కశ్మీర్‌లో ఉగ్రదాడి : ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి | Terrorists Attacked A Police Party In Anantnag | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఉగ్రదాడి : ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి

Published Wed, Jun 12 2019 6:11 PM | Last Updated on Wed, Jun 12 2019 6:41 PM

Terrorists Attacked A Police Party In Anantnag - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలపై బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించగా,పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. గాయపడిన వారిలో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ ఎస్‌హెచ్‌ఓ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌, స్ధానిక మహిళ ఒకరు ఉన్నారని అధికారులు తెలిపారు.

దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ పట్టణం కేపీ రోడ్‌లో సీఆర్‌పీఎఫ్‌ బృందంపై ఉగ్రదాడి జరిగిందని వారు వెల్లడించారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement