న్యూఢిల్లీ: ఎన్నో శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న శబరిమల ఆలయ వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారించింది.
‘దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి మహిళలను ఆలయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోకూడదు. ఇది కచ్చితంగా వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని అనుకోవడం లేదు. కానీ ఒకవేళ ఆ పరిస్థితే వస్తే ఆ ధర్మాసనానికి పూర్తి ఉత్తర్వులు ఇస్తాం’ అని వ్యాఖ్యానించింది.
శబరిమల కేసు రాజ్యాంగ బెంచ్కి బదిలీ!
Published Tue, Jul 12 2016 1:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement