హాస్య నటుడు ఏవీఎస్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో సాయి కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, ఉత్తేజ్, ఆలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. సినీ జీవితంలో తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నఏవీఎస్ ఇక లేకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.