
అహ్మదాబాద్ : పార్టీలోకి వస్తే రూ. కోటి ఇస్తామని, అడ్వాన్సుగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తనకు రూ.10 లక్షలు ఇచ్చిందని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) కన్వీనర్ ఆరోపించారు. త్వరలో గుజరాత్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీపై ఈ తరహా ఆరోపణలు రావడం నష్టదాయకమే.
హార్థిక్ పటేల్కు సన్నిహితుడైన వరుణ్ పటేల్ శనివారం బీజేపీలో చేరారు. ఆ మరుసటి రోజే బీజేపీలో చేరేందుకు తనకు రూ.కోటి ఇవ్వజూపారని, అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఇచ్చారని.. ఆ డబ్బు ఇదేనని(మీడియా సమావేశంలో చూపుతూ) నరేంద్ర పటేల్ చెప్పారు. రూ.కోటి కాదు, మొత్తం రిజర్వ్ బ్యాంకును తన పేరు మీద రాసిస్తానన్నా.. పీఏఏఎస్ను వీడనని పేర్కొన్నారు.
నరేంద్ర పటేల్ ఆరోపణలను వరుణ్ పటేల్ ఖండించారు. కాంగ్రెస్తో కుమ్మక్కై బీజేపీపై ఈ ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఆ డబ్బు బీజేపీ ఇచ్చిందనడానికి ఆధారాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కాగా, నరేంద్ర పటేల్ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించాల్సివుంది. సోమవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పీఏఏఎస్ నాయకుడు హార్థిక్ పటేల్ను కలిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment