పార్లమెంట్‌ సమావేశాలతో అఖిలపక్ష భేటీ | All party meeting begins at the Parliament, ahead of first Parliament  | Sakshi
Sakshi News home page

సమావేశమైన అఖిలపక్ష నేతలు

Jun 16 2019 11:53 AM | Updated on Jun 16 2019 4:01 PM

All party meeting begins at the Parliament, ahead of first Parliament  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్షం భేటీ అయింది.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి హాజరు అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగే విధంగా విపక్షాల మద్దతు కోరేందుకు కేంద్రం ఈ అఖిలపక్షం ఏర్పాటు చేసింది. 17వ లోక్‌సభ రేపు కొలువుదీరనుంది. 17, 18 తేదీల్లో దిగువ సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు.

ఈ నెల 19న స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఈ నెల 20న ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 5న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈ నెల 26 వరకూ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో గత ప్రభుత్వం జారీచేసిన 10 ఆర్డినెన్స్‌లను చట్టరూపం ఇచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో కీలకమైన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement