా.. మీకు కృతజ్ఞతలు.. ఎమోషనలైన సత్య నాదెళ్ల
మాతృదేశాన్ని, ఇక్కడి ప్రజలను తలుచుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భావోద్వేగానికి లోనయ్యారు. గణతంత్రదినోత్సవ వేడుకల వేళ భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పద్మభూషన్ అవార్డును ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఎమెషనల్ అయ్యారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రిలతో ఇక్కడి ప్రజలకు కృతజ్ఞనతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులతో పాటు ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ భారత్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ చెప్పారు. It’s an honor to receive a Padma Bhushan Award and to be recognized with so many extraordinary people. I’m thankful to the President, Prime Minister, and people of India, and look forward to continuing to work with people across India to help them use technology to achieve more. — Satya Nadella (@satyanadella) January 27, 2022 సత్యనాదెళ్లతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్కి సైతం కేంద్రం పద్మభూషన్ అవార్డును ప్రకటించింది.. దీనిపై ఆయన స్పందిస్తూ వివిధ రంగాల్లో గొప్ప ప్రతిభ చూపిన వ్యక్తులతో కలిసి ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. -
పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం
న్యూఢిల్లీ: తమకు ప్రకటించిన పద్మ పురస్కారాలను పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, ప్రముఖ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ తిరస్కరించారు. పద్మభూషణ్ అవార్డు స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనని బుద్ధదేవ్ చెప్పినట్టు సీపీఎం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలు తీసుకోరాదన్నది తమ పార్టీ విధానమని స్పష్టం చేసింది. తాము ప్రజల కోసం పనిస్తామని, అవార్డుల కోసం కాదని ప్రకటించింది. గతంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్కు ‘పద్మ’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన దానిని తిరస్కరించారని సీపీఎం వెల్లడించింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును నంబూద్రిపాద్ నిరాకరించారు. దేశాన్ని అవమానించడమే.. గులాం కావాలనుకోవడం లేదు పద్మభూషణ్ను తిరస్కరించడం ద్వారా భట్టాచార్జీ దేశాన్ని అవమానించారని, బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ అన్నారు. పద్మ అవార్డులు ఏ ఒక్క పార్టీకి లేదా సిద్ధాంతానికి చెందినవి కాదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ‘ఆయన ఆజాద్గా ఉండాలనుకుంటున్నారు. గులాం అవ్వాలను కోవడం లేద’ని వ్యాఖ్యానించారు. (చదవండి: కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్) అవమానంగా ఉంది.. అవార్డు వద్దు: సంధ్యా ముఖర్జీ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని నిరాకరించినట్లు పీటీఐ తెలిపింది. ఆలస్యంగా ఎంపిక చేసినందుకు ఆమె అవార్డును వద్దనుకున్నట్టు సమాచారం. ‘90 సంవత్సరాల వయస్సులో సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు స్వర ప్రస్థానం సాగించిన సంధ్యా ముఖర్జీకి ఇంత ఆలస్యంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం ఆమెను కించపరచడమేన’ని ఆమె కుమార్తె సౌమీ సేన్గుప్తా అన్నారు. అవార్డును తిరస్కరించడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఆ దశను ఎప్పుడో దాటాను: అనింద్య ఛటర్జీ ప్రముఖ తబలా విద్వాంసుడు పండిట్ అనింద్య ఛటర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించినట్టు వెల్లడించారు. అవార్డు కోసం తన సమ్మతిని కోరుతూ ఢిల్లీ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ప్రతికూలంగా స్పందించినట్టు ‘పీటీఐ’కు తెలిపారు. ‘పద్మ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించాను. నాకు అవార్డు ఇవ్వాలని అనుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాను. నా కెరీర్లో ఈ దశలో పద్మశ్రీని అందుకోవడానికి సిద్ధంగా లేనని.. ఆ దశను ఎప్పుడో దాటాన’ని అన్నారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. (చదవండి: బిపిన్, ఆజాద్లకు పద్మవిభూషణ్..) -
గులాం నబీ ఆజాద్కు పద్మ భూషణ్.. ‘ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు’
న్యూఢిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సహచరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మేరకు లోక్సభ ఎంపీ శశిథరూర్ మాత్రం అజాద్కు అభినందనలు తెలిపారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ అవార్డును తిరస్కరించారనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అతను అజాద్గా ఉండాలనుకుంటున్నాడు గులాం అవ్వాలను కోవట్లేదంటూ గులాం నబీ ఆజాద్పై పరోక్ష విమర్శలు గుప్పించారు. అంతేకాదు మాజీ బ్యూరోక్రాట్ పీఎన్ హస్కర్ పద్మ అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు 1973లో మన దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వోద్యోగి హస్కర్ పీఎంఓ నుండి నిష్క్రమించినప్పుడు అతనికి పద్మవిభూషణ్ను అందజేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దానిని ఆయన తిరస్కరించారు. హస్కర్ పుస్తకంలోని ఆ భాగం అత్యత్తుమమైనది, అనుకరణ అర్హమైనది అనే క్యాప్షన్ జోడించి మరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అయితే పద్మ అవార్డులను బహిరంగంగా తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే అవార్డు గ్రహీతలకు అవార్డు గురించి ముందుగానే తెలియజేయడమే కాక వారు అంగీకరించిన తర్వాత మాత్రమే జాబితాను ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్పై నిర్ణయాన్ని భట్టాచార్య భార్యకు తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కానీ, బుద్ధదేవ్ మాత్రం తనకు పద్మభూషణ్ గురించి ఏమి తెలియదని ఒకవేళ వారు పద్మభూషణ్ ఇచ్చినట్లయితే తిరస్కరిస్తున్నాను అని అన్నారు. In Jan 1973, the most powerful civil servant of our country was told he was being offered the Padma Vibhushan on his leaving the PMO. Here is PN Haksar's response to it. It is a classic, and worthy of emulation. pic.twitter.com/H1JVTvTyxe — Jairam Ramesh (@Jairam_Ramesh) January 25, 2022 (చదవండి: యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్) -
మన తెలుగు పద్మాలు
గణతంత్ర దినోత్సవం ముంగిట తెలుగు పద్మాలు నిండుగా వికసించాయి. తెలుగు కీర్తిని ఘనంగా చాటాయి. అనంతపురంలో పుట్టిన ఓ కుర్రాడు అంతర్జాతీయ యవనికపై తెలుగు కీర్తిబావుటాను రెపరెపలాడిస్తున్నాడు. కరోనా టీకాను అపర సంజీవనిగా అందించింది ఒక శాస్త్రవేత్తల జంట. కిన్నెరపై సొగసుగా పదనిసలు వాయిస్తూ జాతీయ స్థాయిలో అబ్బురపరుస్తున్నాడో అడవి బిడ్డ. మనిషి ఎలా జీవించాలి అంటూ ప్రపంచం నలుమూలలా తెలుగు మాటలను వ్యాపింపజేస్తున్నాడు ఒక ఆధ్యాత్మిక వేత్త. ఇలా చెప్తూ పోతే ఎన్నో పద్మాలు... ఎన్నో ప్రత్యేకతలు... టీకా మేకర్స్ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలన్న దృఢ సంకల్పమే వ్యవసాయంలో పట్టభద్రుడైన కృష్ణ ఎల్లాను శాస్త్రవేత్తను చేసింది. తమిళనాడులోని తిరుత్తణిలో 1969లో జన్మించిన ఆయన బెంగ ళూరులోని యూని వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్లో డిగ్రీ విద్య నభ్యసించారు. సౌత్ కరోలినా యూనివర్సి టీలో కొంతకాలం బోధన చేపట్టారు. ఆరోగ్య రంగం ఎదుర్కొం టున్న సవాళ్లకు పరిష్కారాలు కనుక్కోవాలన్న లక్ష్యంతో భార్య సుచిత్రతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చారు. 1996లో భారత్ బయోటెక్ను స్థాపించిన ఈ దంపతులు వ్యాక్సిన్ల తయారీలో తమదైన ముద్ర వేశారు. ఇప్పటివరకూ 116 అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ టీకాలను సరఫరా చేశారు. మానవాళికి సవాలు విసిరిన సార్స్–కోవ్–2 వైరస్ నియంత్రణకు అందరికంటే ముందుగా టీకా ప్రయ త్నాలు మొదలుపెట్టింది ఈ దంపతులే. అట్లా కోవాగ్జిన్ దేశీయ టీకాగా ఆవిర్భవించింది. శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా కృష్ణ ఎల్లా ఎదుగుదల వెనుక ఉన్న శక్తి ఆయన భార్య సుచిత్రా ఎల్లా. హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయం నుంచి పేటెంట్ చట్టాల్లో పీజీ డిప్లొమా చేశారు. నిజానికి సుచిత్రా అభ్యర్థన మేరకే కృష్ణ భారత్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ నగరంలో భారత్ బయోటెక్ ఏర్పాటుకు ఆమె కారణమయ్యారు. నటనా షావుకారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తమిళనాడు నుంచి ‘షావుకారు’ జానకిని పద్మశ్రీకి ఎంపిక చేశారు. 1931 డిసెంబరు 12న రాజ మండ్రిలో టి. వెంకోజీరావు, శచీదేవి దంపతులకు జన్మించారామె. అసలు పేరు శంకరమంచి జానకి. తన 11వ ఏటనే రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత అనేక రంగస్థల నాటకాల్లో నటిం చారు. మామూలుగా పెళ్లి తర్వాత కథానాయికల కెరీర్ అయి పోతుంది అంటారు. ఇల్లాలంటే ఇంటి బాధ్యతలు చూసుకోవాలని అనుకునే రోజుల్లో పెళ్లి తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ‘రక్షరేఖ’లో చంద్రిక పాత్ర చేశారు. అయితే 1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’తో ప్రసిద్ధి చెందారు. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తర్వాత శంకరమంచి జానకి కాస్తా ‘షావుకారు’ జానకిగా మారిపోయారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి హీరోలకు జోడీగా నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించారు. ‘డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు చేశారు. క్యారెక్టర్ నటిగా మారాక ‘తాయారమ్మ బంగారయ్య’, ‘సంసారం ఒక చదరంగం’ లాంటి చిత్రాల్లో కథకు కీలకంగా నిలిచే పాత్రలు చేశారు. 90 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తుండటం విశేషం. తమిళంలో రెండేళ్ల క్రితం తన 400వ సినిమాగా ‘బిస్కోత్’లో నటించారు. తెలుగులో ఆమె చేసిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ విడుదలకు సిద్ధంగా ఉంది. జీవితమే మెట్లుగా... కొంతకాలం క్రితం వరకు కిన్నెర వాద్యమంటే పెద్దగా తెలియదు. కానీ, సామాజిక మాధ్యమాల ప్రాభవంతో అలాంటి ఓ వాయిద్యముందనీ, దాన్ని సొంత తెలివితో ఓ అడవి బిడ్డ 12 మెట్లతో రూపొందించాడనీ, అతని పేరు మొగులయ్య అన్న విషయం వెలుగు చూసింది. నాగర్కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగిన దర్శనం మొగులయ్య క్రమంగా కిన్నెర మొగులయ్యగా మారారు. దీని మీద జానపదాలు, స్థానిక రాజులు, వీరుల గాథలను ఊరూరా తిరుగుతూ లయబద్ధంగా పాడతారు. తెలంగాణ ఆర్టీసీ ఆయన్ని తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. ‘ప్రభుత్వం నా కళను గుర్తించి ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారానికి ఎంపిక చేయటం సంతోషంగా ఉంది. అంతరించిపోతున్న కిన్నెర కళను బతి కించేందుకు పనిచేస్తాను. ఆసక్తి ఉన్న వారికి కిన్నెర కళను నేర్పిస్తాను’ అన్నారు. వైద్య నారాయణుడు డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు భీమవరం యూఎస్సీఎం ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. 1961–66 కాలంలో విశాఖ పట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1970లో అదే కళాశాల నుంచి∙ఆర్థోపెడిక్ సర్జరీలో ఎం.ఎస్.(ఆర్థోపెడిక్స్) పూర్తి చేశారు. తరువాత జర్మనీ వెళ్ళి మైక్రోవాస్కులర్, హ్యాండ్ సర్జరీ అంశాలలో శిక్షణ పొందారు. వచ్చాక ఆంధ్రా మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గానూ, విశాఖ పట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గానూ సేవలందించారు. రాణీ చంద్రమణి దేవి హాస్పిటల్, రెహాబిలిటేషన్ సెంటర్కు సూపరింటెండెంట్గా వ్యవహరించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ట్రామాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇప్పటి వరకూ 3 లక్షల వరకూ ఆపరేషన్లు చేశారు. ఒకే రోజు తన సిబ్బందితో విశాఖలో 325 శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ‘సర్జరీ ఆన్ పోలియో డిజెబిలిటీ’, ‘ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆర్థోపెడిక్స్’ పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు. పటం కథల్లో దిట్ట సమ్మక్క–సారలమ్మ గద్దె వద్ద నిలబడి ఆ వనదేవతల పటం కథ చెప్తుంటే భక్తులు తన్మయత్వంలో మునిగిపోతారు. కథ పాతదే. కానీ చేతిలో కోయ డోలును వాయిస్తూ అలాంటి డోలు ధరించిన ఇద్దరు వంతగాళ్లతో కలిసి కథను చెప్పే తీరు అబ్బురపరుస్తుంది. ఆ కథకుడే రామచంద్రయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన 60 ఏళ్ల గిరిజన కళాకారుడు. కోయ, తెలుగు... రెండు భాషల్లోనూ పటం కథలు చెబుతారు. నిరక్షరాస్యుడైనప్పటికీ గిరిజన యోధులు, వన దేవతల గాథలన్నీ మస్తిష్కంలో నిక్షిప్తం. తండ్రి సకిని ముసలయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రామచంద్రయ్య 12 ఏళ్ల ప్రాయం నుంచే గిరిజన దేవుళ్ల చరిత్రలు చెప్పడం మొదలు పెట్టారు ‘కోయ భాషలో గిరిజన దేవతల చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఈ కాలంలో ఎవరూ ముందుకురావడం లే’దని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను తండ్రి నుంచి నేర్చుకున్న కళను తన కుమారుడు బాబూరావుకు నేర్పించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. నాదస్వరమే ఊపిరిగా... భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో షేక్ అస్సాన్ సాహెబ్ నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఆయనను మరణాంతరం పద్మశ్రీ వరిం చింది. 1928 జనవరి 1న కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని గోసవీడు గ్రామంలో జన్మించిన షేక్ అస్సాన్ తన 93వ ఏట 23 జూన్ 2021న కన్ను మూశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నోప్రఖ్యాత దేవాలయాల్లో నాద స్వర ప్రదర్శ నలను ఇచ్చిన ఘనత ఈయన సొంతం. సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో 1950 నుంచి 1996 వరకు నాదస్వర ఆస్థాన విద్వాన్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. నాదస్వరంలో ప్రభుత్వ ఉద్యోగిగా రామాలయంలో పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి ముస్లిం ఈయనే కావడం విశేషం. ఆయన పలువురు శిష్యులు నాదస్వర విద్వాంసులుగా, ఉద్యోగులుగా ఆలయాల్లో పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ మొనగాడు! హైదరాబాద్లోని బేగంపేట ప్రాంతా నికి చెందిన తెలుగు బిడ్డ సత్య నాదెళ్ళ ఇవాళ ప్రపంచం తిరిగి చూసే స్థాయికి ఎదిగారు. దాని వెనుక ఆయన స్వయం కృషి, దీక్ష అనన్య సామాన్యం. 2014లో∙మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈఓగా ఎదిగిన ఆయన కథ ఎందరికో స్ఫూర్తి. ‘మొబైల్ – ఫస్ట్, క్లౌడ్ – ఫస్ట్’ వ్యూహంతో సత్య మైక్రోసాఫ్ట్ జాతకాన్నే మార్చేయడం ఓ చరిత్ర పాఠం. ఆయన పగ్గాలు చేపట్టినప్పుడు 30 వేల కోట్ల డాలర్ల చిల్లర ఉన్న మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ ఆపైన ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్లకు చేరడమే అందుకు ఓ నిదర్శనం. మాతృదేశాన్ని గర్వించేలా చేసిన భారతీయ – అమెరికన్ అయిన 54 ఏళ్ళ సత్యకు ‘వాణిజ్యం, పరిశ్రమల’ విభాగంలో చేసిన కృషికిగాను పద్మ పురస్కారం ప్రకటించారు. తండ్రి ఐ.ఏ.ఎస్. అధికారి అయిన సత్య కర్ణాటకలోని మణి పాల్లో ఇంజనీరింగ్ చేశారు. అమెరికాలోని విస్కాన్సిన్ – మిల్వాకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో ఎమ్మెస్ చదివారు. అమెరికా లోనే ఎమ్బీఏ చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్లో చేరక ముందు కొంత కాలం ఆయన సన్ మైక్రోసాఫ్ట్లో పనిచేశారు. మణిపాల్లో తన జూనియర్ – బీఆర్క్ విద్యార్థిని అయిన అనుపమను వివాహం చేసుకున్నారు. సత్య మామ గారు కూడా ఐఏఎస్సే. ముగ్గురు పిల్లల తండ్రి అయిన సత్యకు క్రికెట్ అంటే వీరాభిమానం. మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు బులిబులి అడుగులు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో పడ్డాయి. బాల్యం నుంచే పద్యధారణపై మక్కువ పెంచుకున్నారు. మేధను పెంచుకొనే క్రమంలో భాషకు సంబంధించి తల్లి ఇచ్చిన సవాళ్లను అధిగమించడం కోసం యత్నిస్తూ క్రమంగా ధారణను వంటబట్టించు కున్నారు. ఒకేసారి ఎక్కువ మంది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం ప్రారంభించి క్రమంగా అవధానాలు చేసే దిశగా అడుగులేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత కాకినాడలో అధ్యాపకులుగా చేరారు. ఖమ్మం జిల్లాలో కూడా కొంతకాలం పనిచేశారు. వృత్తి కొనసాగిస్తూనే 1992లో అష్టావధానాలకు శ్రీకారం చుట్టారు. 1996లో కాకినాడలో 1,116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు మహాసహస్రావధానాన్ని రంజుగా నిర్వహించి భేష్ అనిపించుకున్నారు. క్రమంగా అవధానం నుంచి ఆధ్యాత్మిక ప్రవచన కర్తగా ఎదిగారు. ఆధ్యాత్మిక ప్రసంగాల్లో ప్రాపంచిక విషయాలను జోడిస్తూ ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. సంప్ర దాయాలు, సనాతన పద్ధతులను కొనసాగిస్తూనే మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలపై ఆయన ప్రవచనాలే ఆయుధంగా పోరాడుతున్నారు. నాట్య రుద్రమ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేశపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ గడ్డం పద్మజారెడ్డి కూచిపూడి నర్తకిగా కళకు తన జీవితాన్ని అర్పిం చారు. కృష్ణా జిల్లా పామర్రులో 1967 జనవరి 1న డాక్టర్ జీవీరెడ్డి, స్వరాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. నిజామాబాద్ మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డిని వివాహం చేసుకుని తెలంగాణ కోడలు అయ్యారు. ఐదేళ్ల వయస్సు నుంచే కూచిపూడి నాట్యం వైపు అడుగులు వేసిన ఆమె ఇప్పటివరకు 3 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. శోభానాయుడు దగ్గర మెళకువలు నేర్చుకున్నారు. సత్యభామ, రుద్రమదేవి పాత్రలకు పేరొందారు. ‘కాకతీయం’ అనే తెలంగాణ క్లాసికల్ ఆర్ట్ ఫామ్ను రూపొందించారు. నృత్త రత్నావళి గ్రంథంలోని అంశాలను దృశ్యరూపంగా మార్చారు. మరోవైపు ఆడపిల్లల భ్రూణ హత్యలు, ఎయిడ్స్, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే అంశాలకు సంబంధించి నత్య ప్రదర్శనలు ఇచ్చారు. తన కుటుంబం తనకు ఎనలేని ప్రోత్సాహం ఇచ్చిందని ఆమె ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
సింగర్ సోనూ నిగమ్కు అరుదైన గౌరవం.. 'పద్మశ్రీ'తో సత్కారం
Singer Sonu Nigam Bags Padma Shri Award 2022: దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను హోం మంత్రిత్వ శాఖ మంగళవారం (జనవరి 25) ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ఈ ఏడాదికిగాను 128 మందికి ఈ అవార్డులు లభించాయి. ఈ అవార్డులను రాష్ట్రపతి తన అధికారిక నివాసం - రాష్ట్రపతి భవన్లో ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్లో జరిగే వేడుకల్లో ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్కు ఈ అరుదైన గౌరవ పురస్కారం దక్కింది. కళారంగంలో అనేక సేవలందించినందుకు గాను సోనూ నిగమ్ను 'పద్మశ్రీ' అవార్డుతో ప్రభుత్వం సత్కరించనుంది. జూలై 30, 1973న ఆగమ్ కుమార్ నిగమ్, శోభ నిగమ్ దంపతులకు హర్యానాలోని ఫరిదాబాద్లో జన్మించాడు సోనూ నిగమ్. నాలుగేళ్ల చిరుప్రాయం నుంచే తండ్రితోపాటు వేదికలెక్కి పాటలు పాడటం ప్రారంభించిన సోనూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 18 ఏళ్ల వయసులో బాలీవుడ్లో తానేంటే నిరూపించుకోవాలని ముంబైకి వచ్చాడు. హిందుస్తానీ గాయకుడు గులాం ముస్తఫా ఖాన్ వద్ద శిక్షిణ తీసుకున్నాడు. హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్ పురీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మైథిలి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, తుళు, తమిళం, తెలుగు, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ప్రేమ, దేశభక్తి, రాక్, వేదనా భరిత గీతాలను ఆలపించాడు. -
టెక్ దిగ్గజాలకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్కు పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్ చేసింది. ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. The President of India has approved conferment of 128 Padma Awards this year.#PadmaAwards#RepublicDay2022 The list is as below - pic.twitter.com/4xf9UHOZ2H — DD News (@DDNewslive) January 25, 2022 (చదవండి: Padma Awards 2022: బిపిన్ రావత్కు పద్మ విభూషణ్!) -
Padma Awards 2022: బిపిన్కు విభూషణ్..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులు వరించిన వాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణకు ఒక పద్మ భూషణ్తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పూనావాలా, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్లకు పద్మ భూషణ్ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్కు ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్తో పాటు రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్ సింగ్ (మరణానంతరం), ప్రభా ఆత్రే ఎంపికయ్యారు. పద్మ భూషణ్కు మాజీ కాంగ్రెస్ లీడర్ గులాం నబీ ఆజాద్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఐ (ఎం) నేత బుద్ధదేవ్ భట్టాచార్య, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా, కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ను దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, పంజాబీ ఫోక్ సింగర్ గుర్మీత్ బవ, నటుడు విక్టర్ బెనర్జీ, కేంద్ర మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిశ్రీలను కేంద్రం ఎంపిక చేసింది. తమిళనాడు రాష్ట్రం నుంచి నటి షావుకారు జానకి, అలాగే ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన నీరజ్ చోప్రా, సింగర్ సోనూ నిగమ్లు పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఈసారి 34 మంది మహిళలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వాళ్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తుంటారు. ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించారు. అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు. పద్మ భూషణ్కు తెలంగాణ నుంచి భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు).. ఏపీ నుంచి గోసవీడు షేక్ హాసన్ (కళలు) (మరణానంతరం), డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది. -
ప్రతిభకే 'పద్మ' పురస్కారాలు
సాక్షి, నెల్లూరు: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారి ప్రతిభ, సేవల కొలమానంగానే కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చెప్పారు. ఇటీవల సినీనటి కంగనాకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంపై పలు రాజకీయపార్టీల నేతలు చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గతంలో కేంద్రం ఇచ్చే అత్యున్నత పురస్కారాలకు ఎంపిక రాజకీయ సిఫార్సుల మేరకు జరిగేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వసంతోత్సవాల్లో ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖనే ఎన్నుకుని సేవలందించిన వెంకయ్యనాయుడిది గొప్ప వ్యక్తిత్వమని చెప్పారు. ఆస్తిలో సగభాగం కూతురికి ఇవ్వాలి: ఉప రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కుటుంబ ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు సగభాగం రావాలని, అప్పుడే సాధికారత ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ భారత సాధికారతే ధ్యేయంగా స్థాపించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రెండు దశాబ్దాల సేవాప్రస్థానాన్ని పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల నడవడిక విలువలతో ఉండాలని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి తులసి మొక్కలు నాటారు. స్వర్ణభారత్ ట్రస్ట్ రూపొందించిన సావనీర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్
ఒడిశాకు చెందిన 102 ఏళ్ల టీచర్ నందా ప్రస్తీ మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో నందా చేసిన సేవలకు ఆయనకు ఈ అవార్డు వరించింది. అయితే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇంతకు మించిన మరో విషయం నెటిజన్లను ఆకర్షించింది. అవార్డు అందుకున్న ప్రస్తీ రాష్ట్రపతి కోవింద్ను నిండైన చేతులతో ఆశీర్వదిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. ట్విటర్లో వేల రియాక్షన్లను అందుకుంటోంది. చదవండి: పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది నందా సర్ అని కూడా పిలువబడే ప్రస్ట్రీ ఒడిశాలోని జాజ్పూర్లో పిల్లలతోపాటు పెద్దలకు ఉచిత విద్యాను అందించేందుకు తనను తాను అంకితం చేసుకున్నాడు. తన గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించడమే అతని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాడు. ‘రాష్ట్రపతి కోవింద్ సాహిత్యం, విద్య కోసం చేసిన కృషికి నందా ప్రస్తీకి పద్మశ్రీని ప్రదానం చేశారు. ఒడిశాలోని జాజ్పూర్లో దశాబ్దాలుగా పిల్లలు, పెద్దలకు ఉచిత విద్యను అందించిన 102 ఏళ్ల “నందా సర్”, రాష్ట్రపతిని ఆశీర్వదిస్తున్నారు. అని భారత రాష్ట్రపతి ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది. చదవండి: పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!! కాగా ప్రస్తీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విద్యపై ఆయనకున్న అంకిత భావాన్ని అభినందిస్తున్నారు. అంతేగాక రాష్ట్రపతిని ఆశీర్వదించడం ఎంతో అమూల్యం, విలువైనదని కొనియాడుతున్నారు. ‘మాటల్లో వర్ణించలేనిది. ఇది నేను కలలుగన్న భారతం. నిజమైన గురువు.. అద్భుతమైన ఫోటో. అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ President Kovind presents Padma Shri to Shri Nanda Prusty for Literature & Education. 102-yr-old “Nanda sir”, who provided free education to children and adults at Jajpur, Odisha for decades, raised his hands in a gesture of blessing the President. pic.twitter.com/4kXPZz5NCJ — President of India (@rashtrapatibhvn) November 9, 2021 ఇదిలా ఉండగా సోమవారం, మంగళవారం రెండు రోజులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వివిద రంగాలకు చెందిన వారికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో ఏడు పద్మ విభూషణ్లు, 10 పద్మ భూషణ్, 102 పద్మ శ్రీ అవార్డులు అందించారు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వరకూ ఉన్నారు. -
పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది
సాక్షి, వెబ్డెస్క్: ట్రాన్స్జెండర్లు.. ఈ పేరు వినగానే చాలా మందికి రోడ్డు మీద భిక్షాటన చేసుకునేవారే గుర్తుకు వస్తారు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే పొరపాటు. వారిలో కూడా చాలామంది మంచి ఉద్యోగాలు చేసేవారు.. సమాజసేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నావారు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మంజమ్మ జోగతి. ట్రాన్స్జెండర్ అయినప్పటికి మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతోంది. ఫోక్ డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక అవార్డు తీసుకునే వేళ మంజమ్మ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజనులు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ) కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్విమెన్గాను మంజమ్మ జోగతి రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకునే సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను తనదైన స్టైల్లో ఆశీర్వదించి, నమస్కరించిన తీరు సభికుల్ని ఆకట్టుకుంది. మంజమ్మ తన చీర కొంగుతో రామ్నాథ్కు దిష్టి తీసినట్లు చేశారు. ఇది వారి స్టైల్లో ఆశీర్వదించడం అన్నమాట. రామ్నాథ్ కోవింద్ కూడా మంజమ్మ ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఇది చూసిన సభికులు చప్పట్లతో వారివురిని ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్గా నిలిచారు మంజమ్మ. (చదవండి: పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!) మంజమ్మ జీవితం.. మంజమ్మ దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకుని.. నిలబడి.. నేడు సన్మానాలు అందుకున్నారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించిన తర్వాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు. ఇక ఆమె కుటుంబం మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లింది. ట్రాన్స్జెండర్ల సంఘం తమను తాము రేణుకా ఎల్లమ్మ దేవత సేవలో అంకితం చేసుకునే ప్రక్రియే జోగప్ప. ఇలా మారిన వారు దేవతను వివాహం చేసుకున్నట్లు భావిస్తారు. పేదరికం, సాంఘిక బహిష్కరణ, అత్యాచారాల మధ్యనే మంజమ్మ జోగతి పలు కళారూపాలు, జోగతి నృత్యం, స్త్రీ దేవతలను స్తుతిస్తూ కన్నడ భాషా జానపద పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. (చదవండి: బిగ్బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..) మంజమ్మ సేవలకు గాను 2006లో, ఆమెకు కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 13 సంవత్సరాల తర్వాత అనగా 2019లో, ఆమె సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. చదవండి: భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను -
పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు
సాక్షి, న్యూఢిల్లీ/మదనపల్లె సిటీ(చిత్తూరు జిల్లా)/రాజాం: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 2020వ సంవత్సరానికి సంబంధించి మొత్తం 141 పురస్కారాలను అందజేశారు. ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. ఇందులో మొత్తం 33 మంది మహిళలున్నారు. ఏపీ నుంచి ముగ్గురు.. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు ‘పద్మ’ అవార్డులు అందుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, చిత్తూరు జిల్లా మదనపల్లె వాస్తవ్యులు, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు, అనంతపురం జిల్లాకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు దాళవాయి చలపతిరావు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ నుంచి రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్రెడ్డి, సంస్కృత వాచస్పతిగా పేరొందిన శ్రీభాష్యం విజయసారథి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. అందరి సంతోషం కోసం.. ముంతాజ్ పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ముంతాజ్ అలీ కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 19 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లారు. అక్కడ మధుకర్నాథ్తో ఏర్పడిన పరిచయం ద్వారా వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకోవడంతో పాటు «ధ్యానం, క్రియా యోగాల్లో శిక్షణ తీసుకున్నారు. 1996లో చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. 2015లో వాక్ ఆఫ్ హోప్ యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు యాత్ర చేశారు. నక్కలదిన్నె సమీపంలో సత్సంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడే గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. యోగా, ధ్యానంపై ప్రచారం చేస్తూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దేశవిదేశాల్లో సత్సంగ్ ఆధ్యాత్మిక సంస్థలు పనిచేస్తున్నాయి. అందరూ సంతోషంగా ఉండాలన్న ఆశయంతో ముంతాజ్ అలీ పనిచేస్తున్నారు. కళే.. ఇంతవాడిని చేసింది పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. నాకు పురస్కారాలు, సత్కారాలు వస్తాయని ఏనాడూ అనుకోలేదు. నా జీవనం కోసం కళను నమ్ముకున్నాను. ఆ కళే నన్ను ఇంతవాడిని చేసింది. నక్షత్రక పాత్రే నాకు ఇంతటి ఖ్యాతిని తెచ్చిపెట్టింది. నాలో ఉన్న నటుడిని.. నా గురువు యడ్ల సత్యంనాయుడు ప్రపంచానికి పరిచయం చేస్తే, నాకు అన్ని విధాలా నా భార్య జయమ్మ సహకరించింది. మందరాడ గ్రామ ప్రజలంతా నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. బాలభారతి కళా నాట్యమండలికి, కుటుంబీకులకు, తోటి కళాకారులకు, మందరాడ గ్రామస్తులకు ఈ పురస్కారం అంకితం. – పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్ల గోపాలరావు -
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
-
పద్మ అవార్డుల ప్రదానం
-
పద్మ అవార్డుల ప్రదానోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డు ప్రకటించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషన్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం అరుణ్ జైట్లీకి పద్మ విభూషన్, సుష్మా స్వరాజ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పద్మ విభూషన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. విజయవాడ వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురానికి చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్రావు, తొలి మృదంగ కళాకారిణి విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి రాష్ట్రపతి చేతులమీదిగా పద్మ శ్రీ పురాస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ కళాకారుడు కనకరాజుకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. -
‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం 2022 ఏడాదికిగాను పద్మ అవార్డులకు గాను నామినేషన్లు, సిఫారసుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దఖాస్తులను ఆహ్వానిస్తోంది. నామినేషన్లకు స్వీకరించేందుకు తుది గడువును సెప్టెంబర్ 15గా కేంద్రం తాజాగా ప్రకటించింది. నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొంది. పద్మ అవార్డులను "ప్రజల పద్మ" గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈనేపథ్యంలో మహిళలు, ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని గుర్తించి సిఫారసు చేయాలని కేంద్రం కోరింది. వారి ప్రతిభ, విజయాల ఆధారంగా, కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ అవార్డులు అందజేయనున్నామని తెలిపింది. . ఆసక్తి, అర్హతగల వారు వచ్చే నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. కాగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అసాధారణ కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను ‘పీపుల్స్ పద్మ’ అవార్డులకు నామినేట్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే (జూలై ,11న) దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పద్మ అవార్డు: ట్రెండింగ్లో సోనూసూద్ -
పద్మ అవార్డు: ట్రెండింగ్లో సోనూసూద్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టుకున్నది మొదలు ప్రతీ దశలో సాయం చేసేందుకు ముందు వరసలో నిలుస్తూ రియల్ హీరోగా ప్రశంసంలందుకుంటున్న నటుడు సోనూసూద్కు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. సామాన్యులనుంచి సెలబ్రిటీల దాకా ఆయన సేవలను కొనియాడుతున్నవారే. ఇటీవల తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా రియల్ హీరో అంటేనే సోనూ సూదే అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ మరో అడుగు ముందుకేశారు. సోనూ సూద్కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇవ్వాలంటూ తను గట్టిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు తన ప్రతిపాదనను సమర్ధించే వారంతా తన ట్వీటను రీట్వీట్ చేయమని బ్రహ్మాజీ కోరారు. దీంతో ట్విటర్లో రీట్వీట్ల సందడి నెలకింది. మరోవైపు ఈ ట్వీట్కు సోనూసూద్ స్పందించిన తీరు విశేషంగా నిలిచింది. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా? 135 కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే పెద్ద అవార్డు. దానిని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు“ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో దటీజ్ సోనూ సూద్ అంటూ ట్వీపుల్ కొనియాడుతున్నారు. పద్మ అవార్డులకు పేర్లను సిఫార్స్ చేయమంటూ కేంద్రం కోరుతోందనే వార్తను పీటీఐ వెల్లడించింది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ నామినేష్లన స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీని చివరి తేదీగా తెలిపింది. దీంతో కరోనా మొదటి వేవ్నుంచి ఇప్పటికే తనదైన రీతిలో బాధితులను ఆదుకుంటున్న సోనూ సూద్కు పద్మ అవార్డు లభించాలంటూ కోరుకుంటున్నారు. కాగా కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవ చేసినవారికి ఈ అత్యున్నత పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం మే 1, సెప్టెంబరు 15 తేదీలలో పద్మ పురస్కారానికి సంబంధించిన సిఫారసులను భారత ప్రధాని ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగాఎంపిక చేసిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. చదవండి : Hanuma vihari: అందరమూ ఒకరికి సాయం చేయొచ్చు! The love of 135 crore Indians is my biggest award brother, which I have already received.🇮🇳 Humbled 🙏 https://t.co/VpAZ8AqxDw — sonu sood (@SonuSood) June 11, 2021 #padmavibhushan for @SonuSood ..if u agree with me..pl retweet.. #padmavibhushsnforsonusood #respectsonu https://t.co/cqV4We9uX3 — BRAHMAJI (@actorbrahmaji) June 11, 2021 -
‘పద్మ’గీతం గానం: చిత్ర, బాలు
ఒకరు గురువు.. ఒకరు శిష్యురాలు ఒకరు తెలుగు. ఒకరు మలయాళం. ఒకరు లేరు. ఒకరు ఆ జ్ఞాపకాన్ని, గానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరికి పద్మవిభూషణ్ వచ్చింది. ఒకరికి పద్మభూషణ్. పాటకు దక్కిన అంజలి ఇది. తెలుగు శ్రోతలకు ఈ ఇద్దరూ ఇచ్చిన వెలకట్టలేని గీతాలెన్నో. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్రలకు పద్మ పురస్కారాలు వచ్చిన సందర్భంగా ఆ పాటలు తలుచుకుని అభినందనలు తెలపాలి. ‘నిప్పులోన కాలదు... నీటిలోన నానదు.. గాలిలాగ మారదు... ప్రేమ సత్యము’ అని పాడతారు చిత్ర. ‘రాచవీటి కన్యవి.. రంగు రంగు స్వప్నము.. పేదవాడి కంటిలో ప్రేమరక్తము’ అని పాడతారు బాలు. వింటున్నవారందరూ ఏ వయసు వారైనా ప్రేమ స్పర్శను అనుభవిస్తారు. వారిద్దరి జోడి అలాంటిది. తెలుగు సినీ సంగీత అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. దుఃఖంగా కూడా ఉన్నారు. సంతోషం చిత్ర, బాల సుబ్రహ్మణ్యంలకు ‘పద్మ’ అవార్డులు వచ్చినందుకు. దుఃఖం.. బాలుగారు లేనందుకు. ఉండి ఉంటే ఇవాళ వీరి యుగళ గీతాలు మరింత హుషారుగా మోగిపోయేవి. తెలుగులో బాల సుబ్రహ్మణ్యం తిరుగులేని మేల్ సింగర్. ఆయన పక్కన కొద్దిగా దస్తీ వేయగలిగినది మనో ఒక్కడే. కాని చిత్ర తెలుగులో టాప్ రేంజ్కు వెళ్లడం అంత సులువు కాదు. ఎందుకంటే ఆమె తెలుగులో 1985లో ‘సింధుభైరవి’తో అడుగుపెట్టే సమయానికి ఇక్కడ సుశీల, జానకిలు శక్తిమంతంగా ఉన్నారు. చక్రవర్తి, కె.వి.మహదేవన్లు బాలు, సుశీల, జానకీలతోటే అన్ని పాటలు పాడించేవారు. కొన్ని పాటలు శైలజ కు వెళ్లేవి. ఇందరు ఉండగా చిత్ర ప్రవేశం కష్టమే. కాని 1986లో ‘డాన్స్ మాస్టర్’ సినిమాకు డబ్బింగ్ పాడుతున్నప్పుడు బాలు చిత్రలోని టాలెంట్ను దగ్గరి నుంచి గమనించారు. ఆ సినిమాలో ‘రావేల వసంతాలే’ పాట చిత్రను ఇంటింట మోగే రేడియో గొంతుగా మార్చింది. అందులోని ‘జింగిల్జింగా జీమూతా జింగిల్జింగా’, ‘కవిత చిలికింది’ పాటలు బాలు, చిత్ర పాడారు. చిత్ర మలయాళీ. ఆమెకు తమిళం బాగానే తెలుసు. కాని తెలుగు బొత్తిగా తెలియదు. బాలు ఆమెకు సాయం చేసేవారు. తెలుగు ఉచ్ఛరణ దాదాపుగా ఆమె బాలు వల్లే నేర్చుకున్నారు. ‘చెప్పి చెప్పి ఒక దశలో నేను చెప్పను నువ్వే నేర్చుకో అన్నాను. పట్టుదలగా నేర్చుకుంది’ అని బాలు ఒక సందర్భంగా మెచ్చుకోలుగా అన్నారు. 1990 వరకు చిత్రకు తెలుగులో సరైన పూనిక దొరికలేదు. ‘ఆఖరి పోరాటం’లో చిత్ర, బాలు పాడిన ‘ఎప్పుడు ఎప్పుడు’, ‘అబ్బ దీని సోకు’ హిట్ అయినా. చిత్రకు తెలుగు అవకాశాలు ఇళయరాజా ఇస్తూ వెళ్లారు. ‘మరళమృదంగం’లో బాలు, చిత్ర పాడిన ‘గొడవే గొడవమ్మా’ పెద్ద హిట్. ‘వారసుడొచ్చాడు’లో ‘నీ అందం నా ప్రేమగీతం గోవిందం’ పాట కూడా. ఆ తర్వా ఇళయరాజా చిత్ర, బాలుల గళాలతో సృష్టించిన స్వరచరిత్ర ‘గీతాంజలి’. అందులో ఇద్దరూ కలిసి అమృతం కురిపించారు. ‘ఓ ప్రియా ప్రియా’, ‘ఓం నమహ’ డ్యూయెట్లు ఎంతో ప్రియమైనవి. ఇక ‘జగదేక వీరుడు–అతిలోకసుందరి’ కోసం వీరు పాడిన విఖ్యాత డ్యూయెట్ ‘అబ్బనీ తీయని దెబ్బ’ రికార్డులు సృష్టించింది. కీరవాణి రాకతో 1990లో ‘మనసు–మమత’ సినిమాతో కీరవాణి రాకతో బాలు, చిత్ర, కీరవాణిల పాటలు తెలుగు నేలను ఊపేశాయి. కీరవాణి చిత్రతోనే ఎక్కువ పాటలు చేశారు. బాలుకు కొత్త ఊపు తెచ్చారు. బాలు, చిత్ర కలిసి పాడిన ‘పూసింది పూసింది పున్నాగ’ కీరవాణి తెలుగువారికి ఇచ్చిన ఒక పున్నాగపువ్వు పరిమళం. ‘క్షణక్షణం’లో బాలు, చిత్ర ఆయన బాణీలకు హిట్ రేంజ్ తెచ్చారు. ‘అమ్మాయి ముద్దు ఇవ్వందే’, ‘జాము రాతిరి’... ఇప్పటికీ వింటున్నారు. ఇక కీరవాణి చేసిన ‘అల్లరి ప్రియుడు’ అచ్చంగా బాలు, చిత్రల మ్యూజికల్. ‘అహో.. ఒక మనసుకు నచ్చిన’, ‘రోజ్ రోజ్ రోజా పువ్వా’... పాటల పూలు. ఇక కీరవాణి సంగీతంలో వచ్చిన ‘క్రిమినల్’ క్లాసిక్ డ్యూయెట్ ‘తెలుసా.. మనసా’ ఎలా మరువగలం. ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘పెళ్లి సందడి’.. ఇవన్నీ బాలు, చిత్రల మేజిక్తో నిండి ఉన్నాయి. ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా అమ్మకచెల్లా’ ఎలా మర్చిపోగలం. రెహమాన్తో బాలు, చిత్రలు ఏ.ఆర్.రెహమాన్ పాటలతో తెలుగు సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రెహమాన్ తొలి సినిమా ‘రోజా’లో వీరిద్దరూ కలిసి పాడిన ‘పరువం వానగా’... లోని మాధుర్యం ఎంతని. ఆ తర్వాత ‘డ్యూయెట్’లో బాలు, చిత్రల ప్రతిభకు గొప్ప ఉదాహరణగా ‘అంజలి.. అంజలి.. పుష్పాంజలి’ పాట ఉంటుంది. ఆ పాట చరణంలో హైపిచ్లో ఇద్దరూ పాడేది వినాలి. అందులో చిత్ర ఆలాపనలూ అద్భుతం. ఎన్నో ఆణిముత్యాలు.. చిత్ర, బాలూ లేకపోతే తెలుగులో 1990 –2000 మధ్య సినిమా సంగీతం లేదన్నంతగా వారు వందలాది గీతాలు పాడారు. ఆ తర్వాత కొత్తతరం సంగీత దర్శకులు వచ్చినా వీరి జోడుగానం కొనసాగింది. రాజ్కోటిల సంగీతంలో వచ్చిన ‘ప్రియరాగాలే’ (హలో బ్రదర్), ‘అందమా అందుమా’ (గోవిందా గోవిందా), ఎస్.ఏ.రాజ్కుమార్ సంగీతంలో వచ్చిన ‘గుండె నిండ గుడి గంటలే’, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ‘నా మనసునే మీటకే’ (మన్మథుడు)... ఆ లిస్టుకు అంతే లేదు. చిత్ర బాలూను గురువుగా భావిస్తారు. ఆ గురుపరంపరను ఆమె కొనసాగిస్తున్నారు. శిష్యురాలికి ‘పద్మభూషణ్’, గురువుకు ‘పద్మవిభూషణ్’ వచ్చిన ఈ వేళ నిజంగా సంగీతమయమైన వేళ. పాటగా వ్యాపించి ఉన్న బాలు సంతృప్తి పడేవేళ. ‘నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా.. నా మనసేమో నా మాటే వినదంటా’... – సాక్షి ఫ్యామిలీ -
గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి
సాక్షి, ఆదిలాబాద్ : కొమరం భీమ్ జిల్లా అదివాసీ కళాకారునికి అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయాలు పాటిస్తూ, ఆచారాలు పరిరక్షిస్తున్న ఆదివాసీ కళకారుడు కనకరాజు.. సంప్రదాయ గుస్సాడీ న్రుత్యం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి గుస్సాడీ కళకారుడు కనకరాజును కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు దక్కిన వారిలో తెలంగాణ నుంచి ఎంపికైన వారిలోకనకరాజు ఏకైక వ్యక్తి కావడం విశేషం. గిరిజన గుస్సాడీ కళకారునిగా అరుదైన పద్మశ్రీ అవార్డు కనకరాజుకు లభించడంతో అదివాసీల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అదివాసీ కళకారునికి కేంద్ర పురస్కారం దక్కించుకున్న కనకరాజును అందరూ అభినందిస్తున్నారు. చదవండి: పద్మ పురస్కారాలు: ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ అద్బుతమైన కళా నైపుణ్యంతో ఈ అవార్డును సాదించిన కనకరాజును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా ఓకళాకారునిగా కేంద్రం పురస్కారం లబించడంపై కనకరాజు సంతోషం వ్యక్తం చేశారు. కలలో కూడ ఈ అవార్డు దక్కతుందని ఊహించలేందని భావోద్వేగానికి లోనయ్యారు. అవార్డు తనకు దక్కినప్పటికీ గిరిజనుల కళకు సర్కార్ ఇచ్చిన గౌరవంగా బావిస్తున్నానని కనకరాజు పేర్కొన్నారు. అయితే కళకారుని అద్బుతమైన నైపుణ్యం ఉన్నా.. అర్థికంగా అంతంత మాత్రమే బతుకున్నారని, అర్థికంగా సర్కారు అదుకోవాలని కనకరాజు కోరారు. అయితే గుస్సాడీ కళ వందల ఎళ్ల కాలం నుండి వస్తున్నా కళ. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా దండారి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అదివాసీల దైవం ఎథ్మసూర్ను ప్రార్థిస్తూ గుస్సాడీ నృత్యం చేస్తారు గిరిజనులు. గుస్సాడీ నృత్యం చేసే వాళ్లు నెత్తిన నెమలి పించం, భుజాన జింక చర్మాన్ని దరించి, చేతిలో దండారి పట్టుకొని గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా గుస్సాడీ చేసే నాట్యం చూపరుల గుండెలను హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి అద్బుతమైన కళను కనరాజు పరిరక్షరిస్తున్నారు. అందులో బాగంగా గుస్సాడీలో గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు. ఈవిదంగా కొన్ని వందల మందికి శిక్షణ ఇచ్చారు. అందుకే కనకరాజును గుస్సాడీ గురువుగా పిలుస్తుంటారు. ఒకవైపు గుస్సాడీ కళను పరిరక్షిస్తూనే మరోకవైపు కనకరాజు శిక్షణ ఇస్తున్నారు. అద్బుతమైన నైపుణ్యంతో అనేక ప్రాంతాలలో గుస్సాడీ కళ ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ ప్రదాన మంత్రి ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చారు..ఇలా ఏందరో మహనుబావులను గుస్సాడీ కళ నైపుణ్యంతో అకట్టుకున్నారు. వివిర రంగాల వ్యక్తుల నుండి ప్రశంసలు, మన్ననలు కనకరాజుకు లబించాయి. -
పద్మ పురస్కార గ్రహీతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక పద్మ పురస్కార గ్రహీతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని, పురస్కార గ్రహీతలు ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించి రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చారని సీఎం తన సందేశంలో కొనియాడారు. వాయులీన వైతాళికుడు ‘అన్నవరపు’ శాస్త్రీయ సంగీత కళలో అంతర్జాతీయ గుర్తింపు తెనాలి : ఉత్కృష్టమైన సంగీత కళాకారులకు నిలయం కృష్ణాతీరం. వారిలో విజయవాడకు చెందిన ‘నాద సుధార్ణవ’ అన్నవరపు రామస్వామి ప్రసిద్ధులు. వాయులీన విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను స్వీకరించిన ఈ వైతాళికుడికి 97 ఏళ్ల వయసులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. రామస్వామి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర్లోని సోమవరప్పాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, అన్నవరపు పెద్దయ్య. రామస్వామి 1926లో జన్మించారు. సంగీత కుటుంబంలో జన్మించినా యుక్తవయసులో సంగీత సాధనకు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. తొలుత మాగంటి జగన్నాథం చౌదరి దగ్గర రెండేళ్లు వయొలిన్ శిక్షణ తీసుకున్నారు. సుశిక్షణ కోసమని 12 ఏళ్ల వయసులో 1942లో విజయవాడ చేరుకున్నారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు అన్నవరపు రామస్వామి సహధ్యాయి. వారాలు చేసుకుంటూ గురుకుల పద్ధతిలో గురువు సుశ్రూష చేసుకుంటూ సంగీతాన్ని అభ్యసించారు. రామస్వామి ఆకాశవాణిలో 1948 నుంచి 1986 వరకు వయొలినిస్టుగా పనిచేశారు. ఆకాశవాణి, దూరదర్శన్లో సంగీత కార్యక్రమాల రూపకల్పన చేశారు. పలు దేశాల్లో పర్యటించి, భారతీయ శాస్త్రీయ సంగీతకళ ఔన్నత్యాన్ని చాటారు. తెలుగు విశ్వవిద్యాలయం సంగీత విద్యకు సంబంధించిన సలహా సంఘ సభ్యుడిగా, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంగీత విద్య సలహా విభాగ సభ్యుడిగా, ఆకాశవాణి ప్రోగ్రాం కమిటీ సలహా విభాగంలోనూ పనిచేశారు. ఏఐఆర్ న్యూఢిల్లీకి చెందిన టాప్ గ్రేడింగ్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు. వివిధ ప్రతిష్టాత్మక వేదికలపై ‘నాద సుధార్ణవ’, ‘వాయులీన కళాకౌముది’, ‘వాద్యరత్న’, ‘కళాభారతి’... వంటి ఎన్నో బిరుదులతో సత్కారం అందుకున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమి, రాష్ట్ర సాంస్కృతిక మండలి ‘హంస’, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బహూకరించిన రూ.10 లక్షల నగదుతో కూడిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డు ప్రతిష్టాత్మకమైనవి. సంగీత విద్యను ఎందరికో ఉచితంగా నేర్పిస్తూ వచ్చారు. పద్యకవితా చక్రవర్తి ‘ఆశావాది’ ఆశావాది ప్రకాశరావుకు పద్మశ్రీ పురస్కారం అనంతపురం: జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి, అష్టావధాని ఆశావాది ప్రకాశరావును పద్మశ్రీ అవార్డు వరించింది. ప్రాచీన, ఆధునిక కవితా సమ్మేళనంగా కీర్తిగాంచిన ఆశావాది జిల్లాలోని పెనుకొండ వాసులైన పక్కీరప్ప, కుళ్లాయమ్మ దంపతులకు 1944లో జన్మించారు. దళిత నేపథ్యంలో ఎన్నో అవమానాలకు గురైనా గుర్రం జాషువా లాంటి వారి స్ఫూర్తితో ఆయన సాగించిన కవితా ప్రయాణంలో చిరస్మరణీయమైన విజయాలెన్నింటినో నమోదు చేశారు. చిన్నవయసులోనే నండూరి రామకృష్ణామాచార్యుల ఆశీస్సులందుకున్న ఆశావాది చిరుతప్రాయంలోనే శ్రీశైలంలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్పై ఆశువుగా పద్యం చెప్పి ప్రశంసలు పొందారు. ఆశావాదిలోని ప్రతిభా పాటవాలను గుర్తించిన రాధాకృష్ణన్.. ఎప్పటికైనా తెలుగువారు గర్వించే కవిగా మారతావన్న మాటను అక్షర సత్యం చేస్తూ ఆయన కలం నుంచి తర్వాతి కాలంలో ఎన్నో విలువైన పుస్తకాలు వెలువడ్డాయి. అధ్యాపకుడిగా వేలాదిమంది విద్యార్థులకు ఆయన జీవిత పాఠాలను బోధించారు. రాష్ట్రవ్యాప్తంగా 170 అవధానాలు చేశారు. ఆణిముత్యాల వంటి 60 గ్రంథాలు రాశారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, కళారత్న పురస్కారంతో పాటు వందల సంఖ్యలో సాహితీ, కళాసంస్థలు ఆయనకు పురస్కారాలు, సత్కారాలనందించి గౌరవించాయి. జిల్లా పద్య కవిత్వానికి ఆశాకిరణంగా మారిన ఆశావాదికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ, జనప్రియ కవి ఏలూరు యంగన్న, ఉమర్ ఆలీషా సాహితీసమితి ప్రతినిధులు రియాజుద్దీన్, షరీఫ్ తదితరులు అభినందనలు తెలిపారు. మృదంగ విన్యాసంలో వికసించిన పద్మం దండమూడి సుమతికి పురస్కారం.. పులకించిన ‘పశ్చిమ’ ఏలూరు (ఆర్ఆర్పేట): పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మృదంగ కళాకారిణి దండమూడి సుమతి రామమోహన్రావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. తమ జిల్లా కళాకారిణికి ఈ అవార్డు రావడంపై జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఏలూరులో 1950లో జన్మించారు. నిడుమోలు రాఘవయ్య, వెంకటరత్నమ్మల 14 మంది సంతానంలో ఒకరైన ఆమె బాల్యంలో తండ్రి వద్దే మృదంగ శిక్షణ పొందారు. ఆమె భర్త దండమూడి రామమోహన్రావు సైతం మృదంగం విద్వాంసులే. మృదంగ వాయిద్యానికి సంబంధించి ఆమె అత్యుత్తమ గురువుగా, ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ప్రఖ్యాతి గడించారు. దేశ, విదేశాల్లో అనేక సంగీత ఉత్సవాల్లో పాల్గొన్నారు. సుమతిని మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఉత్తమ మృదంగ కళాకారిణి అవార్డుతో మూడుసార్లు సత్కరించింది. సుమతి రామమోహన్రావు కర్ణాటక వాయిద్య సంగీతానికి చేసిన కృషికి సంగీత నాటక్ అకాడమీ అవార్డు అందుకున్నారు. -
ఏడుగురికి ‘పద్మశ్రీ’...
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పౌర పురస్కారాల్లో ఏడుగురికి ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. ఈ జాబితాలో సుధా సింగ్ (ఉత్తరప్రదేశ్–అథ్లెటిక్స్), మౌమా దాస్ (పశ్చిమ బెంగాల్–టేబుల్ టెన్నిస్), అనిత పాల్దురై (తమిళనాడు–బాస్కెట్బాల్), వీరేందర్ సింగ్ (హరియాణా–బధిర రెజ్లర్), మాధవన్ నంబియార్ (కేరళ–దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష కోచ్), కేవై వెంకటేశ్ (కర్ణాటక–పారాథ్లెట్), అన్షు జమ్సెన్పా (పర్వతారోహకురాలు–అరుణాచల్ ప్రదేశ్) ఉన్నారు. 34 ఏళ్ల సుధా సింగ్ 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో, 2017 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 3000 మీటర్ల స్టీపుల్చేజ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన సుధా సింగ్ 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లోనూ బరిలోకి దిగింది. బెంగాల్కు చెందిన 36 ఏళ్ల మౌమా దాస్ 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్ విభాగంలో రజతం సాధించింది. భారత్ తరఫున అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్షిప్లలో ఆమె బరిలోకి దిగింది. చెన్నైకి చెందిన 35 ఏళ్ల అనిత పాల్దురై భారత మహిళల బాస్కెట్బాల్ జట్టుకు ఎనిమిదేళ్లపాటు కెప్టెన్గా వ్యవహరించింది. హరియాణాకు చెందిన 34 ఏళ్ల వీరేందర్ సింగ్ 2005, 2013, 2017 బధిర ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు స్వర్ణ పతకాలు అందించాడు. -
వ్యాపార పద్మాలు అయిదుగురు..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ఈసారి వ్యాపార, పారిశ్రామిక రంగంలో అయిదుగురికి దక్కాయి. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్, రజనీ బెక్టార్, జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్, పి. సుబ్రమణియన్, శ్రీధర్ వెంబు ఇందులో ఉన్నారు. వీరిలో ఒకరికి పద్మభూషణ్ పురస్కారం రాగా, మిగతావారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. వారి వివరాలు.. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్ (పద్మభూషణ్): పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ (యూపీఎల్) వ్యవస్థాపకుడు. ఈ సంస్థ క్రిమిసంహారకాలు, విత్తనాలు మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ష్రాఫ్ 1.7 బిలియన్ డాలర్ల సంపదతో దేశీ కుబేరుల్లో 93వ స్థానంలో ఉన్నారు. రజనీ బెక్టార్ (పద్మశ్రీ): మిసెస్ బెక్టార్స్ ఫుడ్ కంపెనీ అధినేత. రూ. 20,000 పెట్టుబడితో ప్రారంభించిన ఐస్–క్రీమ్స్ వ్యాపారాన్ని నేడు రూ. 1,000 కోట్ల స్థాయికి విస్తరించారు. ఇటీవలే ఇది ఐపీఓ ద్వారా విజయవంతంగా లిస్ట్ అయింది. జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్ (పద్మశ్రీ): అప్పడాల తయారీ సంస్థ లిజ్జత్ను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల్లో ఒకరు. ఓ సామాజిక సేవా కార్యకర్త నుంచి అప్పుగా తీసుకున్న రూ. 80తో 1950లలో ప్రారంభమైన లిజ్జత్ ప్రస్తుతం 800 కోట్ల పైచిలుకు వ్యాపారం సాగిస్తోంది. పి. సుబ్రమణియన్ (పద్మశ్రీ): గేర్ మ్యాన్ ఆఫ్ కోయంబత్తూర్గా పిల్చుకునే సుబ్రమణియన్.. 1969లో శాంతి ఇంజినీరింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది శాంతి గేర్స్గా మారింది. మురుగప్ప గ్రూప్నకు దీన్ని విక్రయించాక సుబ్రమణియన్ .. తను సొంతంగా ఏర్పాటు చేసిన శాంతి సోషల్ సర్వీస్ అనే సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణానంతరం పద్మశ్రీ పురస్కారం దక్కింది. శ్రీధర్ వెంబు (పద్మశ్రీ): క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ జోహో వ్యవస్థాపకుడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఎస్పీ బాలుకు పద్మాంజలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత గాయకుడు, గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యంను ప్రతిష్టాత్మక ‘పద్మ విభూషణ్’ వరించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె సహా మరో ఆరుగురు కూడా భారత ప్రభుత్వం ప్రకటించే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ ‘పద్మ విభూషణ్’కు ఎంపికయ్యారు. ఎస్పీ బాలుకు తమిళనాడు తరఫున ఈ పురస్కారం లభించడం గమనార్హం. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన 119 మందికి కేంద్ర ప్రభుత్వం సోమవారం 2021 సంవత్సరానికి గానూ ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 10 మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. సైకత శిల్పి సుదర్శన్ సాహూ, ప్రధాని మాజీ ప్రిన్స్పల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రులు తరుణ్ గొగోయి(అస్సాం), కేశూభాయి పటేల్(గుజరాత్), లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్, ప్రముఖ గాయని కేఎస్ చిత్రలకు పద్మ భూషణ్ వరించింది. ఈ సంవత్సరం పద్మ అవార్డులు పొందిన వారిలో 29 మంది మహిళలున్నారు. విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మందిని భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఒక ట్రాన్స్జెండర్ కూడా ఈ ఏడాది పద్మ పురస్కారం పొందారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. మాజీ గవర్నర్, దివంగత మృదుల సిన్హా, మాజీ కేంద్రమంత్రి బిజోయ చక్రవర్తిలకు పద్మ శ్రీ పురస్కారం ప్రకటించారు. పద్మ పురస్కారాలు పొందిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి.. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నిడుమోలు సుమతికి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. తెలంగాణ నుంచి కళల విభాగంలో కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక భారతరత్న రావాలి ‘పాడనా తీయగా కమ్మని ఒక పాట. పాటగా బ్రతకనా మీ అందరి నోటా...’అంటూ ‘వాసు’సినిమాలో పాడారు యస్పీ బాల సుబ్రహ్మణ్యం. గత ఏడాది చివర్లో కోవిడ్ వల్ల అనారోగ్యం పాలై ఆయన మరణించిన విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటగా మనతోనే ఎప్పుడూ ఉంటారు. సంగీత కళాకారుడిగా ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం యస్పీబీకి మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. గాయకుడిగా సుమారు 40 వేల పాటలు పాడారాయన. సుమారు 50 ఏళ్ల కాలాన్ని సినిమాలకు పాడటానికే అంకితం చేయడం విశేషం. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సంగీత దర్శకుడిగా, నటుడిగా యస్పీబీ ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అందుకున్నారాయన. యస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని, ఆయన మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు కూడా ఆ వాదనను సమర్థించాయి. సౌతిండియా నైటింగేల్ ‘బొంబాయి’సినిమాలో ‘కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే...’అంటూ పాడారు చిత్ర. చనిపోయే ముందు అందరూ తప్పక వినాల్సిన 100 పాటలు అంటూ బ్రిటీష్ మేగజీన్ ‘ది గార్డియన్’చేసిన 100 పాటల జాబితాలో ఈ పాట ఉంది. ఇలా గాయని చిత్ర పాడిన పాటలు భాషలకు అతీతంగా శ్రోతల్ని చేరుతూనే ఉన్నాయి. అందుకే ఆమెను సౌతిండియా నైటింగేల్ అన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చిత్రకు పద్మ భూషణ్ ప్రకటించింది. గాయనిగా సుమారు 25 వేల పాటలు ఆలపించారు చిత్ర. 1979లో మలయాళ ప్రైవేట్ ఆల్బమ్తో గాయనిగా మారారు చిత్ర. 2005లో పద్మశ్రీ అందుకున్నారు. ‘సింధు భైరవి’అనే తమిళ అనువాద చిత్రంలో ‘పాడలేను పల్లవైనా..’పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో పల్లవులు. చరణాలు పాడుతూనే ఉన్నారామె. -
పద్మ పురస్కారాలు: ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఏడుగురికి పద్మ విభూషణ్.. 10 మందికి పద్మ భూషణ్.. 102 మంది పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. దివంగత సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్.. సినీగాయని చిత్ర పద్మభూషణ్ పొందారు. ఏపీ నుంచి ఆర్ట్స్ విభాగంలో రామస్వామి అన్న వరపు, నిడుమోలు సుమతి.. సాహిత్యం, విద్యలో ప్రకాశ రావు అశావాది.. ఇక తెలంగాణ నుంచి ఆర్ట్ విభాగంలో కనక రాజులకు పద్మశ్రీలు దక్కాయి. మరణానంతరం అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, మాజీ కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్లు పద్మభూషణ్ పొందారు. ఇక విదేశం నుంచి జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మవిభూషణ్ దక్కింది. వీటితో పాటు అమర జవాన్ కల్నల్ సంతోష్బాబుకు కేంద్రం మహావీరచక్ర పురస్కారం ప్రకటించింది. -
'పద్మ' అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ నామినేష్లన స్వీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వచ్చే ఏడాది (2021) గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించనున్న పద్మ పురస్కారాలకు ఆన్లైన్ నామినేషన్లు లేదా సిఫారసులకు ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గడువు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. నామినేషన్లు లేదా సిఫారసులను కేవలం ఆన్లైన్ ద్వారా, పద్మ పురస్కారాల పోర్టల్ ద్వారా స్వీకరిస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేర్లతో ఇచ్చే పద్మ పురస్కారాలు, పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవాలు. పద్మ పోర్టల్ అందుబాటులో ఉన్న నిర్ణీత నమూనా ప్రకారం నామినేషన్లు లేదా సిఫారసులు ఉండాలి. నామినేట్ లేదా సిఫారసు చేస్తున్న వ్యక్తి, సంబంధింత రంగంలో సాధించిన విజయాలు లేదా సేవల గురించి 800 పదాలకు మించకుండా స్పష్టంగా రాయాలి. సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న అర్హులైన మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు వంటి ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రయత్నాలు చేయమని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, అత్యున్నత సంస్థలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. నామినేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 15న ముగుస్తుందని ఈలోగా దరఖాస్తులు పంపాల్సిందిగా పేర్కొంది. 1954 నుంచి మొదలైన ఈ అవార్డుల పర్వం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతోంది. జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేకుండా కళ,సాహిత్యం, విద్య,క్రీడలు, సామాజికం, సైన్స్ అండ్ టెక్నాటజీ సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించినవారు పద్మ అవార్డులకు అర్హులు. అంతేకాకుండా సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నవారిని గుర్తించి వారి వివరాలను నమోదు చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలు, పద్మ అవార్డుల గ్రహీతలకు కేంద్ర హోంశాఖ కోరింది. అంతేకాకుండా పౌరులు కూడా స్వతహాగా నామినేషన్లు దాఖలు చేయొచ్చని పేర్కొంది. గరిష్టంగా 800 పదాలకు మించకుండా సిఫారసులో సూచించిన ఫార్మాట్ తరహాలో పద్మ అవార్డుల పోర్టల్లో సంబంధిత వివరాలను నమోదు చేయాలని తెలిపింది. (కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ) -
‘పద్మ’కు తాకిన కరోనా భయాలు!
న్యూఢిల్లీ: కరోనా భయాల నేపథ్యంలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదాపడింది. అంతకంతకూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఏప్రిల్ 3న జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది పలు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. పద్మ విభూషణ్ అవార్డు ఏడుగురిని వరించగా.. పద్మభూషణ్ 16 మందిని.. 118 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇక తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ క్రీడా కారిణి పీవీ సింధుకు పద్మ భూషణ్ పురస్కారం లభించగా.. రైతు చిన్నితల వెంకట్ రెడ్డి, సాహిత్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన విజయ సారథి శ్రీ భాష్యంకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కళారంగంలో సేవలందించినందుకు దలవాయి చలపతిరావు, ఎడ్ల గోపాలరావుకు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్నారు. (చదవండి: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం) -
ఈ అవకాశాన్ని పొందండి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించే క్విజ్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ క్విజ్లోని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పద్మ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ‘వివిధ రంగాల్లో కృషి చేసే వ్యక్తులకు ఏటా ఇచ్చే పద్మ అవార్డ్స్ పదానోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించే క్విజ్ ఇది’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. అందులో పాల్గొని అవకాశాన్ని పొందాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది దాదాపు 140 పద్మ అవార్డులను ఇవ్వనున్నారు. mygov.in వెబ్సైట్లో హిందీలో 20 ప్రశ్నలతో పొందుపరిచిన లింక్ను తన ట్వీట్కు ప్రధాని మోదీ జత చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ క్లిక్ చేసి క్విజ్లో పాల్గొవచ్చు. (చదవండి: రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చుపైనా పరిమితి?) Every year, several grassroots level achievers are honoured with Padma Awards. Their life journeys inspire many. Here is a unique quiz competition, the Padma Quiz which gives you an opportunity to witness the Padma Awards ceremony at Rashtrapati Bhavan.https://t.co/J2XksCDyF0 pic.twitter.com/5XCa7Hkq43 — PMO India (@PMOIndia) March 9, 2020 -
పద్మ అవార్డులు.. కాంగ్రెస్పై ప్రముఖ సింగర్ ఫైర్
న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు, మ్యూజిషియన్ అద్నాన్ సమీకి పద్మశీ అవార్డు ఇవ్వడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. పాకిస్తాన్లో పుట్టి పెరిగిన అద్నాన్కు ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ షర్గిల్ తప్పుబట్టారు. కార్గిల్ యుద్ధంలో పోరాడిన మహ్మద్ సన్నావుల్లాను ఎన్నార్సీ అనంతరం విదేశీయుడిగా ప్రకటించిన కేంద్రం.. పాక్ ఎయిర్ఫోర్స్ పైలట్ కుమారుడికి పద్మశ్రీ అవార్డును ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం చంచాగిరి మ్యాజిక్ వల్లే అద్నాన్కు పద్మశ్రీ వచ్చిందని వ్యాఖ్యానించారు. కాగా తనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు అద్నాన్ ఘాటుగా స్పందించారు. ‘హేయ్ కిడ్.. మీ బుద్దిని క్లియరెన్స్ సేల్ నుంచి తెచ్చుకున్నారా.. లేక సెకండ్ హ్యాండ్ షాప్ నుంచి కొనుకున్నారా. తల్లిదండ్రుల చర్యలకు పిల్లలు ఎలా బాధ్యులవుతారు. మీరు ఒక న్యాయవాది. లా స్కూల్లో మీరు ఇదే నేర్చుకున్నారా’’ అంటూ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నేతల వాదనకు భిన్నంగా ఆ పార్టీ సీనియర్నేత దిగ్విజయ్ సింగ్ మాత్రం అద్నాన్కు అభినందనలు తెలిపారు. దేశంలో అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 141 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా అందులో అద్నాన్ సమీ ఒకరు. ఈ ఏడాదికి గాను మొత్తం 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేయగా.. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్ వరించగా, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డు వరించాయి. Hey kid, did you get ur brain from a ‘Clearance Sale’ or from a second hand novelty store? Did they teach u in Berkley that a son is to be held accountable or penalised for the acts of his parents? And ur a lawyer?😳 Is that what u learned in law school? Good luck with that!😂 https://t.co/s1mgusEdDr — Adnan Sami (@AdnanSamiLive) January 26, 2020 -
వికసించిన పద్మాలు
-
జైట్లీ, సుష్మాకు విభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి, ఏప్రిల్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని ప్రశంసలు.. ‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు: 1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) 2. అరుణ్ జైట్లీ (మరణానంతరం) 3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్కే 4. ఎం.సి. మేరీ కోమ్ 5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు) 6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం) 7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). 118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్ అజ్ఞాత హీరోలు చండీగఢ్లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్కు చెందిన సత్యానారాయణ్కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. -
తొలి మహిళా అథ్లెట్..
న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్చాంపియన్గా నిలిచి ఇప్పటికీ తనలో పంచ్ పవర్ను చూపిస్తున్న భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ పేరును పద్మ విభూషణ్ అవార్డుకు ప్రతిపాదిస్తూ క్రీడామంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి గాను మొత్తం తొమ్మిది మంది మహిళా క్రీడాకారిణులతో కూడిన పద్మ అవార్డుల జాబితాను క్రీడా శాఖ తాజాగా సిద్ధం చేసింది. ఇందులో మేరీకోమ్ను పద్మ విభూషణ్కు ఎంపిక చేయగా, తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును పద్మ భూషణ్కు ప్రతిపాదించారు. ఇటీవల వరల్డ్చాంపియన్గా సింధు నిలవడంతో ఆమెను పద్మ భూషణ్కు సిఫారుసు చేయడం ప్రధాన కారణం. 2015లో పద్మ శ్రీ అవార్డు అందుకున్న సింధు.. 2017లోనే పద్మ భూషణ్ గౌరవం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు సింధు పేరును పరిగణలోకి తీసుకోలేక పోవడంతో ఇప్పుడు ఆమె పేరును ఈ అవార్డుకు సిఫారుసు చేస్తూ కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా, పద్మ విభూషణ్గా మేరీకోమ్ను ఎంపిక చేయడంతో ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్కు ఒక మహిళా అథ్లెట్ను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా మేరీకోమ్ పద్మ విభూషణ్కు సిఫారుసు చేయబడ్డ తొలి క్రీడాకారిణిగా నిలిచారు. ఇక మిగిలిన ఏడుగురు క్రీడాకారిణుల పద్మ అవార్డుల్లో భాగంగా రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమా షిర్పూర్, మౌంటైనీర్ ట్విన్ సిస్టర్స్ తాషి, నుంగాషి మాలిక్లను పద్మ శ్రీకి సిఫారుసు చేశారు. -
పద్మ అవార్డులకు నామినేషన్ల వెల్లువ
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం 16 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2020లో ఈ పురస్కారాలను ప్రకటించనున్నారు. ఈ అవార్డులు అందుకోవడానికి కులం, మతం, స్థాయి, లింగ బేధాలు ఉండవని తెలిపారు. అయితే ప్రభుత్వోద్యోగాలు చేసేవారిలో కేవలం వైద్యులు, సైంటిస్టులు మాత్రమే ఈ అవార్డు పొందడానికి అర్హులు. కేవలం పద్మ అవార్డ్స్ పోర్టల్లో మాత్రమే దీనికి సంబంధించిన దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15తో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. -
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, సంగారెడ్డి: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2020 వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారి నుంచి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గణతంత్రదినోత్సావాన్ని పురస్కరించుకొని అవార్డులు ఇస్తామన్నారు. చిత్రలేఖనం, సామాజిక, సేవ, ప్రజాసంబంధాలు, సైన్స్, ఇంజనీరింగ్, ట్రేడ్, అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం, విద్య, సివిల్సర్వీస్, క్రీడలు, తదితరరంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి పద్మ అవార్డుకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అవార్డుల కోసం ప్రతిపాదనలను ఈనెల 22 లోగా పంపించాలని సూచించారు. www.padmaawards.gov.in వెబ్సైట్లో పద్మ అవార్డుల కోసం గైడ్లైన్స్ చూడవచ్చని అన్నారు. ఈ అవార్డు కోసం జిల్లాకు చెందినవారై విశేష కృషి చేసిన ఆసక్తిగల వ్యక్తులు అవసరమైన పత్రాలను జతచేయాలన్నారు. హెచ్ఓడీలకు అందజేయాలని చెప్పారు. పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తులను ఎన్ఐసీ, డీఐఓ కార్యాలయంలో సంబంధిత వైబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు వారి పరిదిలో ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన జిల్లాకు చెందిన వ్యక్తులను గుర్తించి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేయించాలన్నారు. -
గంభీర్కు పద్మశ్రీ ప్రదానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో శనివారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. గంభీర్తో పాటు భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, బాస్కెట్బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్ కూడా పద్మశ్రీ అందుకున్నారు. ఈ ఏడాది జనవరి 25న 112 మంది కూడిన పద్మ(పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) పురస్కారాల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో క్రీడా విభాగం నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ఇందులో పలువురికి మార్చి 11న అవార్డులను ప్రదానం చేయగా... మిగతావారికి శనివారం అవార్డులను అందజేశారు. -
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
-
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
-
స్క్రీన్ టెస్ట్
ప్రతిభకు కొలమానం ఏంటి? అంటే చెప్పలేం. అయితే ప్రతిభను గుర్తించి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, అభినందనలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏ కళాకారుడిలో అయినా ఉత్సాహాన్ని నింపుతాయి. భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ‘పద్మ’ అవార్డు వరిస్తే ఆ గౌరవమే వేరు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ఇప్పటివరకూ ఈ అవార్డు అందుకున్న స్టార్స్లో కొందరి గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఈ నటుడు. 2019వ సంవత్సరంలో ఈయనను పద్మశ్రీ వరించింది. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎవరాయన? ఎ) మణిశర్మ బి) యం.యం. కీరవాణి సి) శివమణి డి) కోటి 2. 2011వ సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుగ్రహీత ఈ నటి. వెంకటేశ్ నటించిన ఓ సూపర్హిట్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారీమె. ఎవరా నటి? ఎ) టబు బి) రమ్యకృష్ణ సి) మీనా డి) కత్రినా కైఫ్ 3. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్లను దక్కించుకున్న ఏకైక నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) శోభన్బాబు సి) కాంతారావు డి) అక్కినేని నాగేశ్వరరావు 4. అద్భుతమైన నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సింగర్గా చాలా ఫేమస్ ఈ నటి. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరు? ఎ) భానుమతి బి) జమున సి) సావిత్రి డి) అంజలీదేవి 5. కామెడీ యాక్టర్గా ఎన్నో సంవత్సరాలు చిత్రపరిశ్రమను ఏలారు. 1990లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ నటుని పేరేంటి? ఎ) అల్లు రామలింగయ్య బి) పద్మనాభం సి) సుత్తివేలు డి) నగేశ్ 6. 2019వ సంవత్సరానికి గాను ప్రభుదేవాని పద్మశ్రీ వరించింది. తన నృత్యంతో అలరించిన ఆయన్ను ఏ ప్రభుత్వం పద్మశ్రీకి నామినేట్ చేసిందో తెలుసా? ఎ) తమిళనాడు బి) తెలంగాణ సి) కర్ణాటక డి) కేరళ 7. ‘సిరివెన్నెల’ చిత్రం తర్వాత చెంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఆయన్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? (సీతారామ శాస్త్రికి ‘సిరివెన్నెల’ మొదటి చిత్రం కాదు) ఎ) కె.రాఘవేంద్రరావు బి) కె.విశ్వనాథ్ సి)ఆదుర్తి సుబ్బారావు డి) దాసరి నారాయణరావు 8. తన గళంతో ఎన్నో భాషల్లోని పాటలను అలవోకగా ఆలపించే గాయకుడు కె.జె. ఏసుదాస్. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (1977), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్లతో సత్కరించింది. ఆయన ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అందుకున్నారో తెలుసా? (సి) ఎ) 2011 బి) 2013 సి) 2017 డి) 2009 10 1968లో పద్మశ్రీ అవార్డు పొందిన నటుడెవరో కనుక్కుందామా? ఎ) యన్టీఆర్ బి) చిత్తూరు నాగయ్య సి) గుమ్మడి డి) కాంతారావు 9. 2006లో ఆయన్ను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. అదే సంవత్సరం ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ను కూడా పొందారు. ఎవరా హీరో? ఎ) కృష్ణంరాజు బి) చిరంజీవి సి) బాలకృష్ణ డి) నాగార్జున 11. 2009లో పద్మశ్రీ అవార్డు పొందిన ఈ నటుడు అప్పటికే ఒకే భాషలో దాదాపు 700 చిత్రాలు పైగా నటించారు. ఎవరతను? ఎ) కైకాల సత్యనారాయణ బి) అలీ సి) బ్రహ్మానందం డి) ధర్మవరపు çసుబ్రహ్మణ్యం 12. కమల్హాసన్ నటించిన ‘శుభసంకల్పం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ఈయన. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఎవరితను? ఎ) దాసరి నారాయణరావు బి) టి. సుబ్బరామిరెడ్డి సి) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డి) డి. రామానాయుడు 13. అనేక భాషల్లో తన సంగీతం ద్వారా చాలా సుపరిచుతులు ఈయన. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ ఆయన్ను వరించాయి. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ డి) పి.బి. శ్రీనివాస్ 14. 2013వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్ను తిరస్కరించిన ప్రముఖ సింగర్ ఎవరో తెలుసా? (అవార్డును నిరాకరించటానికి ఆ సింగర్ చెప్పిన కారణం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని) ఎ) ఎస్. జానకి బి) పి. సుశీల సి) వాణీ జయరాం డి) జిక్కీ 15. కర్ణాటక ప్రభుత్వ సిఫార్సుతో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన ఏ సంవత్సరంలో ఈ అవార్డును పొందారో తెలుసా? ఎ) 2014 బి) 2016 సి) 2018 డి) 2019 16. 340 తెలుగు చిత్రాలకు పైగా నటించారు ఈ ప్రముఖ నటుడు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ప్రకటించింది. ఎవరా హీరో? ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) శోభన్బాబు డి) శరత్బాబు 17. కళలు, విద్యా రంగాలకు సంబంధించి 2007లో పద్మశ్రీ అవార్డును పొందిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) మోహన్బాబు బి) మురళీమోహన్ సి) శ్రీధర్ డి) రంగనాథ్ 18. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరు? ఎ) కమల్హాసన్ బి) రజనీకాంత్ సి) విక్రమ్ డి) శరత్కుమార్ 19. నాటకరంగం నుండి సినిమా రంగానికి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ ప్రముఖ క్యారెక్టర్ నటుడు. 2015లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. ఎవరా నటుడు కనుక్కోండి? ఎ) జయప్రకాశ్ రెడ్డి బి) తనికెళ్ల భరణి సి) బెనర్జీ డి) కోట శ్రీనివాసరావు 20 .1992లో పద్మశ్రీ అవార్డు పొందారు ఈ ప్రముఖ దర్శకుడు. 2017లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఆ దర్శకుని పేరేంటి? ఎ) కె. భాగ్యరాజా బి) భారతీరాజా సి) కె. విశ్వనాథ్ డి) కె. బాలచందర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (డి) 4) (ఎ) 5) (ఎ) 6) (సి) 7) (బి) 8) (సి) 9) (బి) 10) (ఎ) 11) (సి) 12) (సి) 13) (బి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (బి) 19) (డి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
అలాంటి పాటలు రాయలేను: సిరివెన్నెల
సాక్షి, హైదరాబాద్ : స్వరం కూడా ఒక బురద.. అందులోనే పద్మాలు వికసిస్తాయని ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవలె ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ పైవిధంగా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీకి తన పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఎన్నో యేళ్లుగా తాను చేస్తున్నసాహితీ వ్యవసాయానికి ఒక గుర్తింపు దక్కిందని, తనను పరిచయం చేసిన కె. విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని తెలిపారు. సిరివెన్నెలకు పద్మశ్రీ ఎందుకివ్వాలో కేంద్రానికి చెప్పిన ప్రతి ఒక్కరికి తన నమస్సులు తెలియజేశారు. సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలపై తనను పాటలు రాయమని అడగకండని చెప్పేవాడినని, పద్యం రాయడం రానందు వల్ల పాట రూపంలో తన అనుభూతులను పంచుకనేవాడినని తెలిపారు. తన అనుభూతులన్నీ పాటలుగా రాసేవాడినని, కఠినమైన పాట రాసేంత భాష తనకు రాదని చెప్పుకొచ్చారు. ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా తన పాటలు ఉండాలని అనుకున్నానని, తన ప్రతి పాటను అవార్డ్గానే భావిస్తానన్నారు. లాలిజో లాలిజో పాట.. గుమ్మాడి గుమ్మాడి.. పాటలు తన బాగా నచ్చుతాయన్నారు. అష్టయిశ్వర్యాలకంటే తనకు వ్యక్తిత్వమే ముఖ్యమన్నారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ రాయమని వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందింగా ఉంటుందన్నారు. -
3 లక్ష్యాలు.. 3 అవార్డులు!
‘వ్యక్తులకు బిరుదులు అలంకారం కాదు. వ్యక్తులే బిరుదులకు వన్నె తెస్తారు’ అనేది నానుడి. ఇటీవల ప్రకటించిన కొన్ని అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించడం, ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవడంతో విమర్శలు తలెత్తాయి. ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇవ్వడం సహజమే. 2019 ఏడాదికి భారతరత్న పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలు ఈ అవార్డుకు అర్హులే. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేయడం పట్ల బీజేపీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన సీపీఎం బలహీనపడటంతో అక్కడ ధీటైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య విద్వేషం పెరిగింది. అక్కడ మమత బెనర్జీకి పోటాపోటీగా నిలవాలని చాన్నాళ్లుగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ‘బెంగాలీ పుత్రుడు’ ప్రణబ్ పేరును చూపి సెంటిమెంట్తో ఆ రాష్ట్రంలో కేడర్ను బలోపేతం చేసుకోవాలని బీజేపీ ఆశిస్తూ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌరసత్వ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం అట్టుడుకుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి అస్సాం గణపరిషత్ ఇప్పటికే తప్పుకుంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలను బుజ్జగించడానికి ఆ ప్రాంత గాయకుడు అయిన హజారికాకు భారతరత్న ప్రకటించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక నానాజీ దేశ్ముఖ్కు భారతరత్నను ఇవ్వడం ద్వారా బీజేపీ ఆచితూచి అడుగులేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. దీంతో బీజేపీ రెండు ఆశయాల్ని నెరవేర్చుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకటి ఆరెస్సెస్ను సంతృప్తిపరచడం, రెండోది మేధావుల వారసత్వాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే కాదు తాము కూడా గౌరవించగలమని చాటి చెప్పడం. ఎన్నికల ఎత్తుగడే కానీ.. ‘మమతా బెనర్జీకి చెక్ పెట్టి బెంగాల్లో పాగా వేయాలి. పౌరసత్వ బిల్లు వల్ల దూరమయ్యేలా కనిపిస్తున్న ఈశాన్య ప్రాంత ప్రజల్ని మళ్లీ తమ వైపు తిప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఒత్తిడి పెంచుతున్న ఆరెస్సెస్ను ఎలాగైనా శాంతపరచాలి’..ఈ లక్ష్యాలతోనే బీజేపీ అనూహ్యంగా భారతరత్నకు ముగ్గురు విశిష్ట వ్యక్తుల్ని ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నా విపక్షాలు తప్పు పట్టలేని పరిస్థితి. జీవిత కాలమంతా కాంగ్రెస్కే సేవచేసిన ప్రణబ్ 2సార్లు ప్రధాని పదవిని తృటిలో కోల్పోయారు. రాష్ట్రపతి అయ్యాక బీజేపీ ఆయనతో మంచి సంబంధాలే కొనసాగించింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హజారికాతో బీజేపీకి రాజకీయ సంబంధాలున్నాయి. 2004 లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్పై పోటీచేసి ఓటమిపాలయ్యారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం రాజకీయ పార్టీలతో పెరిగిన దూరాన్ని హజారికా రూపంలోనైనా తగ్గించుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్ముఖ్ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1977లో మొరార్జీ దేశాయ్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తామన్నా వద్దనుకుని సామాజిక సేవకు అంకితమయ్యారు. ఓవైపు, ఆయన సేవల్ని గౌరవిస్తూనే, మరోవైపు ఆరెస్సెస్ వ్యక్తికి భారతరత్న ఇచ్చుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
పద్మాలకు 50వేల దరఖాస్తులు
న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల ఎంపికకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2014లో తొలిసారి ప్రజల నుంచి నామినేషన్లను ఆహ్వానించినప్పుడు 2,200 మాత్రమే కాగా, 2019లో ఆ సంఖ్య 50,000కు చేరుకుందని వ్యాఖ్యానించారు. సమాజంపై, ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావం చూపిన వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు, వ్యక్తులకు ఈసారి అవార్డులు వరించాయని అభిప్రాయపడ్డారు. ఈసారి తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతులు పద్మ అవార్డులను అందుకున్నారు. వీరిలో అత్యాధునిక పద్ధతులు సాంకేతికత పాటించినందుకు భారత్ భూషణ్ త్యాగి, రామ్శరణ్ వర్మతో పాటు సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కమలా పూజారీ, రాజ్కుమారీ దేవి, బాబూలాల్ దహియా, హుకుమ్చంద్ పటీదార్ ఉన్నారు. వీరితో పాటు కన్వల్ సింగ్ చౌహాన్(మష్రూమ్, మొక్కజొన్న సాగు), వల్లభ్భాయ్ వస్రమ్భాయ్(క్యారట్ సాగు), జగదీశ్ ప్రసాద్(క్యాలీఫ్లవర్), సుల్తాన్ సింగ్(చేపల పెంపకం), నరేంద్ర సింగ్(పాడిపశువుల పునరుత్పత్తి)లకు పద్మ అవార్డులు దక్కాయి. వైద్య రంగానికి సంబంధించి 11 రాష్ట్రాల నుంచి 14 మంది వైద్యులను కేంద్ర పద్మ అవార్డులతో సత్కరించింది. పేదలకు నామమాత్రపు ఫీజుకే, కొన్నిసార్లు ఉచితంగా చికిత్స అందజేస్తున్న శ్యామ్ప్రసాద్ ముఖర్జీ(జార్ఖండ్), స్మిత, రవీంద్ర కోల్హే(మహారాష్ట్ర), ఆర్వీ రమణి(తమిళనాడు)లకు పద్మ అవార్డులు వరించాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సేవలను కొనసాగిస్తున్న సెరింగ్ నోర్బూ(లడఖ్), ఇలియాజ్ అలీ(అస్సాం), అశోక్ లక్ష్మణ్రావ్ కుకడే(లాతూర్–మహారాష్ట్ర) పద్మ పురస్కారాలను దక్కించుకున్నారు. వీరితో పాటు ప్రతిష్టాత్మక వైద్య సంస్థలకు చెందిన జగత్రామ్(పీజీఐఎంఈఆర్ డైరెక్టర్–చండీగఢ్), షాదాబ్ మొహమ్మద్(కింగ్ జార్జ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం–లక్నో), సందీప్ గులేరియా(ఎయిమ్స్–ఢిల్లీ), మమ్మెన్ చాందీ(టాటా మెడికల్ సెంటర్ డైరెక్టర్–కోల్కతా) పద్మ అవార్డులను అందుకున్నారు. పద్మ పురస్కారాలు పొందినవారిలో సోషలిస్ట్ నేత హుకుమ్దేవ నారాయణ్ యాదవ్, గిరిజన నేత కరియాముండా, సిక్కు నేత సుఖ్దేవ్ సింగ్, మహాదళిత్ మహిళా నేత భగీరథి దేవి, 1984 అల్లర్ల బాధితుల తరఫున పోరాడుతున్న లాయర్ హర్విందర్ సింగ్ ఫూల్కా ఉన్నారు. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది. 2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది. మొత్తం 112 మందికి ఈ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. జానపద గాయకురాలు తీజన్ బాయి, జిబౌటీకి చెందిన ఇస్మాయిల్ ఒమర్ గులేహ్, ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన బల్వంత్ పురందరేలను పద్మ విభూషణ్ విజేతలుగా కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మార్చి, ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ నటుడు మోహన్ లాల్(కేరళ)కు పద్మ భూషణ్, నటుడు, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా(కర్ణాటక)కు నృత్యంలో పద్మ శ్రీ లభించింది. నర్తకి నటరాజ్, ఖాదర్ ఖాన్ కరియా ముండా, మోహన్లాల్ రైతు నేస్తం వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ లభించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు 1994 నుంచి హైదరాబాద్లో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. 2001 నుంచి 2004 వరకు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం చూసి కలత చెందిన వెంకటేశ్వరరావు రైతు రాజులా బతకటానికి తన వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2005లో రైతునేస్తం మాసపత్రికను ప్రారంభించారు. మొదటి సంచికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ అయిన పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2012లో ప«శునేస్తం మాస పత్రికను, ప్రకృతి వ్యవసాయ విధానాలపై విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో 2014లో ప్రకృతి నేస్తం మాస పత్రికను ప్రారంభించారు. తన ఆలోచనలను పుస్తక రూపంలో అందిస్తూ వచ్చిన వెంకటేశ్వరరావు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటుచేసి, రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొర్నెపాడు గ్రామంలో రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటివరకు 140 వారాలకు పైగా తరగతులను నిర్వహించి 4000 మంది పైచిలుకు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి సూచనల ప్రకారం.. చిరుధాన్యాల సాగుపై రైతునేస్తం తరఫున పుస్తకాలు ప్రచురించారు. వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ పురస్కారం లభించడంతో ఆయన స్వగ్రామం కొర్నెపాడులో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకిచ్చిన ఈ అవార్డును రైతుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. సాక్షి ‘సాగుబడి’ తన కార్యక్రమాలకు మద్దతుగా నిలిచిందని ధన్యవాదాలు తెలిపారు. నలుగురికి ‘కీర్తి చక్ర’ దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తిచక్ర’ను నలుగురు జవాన్లు పొందారు. వీరిలో జాట్ రెజిమెంట్కు చెందిన మేజర్ తుషార్ గౌబా, 22వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన సోవర్ విజయ్ కుమార్(మరణానంతరం)తోపాటు 2017లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్ ఉన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ జైల్ సింగ్తోపాటు 9 మంది సైనికాధికారులకు శౌర్యచక్రను రక్షణ శాఖ ప్రకటించింది. ‘పరమ్ విశిష్ట సేవా పతకం’ ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సహా 19 మంది సైనికాధికారులకు లభించింది. ఎమర్జెన్సీపై గొంతెత్తిన నయ్యర్ ప్రముఖ జర్నలిస్ట్, మానవహక్కుల కార్యకర్త, దౌత్యవేత్త కుల్దీప్ నయ్యర్ అవిభక్త భారత్లోని సియాల్ కోట్(ప్రస్తుతం పాకిస్తాన్)లో 1923, ఆగస్టు 14న జన్మించారు. కెరీర్ తొలినాళ్లలో ఉర్దూ పత్రిక అంజామ్ లో రచయితగా పనిచేశారు. ఆ తర్వాత అదే పత్రికలో రిపోర్టర్గా చేరారు. దేశవిభజన అనంతరం కుటుంబంతో కలిసి భారత్కు వచ్చేశారు. ఆయన ‘ది స్టేట్స్మన్’ పత్రిక ఢిల్లీ ఎడిషన్కు ఎడిటర్గా పనిచేశారు. మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, కేంద్ర మాజీ హోంమంత్రి గోవింద్ బల్లప్పంత్కు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా సేవలందించారు. 1975లో ఎమర్జెన్సీ సందర్భంగా పత్రికలపై సెన్సార్షిప్ను వ్యతిరేకించడంతో ఇందిర ప్రభుత్వం ఆయన్ను తీహార్ జైలులో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం 1990లో ఆయన్ను లండన్లో భారత హైకమిషనర్గా నియమించింది. కుల్దీప్ నయ్యర్ 1997లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. జర్నలిజంలో ఆయన చేసిన సేవలకు గానూ 2015లో రామ్నాథ్ గోయెంకా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. బియాండ్ ది లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, స్కూప్, ఎమర్జెన్సీ కీ ఇన్సైడ్ స్టోరీ, వాల్ ఎట్ వాఘా తదితర పుస్తకాలు రాశారు. న్యుమోనియాతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరిన నయ్యర్ 2018, ఆగస్టు 23న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. పాండవని కళలో ప్రసిద్ధురాలు తీజన్ ఛత్తీస్గఢ్కు చెందిన తీజన్ బాయి (62) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన జానపద గాయకురాలు. ఆమెకు 1987లోనే పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. మహాభారతం నుంచి పాండవుల వీరగాథలను ఆమె ఏకకాలంలో సంగీత వాద్యాలను ఉపయోగిస్తూ, జానపద గేయాలు పాడుతూ వివరిస్తారు. దీనినే పాండవని కళ అంటారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించి, ఎంతో కృషి చేసి ఈ స్థాయికి చేరారు. భిలాయ్ పట్టణానికి సమీపంలోని గణియారి గ్రామంలో గిరిజన తెగకు చెందిన చంక్లాల్ పార్ధి, సుఖవతి దంపతుల ఐదుగురు పిల్లల్లో తొలి సంతానంగా తీజన్ బాయి జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు అప్పటికే ఇద్దరు పెళ్లాలున్న వ్యక్తికి తీజన్ బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాతా ఆమె భర్త మరో పెళ్లి చేసుకోవడంతో ఇక ఆమె అత్తారింటిని వదిలి వచ్చేశారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా, అదీ ఎంతో కాలం నిలువలేదు. ఛత్తీస్గఢ్లో లెక్కలేనన్ని గ్రామాల్లో ప్రదర్శనలిచ్చిన ఆమె, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, నాటి యూఎస్ఎస్ఆర్, సైప్రస్, ట్యునీషియా, టర్కీ, మాల్టా తదితర అనేక దేశాల్లోనూ పర్యటించి ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు. ఎంత ఎదిగినా ఆమె ఎంతో వినమ్రతతో అణుకువగా ఉంటారు. ఎదురులేని నేత ఒమర్ గులెహ్ ఆఫ్రికా దేశమైన జిబౌటీని గత 20 ఏళ్ల నుంచి అప్రతిహతంగా పాలిస్తున్న ఇస్మాయిల్ ఒమర్ గులెహ్(72) ఇథియోపియాలో 1947, నవంబర్ 27న జన్మించారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక జిబౌటీకి వలసవెళ్లారు. ఫ్రెంచ్ పాలనలో ఉన్న జిబౌటీలో 1968లో ప్రభుత్వఉద్యోగిగా చేరారు. రెండేళ్లలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ‘జిబౌటీ టుడే’ వార్తాపత్రికను ప్రారంభించారు. 1977లో స్వాతంత్య్రం పొందాక జిబౌటీ తొలి అధ్యక్షుడు, తన బంధువైన హసన్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఏకంగా 22 ఏళ్లు పనిచేశారు. అయితే 1999 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న హసన్ తన వారసుడిగా గులెహ్ పేరును ప్రతిపాదించారు. చైనా ఇప్పటికే జిబౌటీలో నౌకా స్థావరాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో భారత్ గులెహ్కు పద్మవిభూషణ్ను ప్రకటించడం గమనార్హం. మరాఠా నాటక రచయితకు పద్మవిభూషణ్ నాటక–కథా రచయిత, చరిత్రకారుడు బల్వంత్ మోరేశ్వర్ పురందరే(96) మహారాష్ట్రలోని పుణెలో 1922, జూలై 29న జన్మించారు. ఆయన రచనల్లో 17వ శతాబ్దపు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ జీవితం, పాలన ఆధారంగా రాసినవే ఎక్కువగా ఉన్నాయి. శివాజీ పాలనపై పురందరే రాసిన ‘జనతా రాజా’ అనే నాటకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు పొందింది. చరిత్రపై అమితాసక్తి చూపే పురందరే.. రాజా శివ ఛత్రపతి, కేసరి వంటి పుస్తకాలను రాశారు. కళారంగంలో ఆయన అందించిన సేవలకు గానూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2007–08 సంవత్సరానికి కాళిదాస్ సమ్మాన్ అవార్డును ప్రకటించింది. అలాగే 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రపు అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందించింది. -
ప్రణబ్ ‘భారతరత్న’ ఆనందదాయకం
సాక్షి, అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు లభించ డం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రణబ్ ఈ అవార్డుకు అన్నివిధాలా అర్హుడన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని ప్రశంసించారు. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త నానాజీ దేశ్ముఖ్కు మరణానంతరం భారతరత్న గౌరవం దక్కడంపై జగన్ సంతోషం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలను పొందిన తెలుగువారికి జగన్ అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రణబ్ముఖర్జీకి భారతరత్నపై కేసీఆర్ హర్షం సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్ ముఖర్జీ పూర్తి అర్హుడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న చొరవను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. రాజనీతిజ్ఞుడిగా.. రచయితగా, దౌత్యవేత్తగా, పాలనాదక్షుడిగా ప్రణబ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. -
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను శుక్రవారం సాయంత్రం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నలుగురికి పద్మ విభూషణ్, 14 పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. పద్మ విభూషణ్ పొందిన వారిలో ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్కుమార్ మణీబాయ్, బల్వంత్ మెరేశ్వర్ పురందరే, టీజెన్ బాయ్లు ఉన్నారు. మాళయళ నటుడు మోహన్ లాల్ను, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్లను పద్మ భూషణ్ వరించింది. పద్మ శ్రీ అవార్డులు పొందిన వారిలో కొందరు... ద్రోణవల్లి హారిక(చెస్ క్రీడాకారిణి) సిరివెన్నెల సీతారామశాస్త్రి(గేయ రచయిత) యెండవల్లి వెంకటేశ్వరరావు(వ్యవసాయ వేత్త) ప్రభుదేవా(కొరియోగ్రాఫర్) మనోజ్ బాజ్ పాయ్(నటుడు) సునీల్ చెత్రీ(పుట్బాల్ ప్లేయర్) గౌతమ్ గంభీర్(క్రికెటర్) శివమణి(డ్రమ్మర్) పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పద్మ అవార్డులు: సంపూర్ణంగా లేని పోర్టల్ ప్రయోగం
-
‘పద్మ’ అవార్డుల కోసం 1200 ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో అసాధారణ, ప్రత్యేక ప్రతిభ చూపిన వారికి ఇచ్చే ‘పద్మ’ అవార్డుల కోసం 1,200పైగా ప్రతిపాదనలు అందినట్లు హోంశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటిలో 1,207 ప్రతిపాదనల పరిశీలన పూర్తయిందని ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీలోగా నామినేషన్లు, ప్రతిపాదనలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ అవార్డుల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 1954 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ప్రకటిస్తోంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలు, ప్రసిద్ధ సంస్థలు, భారతరత్న, పద్మ విభూషణ్ గ్రహీతల నుంచి ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో ప్రతిపాదనలను ఆహ్వానించినట్లు వెల్లడించింది. ప్రతిపాదనలను ఆన్లైన్లో www.padmaawards.gov.in లోనే పంపాలని కోరింది. -
‘పద్మ’ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్ స్పోర్ట్స్: భారత ప్రభుత్వం–2019 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా డీవైఎస్ఓ ధనలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు అందజేస్తారన్నారు. ఆసక్తి, అర్హతగల వారు నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేయాలని తెలిపారు. -
పద్మ అవార్డుల నామినేషన్ల ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: దేశంలో వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి కేంద్రప్రభుత్వం ప్రదానం చేసే ‘పద్మ’ అవార్డుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 15ను నామినేషన్ల స్వీకరణకు చివరి గడువుగా హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజా సంబంధాలు, పౌర సేవలు, వాణిజ్యం, వ్యాపార రంగాల అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేసిన వారికి పద్మ అవార్డులను ప్రకటించనున్నారు. www.padmaawards.gov.in. వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దరఖాస్తుకు, రికమండ్ చేసేందుకు దేశంలోని పౌరులంతా అర్హులే. వెబ్సైట్లో తెలిపిన పద్ధతిలో సంబంధిత పత్రాలు, వివరాలతో దరఖాస్తులు పంపాలి. ఆ రంగంలో తాము చేసిన కృషిని 800 పదాలకు మించకుండా సవివరంగా రాసి పంపాలి. -
ఘనంగా పద్మా అవార్డుల ప్రదానోత్సవం
-
ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం