రాహుల్‌ గాంధీకి ఓవైసీ స్వాగతం | Asaduddin Owaisi Invite To Rahul Gandhi For Charminar Visit | Sakshi
Sakshi News home page

‘రాహుల్.. హైదరాబాద్‌ నుంచి పోటీ చేయండి’

Published Sat, Oct 20 2018 3:54 PM | Last Updated on Sat, Oct 20 2018 4:39 PM

Asaduddin Owaisi Invite To Rahul Gandhi For Charminar Visit - Sakshi

రాహుల్‌ గాంధీ.. చార్మినార్‌కు వస్తున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌, కామారెడ్డిలలో భారీ బహిరంగ సభలలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకొని చార్మినార్ దగ్గర జరిగే రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొననున్నారు. రాహుల్‌ గాంధీ.. చార్మినార్‌కు వస్తున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

‘చార్మినార్‌కు వస్తున్నందుకు రాహుల్‌ గాంధీకి స్వాగతం. మా నగరం అందరినీ గౌరవిస్తుంది. మీరు(రాహుల్‌ గాంధీ), బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఇక్కడి నుంచి పోటీచేయాల్సిందిగా కోరుతున్నాము. భిన్న జాతుల సంస్కృతి అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు మీకు చూపిస్తారు. దోస్తులయినా, శత్రువులైనా అందరికీ హైదరాబాద్‌ స్వాగతం పలుకుతుంది’ అంటూ ఓవైసీ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement