hardik patel
-
Gujarat Assembly Election 2022: సౌరాష్ట్ర ఎవరికి సై?
సౌరాష్ట్ర.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. పటీదార్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయిన బీజేపీ తిరిగి పూర్వవైభవం సాధించడానికి ప్రయత్నిస్తోంది. మరి సౌరాష్ట్ర ఓటర్లు ఎవరకి జై కొడతారు...? సౌరాష్ట్ర కేంద్రంగా 2015లో మొదలైన పటీదార్ (పటేళ్లు) ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలో అగ్రకులమైన పటేళ్లను ఒబిసిలో చేర్చాలని, వారికి కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో యువ నాయకుడు హార్థిక్ పటేల్ నేతృత్వంలో సాగిన ఉద్యమం 2017 ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బ తీసింది. సౌరాష్ట్రలో పటీదార్లు, ఒబీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లు చేసిన ఉద్యమంతో 2017 ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్కు వెలుపల నుంచి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఏకంగా 28 స్థానాలను గెలుచుకొని తన పట్టు పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని 99 స్థానాలకే పరిమితం చేయగలిగింది. ఇప్పుడపా మాదిరి భావోద్వేగ పరిస్థితుల్లేవు. పటీదార్ల ఉద్యమం చల్లారింది. హార్దిక్ పటేల్ కాంగ్రెస్లో చేరినా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. హార్దిక్ ఇప్పుడు బీజేపీలో చేరారు. విరమ్గమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్కు ఎదురుదెబ్బగా మారేలా ఉన్నాయి. సౌరాష్ట్రలో పటీదార్లు, కొలి జనాభా 40% దాకా ఉంది. 18 అసెంబ్లీ స్థానాల్లో పటీదార్ల ఓట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో కొలి వర్గం ఓట్లు నిర్ణయాత్మకం. ఓబీసీ, క్షత్రియులు, మత్స్యకారులు కూడా ప్రభావం చూపించగలరు. ‘‘సౌరాష్ట్ర యువ ఓటర్లు ఈసారి ఆప్వైపు మొగ్గుతున్నారు. పటీదార్లు వ్యాపారాలంతా ఆప్కు అవకాశమిద్దామని అనుకుంటున్నారు. కొలి, ఇతర ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్కి ఓటేయొచ్చు’’ అని రాజకీయ విశ్లేషకుడు దిలీప్ గొహ్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓబీసీ మంత్రం సౌరాష్ట్రలో 48 సీట్లలో సగానికిపైగా స్థానాల్లో పటేళ్ల ఆధిక్యం ఉంది. హార్దిక్ వంటి నాయకుల్ని బీజేపీ తమ వైపు తిప్పుకున్నా పటేళ్లలో ఉపకులాల కారణంగా అందరూ బీజేపీ వైపుండే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు టిక్కెట్లు ఎక్కువ ఇచ్చింది. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంపయ్యారు. పటీదార్, కొలి, అహిర్ సామాజిక వర్గాలకు చెందిన కున్వర్జీ బవాలియా, బ్రిజేశ్ మెర్జా, చవడ వంటి అగ్రనాయకులూ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. సంపన్న సౌరాష్ట్ర సౌరాష్ట్ర ప్రాంతం మొదట్నుంచి సంపన్న ప్రాంతమే. అరేబియా తీరంలో ఉండే ఈ ప్రాంతంలో సహజవనరులు చాలా ఎక్కువ. నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.2019లో సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మద నది నుంచి నీళ్ల ట్యాంకర్లతో సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ప్రాంతంలో 11 జిల్లాలున్నాయి. సురేంద్రనగర్, మోర్బీ, రాజ్కోట్, జామ్నగర్, దేవ్భూమి ద్వారక, పోర్బందర్, జునాగఢ్, గిర్ సోమ్నాథ్, అమ్రేలి, భావనగర్, బోతాడ్.. ఈ 11 జిల్లాలకు గాను బీజేపీ 2017 ఎన్నికల్లో మోర్బీ, గిర్ సోమ్నాథ్, అమ్రేలి జిల్లాల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. ఈ సారి ఎన్నికల్లో అధిక ధరలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, నీటి సమస్య కీలకం కానున్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
బీజేపీ ‘పటీదార్ పవర్’.. వర్కవుట్ అయ్యేనా?
హార్దిక్ పటేల్. ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పటీదార్ నాయకుడు. పటీదార్లను ఓబీసీలుగా గుర్తించాలంటూ కమళదళంపై గళమెత్తిన నేత. ఇప్పుడు ఆ పార్టీ విధానాలకే జై కొడుతున్నారు. కాంగ్రెస్ను వీడిన ఆయన, ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు. హార్దిక్పై గుజరాత్లో బీజేపీ ఎందుకు భారీ ఆశలు పెట్టుకుంది. ఆయన చేరికతో అక్కడ పార్టీ మరింత బలం పుంజుకుంటుందా? ఎవరీ పటీదార్లు? గుజరాత్లో వారికి ఎందుకంత ప్రాధాన్యం...? పటీదార్లు తాము శ్రీరాముని వారసులమని చెప్పుకుంటారు. వీరిలో లేవా, కడ్వా అని ప్రధానంగా రెండు ఉపకులాలున్నాయి. రాముడి కవల పిల్లలైన లవకుశల్లో లవుడి సంతతి లేవా పటేల్స్ కాగా, కడవా పటేల్స్ కుశుడి సంతతి అంటారు. లేవాలు సౌరాష్ట్ర, మధ్య గుజరాత్లో అధికంగా ఉంటే, ఉత్తర గుజరాత్లో కడ్వాల ప్రాబల్యం ఎక్కువ. పటీదార్లలో 80% మంది లేవా, కడ్వా పటేల్స్. మిగతా 20%లో సత్పంతి, అంజన వంటి ఉపకులాలున్నాయి. ఒకప్పుడు వ్యవసాయదారులైన వీరు ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాల్లోనూ బాగా ఎదిగి ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారారు. హర్దిక్ బలం ఎంతంటే.. గుజరాత్ రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా దూసుకొచ్చిన యువ నాయకుడు హార్దిక్ పటేల్. 2015 ముందు వరకు ఆయన పేరు ఎవరికీ తెలీదు. రాష్ట్రంలో అగ్రకుల జాబితాలో ఉన్న పటీదార్లను ఓబీసీలోకి చేర్చాలని, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిప్పులు చెరిగే ప్రసంగాలతో బీజేపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూ యూత్లో ఫాలోయింగ్ సంపాదించారు. పటేల్ ఉద్యమం సందర్భంగా రాష్ట్రంలో హింస, గృహ దహనాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయనపై బీజేపీ దేశద్రోహం సహా ఎన్నో కేసులు పెట్టింది. బెయిల్పై బయటికొచ్చాక కూడా కేంద్రంలో, గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్కు బయటి నుంచి మద్దతిచ్చారు. కాంగ్రెస్ గెలవకపోయినా పటీదార్ల ఓట్లను భారీగా చీల్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు హార్దిక్ కాంగ్రెస్లో చేరారు. కానీ గుజరాత్లో 26 లోక్సభ సీట్లలో కాంగ్రెష్ ఒక్కటీ నెగ్గలేదు. 2020లో హార్దిక్ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ నియమించింది. కానీ ఆ తర్వాత ఆశించిన ప్రాధాన్యం లభించక మూడేళ్లలోనే పార్టీ వీడే పరిస్థితులు వచ్చాయి. ముందునుంచే హార్దిక్పై కన్ను నెల క్రితం కాంగ్రెస్కు గుడ్ బై కొట్టిన హార్డిక్, ఆ సందర్భంగా సోనియాగాంధీకి రాసిన లేఖలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం తదితరాలను ప్రశంసించారు. దాంతో ఆయన బీజేపీలో చేరతారని అప్పుడే భావించారు. పార్టీ కూడా ఆయన్ను చేర్చుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగా 2015 కోటా ఆందోళన సమయంలో ఆయనపై పెట్టిన కొన్ని కేసుల్ని వెనక్కు తీసుకుంది. రాష్ట్రంలో 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అన్ని మార్గాలనూ బీజేపీ వెదుకుతోంది. అందులో భాగంగా అత్యంత కీలకమైన పటీదార్ల ఓట్లపై దృష్టి పెట్టింది. 28 ఏళ్ల హార్దిక్ చేరికతో యువత, రైతులు పార్టీ పట్ల మరింతగా ఆకర్షితులవుతారని అంచనా వేస్తోంది. కోటా కేసుల్లో హార్దిక్ను దోషిగా తేలుస్తూ వచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయన ఎన్నికల్లో పోటీకి లైన్ క్లియరైంది. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ సమక్షంలో హార్దిక్ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల్లో ప్రభావమెంత? పటీదార్లు గుజరాత్లో అత్యంత శక్తిమంతమైన సామాజికవర్గం. రాష్ట్ర జనాభాలో వీళ్లు 15% దాకా ఉంటారు. ఠాకూర్ల తర్వాత వీరి సంఖ్యే ఎక్కువ. మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో 70 చోట్ల పటీదార్ల ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఎన్నికల్లో వీరంతా ఒకేతాటిపై వచ్చి ఓటేయరు. ఉపకులాలూ ఉండటంతో వీరిలోనూ విభేదాలున్నాయి. లేవా పటేల్స్ మొదట్నుంచీ బీజేపీకి గట్టి మద్దతుదార్లు. కడ్వా ఉప కులానికి చెందిన హార్దిక్ 2017 ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతివ్వడంతో వారంతా ఆ పార్టీ వైపు మళ్లారు. బీజేపీ గెలిచినా సీట్లు 115 నుంచి 99కి పడిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవలి కేబినెట్ మార్పుచేర్పుల్లో ఏకంగా పటేల్ వర్గానికి చెందిన ఏడుగురికి బీజేపీ స్థానం కల్పించింది. హార్దిక్ చేరికతో కడ్వా పటీదార్ల ఓట్లు ఈసారి తమకేనని నమ్మకం పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవితంలో మూడేళ్లు వృథా
అహ్మదాబాద్: కాంగ్రెస్లో ఉండి తన జీవితంలో మూడేళ్లు వృథా చేసుకున్నానని గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వాపోయారు. ఆయన బుధవారం కాంగ్రెస్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని హార్దిక్ మండిపడ్డారు. గురువారం అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో అధికార బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ లేదా మరో రాజకీయ పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోలేదనన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వంటి ఘనతలు బీజేపీ సాధించిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్లో ముందుచూపు లేని నేతలు ఉన్నారని, గుజరాత్ ప్రజలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతం.. వాడుకో, వదిలించుకో గుజరాత్లో తనను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినప్పటికీ ఏనాడూ సరైన పని అప్పగించలేదని, గౌరవం కల్పించలేదని హార్దిక్ ఆక్షేపించారు. పటీదార్ కోటా ఉద్యమంతో గుజరాత్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతగానో లాభపడిందన్నారు. అయినప్పటికీ కీలకపార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ కాంగ్రెస్లో 25 ఏళ్లుగా 7–8 మందే పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సెకండ్ క్యాడర్ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. వాడుకో, వదిలించుకో.. ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు ఇప్పుడు కావాల్సింది చింతన్(మేధోమథనం) కాదు, చింత అని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. హార్దిక్ పటేల్కు జైలు భయం: కాంగ్రెస్ హార్దిక్ వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ తిప్పికొట్టారు. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా పత్రం తయారు చేసుకున్నాడని విమర్శించారు. అతడిపై దేశద్రోహం కేసు నమోదయ్యిందని గుర్తుచేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్ను వీడాడన్నారు. -
గుజరాత్ కాంగ్రెస్కు బిగ్ షాక్.. హార్దిక్ పటేల్ రాజీనామా
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు.. ఈ మేరకు రాజీనామా లేఖను షేర్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నాను. ‘నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నాను’ అని ట్విటర్లో రాసుకొచ్చారు. కాగా మరి కొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పటేల్ రాజీనామా చేయడం కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలినట్లైంది. అంతేగాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రాజీనామా నేపథ్యంలో గుజరాత్లో పార్టీ పరిస్థితిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తూ సుధీర్ఘ లేఖ రాశారు. చాలాకాలంగా కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై ఆగ్రహంగా ఉన్న హార్దిక్ పార్టీ సీనియర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్లో క్లిష్ట పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు మన నేతలు విదేశాల్లో ఉన్నారని రాహుల్ గాంధీని ఉద్ధేశించి విమర్శించారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుజరాత్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, తమ మొబైల్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి గుజరాత్పై ఆసక్తి లేదని అన్నారు. గుజరాత్ కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకు సేవలు చేయడంలో మునిగిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ను సరైన దిశలో ముందుకు నడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఎల్లప్పుడూ దేశ, సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అందుకే ప్రతిచోట పార్టీ తిరస్కరణకు గురవుతోందన్నారు. చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు గత కొంత కాలంగా హార్దిక్ కాంగ్రెస్ను వీడుతారంటూ ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. 2019లో కాంగ్రెస్లో చేరిన హార్దిక్ను పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పట్టించుకోలేదని బహిరంగంగా వెల్లడించారు. పీసీసీ సమావేశాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో హార్దిక పటేల్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్లోని పటీదార్ ఆందోళన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన హార్దిక్ పటేల్కు తగిన గౌరవం లభించని కారణంగా పార్టీని వీడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హార్ధిక్ పటేల్(గుజరాత్ కాంగ్రెస్) రాయని డైరీ
కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ని పక్కన పెట్టేసే విధానం ఒక దారుణమైన విలక్షణతను కలిగి ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్కి వర్క్ ఇవ్వడం మానేస్తారు! వర్క్ల ప్రారంభోత్సవాలు ఏవైనా ఉంటే అక్కడికి పిలవడం మానేస్తారు. వర్క్ ఎందుకు ఇవ్వందీ చెప్పరు. వర్క్ల ప్రారంభోత్సవాలకు ఎందుకు పిలవందీ చెప్పరు. రాహుల్కి చెప్పుకుందామని ఢిల్లీ వెళితే, అప్పటికే అక్కడ వేరే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు తన సమస్యను చెప్పుకోడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తారు! ‘‘మా దగ్గరికి వచ్చేయొచ్చు కదా.. కాంగ్రెస్లోనే ఉండి నీ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు.. డిసెంబర్లో ఎన్నికలు పెట్టుకుని..’’ అన్నారు గోపాల్ ఇతాలియా. ‘ఆప్’కి గుజరాత్ స్టేట్ చీఫ్ అతడు. ‘‘మీ పేరు గోపాల్ ఇతాలియానే అయినా నాకు మిమ్మల్ని నరేశ్ పతేలియా అని పిలవాలనిపిస్తోంది..’’ అన్నాను. ‘‘నరేశ్ పతేలియానా!! నరేశ్ పటేల్ కదా ఆయన?!’’ అన్నారు ఇతాలియా. ‘‘అవును నరేశ్ పటేలే! అతణ్ణి లోపలికి తీసుకోడానికి నన్ను బయటికి పంపాలనో, నన్ను బయటికి పంపడానికి అతణ్ణి లోపలికి తీసుకోవాలనో ప్లాన్ చేస్తున్నారు మా వాళ్లు. నేనిప్పుడు మీతో వచ్చేస్తే.. లోపలికి రావడానికి పటేల్కి, లోపలికి తీసుకోడానికి మా పార్టీకి మీరు హెల్ప్ చేసినవాళ్లవుతారు. అప్పుడు మీరు నాకెప్పటికీ పతేలియాలా గుర్తుండిపోతారు తప్ప ఇతాలియాలా కాదు..’’ అన్నాను. ‘‘మీ పార్టీకో, నరేశ్ పటేల్కో దారి క్లియర్ చేయడానికి నేనెందుకు నిన్ను రమ్మని అడుగుతాను హార్దిక్? కేజ్రీవాల్ నిన్ను అడుగుతున్నారు. ‘ఆప్’లోకి వచ్చేయ్. ఫీల్ ద లీడర్షిప్..’’ అన్నారు ఇతాలియా. ‘‘నేను రాలేను. మా నాన్నగారి పేరు భరత్. నా చిన్నప్పట్నుంచే ఆయన కాంగ్రెస్ కార్యకర్త’’ అన్నాను. ‘‘లైఫ్లో ఇలాంటివి ఉంటూనే ఉంటాయి హార్దిక్. మనకూ ఒక లైఫ్ ఉంటుంది కదా. రేపు నువ్వూ.. నీ కొడుకునో, కూతుర్నో ‘మా తాతగారు భరత్. మా నాన్నగారి చిన్నప్పట్నుంచే మా తాతగారు కాంగ్రెస్ కార్యకర్త’ అనే చెప్పుకోనిస్తావా? మన గురించి చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడే మన పిల్లలు వాళ్ల తాతగారి గురించి, ముత్తాతగారి గురించి చెప్పుకుంటారు. ఇంకేం ఆలోచించకు వచ్చేయ్..’’ అన్నారు ఇతాలియా. ఇతాలియా వెళ్లాక చూసుకుంటే ఫోన్లో మెసేజ్! ‘ఒకసారి పార్టీ ఆఫీస్కి వచ్చి వెళ్లడం కుదురుతుందా హార్దిక్..’ అని జగదీశ్ థాకర్. గుజరాత్కి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే జగదీశ్ థాకర్ ప్రెసిడెంట్. ‘‘పార్టీ గురించి బయట నువ్వేదో బ్యాడ్గా మాట్లాడుతున్నావట?!’’ అన్నారు థాకర్.. పార్టీ ఆఫీస్కి నేను వెళ్లీవెళ్లగానే. ‘‘బ్యాడ్గా ఏమీ మాట్లాడలేదు, బ్యాడ్గా ఫీల్ అవుతూ మాట్లాడి ఉంటాను’’ అన్నాను. థాకర్ పక్కనే రఘుశర్మ కూర్చొని ఉన్నారు. రఘుశర్మ పక్కన మనీష్ దోషి ఉన్నారు. శర్మ స్టేట్ ఇన్చార్జ్. మనీష్ స్టేట్ అధికార ప్రతినిధి. ‘‘హార్దిక్.. ఒకమాట. ఇంతప్పుడు నిన్ను పార్టీలోకి తెచ్చి, అంతలోనే కాంగ్రెస్ నిన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ని చేసిందంటే.. అది నీకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాదా? గుడ్ని వదిలేసి, బ్యాడ్ని పట్టుకుంటావేంటి?’’ అన్నారు శర్మ. ‘‘2017లో నన్ను తెచ్చారు. 2022లో నా మీదకు నరేశ్ పటేల్ను తెస్తున్నారు. 2027లో నరేశ్ పటేల్ మీదకు మరొక పటేల్ని తెస్తారు. ఇది నాకు గుడ్ అనిపించలేదు..’’ అన్నాను. ‘‘సరే, ‘ఆప్’లోకి ఎప్పుడు వెళ్తున్నావ్?’’ అన్నారు థాకర్ సడన్గా! ఆయన అలా అంటున్నప్పుడు పార్టీలోని విలక్షణత ఆయన ముఖంలో ప్రతిఫలించింది. ‘‘అవును.. ఎప్పుడు?’’ అన్నారు శర్మ, దోషి వెంటవెంటనే! నన్ను రప్పించుకోడానికి కేజ్రీవాల్ పడని తొందర కంటే, నన్ను పంపించడానికి కాంగ్రెస్ పడుతున్న తొందరే ఎక్కువగా కనిపిస్తోంది!! -
హార్దిక్కు ‘ఆప్’ ఆహ్వానం
అహ్మదాబాద్: కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గుజరాత్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం పలికింది. ‘‘ఆయన సొంతగానే పెద్ద నాయకుడిగా ఎదిగారు. అలాంటి నాయకులు మాకు కావాలి. అందుకే మా పార్టీలో చేరాలని కోరుతున్నాం’’ అని గుజరాత్ ఆప్ నేత గోపాల్ ఇతాలియా శుక్రవారం చెప్పారు. గుజరాత్లో పాటిదార్ రిజర్వేషన్ల ఉద్యమంతో తెరపైకి వచ్చిన హార్దిక్ పటేల్ కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. -
Hardik Patel: గుజరాత్ కాంగ్రెస్ నన్ను వేధిస్తోంది
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్ తన వ్యాఖ్యలతో రాజకీయ కాక పుట్టించారు. రాష్ట్ర పార్టీ నాయకులు తనను వేధిస్తున్నారని, తాను పార్టీ విడిచి వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఖొదాల్దమ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్ను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పరిణామాలతో హార్దిక్ పటేల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘‘2017లో మీరు హార్దిక్ని ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి మీకు నరేష్ కావాల్సి వచ్చారు. 2027లో మరో పాటిదార్ నాయకుడు కోసం చూస్తారు. హార్దిక్ పటేల్నే శక్తిమంతుడిగా మీరు తయారు చెయ్యలేరా?’’ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. చదవండి: (మీలో ఒక్కడిలా ఉంటా...మీ కోసం ఎందాకైనా వస్తా: తోపుదుర్తి ప్రకాష్రెడ్డి) -
నన్ను పట్టించుకోవడం లేదు.. కొత్త పెళ్లికొడుకులా ఉన్నా..
అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ బుధవారం సొంత పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. సీనియర్ నాయకులు తనను పక్కన పెట్టారని, పార్టీ కోసం తన నైపుణ్యాలను ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కొత్త పెళ్లికొడుకులా.. పార్టీలో తన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ సమావేశాలకు తనను పిలవడం లేదని, పార్టీ నిర్ణయాలు తీసుకునే ముందు సంప్రదించడం లేదని.. అలాంటప్పుడు వర్కింగ్ ప్రెసిడింట్గా ఉండి ప్రయోజనం ఏంటని అన్నారు. ‘వర్కింగ్ ప్రెసిడెంట్ సహా పంజాబ్ కాంగ్రెస్ నేతల బృందం ఇటీవల సోనియా గాంధీని కలిశారు. గుజరాత్ కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్కు అలాంటి గౌరవం ఎందుకు లభించద’ని ప్రశ్నించారు. కొత్తవారి కోసం పాకులాట పార్టీలో ముందు నుంచి ఉన్న వారిని వదిలేసి కొత్తవారి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఖోడల్ధామ్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేశ్ పటేల్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2017లో మా వల్ల (పటేల్ సంఘం) కాంగ్రెస్ లాభపడింది. ఇప్పుడు, నేను టెలివిజన్లో చూస్తున్నట్లుగా, పార్టీ 2022కి నరేష్ పటేల్ను చేర్చుకోవాలని కోరుకుంటోంది. 2027కి కొత్త పటేల్ కోసం వారు వెతకరని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలను ఎందుకు ఉపయోగించుకోలేద’ని హార్దిక్ పటేల్ ప్రశ్నించారు. ఒకవేళ నరేశ్ పటేల్ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ఆ పని వెంటనే పూర్తి చేయాలని, నాన్చుడు ధోరణి సరికాదన్నారు. (క్లిక్: యూపీలో ఏం జరిగిందో చూశారుగా!: సీఎం యోగి) హార్దిక్తో చర్చిస్తా: ఠాకూర్ 2015 అల్లర్ల కేసులో సెషన్స్ కోర్టు తనకు విధించిన శిక్షను సుప్రీం కోర్టు నిలిపివేయడంతో తాజా ఎన్నికల్లో పోటీ చేసేందుకు హార్దిక్ పటేల్ రెడీ అవుతున్నారు. కాగా, పటేల్ వ్యాఖ్యలపై గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ స్పందించారు. హార్దిక్ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలా, వద్దా అనే దానిపై నరేశ్ పటేల్ నిర్ణయించుకోవాలన్నారు. మంచి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని స్పష్టం చేశారు. -
హక్కుల భంగం.. ఇదా మీ తీరు?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! పెద్ద మార్పు ట్యునీషియా నూతన ప్రధానమంత్రిగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, జియాలజిస్ట్ నజ్లా బూడెన్ రమధానే నియమితులయ్యారు. దీనితో అరబ్ ప్రపంచంలో మహిళను ప్రధాన మంత్రిని చేసిన మొదటి దేశంగా ట్యునిషీయా నిలిచింది. – అర్షియా మాలిక్, రచయిత అవసరమైన పోరాటం మూడేళ్ల తర్వాత ఇండియాలోని మీటూ ఉద్యమాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎక్కువగా నిరాశ వైపే మనసు మొగ్గు తోంది. కానీ దాని అన్ని లోపాలతో కలుపుకొని అది విలువైన ఉద్యమం. – నమితా భండారే, జర్నలిస్ట్ ఇదా మీ తీరు? హాథ్రస్ అత్యాచార బాధితురాలిని బలవంతంగా దహనం చేయడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబం సూర్యాస్తమయం లోగా ఖననం కావాలని కోరుకుంది; దహనం కాదు; ఎందుకంటే ఆమె అవివాహిత కాబట్టి. ‘హిందూ విశ్వాసాల’ పట్ల ఎంతో పట్టింపు ఉన్న ఉత్తరప్రదేశ్ అధికార వ్యవస్థ బాధితురాలి కుటుంబ నమ్మకాలను, రాజ్యాంగాన్ని బాహాటంగా తోసిపుచ్చింది. ఇదంతా కూడా ‘చట్టం’ పేరు మీదుగానే జరిగింది. – తనుశ్రీ పాండే, జర్నలిస్ట్ హక్కుల భంగం నమ్మండి, నమ్మకపోండి. గుజరాత్లోని మహేసాణా జిల్లాలోకి ప్రవేశించడానికి నన్ను ఆరేళ్లుగా అనుమతించడం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నాకు హామీ ఇచ్చిన నా స్వేచ్ఛా సంచార హక్కు ఏమైనట్టు? – హార్దిక్ పటేల్, కాంగ్రెస్ నాయకుడు టాటా ఎయిర్ ఇంతకుముందు చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. దానికి ఉన్న అన్ని సమస్యలను పక్కన పెడితే, ఎయిర్ ఇండియా బహుశా విమానం లోపలి భోజనం విషయంలోనూ; దురుసైన ప్రయాణీకుల మూకతో తియ్యగా వ్యవహరించే సర్వీసులోనూ అత్యుత్తమం. టాటాల ఆధ్వర్యంలో అది మరింత మెరుగవుతుందని ఆశిస్తాను. – వీర్ దాస్, కమెడియన్ అందుకా సంతోషం? అన్నట్టూ, పెట్రోలు ధరలు వరుసగా రెండు రోజుల పాటు పెరిగాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఏదీ నియం త్రణలో లేదు. అయినా వాళ్ల ఓటర్లు సంతోషంగా ఉన్నారు; ఎందుకంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి. – సంగీతా నంబీ, రచయిత్రి మాట మరిచారా? పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే ఇంకా బాగా చేయగలవు. యూరోపియన్ యూనియన్ దేశాలు కేవలం 4.4 కోట్ల డోసుల కరోనా వైరస్ టీకాలను మాత్రమే మిగతా ప్రపంచానికి పంపించాయి. సెప్టెంబర్ 30 నాటి ఒక నివేదిక మేరకు, ఆ దేశాలు పంచుకుంటామని చేసిన 50 కోట్ల డోసుల వాగ్దానంలో ఇది తొమ్మిది శాతం మాత్రమే. – నికోలా స్మిత్, జర్నలిస్ట్ -
హార్దిక్ పటేల్తో భేటీ అయిన రాహుల్
గాంధీనగర్ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్గాంధీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. ‘అమిత్షా నేరస్తుడు’ అని లోక్సభ ఎన్నికల ర్యాలీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్పై అహ్మదాబాద్ హైకోర్టులో పరువునష్టం దావాకు పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఆయన అహ్మదాబాద్ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్, మరికొంత మంది స్థానిక నేతలతో కలిసి ఓ రెస్టారెంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశం నేపథ్యంలో రాహుల్ను కలిసేందుకు జనం ఎగబడ్డారు. మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగలంతా మోదీలే ఎందుకవుతారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు సహజంగా ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇక ఆరెస్సెస్ శక్తులు రాజకీయ కుట్రల్లో భాగంగానే తనను టార్గెట్ చేస్తున్నాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. (చదవండి : నేను ఏ తప్పూ చేయలేదు: రాహుల్ గాంధీ) -
చౌకీదార్ కోసం నేపాల్కు వెళ్తా..కానీ
అహ్మదాబాద్ : సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు చేపట్టిన మై బీ చౌకీదార్ ఉద్యమంపై కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రధాన మంత్రి మాత్రమే ఉండాలని కోరుకుంటానే తప్ప చౌకీదార్లను కాదని ఆయన ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు దేశ వ్యాప్తంగా మూడో విడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్లోని సురేంద్రనగర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో హార్దిక్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ నాకు చౌకీదార్(వాచ్మెన్) అవసరం ఉంటే... నేను నేపాల్కు వెళ్తాను. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే, యువతకు విద్య, ఉపాధి కల్పించి దేశాన్ని దృఢంగా మార్చే ప్రధాని ఉండాలని కోరుకుంటాను. ప్రస్తుతం నాకు కావాల్సింది ప్రధాని మాత్రమే. చౌకీదార్ కాదు అంటూ హార్దిక్ పటేల్ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఆమె కూడా పోటీ చేస్తుంది.. నేనే.. ‘ నేను అస్సలు సంతోషంగా లేను. ఆఖరికి సాధ్వీ ప్రగ్యా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను మాత్రం అనర్హుడినయ్యాను. ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తోంది. అసలు ఇలా జరగాల్సింది కాదు అంటూ హార్దిక్ పటేల్ అసహనం వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మాలేగావ్ పేలుళ్ల కేసుతో సంబంధం ఉన్న సాధ్విని బీజేపీ భోపాల్లో పోటీకి దింపడాన్ని విమర్శించారు. తమను మోసం చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన గుజరాత్లో బీజేపీ ఇప్పుడు 10 నుంచి 12 సీట్లు మాత్రమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. కాగా 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ నమోదైన కేసులో విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్లో చేరిన హార్దిక్.. జామ్నగర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో హార్ధిక్ ఆశలు ఆవిరయ్యాయి. -
‘అందుకే హార్దిక్ చెంప చెళ్లుమనిపించా’
అహ్మదాబాద్: ‘పటీదార్ ఉద్యమం నడుస్తున్నపుడు నా భార్య గర్భవతి. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాను. ఆ సమయంలో పటీదార్ ఉద్యమం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది. హార్దిక్ పటేల్పై దాడి చేయాలని అప్పుడే అనుకున్నాను. ఎలాగైనా అతడికి తగిన గుణపాఠం చెప్పాలని గట్టిగా భావించాను’.. ఇవి హార్దిక్ పటేల్ను చెంప దెబ్బ కొట్టిన తరుణ్ గజ్జర్ అనే వ్యక్తి చెప్పిన మాటలు. గుజరాత్లోని సురేంద్రనగర్లో శుక్రవారం ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా హార్దిక్ పటేల్పై తరుణ్ గజ్జర్ హఠాత్తుగా దాడి చేశాడు. ఊహించని పరిణామంతో హార్దిక్ బిత్తరపోయారు. దాడికి పాల్పడిన తరుణ్ను కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకుపోయారు. గాయాలపాలైన అతడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హార్దిక్ పటేల్పై దాడి చేయడానికి గల కారణాలను మీడియాకు వివరించాడు. తరుణ్ గజ్జర్ సామాన్య పౌరుడని, అతడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సురేంద్రనగర్ ఎస్పీ మహేంద్ర బాఘేదియా తెలిపారు. చట్టప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: హార్దిక్ పటేల్ చెంప చెళ్లు!) -
హార్దిక్ పటేల్ చెంప చెళ్లు!
అహ్మద్బాద్ : కాంగ్రెస్నేత, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సురేందర్ నగర్ జిల్లా నిర్వహించిన జన ఆక్రోష్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో హార్దిక్ పటేల్ మాట్లాడుతుండగా... ఓ వ్యక్తి ఆయన చెంపపై కొట్టారు. ఊహించని ఘటనతో హార్దిక్ అవాక్కవ్వగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు. నిన్న(గురువారం) బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై బూటు దాడి జరిగిన మరుసటి రోజే హార్దిక్పై మరో అంగతకుడు చేయిచేసుకోవడం గమనార్హం. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఆయనపైకి రెండు బూట్లు విసిరాడు. మొదటి బూటు జీవీఎల్కు దూరంగా వెళ్లగా.. రెండోది ఆయనకు అతి సమీపం నుంచి వెళ్లింది. ఇక మార్చిలో కాంగ్రెస్లో చేరిన హార్దిక్.. జామ్నగర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. కానీ 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ మెహ్సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో హార్దిక్ ఆశలు అడియాశలయ్యాయి. అయినా కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. -
‘బ్రెయిన్ లేదనుకుంటున్నారా.. ఏడుస్తూ కూర్చోను’
ముంబై : ‘బాలీవుడ్ నుంచి వచ్చాను కదా అని నాకు మెదడు లేదని అనుకుంటున్నారేమో. ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదు. ఇండస్ట్రీలో భాగమైనందుకు నేను ఇప్పటికీ గర్వంగా ఫీలవుతున్నా’ అని ముంబై నార్త్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళా మటోంద్కర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంధేరీలో ఏర్పాటు చేసిన ‘యూత్ మీట్’కు పాటిదార్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ యువతను వినియోగించుకుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం యువతకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని మండిపడ్డారు. రాజకీయాల్లోకి ప్రవేశించగానే కొంతమంది తనను విపరీతంగా ట్రోల్ చేశారని.. అయితే అంతమాత్రాన ఏడుస్తూ కూర్చోనని పేర్కొన్నారు. ఇటువంటి వేదికలపై ఆ విషయాలను ప్రస్తావించి సానుభూతి పొందాలనుకోవడం లేదని.. ఎంపీగా గెలిచితీరతానే నమ్మకం ఉందని ఊర్మిళ చెప్పుకొచ్చారు. కాగా ముంబై నార్త్ నియోజకవర్గంలో గుజరాతీలు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఊర్మిళ, ముంబై నార్త్ వెస్ట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు హార్ధిక్ పటేల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 2014లో యూత్కు మోదీ పట్ల బాగా క్రేజ్ ఉండేది. కానీ అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కి ఆయన యువతను మోసం చేశారు. ఇందుకు తగిన సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఇక వికీపీడియాలోని ఊర్మిళ ప్రొఫైల్ పేజీలో ఆమె పేరు, మతం, తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యాన్ని మార్చేసి కొంతమంది ఆకతాయిలు తప్పుడు వివరాలను అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఊర్మిళ కుటుంబ సభ్యులు మండిపడగా, బీజేపీ సోషల్మీడియా విభాగం ఈ నీచమైన ప్రచారానికి దిగిందని కాంగ్రెస్ విమర్శించింది. ఊర్మిళ ప్రస్తుత పేరు మరియమ్ అక్తర్ మిర్ అనీ, 2015లో ఆమె కశ్మీరీ వ్యాపారవేత్త మొహసీన్ అక్తర్ మిర్ను పెళ్లిచేసుకున్నారంటూ ట్రోల్ చేశారు. -
హార్దిక్ పటేల్కు సుప్రీంషాక్
న్యూఢిల్లీ: పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్(25)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2015 నాటి దాడి కేసులో ఆయన దోషిత్వంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆయన ఆశలు నీరుగారినట్లే. 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ మెహ్సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను కొట్టేసిన కోర్టు.. దోషిత్వాన్ని అలాగే ఉంచింది. మార్చిలో కాంగ్రెస్లో చేరిన హార్దిక్.. జామ్నగర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన వ్యక్తి(దోషిత్వంపై న్యాయస్థానం స్టే ఇవ్వని పరిస్థితుల్లో) ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. -
హార్దిక్ పటేల్కు హైకోర్టు షాక్
అహ్మదాబాద్: రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2015లో ఓ అల్లర్ల కేసులో దిగువ కోర్టు దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని హార్దిక్ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హార్దిక్ పటేల్పై 17 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో రెండు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. హార్దిక్కు నేరచరిత్ర ఉందని పేర్కొంది. దీంతో హార్దిక్ పటేల్పై నమోదైన కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్ పటేల్ కార్యాలయంపై దాడిచేశారు. ఈ కేసును విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో హార్దిక్ గతేడాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలుశిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ జామ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తనను దోషిగా తేలుస్తూ విస్నగర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్ -
ఎ‘టాక్’! కొత్త గళాలు.. ప్రశ్నించే గొంతుకలు..
చైతన్యానికి నిదర్శనం ప్రశ్నించడమైతే.. అన్ని రకాల ప్రశ్నలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యానికి పుష్టినిస్తుంది! అందుకే.. ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో.. అసమ్మతికి తావు, ప్రాధాన్యం ఎక్కువే ఉండాలి. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలదైతే.. అది కాస్తా విఫలమైనప్పుడు పౌర సమాజం తన గొంతుకనివ్వాలి. ప్రజాస్వామ్యంలో మూలస్తంభాలుగా భావించే వ్యవస్థలు రకరకాల కారణాలతో రాజీ పడిపోతున్నఈ తరుణంలో.. మేమున్నామంటూ కొందరు ముందుకొస్తున్నారు!. ప్రజాస్వామ్యమంటే.. నేతలు, ఎన్నికలు మాత్రమే కాదు.. అంశాలపై గళమెత్తడం కూడా అంటున్న వీరు వినిపిస్తున్న కొత్త గళాలివిగో... ఓటరే అసలు దేవుడు: ప్రకాశ్రాజ్ ఒక్క సంఘటన మన జీవిత గమనాన్నిమార్చే స్తుందంటారు. ప్రకాశ్రాజ్ విషయంలోజరిగింది అచ్చంగా ఇదే. నటుడిగా ఐదారు భాషల్లోనటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సమయంలో చిన్ననాటి స్నేహితురాలు.. అదీ తన గురువుగాభావించి పూజించిన లంకేశ్ కూతురు గౌరి.. ఇంటి ముందే దారుణమైన హత్యకు గురికావడంప్రకాశ్ను దేశంలోనే శక్తిమంతుడైన వ్యక్తిని కూడా ఢీకొనేలా చేసింది. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రకాశ్రాజ్ వేసిన ప్రశ్నలు చాలా మౌలికమైనవి. కర్రుకాల్చివాతపెట్టడమెలాగో బాగా తెలిసిన ప్రకాశ్రాజ్రాజకీయాలు కులం, మతం, ప్రాంతాల ఆధారంగా కాకుండా సామాన్యుడి అవసరాలు, బాగు చుట్టూజరగాలని కోరుకుంటారు. ప్రకాశ్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయ బరిలోకీ దిగేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ ఇప్పటికే సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుస్తూప్రచారం కూడా మొదలుపెట్టారు. పార్లమెంటు సభ్యుడంటే ఢిల్లీలో కూర్చుని రాజకీయం మాత్రమే చేయడం కాదంటున్న ఈ నటుడుమురికివాడల్లోని అతి సామాన్యుల కష్టాలకూ స్పందించాలని అంటున్నారు. రామమందిర రాజకీయాలకు కాకుండా సామాన్య రైతుల కష్టాలను తీర్చడమే ముఖ్యమని స్పష్టంగా చెబుతున్న ప్రకాశ్ఎన్నికల్లో ఏమాత్రం విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే!! దళిత హక్కుల గళం: జిగ్నేశ్ మెవానీ ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని బహిరంగంగా వ్యాఖ్యానించగల ముఖ్యమంత్రులున్న ఈ దేశంలో దళితుడిగా పుట్టిన ప్రతివాడికీ విచక్షణ అంటే ఏమిటో స్పష్టంగా తెలుసని కుండబద్దలు కొట్టగలిగే జిగ్నేశ్ మెవానీ కూడా ఉన్నాడు! చర్మకారుడిగా తాత అనుభవాలు కదలించాయో.. పొట్టకూటి కోసం అహ్మదాబాద్ మున్సిపాలిటీలో అన్ని రకాల పనులూ చేసిన తండ్రి కష్టాలు ఆలోచనలు రేకెత్తించాయో తెలియదుగానీ.. ముంబైలో కొంతకాలం విలేకరిగానూ పనిచేసిన జిగ్నేశ్ ఆ తరువాతి కాలంలో న్యాయవాదిగా దళితుల హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించాడు. గుజరాత్లోని ఊనాలో దళితులకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా నిరసించిన జిగ్నేశ్ అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్యమించాడు. కమ్యూనిస్టు నేత ముకుల్ సిన్హా, గాంధేయ వాది చున్నీభాయ్ వేద్ వద్ద ఉద్యమ పాఠాలు నేర్చుకున్న జిగ్నేశ్ 2016 నాటి ‘‘దళిత్ అస్మిత్ యాత్ర’’తో ప్రాచుర్యంలోకి వచ్చారు. దేశంలో దళితులపై వివక్ష పోవాలన్నా, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలన్నా కార్పొరేట్ సంస్థలకు బదులు దళితులకు భూమి పంపిణీ జరగాలని అంటున్నారు. ఇందుకోసం వ్యవస్థాగత మార్పులూ తప్పనిసరి అన్నది జిగ్నేశ్ వాదన. దళిత్ అస్మిత యాత్ర తరువాత జరిగిన ఎన్నికల్లో జిగ్నేశ్ గుజరాత్లోని వడ్గామ్ నుంచి అసెంబ్లీ బరిలో దిగి విజయం సాధించారు. తరువాతి కాలంలో దేశవ్యాప్తంగా దళితులను తమ హక్కుల సాధనకు ఉద్యమించేలా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని భీమా కొరేగావ్లో ఘర్షణలకు కారణమయ్యాడని పోలీసులు కేసులు పెట్టినా.. అతడి ప్రమేయమేమీ లేదని కోర్టు ఆ కేసును కొట్టేసింది. రోడ్డెక్కిన పాటీదార్: హార్దిక్ పటేల్ రెండేళ్ల క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అత్తెసరు ఆధిక్యంతో ఇంకోసారి పగ్గాలు చేపట్టింది. దేశం మొత్తం మోదీ గాలులు వీస్తున్న 2017లో గుజరాత్లో బీజేపీని నిలువరించిన యువనేతగా హార్దిక్ పటేల్ను వర్ణిస్తారు విశ్లేషకులు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న ఆందోళనకు నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ ఆలోచనలు ఇతరుల కంటే చాలా భిన్నం. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈయన. మంచి మార్కులు సంపాదించుకున్నా తన చెల్లికి స్కాలర్షిప్ రాకపోవడం.. తక్కువ మార్కులతోనే ఓబీసీల్లోని చెల్లి స్నేహితురాలికి దక్కడం.. యువ హార్దిక్ పటేల్కు ఏమాత్రం నచ్చలేదు. రిజర్వేషన్లు కొందరికి మాత్రమే ఉపయోగపడుతున్నాయని ఆందోళన చేపట్టిన హార్దిక్.. ఓబీసీ కోటాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని.. అలా కుదరని పక్షంలో అందరికీ ప్రత్యేక కోటాలు తీసేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వేలమంది యువకులతో నిర్వహించిన పాటీదార్ అనామత్ ఆందోళన్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఓబీసీ వర్గపు నేత అల్బేశ్ ఠాకూర్, దళిత ఉద్యమ నేత జిగ్నేశ్ మెవానీతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్న హార్దిక్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ్యాంగంపై ఒట్టేసి..: కన్హయ్య కుమార్ మూడేళ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దేశమంతా పరిచయమైన వ్యక్తి. పీహెచ్డీ విద్యార్థులకిచ్చే భృతిని తగ్గించడంపై ఢిల్లీ వీధులకెక్కిన కన్హయ్య కుమార్ తరువాతి కాలంలో దేశద్రోహం కేసులు ఎదుర్కోవడం.. అరెస్ట్ కావడం ఇటీవలి పరిణామాలే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బెయిల్పై విడుదలయ్యాక జేఎన్యూలో తోటి విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం.. చతురోక్తులు, మాట విరుపులతో మోదీ, అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఎక్కుపెట్టిన విమర్శలు దేశంలో సరికొత్త చర్చకు దారితీశాయి. కన్హయ్య కుమార్ నమ్మేది.. ప్రచారం చేసేది.. రాజకీయ నేతలు అనుసరించాలని కోరుకుంటున్నదీ ఒక్కటే. భారత ప్రజలందరి కోసం రాసుకున్న రాజ్యాంగాన్ని తు.చ. అమలు చేయమని! ఎన్నికల సమయంలో చేసిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలందరూ ప్రశ్నించాలన్నది అతని సిద్ధాంతం. బిహార్లోని బేగూసరాయిలోని భూమిహార్ కుటుంబం నుంచి వచ్చారీయన. జేఎన్యూలో పీహెచ్డీ చేసే సమయానికి ఆయన ఆలోచన తీరులో గణనీయమైన మార్పు వచ్చింది. రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్ దళితులకు కల్పించిన రక్షణను, వామపక్ష సిద్ధాంతాలను కలిపి కన్హయ్య కుమార్ ప్రతిపాదిస్తున్న ‘‘లాల్.. నీల్’’ నినాదాన్ని ఇప్పుడు వామపక్ష పార్టీలు ప్రచారం చేస్తూండటం గమనార్హం. 2019 ఎన్నికల బరిలోనూ నిలుస్తున్న ఈ యువనేత భారత రాజకీయ వ్యవస్థలో సరికొత్త, ప్రస్ఫుటమైన గళమవుతారనడంలో సందేహం లేదు. గిరిజనుల మరో గొంతుక: సోనీ సూరి బస్తర్ జిల్లాలో ఒకప్పుడు ఓ సామాన్య ఉపాధ్యాయురాలి పేరు సోనీ సూరి! మరి ఇప్పుడు..? దాదాపు 17 రాష్ట్రాల్లో గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న ధీర వనిత. ఒకపక్క నక్సలైట్లు.. ఇంకోవైపు వారిని వెంటాడుతూండే పోలీసుల మధ్య నలిగిపోతూ మాన ప్రాణాలను కోల్పోతున్న గిరిజనులకు అండగా నిలవడం ఈమె వృత్తి, ప్రవృత్తి కూడా. తమతో కలిసిపోవాల్సిందిగా మావోయిస్టులు కోరినప్పుడు.. తమకు ఇన్ఫార్మర్గా పనిచేయాలని పోలీసులు ఆదేశించినప్పుడూ సోని సూరి చెప్పిన మాట ఒక్కటే. ఇద్దరికీ సమాన దూరంలో ఉండటం తన విధానమని కుండబద్దలు కొట్టింది. అందుకు తన భర్తను పోగొట్టుకుంది. అత్యాచారాలకు గురైంది. ఎనిమిది పోలీసు కేసులు ఎదుర్కొంది. చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టి మరీ తాను పోలీసుల చేతిలో అత్యాచారానికి గురయ్యానని.. అది తన హక్కులను కాలరాయడమేనని వాదించి విజేతగా నిలిచింది. ఆ తరువాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల బరిలోనూ నిలిచింది. సోనీ తండ్రిని మావోయిస్టులు కాల్చేస్తే.. సానుభూతి పరుడన్న నెపంతో పోలీసులు భర్తను ఎత్తుకెళ్లిపోయి.. హింసించిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినాసరే నమ్మిన సిద్ధాంతాల కోసం, గిరిజనుల హక్కుల కోసం సోనీ సూరి ఛత్తీస్గఢ్లో పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్యలో ఆమెపై యాసిడ్ దాడి కూడా జరిగింది. కశ్మీర్ కి కలీ షెహలా రషీద్ షోరా కశ్మీర్ సమస్య పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉగ్రవాదం మాత్రమే కావచ్చు. అయితే ఈ ఉగ్రవాదాన్ని అణచివేసే లక్ష్యంతో అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ దళాలు హద్దుమీరి ప్రవర్తిస్తుంటాయని.. మానవ హక్కులను తోసిరాజంటాయని చాలామంది చెబుతుంటారు. కశ్మీర్లోనే పుట్టి పెరిగి.. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఎదిగిన షెహలా రషీద్.. కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్ అరెస్ట్కు నిరసనగా చేసిన ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. అంతకుముందు కూడా కశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితిపై.. ముఖ్యంగా మైనర్ విచారణ ఖైదీలకు మద్దతుగా గళమెత్తారు షెహలా రషీద్. పీహెచ్డీ విద్యార్థులకు ఇచ్చే భృతిని తగ్గించిన సందర్భంలో ‘‘ఆక్యుపై యూజీసీ’’ పేరిట షెహలా తదితరులు చేసిన ఉద్యమం అందరికీ తెలిసిందే. 2015లో జేఎన్యూ ఎన్నికల్లో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున బరిలో దిగిన షెహలా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. మంచి వక్తగా పేరొందిన ఈ కశ్మీరీ మహిళ వివాదాలకు కొత్తేమీ కాదు. ఒక ఫేస్బుక్ పోస్ట్లో మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఆరోపణపై 2017లో షెహలాపై ఒక కేసు నమోదైంది. కన్హయ్య కుమార్పై దేశద్రోహం కేసు సందర్భంగానూ షెహలా చేసిన పలు వ్యాఖ్యలు దుమారం రేపాయి. పల్లె నాడి పట్టినోడు: సాయినాథ్ ‘‘పల్లె కన్నీరు పెడుతోందో.. కనిపించని కుట్రల’’... పదిహేనేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసిన పాట. భారతీయ ఆత్మగా చెప్పుకునే పల్లెల్లోని కష్టాలకు ఈ పాట అద్దం పట్టింది. అయితే దశాబ్దాలుగా జర్నలిస్టుగా.. ఫొటో జర్నలిస్టుగా ఇదే పని చేస్తున్న పాలగుమ్మి సాయినాథ్ గురించి మాత్రం కొందరికే తెలుసు. కరువు, ఆకలి గురించి సాయినాథ్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ లాంటి వాళ్లే చెబుతున్నారంటే ఈ వ్యక్తి సామర్థ్యం ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పీపుల్స్ ఆర్కై వ్ ఆఫ్ రూరల్ ఇండియా (పరి) పేరుతో సాయినాథ్ నడుపుతున్న ఓ వెబ్సైట్ దేశంలో అన్నదాతకు జరుగుతున్న నష్టమేమిటన్నది భిన్నకోణాల్లో వివరిస్తుంది. రైతు ఆత్మహత్యలు.. అందుకు దారితీస్తున్న కారణాలను వివరిస్తూ వేర్వేరు సమావేశాల్లో సాయినాథ్ చేసిన ప్రసంగాలు అత్యంత ఆసక్తికరమైనవంటే అతిశయోక్తి కాదు. ‘‘సుప్రీంకోర్టు జడ్జీలందరికీ కనీసం ఓ పోలీస్ కానిస్టేబుల్కు ఉన్నన్ని అధికారాలు కూడా లేవు. కానిస్టేబుల్ అటో ఇటో తేల్చేస్తాడు. చట్టాలను తిరగరాసే శక్తిలేని సుప్రీంకోర్టు జడ్జీలు రెండువైపులా వాదనలను వినడం మాత్రమే చేయగలరు. కానిస్టేబుల్ మాత్రం తనదైన చట్టాన్ని సిద్ధం చేసుకోగలడు. ఏమైనా చేయగలడు’’ అంటారు సాయినాథ్. ప్రభుత్వ విధాన లోపాల కారణంగానే దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని విస్పష్టంగా ఎలుగెత్తే సాయినాథ్ కార్పొరేట్ సంస్థలు సిద్ధం చేసిన గ్యాట్, డబ్ల్యూటీవో చట్టాల దుష్ప్రభావాలను రైతులు అనుభవిస్తున్నారని అంటారు. శ్రామిక బాంధవి: సుధా భరద్వాజ్ పుట్టిందేమో అమెరికా. పదకొండేళ్ల ప్రాయంలోనే భారత్కు తిరిగొచ్చారు. 18 నిండేసరికి అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఐఐటీ చదువుతూ.. కార్మికుల కష్టాలకు కదిలిపోయారు. న్యాయవాదిగానూ మారిపోయాడు. ఇదీ హక్కుల ఉద్యమకారిణి సుధా భరద్వాజ్ స్థూల పరిచయం. 30 ఏళ్లుగా ఛత్తీస్గఢ్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఛత్తీస్గఢ్ ముక్తిమోర్చా తరఫున పనిచేస్తున్నారు. భిలాయి ప్రాంతంలోని గనుల్లో కార్మికుల వేతనాలను దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులపై కేసులు కట్టి న్యాయం కోసం పోరాడారు. గత ఏడాది జూలైలో రిపబ్లిక్ టీవీలో సుధా భరద్వాజ్పై వెలువడిన కథనం ఒకటి ఆమె అరెస్ట్కు దారితీసింది. మావోయిస్టు నేత ప్రకాశ్కు సుధా భరద్వాజ్ ఒక లేఖ రాసినట్లు.. ‘‘కశ్మీర్ తరహా పరిస్థితిని సృష్టించాలని అందులో పేర్కొన్నట్లు ఆర్ణబ్ గోస్వామి ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన సుధా భరద్వాజ్.. భీమా కోరేగావ్ అల్లర్ల విషయంలో పోలీసుల తీరును తప్పు పట్టినందుకే తనపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారన్నది సుధ వాదన. దేశమంటే మనుషులోయ్: ఖాలిద్ పార్లమెంటుపై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుపై జేఎన్యూలో ఒక కార్యక్రమం నిర్వహించడం ద్వారా వివాదాల్లోకి.. ప్రాచుర్యంలోకి వచ్చిన ఉమర్ ఖాలిద్ దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని గట్టిగా నమ్ముతారు. కాలేజీ రోజుల్లో భిన్న సంస్కృతులు, వ్యక్తులతో భిన్నత్వానికి పరిచయమైన ఉమర్.. తరువాతి కాలంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను, సమాజంలో వేర్వేరు వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తడం మొదలుపెట్టారు. ఆర్థిక సరళీకరణల తరువాత దేశం అగ్రరాజ్యంగా ఎదుగుతోందన్న ప్రచారం జరుగుతున్న దశలోనూ కొన్ని వర్గాల వారు పొట్టగడిపేందుకు పడుతున్న కష్టాలు తనను కలచివేశాయని. దేశభక్తి అంటే.. వీరి కోసం పోరాడడమే అని గట్టిగా విశ్వసించి అనుసరిస్తున్నారు ఉమర్. రాజ్యాంగం కులమతాలకు అతీతంగా పనిచేయాలని.. స్పష్టం చేస్తూండగా. చేసే పని ఆధారంగా, కులం, వర్గం, మతం ఆధారంగా సమాజం విడిపోయి ఉండటం కూడా నిష్టు్టర సత్యమని.. రాజకీయాలు ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడాలని.. అంతరాలను, అసమానతలను మరింత పెంచేలా ఉండకూడదన్నది ఉమర్ విస్పష్ట అభిప్రాయం. దేశాన్ని ముక్కలు చేసే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్ ప్రభుత్వాలు లాభాపేక్ష కలిగిన కార్పొరేట్లకు మద్దతుగా నిలవరాదని అంటారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన వారెన్ ఆండర్సన్ను అప్పటి అధికార పక్షం విమానంలో దేశం దాటిస్తే.. మోదీ ప్రభుత్వం నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులను దాటించేసిందని ఆరోపిస్తారు. -
కాంగ్రెస్లోకి హార్దిక్
సాక్షి, అహ్మదాబాద్ : పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారనే సమాచారం. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే హార్దిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ జామ్నగర్ నియోజకవర్గం నుంచి హార్దిక్ పోటీ చేస్తారని ఆయన సన్నిహుతులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో పుణమ్బన్ మాడమ్ బీజేపీ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పటేల్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అహ్మదాబాద్లో సీడబ్ల్యూసీ మీటింగ్ని ఏర్పాటు చేసి అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో పబ్లిక్ ర్యాలీని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది కాలం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో పట్టు కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది. (చదవండి : ఇక ఢిల్లీలో పోరాడతా: హార్దిక్) -
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా
-
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తా : హార్దిక్
సాక్షి,న్యూఢిల్లీ : పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలల్లో పోటీకి సిద్ధమయ్యారు. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో హర్దిక్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 లోక్సభ ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు హార్దిక్ పటేల్ ప్రయత్నించారు, కానీ వయస్సు సరిపోని కారణంగా పోటీకి దూరంగా నిలిచారు. ఇప్పుడు 25ఏళ్ల వయసు దాటడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హర్దిక్ సిద్ధమయ్యారు. అయితే ఏ స్థానం నుంచి అతను పోటీ చేస్తాడన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. (చిన్ననాటి స్నేహితురాలితో హార్ధిక్ పెళ్లి) గుజరాత్లోని అమ్రేలీ లేదా మెహసానా స్థానం నుంచి పోటీ చేస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమ్రేలి నుంచి అభ్యర్థిని నిలబెట్టకుండా హార్దిక్ పటేల్కు ఇవ్వనున్నట్లు సమాచారం. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రేలీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అయిదు స్థానాల్లో పటేదార్లు గెలిచారు. దీంతో హార్థిక్ ఆ స్థానం నుంచే పోటీపడే అవకాశాలు ఉన్నాయి. -
ఇంటివాడైన హార్దిక్ పటేల్..
బాల్య స్నేహితురాలు కింజాల్ పారిఖ్ను వివాహమాడిన పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్. అహ్మదాబాద్కు 130 కిలోమీటర్ల దూరంలోని దిగ్సార్ అనే గ్రామంలో ఆదివారం ఈ వేడుక జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అనుమతితో ఒక్కటయ్యారు. -
చిన్ననాటి స్నేహితురాలితో హార్ధిక్ పెళ్లి
అహ్మదాబాద్: పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిక్ను ఆదివారం వివాహం చేసుకున్నారు. సురేంద్రనగర్ జిల్లా దిగ్సార్ గ్రామంలోని ఓ దేవాలయంలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పటేల్ సంప్రాదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దగ్గరి బంధువులు, కొద్దిమంది స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం హార్ధిక్ మాట్లాడుతూ.. ‘నా కుటుంబ జీవితంలో ఇది రెండో ఇన్నింగ్స్. ప్రతి ఒక్కరు సమాన అవకాశాలు పొందాలనేదే నా కోరిక. పురుషులకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని.. నేను నా భార్యకు ప్రామిస్ చేశాను. ఇకపై మేమిద్దరం ఈ దేశ నవ నిర్మాణం కోసం పోరాడతామ’ని తెలిపారు. కింజాల్, తాను ప్రేమించుకున్న విషయాన్ని హార్ధిక్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలుత కింజల్ తనకు ప్రపోజ్ చేసిందన్న హార్ధిక్.. పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు. హార్ధిక్ స్వగ్రామం అహ్మదాబాద్ జిల్లాలోని చందన్ నగరి కాగా, కింజల్ ఆ ఊరికి సమీపంలోని విరంగం గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం కింజల్ కుటుంబం సూరత్లో నివాసం ఉంటుంది. ఆమె తంద్రి దిలీప్ పారిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన కింజల్.. ప్రస్తుతం లా చదువుతున్నారు. -
‘అలాగైతే అందరి పేర్లూ రామ్గా మార్చాలి’
అహ్మదాబాద్ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నగరాల పేర్లను మార్చడం పట్ల పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యోగి ఆదిత్యానాథ్ సర్కార్ అలహాబాద్, ఫైజాబాద్ నగరాల పేర్లను మార్చడాన్ని పటేల్ ప్రస్తావిస్తూ పేర్లు మార్చినంత మాత్రన సమస్యలు పరిష్కారమైతే భారతీయులందరి పేర్లను రాముడిగా మార్చాలని చురకలు వేశారు. నగరాల పేర్లను మార్చడంతో దేశం సుసంపన్నమైతే ఇక దేశంలోని 125 కోట్ల మంది భారతీయుల పేర్లను రాముడిగా మార్చాలని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి ఎన్నో అంశాలు ప్రధానంగా ముందుకొస్తుంటే ప్రభుత్వం మాత్రం పేర్లు, విగ్రహాల పట్ల ఆసక్తిగా ఉందని ఎద్దేవా చేశారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల ప్రకటించిన క్రమంలో హార్ధిక్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతకుముందు అలహాబాద్ పేరును ప్రయాగ రాజ్గా యూపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఇక ముజఫర్నగర్ పేరును లక్ష్మీనగర్గా, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ను కర్ణావతిగా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
పోటీ పరీక్ష: దీక్ష విరమణకు నీళ్లిచ్చిందెవరు?
అహ్మదాబాద్: ఓ పోటీ పరీక్షలో అడిగిన ప్రశ్న ఆ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్లో రైతులకు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్ నిరహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలో ఇటీవల దీక్షలో ఉన్న హార్ధిక్కు నీరు అందజేసి మద్దతు తెలిపింది ఎవరనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నకు నాలుగు ఐచ్ఛికాలు.. శరద్ యాదవ్, శతృజ్ఞ సిన్హా, లాలూ ప్రసాద్యాదవ్, విజయ్ రూపానీ కూడా ఇచ్చారు. అందులో సరైన సమాధానం మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్. ఈ సంగతి అటు ఉంచితే.. పరీక్షలో ఈ రకమైన ప్రశ్న రావడం గుజరాత్లో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 25న నిరహార దీక్ష చేపట్టిన హార్ధిక్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మంచి నీళ్లు కూడా తీసుకోవడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. సెప్టెంబర్ 7వ తేదీన ఆస్పత్రికి తరలించారు. ఆ మరుసటి రోజు హాస్పిటల్లో హార్ధిక్ను పరామర్శించిన శరద్ యాదవ్ అతనికి నీరు అందజేశారు. కాగా హార్ధిక్ సెప్టెంబర్ 12వ తేదీన దీక్షను విరమించారు. పోటీ పరీక్షలో ఈ ప్రశ్న రావడంపై గాంధీనగర్ మేయర్ను ప్రశ్నించగా.. దీనిపై తనకు సమాచారం లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కాబడిన ప్రతినిధులు ఎవరు ఈ పరీక్షల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. -
దీక్ష విరమించిన పటేళ్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్
-
ఇక ఢిల్లీలో పోరాడతా: హార్దిక్
అహ్మదాబాద్: గుజరాత్లో రైతులకు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్లు, దేశద్రోహం కేసులో అరెస్టైన తన స్నేహితుడు అల్పేశ్ కత్రియా విడుదల డిమాండ్లతో పటేళ్ల నేత హార్దిక్ పటేల్ గత 19 రోజులుగా చేసిన నిరశన దీక్షను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం తన డిమాండ్లను పట్టించుకోకపోవడంతో ఇక తదుపరి పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీలో చేస్తాననీ, జంతర్ మంతర్ లేదా రామ్ లీలా మైదానం వద్ద తాము నిరసనలకు దిగుతామని హార్దిక్ చెప్పారు. మూడు డిమాండ్లతో అహ్మదాబాద్లోని తన ఇంట్లో గత నెల 25 నుంచి హార్దిక్ పటేల్ నిరవధిక నిరాహార దీక్షకు దిగడం తెలిసిందే. దీక్ష 14వ రోజున ఆరోగ్యం క్షీణించడంతో హార్దిక్ను వైద్యశాలకు తరలించగా రెండురోజులపాటు ఆసుపత్రిలోనే ఆయన దీక్ష కొనసాగించారు. పటేల్ సామాజిక వర్గ నేతలు నరేశ్ పటేల్, సీకే పటేల్లు బుధవారం హార్దిక్కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. హార్దిక్ మాట్లాడుతూ ‘ప్రజల సలహా మేరకు నేను నిరాహార దీక్షను విరమిస్తున్నాను. ముందు నేను బతికుంటేనే పోరాడగలను. పోరాడితేనే గెలుస్తాను’అని హార్దిక్ చెప్పారు. -
ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తా
అహ్మదాబాద్: రైతు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్ల డిమాండ్లతో గుజరాత్లో పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) కన్వీనర్ హార్దిక్ పటేల్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. గత నెల 25 నుంచి ఆయన దీక్ష చేస్తుండగా ఆరోగ్యం క్షీణించడంతో హార్దిక్ను శుక్రవారం ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తాజాగా ఆయన వైద్యశాల నుంచి డిశ్చార్జి అయ్యి, తన ఇంటివద్దనే 16వ రోజు దీక్ష కొనసాగించారు. అంతకుముందు హార్దిక్ ఇంటికి వెళ్తుండగా ఆ దారిలో భారీ సంఖ్యలో పోలీసులను ప్రభుత్వం మోహరించింది. హార్దిక్ను అనుసరిస్తున్న విలేకరులను పోలీసులు అడ్డుకోవడంతోపాటు కొంతమందిపై లాఠీ చార్జీ కూడా చేశారు. పోలీసుల చర్యను హార్దిక్ ఖండించారు. ఆగస్టు 25న హార్దిక్ పటేల్ దీక్ష ప్రారంభించారు. మంచినీళ్లు తీసుకోవడం కూడా మానేయడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లోనే నిరహార దీక్ష కొనసాగిస్తానని ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన ప్రకటించారు. -
పటేల్ ఉద్యమనేత హర్ధిక్ పటేల్కు ఎదురుదెబ్బ
-
హార్దిక్కు రెండేళ్ల జైలు
మెహసానా: పటీదార్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్కు గుజరాత్లోని ఓ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2015 జూలైలో విస్నగర్లో జరిగిన అల్లర్లు, ఆస్తి నష్టం కేసులో హార్దిక్తో పాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్కు శిక్ష పడింది. అయితే వెంటనే అదేకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అల్లర్లు సృష్టించడం, ఆస్తి నష్టం, చట్ట వ్యతిరేకంగా సమావేశం కావడం వంటి కేసుల్లో వారు ముగ్గురూ దోషులుగా తేలినట్లు విస్నగర్ సెషన్స్ కోర్టు జడ్జి వీపీ అగర్వాల్ తీర్పులో పేర్కొన్నారు. వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 14 మందిని సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు విడిచిపెట్టింది. పటీదార్ రిజర్వేషన్ల కోసం విస్నగర్లో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారిందని, దీనివల్ల ఆస్తి నష్టం, మీడియాపై దాడులు జరిగాయని మెహసానా జిల్లాలో 2015 జూలై 23న ఎఫ్ఐఆర్ నమోదైంది. సత్యం, రైతులు, యువత, పేదవారి కోసం తాను చేస్తున్న ఉద్యమాన్ని బెదిరింపులతో బీజేపీ ‘హిట్లర్ షాహీ’ ఆపలేరని హార్దిక్ పటేల్ మీడియాతో పేర్కొన్నారు. -
హార్దిక్ పటేల్కు భారీ ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: పటేల్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2015లో పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసులో హార్దిక్కు రెండు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ గుజరాత్లోని స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో పాటు 50వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది. మొత్తం 17మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్తోపాటు సర్దార్ పటేల్ వర్గం నేత లాల్జీ పటేల్, ఏకే పటేల్ను కూడా దోషులుగా నిర్దారించింది. వీరికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది. మరోవైపు తీర్పువెలువడిన వెంటనే హార్దిక్కు చెందిన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ నేతృత్వంలో 2015లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది. ఉద్యమనేత హార్దిక్ పటేల్.. హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోదైంది. -
రిజర్వేషన్ల కోసం ఆఖరి పోరాటం: హార్దిక్
అహ్మదాబాద్: పటేల్ వర్గీయులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆగస్టు 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు పటీదార్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ప్రకటించారు. తన వర్గీయులకు రిజర్వేషన్లు సాధించడమే తన లక్ష్యమని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కోటా సాధనలో తన ప్రాణాలు పోయినా లెక్కచేయనన్నారు. ‘ఈ పోరాటంలో మీ అందరి మద్దతు కోరుతున్నా. పటీదార్ క్రాంతి దివస్ అయిన ఆగస్టు 25 నుంచి నిరాహార దీక్షకు దిగబోతున్నా. రిజర్వేషన్లు సాధించే వరకు ఆహారం, నీరు ముట్టుకోను’ అన్నారు. -
సన్నీపై హర్ధిక్ పటేల్ కామెంట్!
ఇండోర్ : మాజీ శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్పై పటీదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. మధ్యప్రదేశ్లోని ఓటర్లను చైతన్య పరచడానికి హర్ధిక్ జూలైలో యాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సన్నీ లియోన్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆమెకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మిగతా బాలీవుడ్ హీరోయిన్లలాగానే సన్నీని చూడాలన్నారు. గతంతో సంబంధం లేకుండా ఓ నటిగా సన్నీ తనను తాను నిరూపించుకుందని.. తెరపై దానిని మాత్రమే చూడాలని పేర్కొన్నారు. బాలీవుడ్ హీరోయిన్లు నర్గీస్, శ్రీదేవి, మూధురి దీక్షిత్లా సన్నీని చూడటంలో తప్పేంటని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా సన్నీని ఓ పోర్న్స్టార్లానే చూస్తే.. ఈ దేశం బాగుపడదని హర్ధిక్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా హర్ధిక్ సన్నీకి మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక, బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోందని హార్థిక్ విమర్శించారు. ఒకవేళ 2019లో మోదీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో మళ్లీ ఎన్నికలు జరగవేమోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో జగిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. -
హర్దిక్ పటేల్పై ఇంకు దాడి
-
వెధవలను చేస్తున్నాడంటూ ఇంకు జల్లాడు
ఉజ్జయిని : పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఇంకుతో హర్దిక్పై దాడి చేశాడు. హఠాత్ పరిణామంతో యువనేత బిత్తర పోగా.. దాడి చేసిన వ్యక్తిని హర్దిక అనుచరులు చితకబాదారు. శనివారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో దాడి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉజ్జయినిలో ఓ హెటల్ లో ప్రెస్ మీట్ కోసం హర్దిక్ బయలుదేరారు. అంతలో మిలింద్ గుజ్జర్ అనే వ్యక్తి దూసుకొచ్చి హర్దిక్పై ఇంకు పోసేశాడు. వెంటనే హర్దిక్ పక్కనున్న వ్యక్తులు మిలింద్ను కొట్టి.. ఆపై పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, పటీదార్, గుజ్జర్ తెగలను స్వప్రయోజనాల కోసం హర్దిక్ వెధవలను చేస్తున్నాడని.. అది తట్టుకోలేకనే ఇంక్ పోసినట్లు మిలింద్ వివరించాడు. అంతకు ముందు మిలింద్ ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ హర్దిక్ ఇంకు దాడి చేస్తానని ప్రకటించటం విశేషం. ఇక ఆ పరిణామాలను పట్టించుకోని హర్దిక్ తన ప్రెస్ మీట్ను కొనసాగించించాడు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే.. తాము అడ్డుకోబోమని.. ఆయన తరపున ప్రచారం కూడా చేస్తామని హర్దిక్ తెలిపారు. -
నేను రాహుల్ను కలసి ఉంటేనా..!
ముంబై : గతేడాది జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తాను కలసి ఉంటే బీజేపీ గెలవకపోయుండేదని పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ శనివారం వ్యాఖ్యానించారు. ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను రాహుల్ను కలవలేదు. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రేలతో నేను భేటీ అయ్యాను. రాహుల్ గాంధీని కలిసినా సమస్యేమీ ఉండేది కాదు. ఆయనను కలసి మాట్లాడకపోవడం నా తప్పే. ఆ తప్పు జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యం వచ్చి ప్రభుత్వంలో ఉండేది. బీజేపీ ఓడిపోయేది’అని హార్దిక్ అన్నారు. 2014లో తాము కూడా మోదీకే ఓటేశామనీ, ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధర తదితర మంచి పనులన్నీ జరుగుతాయనీ ఆశించామనీ, కానీ అవన్నీ అడియాసలయ్యాయన్నారు. విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం దేశంలో అనేక మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వలస వెళ్లి రాత్రికిరాత్రి ఐశ్వర్యవంతులయ్యారని అన్నారు. -
రాహుల్పై హర్ధిక్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పటీదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో రాహుల్ నాయకుడే కాదని తెలిపాడు. అదే సమయంలో రాహుల్ సోదరి ప్రియాంక వాద్రాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ హర్ధిక్ ఆహ్వానిస్తున్నాడు. ‘ ఓ వ్యక్తిగా మాత్రమే రాహుల్ గాంధీ నాకు ఇష్టం. అంతేగానీ ఓ నేతగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి పాటించడానికి ఆయనేం నాకు అధిష్ఠానం కూడా కాదు. కానీ, అదే కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయని నా అభిప్రాయం’ అని శుక్రవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన హర్ధిక్ పేర్కొన్నాడు. ఇక 2019 ఎన్నికల్లో పటీదార్ అనమత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) తరపున పోటీ చేయబోనని హర్ధిక్ స్పష్టం చేశాడు. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్ధిక్ పోటీ చేయలేదు. 24 ఏళ్ల హర్ధిక్కు వయోపరిమితి( పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలి) కారణంగానే దూరంగా ఉన్నాడని.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాడంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన హర్ధిక్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తననెవరూ అడ్డుకోలేరని చెబుతూ.. ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపాడు. -
మోదీపై హార్థిక్ ఘాటు విమర్శలు
సాక్షి, గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోదీపై పటేళ్ల ఉద్యమ సారధి హార్థిక్ పటేల్ తీవ్ర విమర్శలు చేశారు. ఓ టీలు అమ్ముకునే వ్యక్తి మాత్రమే(పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీ) నిరుద్యోగులకు స్నాక్స్ అమ్ముకోండని చెప్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈమేరకు ట్వీట్ చేశారు. 'చాయ్లమ్ముకునే వ్యక్తి మాత్రమే సమోసాలు అమ్ముకొమ్మని నిరుద్యోగులకు చెప్తారు.. అంతేగానీ, ఆ వ్యక్తి ఆర్థిక వేత్త అయి ఉంటే ఇలాంటి మాటలు ఎప్పటికీ చెప్పరు' అని ట్వీట్లో హార్థిక్ పేర్కొన్నారు. ఇటీవల ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉపాధిపై స్పందిస్తూ 'ఒక వ్యక్తి పకోడాలు అమ్ముకొని సాయంత్రానికి రూ.200 పట్టుకొని ఇంటికొస్తే దాన్ని ఉపాధిగా పరిగణిస్తారా? లేదా?' అని అన్నారు. దీనిపైనే హార్థిక్ మాట్లాడుతూ మోదీ పరోక్షంగా నిరుద్యోగులను సమోసాలు, పకోడాలు అమ్ముకొమ్మని సలహాలు ఇస్తున్నారంటూ విమర్శించారు. बेरोज़गार युवा को पकौडे का ठेला लगाने का सुझाव एक चायवाला ही दे सकता है, अर्थशास्त्री एसा सुझाव नहीं देता !!!! — Hardik Patel (@HardikPatel_) January 22, 2018 -
కొత్త ట్విస్ట్... నితిన్కు హార్దిక్ బంపరాఫర్
గాంధీనగర్ : గుజరాత్ కేబినెట్ చిచ్చు తారాస్థాయికి చేరిన వేళ.. శాఖ కేటాయింపుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నితిన్భాయ్ పటేల్ వ్యవహారం గుజరాత్లో కొత్త రాజకీయానికి తెరలేపింది. పటేళ్ల ఆత్మగౌరవ సమస్య అంశం తెరపైకి రావటంతో పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చేశాడు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నితిన్పటేల్కు హార్దిక్ బంపరాఫర్ ప్రకటించాడు. ‘‘ఆయన(నితిన్) వెంటనే బీజేపీని వీడాలి. తన వెంట మరో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలి. అలా వస్తే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఇప్పిస్తా’’ అని హామీ ఇస్తున్నాడు. బీజేపీ గౌరవించని పక్షంలో ఇంకా పార్టీని పట్టుకుని వేలాడే అవసరం నితిన్కు ఏంటని హార్దిక్ ప్రశ్నిస్తున్నాడు. సారంగపూర్లో మీడియాతో హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయనప్పటికీ, ఆయన అవమాన భారంతో రగిలిపోతున్నట్లు, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పరిస్థితి అసంతృప్తి తారాస్థాయికి చేరితే మాత్రం బీజేపీ చెయ్యి జారి గుజరాత్ రాజకీయాల్లో సమూల మార్పులు వాటిల్లే అవకాశం ఉందన్నది విశ్లేషకుల మాట. -
మోదీ శకంలో దూసుకొచ్చిన కొత్త తారలు!
2017... భారత రాజకీయ చరిత్రను కొత్త మలుపు తిప్పింది. భవిష్యత్ నాయకులుగా గుర్తింపు పొందుతున్న వారంతా ఈ ఏడాది వెలుగులోకి వచ్చారు. మోదీ శకం దేదీప్యమానంగా సాగుతున్న సమయంలో.. కొత్త తారలు ఆవిర్భవించడం విశేషమే. ఈ ఏడాది భారత రాజకీయ యవనికపై కొత్త ముఖాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టే సత్తా ఉన్న నేతలెవరూ లేరా? అని అనుకుంటున్న తరుణంలో.. గుజరాత్ యువకులు ఆశాదీపంలా కనిపించారు. గుజరాత్ అంటే నాదే అని జబ్బలు చరుచుకునే మోదీకే ముగ్గురు ముప్పయి చెరువుల నీళ్లు తాగించారు. మోదీకి మొదటి అపజయ భయాన్ని కల్గించారు. ఇక దశాబ్దకాలంగా రాజకీయాల్లో ఉన్నా.. శతాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నా గుర్తింపు రానీ రాహుల్ గాంధీకి ఈ ఏడు బాగా కలిసి వచ్చింది. మిణుకుమిణుకు మంటున్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ తిరిగి వెలుగులు తీసుకురాగలడనే నమ్మకం ఇప్పుడే మొదలయింది. అలాగే ఉత్తర ప్రదేశ్లో రెండు దశాబ్దల కిందట అధికారానికి దూరమయిన భారతీయ జనతాపార్టీకి యోగి ఆదిత్యనాథ్ రూపంలో కొత్త శక్తి లభించింది. హార్ధిక్ పటేల్ పటేదార్ రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మొదలు పెట్టిన హార్ధిక్ పటేల్.. రేపటి తరం రాజకీయ ప్రతినిధిగా గుజరాత్లో స్థానం సంపాదించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు కూడా సరిపోయేంత వయసులేని హార్ధిక్... ప్రధాని నరేంద్ర మోదీని ముప్పతిప్పలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి.. బీజేపీని ఓటమి అంచులవరకూ తీసుకు వచ్చారు. సౌరాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు వచ్చాయంటే అది హార్ధిక్ పటేల్ సత్తానే అని చెప్పాలి. జిగ్నేష్ మేవాని సామాజిక వేత్తగా, న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న జిగ్నేష్ మేవానీ.. 2017 గుజరాత్ ఎన్నికల్లో రాజకీయ నేతగా మారారు. ప్రధానంగా దళిత నేతగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని జిగ్నేష్ చేసిన విమర్శలు.. ప్రజల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చిందని చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ జిగ్నేష్.. వడ్గావ్ నియోజక వర్గం నుంచి 19 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. భవిష్యత్ గుజరాత్ నేతగా ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారు. అల్ఫేష్ ఠాకూర్ గుజరాత్లో ఓబీసీ నేతగా అల్ఫేష్ ఠాకూర్.. ఎదిగారు. ఈ ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో.. బీజేపీని, ప్రధాని మోదీ, అమిత్ షాల లక్ష్యంగా అల్ఫేష్ విమర్శల వర్షం కురిపించారు. గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన పేరుతో.. ఆల్ఫేష్ ఠాకూర్ బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఎన్నికల్లో.. అల్ఫేష్ ఠాకూర్.. బీజేపీ అభ్యర్థిపై 10 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యానాథ్.. మొన్నటి వరకూ గోరఖ్పూర్ మఠాధిపతిగా, గోరఖ్పూర్ లోక్సభ సభ్యుడిగానే అందరికీ తెలుసు. ఈ ఏడాది యూపీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. యోగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అతివాద హిందూ నేతగా ఆదిత్యనాథ్కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇప్పటికే నరేంద్ర మోదీ తరువాత భారత ప్రధాని అయ్యేది యోగి ఆదిత్యనాథ్ అని బీజేపీలో ఒక వర్గం ప్రచారం సైతం చేస్తోంది. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి 2004లోనే రాహుల్ గాంధీ ప్రవేశించినా తిరుగులేని గుర్తింపు మాత్రం ఈ ఏడాదే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. వారసత్వంగా పార్టీ అధ్యక్షుడు అయ్యాడన్న వాదనలు ఉన్న సమయంలో గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ తొలిసారి తన సత్తాను చాటారు. కూటమి కట్టడంలోనూ, అందరినీ కలుపుకుపోవడంలోనూ, మోదీపై విమర్శలు చేయడంలోనూ రాహుల్ పరిణతి ప్రదర్శించారు. ‘నీచ్’ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్పై వేగంగా చర్యలు తీసుకుని.. తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. -
హార్ధిక్ పటేల్కు ఝలక్.. ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, అహ్మదాబాద్: అసలే తాను మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో నిరాశ చెందుతున్న పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్కు అహ్మదాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. అహ్మదాబాద్ పోలీసులు హార్ధిక్ పటేల్పై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిసెంబర్ 11న అహ్మదాబాద్ లోని బోపాల్ మునిసిపాలిటీలో తన మద్ధతుదారులతో కలిసి హార్ధిక్ రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా అధికారుల అనుమతి లేకున్నా.. బైక్ ర్యాలీ నిర్వహించిన కారణంగా పటేల్ రిజర్వేషన్ల ఉద్యమనేతపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు బోపాల్ ఇన్స్పెక్టర్ ఐహెచ్ గోహిల్ తెలిపారు. రోడ్ షోకు జిల్లా అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే హార్థిక్ తన మద్దతుదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చేశారని పేర్కొన్నారు. హార్ధిక్తో పాటుగా మరో 50 మంది అతడి కీలక అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోహిల్ వివరించారు. గుజరాత్ రెండో దశ ఎన్నికలకు మూడు రోజుల ముందు బైకులు, కార్లతో బోపాల్ ఏరియా నుంచి నికోల్ ఏరియాల మధ్య 15 కి.మీ మేర రోడ్ షో నిర్వహించిన హార్ధిక్పటేల్ సహా మరికొందరిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ ఏకే సింగ్ అన్నారు. కాగా, గుజరాత్ రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిసెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలు అహ్మదాబాద్లో పర్యటించవలసి ఉంది. అయితే శాంతి భద్రతలతో పాటుగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ర్యాలీలకు తాము అనుమతి ఇవ్వలేదని ఏకే సింగ్ వివరించారు. అయితే మోదీ, రాహుల్లు పోలీసుల నిర్ణయానికి కట్టుబడి ఉండగా.. ఉద్యమనేత హార్ధిక్ పటేల్ మాత్రం నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. -
'ఏటీఎంలే హ్యాక్ చేస్తుంటే.. ఈవీఎంలు ఒక లెక్కా?'
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ విజయంకోసం కీలకంగా పనిచేశానని పటేల్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో 33శాతం ఓట్ల శాతం ఉండేదని అది ఇప్పుడు 43శాతానికి పెరిగిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్లే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. మరో 12 నుంచి 13 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావాల్సి ఉందని కానీ బీజేపీ మోసం వల్ల అవి రాలేదన్నారు. 'వాస్తవానికి బీజేపీకి 82 సీట్లు మాత్రమే రావాలి. వారిని పటేళ్లు, ఓబీసీలు, దళితులు, వ్యాపారులు వ్యతిరేకించారు. అలాంటప్పుడు ఇంకెవరు వారిని నమ్మి ఓటు వేస్తారు. నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈవీఎంల ట్యాంపరింగ్పై దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేతలందరికీ లేఖలు రాస్తాను. అలాగే బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తాను. దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఈవీఎంలేనా.. ఏటీఎంలనే హ్యాకింగ్ చేస్తున్నారు.. అలాంటి ఈవీఎంలు ఒక లెక్కనా.. వాటిని హ్యాకింగ్ చేయలేరా. సూరత్, రాజ్కోట్, అహ్మదాబాద్లలో కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు' అని హార్ధిక్ అన్నారు. -
పటేళ్ల పంతం నెగ్గిందా?
గుజరాత్లో పాటీదార్ల వ్యతిరేకత ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని పరిశీలకులు భావిస్తున్నారు. 2015లో హార్ధిక్ పటేల్ నాయకత్వాన మొదలైన పాటీదార్ల రిజర్వేషన్ ఆందోళన అత్యధిక పటేళ్లను బీజేపీకి దూరం చేసింది. రిజర్వేషన్ అమలు చేస్తామనే రాహుల్ హామీతో వారిని ఆకట్టుకోవడం మొదటిసారి గుజరాత్ రాజకీయ, సామాజిక చిత్రాన్ని సమూలంగా మార్చే పరిస్థితి తలెత్తింది. పర్యవసానంగా బీజేపీ సీట్లకు గండికొట్టి, కాంగ్రెస్కు లాభం చేకూర్చింది. ఎక్కువ సీట్లు ఇచ్చినా బీజేపీకి దక్కని ప్రయోజనం రెండేళ్ల నుంచీ బీసీ కోటా కోసం ఆందోళన సాగిస్తున్న పాటీదార్లను ప్రసన్నం చేసుకోడానికి ఈసారి బీజేపీ ఎక్కువ మంది పటేళ్లకు టికెట్లు ఇచ్చింది. ఆ వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ పోటీ చేసే అవకాశమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం పాటీదార్ రిజర్వేషన్ ఉద్యమ నేతే (హార్ధిక్పటేల్) తనకు మద్దతు ప్రకటించడంతో ఈసారి పటేళ్లకిచ్చే టికెట్ల సంఖ్యను తగ్గించింది. బరిలో నిలిచేందుకు అవసరమైన 25 ఏళ్లు రాకపోవడంతో పాటీదార్ నేత హార్దిక్ పోటీ చేయలేదు కానీ తమ నేతలు కొందరికి టికెట్లు సాధించగలిగారు. పాటీదార్ల మద్దతు బాగా తగ్గిపోయిందన్న విషయం గ్రహించిన బీజేపీ వారికి వ్యతిరేకంగా బాహాటంగా బీసీలను ఆకట్టుకునే సాహసం చేయలేకపోయింది. బీసీల్లో ఎక్కువ శాతమున్న మత్స్యకారులైన కోలీల మద్దతు విషయంలో బీజేపీ కొంత విజయం సాధించింది. ఎస్సీలు, బీసీలు, పాటీదార్ల యువనేతల మద్దతు కాంగ్రెస్కు లభించడం కొంత వరకు ఆ పార్టీకి మేలు చేసింది. తమకు కోటా రాదని తెలిసినా కేవలం మోదీకి, విజయ్ రూపాణీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు ‘గుణపాఠం’ చెప్పాలనే హార్ధిక్, ఇతర యువ పాటీదార్ నేతల మాటలు పెద్ద తరం పటేళ్లకు రుచించలేదు. ఒక్కసారిగా బీజేపీకి కులమంతా దూరం కావడం తెలివైన వ్యూహం కాదని వారు భావించడంతో పాటీదార్ ఓట్లు కూడా చాలా ప్రాంతాల్లో బీజేపీకి అవసరమైన స్థాయిలో పడ్డాయి. అన్ని వర్గాల నుంచీ తగ్గిన మద్దతు? పాటీదార్ల స్థానంలో ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా బీజేపీకి పూర్తిగా పడకపోయినా బీజేపీ 99 సీట్లు గెలుచుకోవడం నిజంగా గొప్ప విజయమేనని చెప్పాలి. పది శాతమున్న ముస్లింల ఓట్లు పెద్దగా బీజేపీకి పడకపోయి నా, దాదాపు 12 శాతమున్న పటేళ్లలో తమ సర్కారుపై కోపం పీకలదాకా ఉన్నా ఈ ఎన్నికల్లో కాషాయ పక్షం మెజారిటీ సాధించ డం ఈ పార్టీ నేతలు సైతం ఊహించని వాస్తవం. పాటీదార్ యువత అంచనా వేయలే నంతగా దూరమైనప్పటికీ ఇతర బీసీలు, ఆదివాసీలను ఆకట్టుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు కొంత వరకు సఫలమయ్యాయని ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13 ఎస్సీ రిజర్వుడ్ సీట్లలో ఏడు, 23 ఆదివాసీ నియోజకవర్గాల్లో దాదాపు సగం దక్కించుకోవడం కూడా బీజేపీ మెజారిటీకి దోహదం చేశాయి. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఈవీఎంలే ఎన్నికల్లో అతి పెద్ద తేడా
-
ఆరోపణలపై స్పందించిన సీఈసీ
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. ట్యాంపరింగ్ ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్ ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి అచల్ కుమార్ జోతి కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ గురి అయ్యే అవకాశమే లేదని ఆయన అంటున్నారు. గతంలో ఎన్నికల సంఘం మీడియా సమక్షంలోనే వీటిపై ప్రయోగపూర్వకంగా వివరణ ఇచ్చుకుంది. గుజరాత్ ఎన్నికల్లో వీవీపీఏటీ లను వినియోగించిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు ట్యాంపరింగ్కు అవకాశమే లేదు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదు అని ఆయన చెప్పారు. కాగా, ఏటీఎంలు హ్యాకింగ్కు గురైనప్పుడు.. ఈవీఎంలు కూడా హ్యాకింగ్కు గురి అయి తీరతాయని హర్దిక్ ఈ ఉదయం కూడా తాజాగా వ్యాఖ్యలు చేశాడు. అయితే గుజరాత్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీబీ స్వాయిన్ కూడా వాటిని తీవ్రంగా ఖండించారు. -
హార్థిక్ పటేల్ సంచలన ఆరోపణలు
అహ్మదాబాద్: అత్యంత హోరాహారీగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెల్లడికానున్న నేపథ్యంలో పటీదార్ నేత హార్థిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంల)ను బీజేపీ ట్యాంపరింగ్ చేసే అవకాశముందని ఆయన అన్నారు. మొత్తం 17 జిల్లాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హార్థిక్ పటేల్ వరుస ట్వీట్లలో సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన హార్థిక్ పటేల్.. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేయడంతో ఈ ట్వీట్లను పటీదార్లు (పటేల్ సామాజికవర్గం) సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు కూడా ఉంటున్నాయి. వడోదరలోని కర్జాన్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఎన్నికల ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టేరీతిలో వీడియో మెసేజ్ పోస్టు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. హార్థిక్ వరుస ట్వీట్లలో ఏమన్నారంటే.. ‘గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. అది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం. బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారానే గుజరాత్ ఎన్నికలను గెలువగలదు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయి గుజరాత్ ఎన్నికల్లో గెలువడం ద్వారా ఎవరికీ అనుమానాలు రాకుండా చూడాలని బీజేపీ చూస్తోంది. ఈవీఎం రిగ్గింగ్కు పాల్పడకపోతే బీజేపీ గుజరాత్లో 82 సీట్లకు మించి గెలువదు. బీజేపీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది. అలా కాకుండా బీజేపీ గెలిచిందంటే అది ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే..’ అని హార్థిక్ అన్నారు. ఈవీఎంలను పక్కనబెట్టి మళ్లీ బ్యాలెట్ బ్యాక్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందని హార్థిక్ పేర్కొన్నారు. రేపే ఫలితాలు! గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈవీఎంలు వాడటంతో ఉదయం 10 గంటల కల్లా ఏ పార్టీకి మెజారిటీ దక్కనుందో ట్రెండ్ను బట్టి తేలిపోనుంది. గుజరాత్లో 182 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లో 68స్థానాలకు లెక్కింపు జరగనుంది. రెండుచోట్లా బీజేపీ గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి. -
ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు: హార్ధిక్
అహ్మదాబాద్ : సీడీల వ్యవహారంతో వార్తల్లో నిలిచిన పటేల్ ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ తనపై వచ్చిన తాజా ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్నికల సమయంలో తాను సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను కలిసినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని హార్ధిక్ పటేల్ ధ్వజమెత్తారు. రేపో...మాపో తాను నవాజ్ షరీఫ్, దావూద్ ఇబ్రహీంను కలిసినట్లు ప్రచారం చేసేలా ఉన్నారని ఆయన విమర్శించారు. బీజేపీ ఇలాంటి చెత్త రాజకీయాలు చాలా చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా హార్ధిక్ పటేల్పై ఆయన మాజీ అనుచరుడు దినేశ్ బంభూనియా మరో బాంబ్ పేల్చారు. ఎన్నికలకు ముందు హార్ధిక్ నాలుగు సార్లు రాహుల్ గాంధీని, ఓ సారి రాబర్ట్ వాద్రాతో రహస్యంగా సమావేశం అయినట్లు ఆరోపణలు చేశారు. ఈ మంతనాలు ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగాయని దినేశ్ బంభూనియా తెలిపారు. ఈ సీక్రెట్ మీటింగ్ ఎందుకన్నది హార్ధిక్ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హార్థిక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ గురువారం జరగనుంది. -
బీజేపీలో వణుకు మొదలైంది..!
సాక్షి, అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో విజయం తమదేనంటూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్ అన్నారు. ప్రజల నుంచి తమకు విశేష స్పందన వస్తుందని, వారి మద్ధతుతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని హార్ధిక్ పేర్కొన్నారు. సోమవారం అహ్మదాబాద్లో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ మద్ధతుదారుడు, పటేల్ ఉద్యమనేత హార్ధిక్ మీడియాతో మాట్లాడారు. దాదాపు లక్షమంది బైక్ ర్యాలీ పాల్గొన్నారని, ఇది తమ విజయానికి సంకేతమన్నారు. గుజరాత్ ఫలితాలపై బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే కక్షకట్టి మరీ తన ర్యాలీలు, కార్యక్రమాలకు అధికార పార్టీ అడ్డుకుంటుందని ఆరోపించారు. రెండో దశ ఎన్నికల్లో ఆరు జిల్లాల ఓట్లు కీలకం కానున్నాయి. రోజురోజుకు ఉత్తర గుజరాత్కు పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు గుజరాత్ రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ అహ్మదాబాద్లో పర్యటించవలసి ఉంది. అయితే శాంతి భద్రతలతో పాటుగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. -
హార్ధిక్ టేపుల్లో ఒకటే మార్ఫింగ్.. మిగతావీ..?
అహ్మదాబాద్: పోలింగ్కు ముందు పటేదార్ అనామత్ అందోళన్ సమితి (పీఏఏఎస్)కు రాజీనామ చేసి షాక్ ఇచ్చిన దినేశ్ బంభూనియా మరో బాంబ్ పేల్చారు. హార్ధిక్ను పటీదార్లంతా ఓ ఐకాన్గా చూస్తున్నారని, అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ అతనిపై సెక్సు టేప్లు రావడం కలిచివేసిందన్నారు. తొలుత వచ్చిన సెక్సు టేపు మార్ఫింగ్ అయితే తరువాత వచ్చిన సీడీల మాటేమిటని ప్రశ్నించారు. ఈ విషయమే నన్ను చాలా బాధపెట్టిందని దినేశ్ బంభూనియా పేర్కొన్నారు. ఓ కమ్యూనిటీ లీడర్గా ఉన్న వ్యక్తిపై ఇలాంటివి రావడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. హార్ధిక్ కాంగ్రెస్ జెండా మోస్తున్నాడని, అధికారంలోకి వస్తే పటీదార్లకు రిజర్వేషన్ కల్పిస్తానని కాంగ్రెస్ హామి ఇవ్వలేదని, అయినా హార్ధిక్ కాంగ్రెస్కు ఎందుకు మద్దతు ఇస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. హార్ధిక్ కాంగ్రెస్తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని దినేశ్ ఆరోపించారు. పటీదార్లు ఉద్యమ లక్ష్యం కోసం ఓటేయాలని దినేశ్ పిలుపునిచ్చారు. సరిగ్గా పోలింగ్ ఒక రోజు ముందు హార్ధిక్పై అత్యంత సన్నిహితుడైన దినేశ్ ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
హార్ధిక్ పటేల్కు బిగ్ షాక్!?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్కు కొన్ని గంటలు మాత్రమే ఉన్న ఈ సమయంలో హార్ధిక్ పటేల్కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. పటేదార్ అనామత్ అందోళన్ సమితి (పీఏఏఎస్)లో కీలక సభ్యుడు, హార్థిక్ పటేల్కు అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన దినేష్ బంభూనియా పీఏఏఎస్కు రాజీనామా చేశారు. . పోలింగ్కు కొన్నిగంటలు మాత్రమే మిగులున్న ఈ సమయంలో పీఏఎస్ఎస్కు దినేష్ రాజీనామా చేయడం హార్ధిక్కు భారీ దెబ్బకు అని విశ్లేషకులు చెబుతున్నారు. పటేల్ అనామత్ ఆందోళన్ సమితిలో దినేష్ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. పటేల్ ఆందోళనలో కీలక పాత్ర పోషించిన అమ్మీష్, కేతన్లు గత నవంబర్లోనే పీఏఏఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుం వారిద్దరు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీఏఏఎస్ కన్వీనర్ అయిన వరుణ్ పటేల్కూడా హార్థిక్కు దూరంమై.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హార్థిక్ పటేల్కు సంబంధించిన సెక్స్ టేపులు విడుదలైన సమయంలో దినేష్.. అతనికి అండగా నిలిచారు. -
గుజరాత్ ఎన్నికలు: హార్ధిక్కు బంపర్ ఆఫర్.!
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్లో చేపట్టిన ర్యాలీలో పాల్గొనకుంటే ఐదు కోట్లు ఇస్తానని ఓ వ్యాపారవేత్త ఆఫర్ చేశాడని పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్ధిక్ పటేల్ ఆరోపించారు. ఇక ఈ ర్యాలీలో 13 లక్షల మంది పాల్గొన్నారని, పటీదార్ నేతలంతా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. పటీదార్ వర్గం ఈ సారి బీజేపీకి ఓటువేయడం లేదన్నారు. అలాగే ఆప్, ఎన్సీపీ, స్వతంత్ర్య అభ్యర్థుల ఉచ్చులో కూడ పడరని చెప్పారు. అంతకు ముందు ర్యాలీలో ప్రసంగించిన హార్ధిక్ ప్రజలను ఉద్దేశించి బీజేపీకి ఓటు వేయవద్దని బంధువులకు పోన్ చేసి చెప్పాలని కోరారు. పటీదార్ల ఆందోళనను పట్టించుకోని ప్రభుత్వానికి ఆరు కోట్ల పటీదార్ వర్గ ప్రజలు దూరమయ్యారనే వార్త డిసెంబర్ 19న అన్ని చానెళ్లలో చూడాలని ఉందని తెలిపారు. వాజ్పెయ్ బీజేపీ.. అమిత్ షా బీజేపీ వేరు.. రైతులు, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన వాజ్పెయ్-కేశుబాయ్ల బీజేపీ వేరని, ప్రస్తుతం ఉన్నబీజేపీ వేరన్నారు. అమిత్ షా సారథ్యంలో నడుస్తున్న బీజేపీలో అందరు అవివేకులేనని ఎద్దేవ చేశారు. 21 ఏళ్లు పాలించిన బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సూరత్లో రెండు ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ పాఠశాల ఉందన్నారు. ఇవి కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారని, మరీ బీజేపీ ఎంచేసిందని, మరో ఆసుపత్రిని ఎందుకు నిర్మించలేదని హార్ధిక్ ప్రశ్నించారు. -
2 కోట్లు ఇస్తే సీఎం సెక్సు సీడీ చేయిస్తా.!
అహ్మదాబాద్: రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ అన్నారు. జీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంత సేపు తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని, గుజరాత్ అభివృద్ధిపై మాట్లాడాలని హితవు పలికారు. ఒక వేళ ఆ వీడియోలో నేనుంటే నా వ్యక్తిగత జీవితం గురించే అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మార్ఫింగ్ వీడియోలతో చిల్లర రాజకీయాలు చేస్తూ బీజేపీ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో వ్యక్తిగత జీవితానికి, ఏకాంతానికి భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ఓ హోటల్లో అమ్మాయితో హర్దిక్ పటేల్ గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. గతంలో పటీదార్ ఆందోళన సమితి కన్వీనర్ కూడా ‘గుజరాత్ ప్రజలు అభివృద్ధి సీడీల కోసం ఎదురు చూస్తున్నారని, 22 ఏళ్ల హర్దిక్ సీడీల కోసం కాదని ట్వీట్ చేశారు. -
హార్థిక్ పటేల్ ఒక ఫూల్..!
అహ్మదాబాద్: పటీదార్ సామాజికవర్గాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పీఏఏఎస్ నేత హార్థిక్ పటేల్ ప్రయత్నిస్తున్నారని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ మండిపడ్డారు. పటేల్ (పటీదార్) సామాజికవర్గానికి రిజర్వేషన్ కోటా కల్పిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ.. ఉట్టి బక్వాస్ అని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ కోటా హామీ అంగీకరించిన హార్థిక్ పటేల్ను ఫూల్ (మూర్ఖుడి)గా అభివర్ణించారు. ’కొందరు మూర్ఖులు మరికొందరు మూర్ఖులకు ఒక కాగితం ముక్కను ఇచ్చారు’ అని నితిన్ పేర్కొన్నారు. పటేల్కు బీసీ రిజర్వేషన్ కల్పించాలన్న తమ షరతులను కాంగ్రెస్ అంగీకరించిందంటూ హార్థిక్ పేర్కొన్న వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీల్లో చేర్చాలని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) గత రెండేళ్లుగా ఆందోళనలు నిర్వహించిందని, తీరా ఇప్పుడు ఆ డిమాండ్ను పక్కనబెట్టి కాంగ్రెస్ హామీని తలకెత్తుకుందని ఆయన విమర్శించారు. ‘సమాజంలో ఇది కులవాదాన్ని వ్యాప్తి చేసింది. మన సామాజికవర్గానికి ఉన్న ప్రతిష్టను హార్థిక్ దిగజార్చారు. సర్దార్ పటేల్, భగత్ సింగ్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు’ అని నితిన్ ధ్వజమెత్తారు. అయితే, నితిన్ విమర్శలను హార్థిక్ తోసిపుచ్చారు. పటీదార్ సామాజికవర్గాన్ని ఫూల్స్ గా చూపేందుకు నితినే ప్రయత్నిస్తుందని హార్థిక్ ఎదురుదాడి చేశారు. తమ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని, గుజరాత్లో పటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా అంగీకరించిందని, సెక్షన్ 31, సెక్షన్ 46 కింద పటీదార్లను బీసీల్లో చేరుస్తామని ఆ పార్టీ పేర్కొందని హార్థిక్ పటేల్ ఇంతకుముందు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ మా షరతులను అంగీకరించింది : హార్ధిక్
గాంధీనగర్ : తమ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్లు పటీదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. గుజరాత్లో పటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలిపారు. సెక్షన్ 31, సెక్షన్ 46 కింద పటీదార్లను బీసీల్లో చేర్చడానికి కాంగ్రెస్ ఒప్పకుందని వెల్లడించారు. గుజరాత్లో అధికారం చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ పటీదార్ల రిజర్వేషన్లకు ఓ బిల్లును తీసుకొస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తాము టికెట్లు కోరలేదని వెల్లడించారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్)లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని ఇంతవరకూ తాము ఎవరినీ కోరలేదని చెప్పారు. అది ప్రజలకే వదిలేస్తున్నామని అన్నారు. ఉత్తర గుజరాత్లో పీఏఏఎస్కు చెందిన పలువురిని కొనుగోలు చేసేందుకు బీజేపీ పలుమార్లు ప్రయత్నించిందని, రూ. 50 లక్షలు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి పనులకు దిగుతోందని ఎద్దేవా చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని వెల్లడించారు. పటీదార్ల రిజర్వేషన్లను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చాల్సివుంటుందని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాడతామని తెలిపారు. -
హార్దిక్ పటేల్ రాయని డైరీ
మూతికీ, ముక్కుకీ గుడ్డ చుట్టుకుని, చీపురూ బకెట్ పట్టుకుని నేరుగా నా రూమ్కి వచ్చి, ‘‘తప్పుకోండి, క్లీన్ చెయ్యాలి’’ అన్నాడొక వ్యక్తి. ఓవర్ టైమ్ చేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికుడిలా ఉన్నాడతను. ముఖం విసుగ్గా ఉంది. ‘‘ఎవరు నువ్వు?’’ అన్నాను, కుర్చీలోకి కాళ్లు పైకి ముడుచుకుంటూ. అతను మాట్లాడలేదు! ‘‘ఎవరు పిలిచారు నిన్ను’’ అన్నాను. ఒకరు పిలవాలా అన్నట్లు చూశాడు. ‘‘ఏం క్లీన్ చేస్తావ్?’’ అన్నాను. ‘‘మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను’’ అన్నాడు! నాకేదో డౌట్ కొట్టింది. ‘‘ముందా మూతి గుడ్డ తీసి మాట్లాడు’’ అన్నాను. తియ్యలేదు. ‘‘దగ్గరికి రా’’ అన్నాను. వచ్చాడు. మూతి గుడ్డ లాగి చూశాను. జితూ వాఘానీ! బీజేపీ ప్రెసిడెంటు!! ‘‘మీరు రావడం ఏంటి?’’ అన్నాను ఆశ్చర్యంగా. ‘‘నీ టూత్పేస్టులో ఉప్పుందో లేదో చూసి రమ్మన్నారు’’ అన్నారు వాఘానీ. ‘‘ఎవరు చూసి రమ్మన్నారు?’’ అని అడిగాను. ‘‘ఆ సంగతి నాకు తెలీదు. ఎవరో ఎవరికో చూసి రమ్మని చెబితే ఆ ఎవరో నాకు చెప్పారు’’ అన్నారు! ‘‘మీకు చెప్పిన ఆ ‘ఎవరో’ ఎవరో చెప్పండి వాఘానీ’’ అన్నాను. ‘‘చెప్తాను. కానీ ఆ ఎవరోకి ఎవరు చెప్పారన్నది మాత్రం నువ్వు నన్ను అడగ్గూడదు’’ అన్నారు. ‘‘అడగను చెప్పండి’’ అన్నాను. ‘‘నేరుగా చెప్పను. నువ్వే అర్థం చేసుకోవాలి మరి’’ అన్నారు. సరే అన్నాను. ‘‘హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్? అండ్.. హూ ఈజ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్?’’ అన్నారు వాఘానీ. అర్థమైంది. ‘‘వాళ్లిద్దరికీ చెప్పింది ‘హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ కదా’’ అన్నాను. ‘కుర్రాడివి కరెక్టుగానే క్యాచ్ చేశావ్’ అన్నట్లుగా బొటనవేలు పైకి లేపి, మూతి గుడ్డను మళ్లీ పైకి అనుకుని నా బాత్రూమ్లోకి వెళ్లబోయారు వాఘానీ. ‘‘నా టూత్పేస్టులో ఉప్పుందో లేదో చూడ్డానికి ఆ చీపురు, బకెట్, ముక్కు గుడ్డా ఎందుకండీ’’ అని అడిగాను. వాఘానీ ఇబ్బందిగా చూశారు. ‘‘జనరల్గా టూత్పేస్ట్ ఉండేది బాత్రూమ్లోనే కదా’’ అన్నారు. ‘‘ఎవరి బాత్రూమ్లోకైనా వెళ్లే ముందు ఇలాగే వెళ్లాలని మాకో నియమం’’ అని కూడా అన్నారు. ‘‘సరే, నా టూత్పేస్ట్లో ఉప్పు లేకపోతే, గుజరాత్కి వచ్చే నష్టం ఏమిటి?’’ అని అడిగాను. మళ్లీ ఇబ్బందిగా చూశారు వాఘానీ. ‘‘గుజరాత్కేమీ నష్టం ఉండదు. నీ దగ్గర ఏదో ఒకటి లేదని చెప్పకపోతే, ‘హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’కు గుజరాత్ ఎన్నికల్లో నష్టం వస్తుంది’’ అన్నారు. ఇరవై రెండేళ్లుగా రాష్ట్రాన్ని మురికి పట్టించిన బీజేపీ.. ఇరవై మూడేళ్ల కుర్రాడి బాత్రూమ్ క్లీన్గా లేదని ప్రచారం చెయ్యబోతోందన్నమాట! - మాధవ్ శింగరాజు -
అర్ధరాత్రి డెడ్లైన్.. అల్టిమేటం ఇచ్చిన హార్థిక్ పటేల్
అహ్మదాబాద్: పటీదార్ ఉద్యమనేత హార్థిక్ పటేల్ మరోసారి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. శనివారం అర్ధరాత్రిలోగా తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని తేల్చిచెప్పారు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వడంతోపాటు తమ షరతులకు ఒప్పుకోవాలని హార్థిక్కు చెందిన పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తుంది. ముఖ్యంగా వచ్చేనెల జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో తమ మద్దతుదారులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని పటీదార్ గ్రూప్ కోరుతోంది. తమ మద్దదుదారులకు టికెట్ ఇస్తేనే.. కాంగ్రెస్కు మద్దతు తెలుపుతామని తేల్చిచెబుతోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం అన్ని సీట్లు ఇవ్వడానికి వెనుకాడుతోంది. హార్థిక్ మద్దతు కోసం 30 సీట్లు ఇవ్వడమంటే చాలా ఎక్కువనని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీట్ల విషయమై చర్చించేందుకు హార్థిక్ మద్దతుదారులను కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిచారు. ఈ చర్చల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న పటీదార్ గ్రూప్ కన్వీనర్ దినేశ్ బంభానియా మీడియాతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రిలోపు తమ డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని, లేకుంటే కాంగ్రెస్కు తమ మద్దతు అవసరం లేదని భావించాల్సి ఉంటుదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఖరిని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. -
దిగజారుడు రాజకీయం
సాధారణ సమయాల్లో ధర్మపన్నాలు వల్లిస్తూ, బరువైన సందేశాలిచ్చే నాయకులు ఎన్నికల రుతువొచ్చేసరికి శివాలెత్తి నోరు పారేసుకోవడం మన దేశంలో చాన్నాళ్ల నుంచి రివాజైంది. ప్రత్యర్థులపై వారుపయోగించే భాష వినడానికి, తిరిగి చెప్ప డానికి వీల్లేని స్థాయిలో ఉంటున్నదని అందరూ మథనపడుతున్న వేళ పరిస్థితి మరింతగా దిగజారినట్టు కనబడుతోంది. గుజరాత్లో పటీదార్లకు ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్పై అసెంబ్లీ ఎన్నికల వేళ సామాజిక మాధ్య మాల్లో బయటి కొస్తున్న వీడియో క్లిప్పింగ్లు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అతను హోటల్ రూంలో ఒక మహిళతో ఉన్న దృశ్యం, ఒక యువతితోపాటు హార్దిక్ మిత్ర బృందం కలిసి ఉన్న దృశ్యం ఆ క్లిప్పింగ్ల్లో ఉన్నాయి. ఎన్నికల ప్రచార పర్వంలో తమను వేధిస్తున్న సమస్యలపైనా, అందుకు గల కారణాలపైనా చర్చ జరగాలని...ఆ సమస్యలకు పరిష్కారం లభించాలని ప్రజలు ఆశిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ వీడియో దృశ్యాలు ప్రచారంలోకొస్తున్నాయి. వీటిని ప్రచారంలో పెట్టినవారు తమ చర్య ద్వారా గుజరాత్ సమాజానికి, దేశానికి ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారో అనూహ్యం. కానీ వయసొచ్చిన ఒక అబ్బాయి, అమ్మాయి వారి ఇష్ట ప్రకారం ఏకాంతంగా ఉంటే దాన్ని రహస్యంగా వీడియో తీయడం, ప్రచారంలో పెట్టడం ఏం సంస్కారమో ఆ తీసినవారికే తెలియాలి. వీటి బాధ్యు లెవరో కానీ... ఈ ఎన్నికల్లో తాను బీజేపీని వ్యతిరేకిస్తున్నందువల్ల వారే ఇలా చేశారని హార్దిక్ ఆరోపిస్తున్నారు. ఆయన అన్నందుకు కాకపోయినా బీజేపీ ఇలాంటి విపరీత ధోరణులను ఖండించాల్సింది. యువ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ చెప్పినట్టు వ్యక్తిగత గోప్యత, శృంగారం రాజ్యాంగం కల్పించిన హక్కులు. వీటికి భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదు. ఇందుకు బదులుగా పటీదార్ ఉద్యమ సహేతుకతనూ, బీసీలుగా గుర్తింపు కావాలంటున్న ఆ ఉద్యమ డిమాండ్లోని లోపాలనూ చర్చిస్తే వేరుగా ఉండేది. కనీసం రాజకీయంగా హార్దిక్ కాంగ్రెస్తో కల వడాన్ని ప్రశ్నించినా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో ఎవరి అవకాశవాదమెంతో చెప్పవచ్చు. అదేమీ లేకుండా ‘మోరల్ పోలీసింగ్’కు దిగి నీతులు వల్లిద్దామను కోవడమే అభ్యంతరకరం. గుజరాత్ చిన్న రాష్ట్రమైనా అక్కడ జరిగే ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ రాష్ట్రం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల స్వస్థలం కావడమే అందుకు ప్రధాన కారణం. పైగా 1998 మొదలుకొని గుజరాత్ వరసగా బీజేపీకే పట్టం కడుతోంది. నరేంద్రమోదీ 2001 నుంచి 2014లో ప్రధాని అయ్యేవరకూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పాలనా కాలంలో కాంగ్రెస్ సర్వశక్తులూ ఉడిగిపోయి క్షీణించింది. పంచాయతీ ఎన్నికలు మొదలు పార్లమెంటు ఎన్నికల వరకూ అన్నిటా బీజేపీదే అక్కడ విజయం. అయితే నరేంద్రమోదీ ఆ రాష్ట్రాన్ని విడిచిపెట్టాక ఈ స్థితి మారింది. ముఖ్యంగా ప్రభుత్వో ద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్లు 2015లో ఉద్యమించడం ప్రారం భించాక ఆ పార్టీకి ఎదురుగాలి మొదలైంది. ఆ ఉద్యమంలో పెద్దయెత్తున హింస చెలరేగడం, లాఠీచార్జిలు, పోలీసు కాల్పులతో ఆ రాష్ట్రం అట్టుడికిపోయింది. దాని పర్యవసానం త్వరలోనే బీజేపీకి అర్ధమైంది. 2015 చివరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లా పంచాయత్లకూ కాంగ్రెస్ 24 గెల్చుకుంది. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో బీజేపీకి ఇది తొలిసారిగా తగిలిన షాక్. పట్టణ, నగర ప్రాంతాలు మాత్రమే బీజేపీని ఆదరించాయి. పర్యవసానంగా నిరుడు ఆగస్టులో ఆనందీబెన్ పటేల్ తప్పుకోవాల్సివచ్చింది. గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి వల్ల ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాలు బాగుపడినా కిందిస్థాయి వర్గాల స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వరస కరువులు ఒకపక్కా, సంస్క రణల వల్ల చిన్న తరహా పరిశ్రమల మూత మరోపక్కా కుంగదీయడంతో పటీదార్ల ఆర్ధిక స్థితి దారుణంగా దెబ్బతింది. గోరక్షకుల దాడుల తర్వాత ఆ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని స్థాయిలో దళిత ఉద్యమం వేళ్లూనుకుంది. న్యాయంగా అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ చర్చకు రావాలి. కానీ చిత్రంగా 24 ఏళ్ల యువకుడు హార్దిక్ పటేల్ ఒక యువతితో ఉన్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్ ఎన్నికల సంరంభం మొదలైనప్పటినుంచీ ఇదే తంతు కనబడుతోంది. అంతక్రితం హార్దిక్ అనుచరులిద్దరు హఠాత్తుగా అత నిపై ఆరోపణలు చేస్తూ బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ తమను ప్రలోభపెట్టిందంటూ డబ్బుతో సహా మీడియా ముందుకొచ్చారు. అలాగే తమతో బీజేపీ నేత ఒకరు బేరసారాలాడిన ఫోన్ సంభాషణను బయటపెట్టారు. ఇవన్నీ చూసి బీజేపీ ఏటికి ఎదురీదుతున్నదని అనుకోవడానికి లేదు. అక్కడ పటీదార్, బీసీ, దళిత వర్గాలకు చెందిన ముగ్గురు యువ నాయకులు కాంగ్రెస్తో చెట్టపట్టాలు వేసుకున్నా విజయం మాత్రమే బీజేపీదేనని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్కు రెండంకెలకు మించి స్థానాలు రావని అంటున్నాయి. మరెందుకింత ఆరాటమో అర్ధం కాదు. సామాజిక మాధ్యమాలొచ్చాక అది సామాన్యుల చేతి ఆయుధమైందని సంబర పడేంతలోనే దాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించే శక్తుల ప్రాబల్యం పెరుగు తోంది. 30 దేశాల్లో ఈ మాధ్యమాల ద్వారా ఓటర్లను ఏమార్చారని ఫ్రీడం ఆఫ్ ది నెట్–2017 నివేదిక చెబుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా సహకారంతో ప్రభావితం చేశారన్న కథనాలు చదివాక జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ ఏడాది మొదట్లో దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభా వంపై పరిశోధనలు చేసిన యూనివర్సిటీ ఆచార్యుణ్ణి పిలిపించుకుని ఈ బెడదపై చర్చించి తగిన చట్టాలు చేశారు. ప్రత్యర్థులను ఎదుర్కొనగలిగారు. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలనేవి కీలకమైనవి. మన నేతలు ఇప్పటికే కరెన్సీ నోట్లతో, బూట కపు హామీలతో, పరస్పర దూషణలతో వాటి స్థాయిని తగ్గించారు. పరిస్థితిని మరింత దిగజార్చి ఎన్నికలంటేనే ఏవగింపు కలిగిస్తే అంతిమంగా నష్టపోయేది పార్లమెంటరీ పార్టీలే. ఆ సంగతి అందరూ గ్రహించాలి. -
హార్దిక్ పటేల్ శృంగార వీడియోపై చర్యలేవీ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న పటీదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ తనపై ‘మార్పిడి చేసిన సెక్స్ సీడీ’ని భారతీయ జనతా పార్టీ త్వరలోనే విడుదల చేస్తుందని చెప్పిన విషయం తెల్సిందే. ఆయన చెప్పినట్లు ఒకటి కాదు, ఆ పార్టీ రెండు వీడియో సీడీలను విడుదల చేసింది. ఒక వీడియోలో హార్దిక్ పటేల్ ఓ మహిళతో సెక్స్లో పాల్గొన్నట్లు మరో వీడియోలో హార్దిక్ పటేల్ ఆల్కహాల్ సేవిస్తున్నట్లు ఉంది. ‘హార్దిక్ ఎక్స్పోజ్డ్’ అనే హాష్టాగ్తో బీజేపీ కార్యకర్తలు, వారి మద్దతుదారులు ఈ వీడియోలపై ట్వీట్లు చేస్తుండగా, ‘రియల్ ట్రూత్ ఆఫ్ హార్దిక్ పటేల్’, బేషరమ్ హార్దిక్ పటేల్’ అంటూ గుజరాత్ బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం కన్వీనర్గా చెప్పుకుంటున్న వ్యక్తి ఈ వీడియాలకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని హార్దిక్ పటేల్ ఇప్పటికే చెప్పుకోగా, ఆయనైతే మాత్రం తప్పేముందని, అది పూర్తి వ్యక్తిగత అంశమని ఆయనకు మద్దతిస్తున్నవారు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు. సెక్స్ వీడియోలో కనిపిస్తున్నది హార్దిక్ పటేల్ అవునా, కాదా ? చర్చనీయాంశమే కాదని, ఆయనే అనుకుంటే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘ప్రైవసీ ప్రాథమిక హక్కు’ అనే వారంతా వాదిస్తున్నారు. ఇటీవల బీజేపీ చత్తీస్గఢ్లో వ్యవహరించిన తీరు, గుజరాత్లో వ్యవహరించిన తీరుకు పూర్తి విరుద్ధంగా ఉంది. బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి సెక్స్లో పాల్గొన్న వీడియోను కలిగి ఉన్నందుకు మాజీ బీబీసీ జర్నలిస్ట్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జర్నలిస్ట్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నానా యాగి చేయడంతో ఆ జర్నలిస్ట్పై పోలీసులు కేసు కూడా పెట్టారు. ఇక్కడ బీజేపీ మంత్రి వ్యక్తిగత స్వేచ్ఛకు బీజేపీ కార్యకర్తలు అండగా నిలిచారు. జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న సదురు మంత్రిపై స్టింగ్ ఆపరేషన్కు వెళ్లడంతో ఆ జర్నలిస్ట్ మంత్రిగారి శృంగారలీలకు సంబంధించిన క్లిప్పింగ్ దొరికింది. ఇక ఆ విషయాన్ని అంతటితో ఆపేస్తే నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ మహిళపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిఘా ఏర్పాటుచేసిన ‘స్నూప్గేట్ స్కామ్’లో బీజేపీ వ్యక్తిగత స్వేచ్ఛను గాలికొదిలేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధించారు. ఆధార్కు సంబంధించి ‘ప్రైవసీ’పై సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయులకు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కాదని వాదించింది. అంటే బీజేపీ ఎప్పటికప్పుడు వ్యక్తిగత ప్రైవసీపై తన వైఖరిని మార్చుకుంటోంది. అంటే ఎప్పటి ఏ వైఖరి ప్రయోజనకరమో అప్పటికీ ఆ వైఖరిని అవలంబిస్తోందన్నమాట! ఇప్పుడు హార్దిక్ పటేల్ సెక్స్ వీడియోలో ఆయన పరస్పర అంగీకారంతోనే సెక్స్లో పాల్గొన్నట్లు స్పష్టం అవడమే కాకుండా మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు కూడా లేదని, అందుకని చత్తీస్గ«ఢ్లో పోలీసులు వ్యవహరించిన తీరులోనే ప్రజల్లోకి ఈ వీడియో విడుదల చేసిన, వీడియాను రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తులపై కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని కూడా పటేల్ మద్దతుదారులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి! -
బీజేపీది నీచ రాజకీయం!?
సాక్షి, అహ్మదాబాద్: సెక్స్ సీడీలు బహిర్గతం కావడం వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి అధినేత హార్థిక్ పటేల్ ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని బీజేపీ పబ్లిక్ చేయడంపై ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత గోప్యతా ఉల్లంఘన కింద ఆ పార్టీపై న్యాయ పోరాటాన్ని చేస్తున్నట్లు హార్ధిక్ బుధవారం ప్రకటించారు. గుజరాత్ రాజకీయాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే నీచస్థాయికి దిగజారాయని హార్ధిక్ పటేల్ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత అథమస్థాయిలో ఉన్నాయి. నన్ను ఎంత దిగజార్చాలని ప్రయత్నాలు చేసినా.. వాటిని ఎవరూ నమ్మొద్దు’ అని హార్ధిక్ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పరాకాష్టగా మారిందని చెప్పిన హార్ధిక్.. ఆ పార్టీపై న్యాయపోరాటం చేస్తానని ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ న్యాయవాదులను సంప్రదించానని.. కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమంపై సెక్స్ సీడీల ప్రభావం ఏ మాత్రం ఉండదని ఆయన చెప్పారు. కాగా హార్ధిక్ పటేల్..రాసలీలల వీడియో టేప్ రెండు రోజలు నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీడీలో హార్థిక్, ఒక మహిళ దగ్గరగా ఉండటం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి ఉండగా.. రెండో సీడీలో ఇద్దరు ముగ్గురు యువకులు, ఒక స్త్రీ సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. -
గుజరాత్ గడబిడ
-
వీడియోలో ఉన్నది హార్థిక్ పటేలేనా..?
-
ఆ సీడీల్లో ఉన్నది హార్థిక్ పటేలే..!
సాక్షి, అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటీదార్ ఉద్యమనేత హర్థిక్ పటేల్ సెక్స్ క్లిప్ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ వీడియో క్లిప్లో ఉన్నది తాను కాదని హార్థిక్ పటేల్ చెబుతున్నా.. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ సీడీల్లో ఉన్నది ముమ్మాటికీ హార్థిక్ పటేలేనని ఆయన మాజీ అనుచరుడు అశ్విన్ తాజాగా వెల్లడించారు. అయితే, ఈ సెక్స్ సీడీల విషయమై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సీడీల్లో ఉన్నది హార్థిక్ పటేలేనని, త్వరలో ఆయనకు సంబంధించిన మరిన్ని వీడియోలు బయటపెడతానని అశ్విన్ హెచ్చరించారు. హార్థిక్ అంతు చూస్తానని అశ్విన్ హెచ్చరించారు. అంతేకాకుండా హార్థిక్ పటేల్ అనుచరులతో కలిసి మద్యం తాగుతున్న వీడియోలు సైతం తాజాగా వెలుగుచూశాయి. ఓ హోటల్ గదిలో ఓ యువతితో ఆయన సన్నిహితంగా గడుపుతున్న వీడియో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ఉంది తాను కాదంటూ ఇప్పటికే హార్దిక్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన విమర్శించారు. ఈ విషయంలో దళిత యువ నేత జిగ్నేశ్ మెవానీ సైతం స్పందించారు. హార్దిక్ సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ‘‘హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు’ ’ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అనంతరం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్ సలహా ఇస్తున్నారు. -
అది నీ హక్కు.. సిగ్గుపడటం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ డర్టీ పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ సెక్స్ క్లిప్ అక్కడి మీడియాలో హల్ చల్ చేస్తుండటం.. దానినే ఆయుధంగా చేసుకుని బీజేపీ తీవ్ర విమర్శలకు దిగటం చూస్తున్నాం. దీనిపై దళిత యువ నేత జిగ్నేశ్ మెవానీ స్పందించారు. హార్దిక్ సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ‘‘హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు’ ’ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అనంతరం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్ సలహా ఇస్తున్నారు. Dear Hardik Patel, don't worry. I m with you. And right to sex is a fundamental right. No one has right to breach your privacy. — Jignesh Mevani (@jigneshmevani80) November 13, 2017 కాగా, వీడియోలో ఉంది తాను కాదంటూ ఇప్పటికే హార్దిక్ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన విమర్శించారు కూడా. జిగ్నేశ్ గుజరాత్లో దళిత హక్కుల కోసం పోరాడుతున్న నేత. గతేడాది ఉన్నావ్లో దళితులపై దాడి తర్వాత ఆ యువకులకు మద్దతుగా ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ మద్ధతుదారుడిగా ఉన్న జిగ్నేశ్ హార్దిక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటంలో తప్పేం లేదన్నది కొందరి వాదన. -
‘పెళ్లి కాలేదు.. నపుంసకుడిని కాదు’
అహ్మదాబాద్: పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ గుజరాత్ టీవీ చానెళ్లలో ప్రసారమైన వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను నపుంసకుడిని కాదంటూ’ సమాధామిచ్చారు. తన పేరు చెడగొట్టడానికి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, దీన్ని ఇతర దేశాల నుంచి అప్లోడ్ చేశారని, అదొక ఫేక్ వీడియో అంటూ వివరణ ఇచ్చారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని ఫైర్ అయ్యారు. మార్ఫింగ్తో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్ర తనపై జరుగుతుందని గతంలోనే తెలిపానని గుర్తు చేశారు. ఈ వీడియోపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. నాలుగు నిమిషాల వ్యవధి ఉన్న ఆ వీడియోలో ఓ మహిళతో 2017 మే 16న హార్ధిక్ పటేల్ను పోలిన వ్యక్తి రాసలీలలు జరిపినట్లు ఓ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇక పటీదార్ ఉద్యమనేత అయిన హార్ధిక్ పటేల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని హార్ధిక్ పటేల్.. కలిసిన సీసీటీవీ ఫుటేజ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బ్లాక్సూట్కేస్ నిండా.. డబ్బుతో హార్ధిక్ పటేల్ వెనుదిగిరిగి వెళుతున్నాడంటూ.. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హార్ధిక్ పటేల్ మద్దతు ప్రకటించినందుకు ఈ మొత్తాన్ని రాహుల్ బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. -
మూడు అంశాలపైనే బీజేపీ ఫోకస్
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ శాసనసభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ భారతీయ జనతాపార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదం, హిందూ-ముస్లిం, గోవధ అంశాలనే లక్ష్యం చేసుకుని రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని హార్ధిక్ పటేల్ విమర్శించారు. ఇదిలా ఉండగా గుజరాత్లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై పటీదార్ అనామత్ ఆందోళన్ సమతి (పీఏఏఎస్) నేత హార్ధిక్ పటేల్, గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో రిజర్వేషన్లపై ఎటువంటి ఒప్పందాలు కుదరలేదు. దీంతో రిజర్వేషన్లపై మరోమారు నవంబర్ 7న కాంగ్రెస్ పార్టీతో హర్ధిక్ పటేల్ చర్చించనున్నారు. నవంబర్ 7న జరిగే చర్చలే ఆఖరివని.. మళ్లీ ఆంశంపై కాంగ్రెస్ పార్టీతో చర్చలు ఉండవని హార్ధిక్ పటేల్ స్పష్టం చేశారు. -
నవంబర్ 3న ఏం తేలబోతుంది?
అహ్మదాబాద్ : పటీదార్ ఉద్యమానికి మద్ధతు ప్రకటించి.. అత్యధిక సీట్లను కేటాయిస్తేనే కాంగ్రెస్ పార్టీతో జత కలుస్తానని హర్దిక్ పటేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో సూరత్ సభలో హర్దిక్ రాహుల్తో వేదిక పంచుకుంటారంటూ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నేపథ్యంలో హర్దిక్ తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హమీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతామని చెప్పాడు. నవంబర్ 3లోగా దానిపై ఓ ప్రకటన చేయాలని లేనిపక్షంలో గతంలో అమిత్షా సూరత్ పర్యటన సందర్భంగా ఎదురయిన పరిణామాలే పునరావృతం అవుతాయని ట్వీట్లో పరోక్షంగా వారించాడు. 3/11/2017तक कोंग्रेस पाटीदार को संवैधानिक आरक्षण कैसे देंगी,उस मुद्दे पर अपना स्टेण्ड क्लीयर कर दे नहीं तो अमित शाह जैसा मामला सूरत में होगा — Hardik Patel (@HardikPatel_) October 28, 2017 గత నెలలో సూరత్ లో అమిత్ షా నిర్వహించిన సమావేశం రసాభాసంగా మారింది. పటీదార్ ఉద్యమ మద్దతుదారులు ఫర్నీఛర్ నాశనం చేసి నానాబీభత్సం సృష్టించారు. గతంలోనే చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ హర్దిక్ డిమాండ్లకు ఓకే చెప్పింది. హర్దిక్ కూడా గజదొంగలను గద్దెదించేందుకు దొంగలకు మద్దతు ఇవ్వటంలో తప్పులేదని బీజేపీ, కాంగ్రెస్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కూడా. అయితే ఎటొచ్చి రిజర్వేషన్ కోటా శాతం, ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలోనే ప్రతిష్టంబన ఏర్పడింది. హర్దిక్ డిమాండ్లలో కొన్ని.. - ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గానికే ఎక్కువ టికెట్లు ఇవ్వాలని హార్దిక్ కోరినట్లు తెలిసింది. - కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో పటేళ్ల ప్రాతినిధ్యం పెంచాలి. - పటేళ్ల రిజర్వేషన్ల అమలుపై న్యాయసమీక్ష లేకుండా రాజ్యాంగ భద్రత కల్పించాలి. - ప్రస్తుత రిజర్వేషన్లకు భంగం కలిగించకుండా పటేళ్లకు వేరుగా రిజర్వేషన్ ఇవ్వాలి. వీటితోపాటు పటీదార్ ఆందోళన సందర్భంగా తమ వర్గం వారిపై దౌర్జన్యం చేసిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని హార్దిక్ పటేల్ కోరినట్లు తెలిసింది. -
గుజరాత్ పీఠం బీజేపీదే!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ పీఠాన్ని వరుసగా ఆరోసారి భారతీయ జనతాపార్టీ నిలబెట్టుకుంటుందని తాజాగా మరో సర్వే తెలిపింది. అంతేకాకుండా 2012తో పోలిస్తే.. సీట్లు కూడా మరింత పెరిగే అవకాశముందని తాజాగా టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వే ప్రకటించింది. మొత్తం 184 స్థానాలున్న గుజరాత్ శాసనసభలో బీజేపీ 118 నుంచి 134 స్థానాలు సాధిస్తుందని సర్వే తెలిపింది. ఇదే 2012లో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీకి 115 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మరోసారి గుజరాత్ చేదు ఫలితాలనే ఇస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 49 నుంచి 61 సీట్లు లభించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. సర్వే ముఖ్యాంశాలు ఈ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా తన ఓట్ బ్యాంక్ను పెంచుకుంటుంది. 2012 ఎన్నికల్లో బీజేపీకి 48 శాతం ఓట్ షేర్ లభించగా.. ప్రస్తుతం ఇది 52 శాతానికి పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఓట్ షేర్ 2 శాతం తగ్గే అవకాశం ఉంది. అంటే గత ఎన్నికల్లో 39శాతం ఉన్న ఓట్ షేర్.. 37కు తగ్గనుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రభావం ప్రజలపై అధికంగా ఉంది. ప్రదానిగా మోదీ నిర్ణయాలపై 42 శాతం గుజరాతీయులు సంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల వల్ల మెరుగైన జీవన వసతులు లభిస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. మోదీ ఆర్థిక సంస్కరణలపై 40 శాత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. 18 శాతం మంది మాత్రం ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. వీరిలో అధికశాతం మంది మోదీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది, 67 శాతం మంది గుజరాతీయులు నరేంద్రమోదీని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా అభివర్ణివంచారు. ఆయన తరువాత ఆనందీబెన్ పటేల్ పాలనపట్ల 20 శాతం, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాలనపై 13 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత ప్రాంతమైన ఉత్తర గుజరాత్లో బీజేపీకి ఈ దఫా గణనీయంగా సీట్లు పెరిగుతాయి. ఉత్తర గుజరాత్లో మొత్తం 53 సీట్లు ఉన్నాయి. మోదీ ప్రభావంతో.. సుమారు 81 శాతం ఓట్ షేర్ను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణంపై 46 శాతం మంది గుజరాతీయులు హర్షం వ్యక్తం చేయగా.. 32 శాతం మంది ఎన్నికల స్టంట్గా కొట్టి పారేశారు. ఆల్ఫేశ్ థాకూర్, హార్ధిక్ పటేల్, జిగ్నేష్ మేవానిల ప్రభావం ఎన్నికలపై పెద్దగా ఉండదని... సర్వే తెలిపింది. ఈ ముగ్గురితో కలిసి రాహుల్గాంధీ జట్టు కట్టినా.. 37 శాతానికి మించి ఓట్ షేర్ను పెంచుకోలేరని సర్వే ప్రకటించింది. -
రూ. 200 కోట్ల డీల్?!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని హార్ధిక్ పటేల్.. కలిసిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే సంచలనంగా మారింది. తాజాగా రాహుల్ని కలిశాక.. హార్థిక్ పటేల్.. బ్లాక్సూట్కేస్ నిండా.. డబ్బుతో హార్ధిక్ పటేల్ వెనుదిగిరిగి వెళుతున్నాడంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్లోని ఓ హోటల్లో.. హార్థిక్ పటేల్, రాహుల్ గాంధీ భేటీ అయిన విషయం తెలిసిందే. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హార్ధిక్ పటేల్ మద్దతు ప్రకటించినందుకు ఈ మొత్తాన్ని బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్ మధ్య 200 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందని.. అందుకే హార్థిక్ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక సామాన్య జనాలు అమోమయానికి లోనవుతున్నారు. ఇదిలావుంటే.. సీసీటీవీ ఫుటేజ్ లీక్ కావడం అనేది వ్యక్తిగత ప్రైవసీ పాలసీకి విరుద్ధమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
నవ యువ మంత్రం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అనూహ్య పరిణామాలు, ఫిరాయింపులతో రాజకీయం రక్తికడుతోంది. మోదీ నెల రోజుల్లోపే మూడుసార్లు గుజరాత్లో పర్యటించగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ కూడా క్షేత్రస్థాయిలో చురుకుగా కదులుతున్నారు. నవంబర్–డిసెంబర్ నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. హిమాచల్ప్రదేశ్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 18న ఉంది కాబట్టి.. గుజరాత్ లెక్కింపు కూడా అదే రోజు ఉండే అవకాశాలుంటాయి. అంటే డిసెంబర్ 15లోగా గుజరాత్లో ఎన్నికలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లో అసలు ఏం జరుగుతోంది? ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలేమిటనే అంశాలపై దృష్టి సారిద్దాం.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ గడిచిన 22 ఏళ్లుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీపై సాధారణంగానే జనంలో వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు మోదీ నేతృత్వం లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. గుజరాత్ సీఎంగా మోదీ గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హ్యాట్రిక్ విజయాలను అందించారు. ఆయన ప్రధానిగా ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్రస్థాయిలో బీజేపీకి నాయకత్వ శూన్యత ఏర్పడింది. పటిష్ట నాయకత్వం కొరవడింది. వీటిని దృష్టిలో పెట్టుకునే కమళ దళపతి అమిత్షా చాన్నాళ్ల ముందు నుంచే గుజరాత్పై దృష్టి కేంద్రీకరించారు. క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచించి.. అమలుకు పార్టీ శ్రేణులను పురమాయిస్తున్నారు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో వచ్చే ఎన్నికల్లో 150 పైచిలుకు స్థానాల్లో గెలవాలని అమిత్షా లక్ష్యంగా నిర్దేశించారు. కాంగ్రెస్ కురువృద్ధుడు శంకర్సింహ్ వాఘేలాతో తిరుగుబాటు చేయించి.. కాంగ్రెస్ వ్యూహకర్త అహ్మద్పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూడాలని అమిత్షా సర్వశక్తులూ ఒడ్డారు. కర్ణాటకలో గుజరాత్ ఎమ్మెల్యేల శిబిరాన్ని నిర్వహించిన మంత్రిపై ఆదాయపన్ను శాఖ దాడులూ జరిగాయి. ఇతర పార్టీలకు భిన్నమని చెప్పుకునే బీజేపీ ఏది నైతికం, ఏది అనైతికమనేది చూడకుండా అన్ని ప్రయత్నాలూ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కుంభస్థలాన్ని కొట్టి.. ఆ పార్టీ శ్రేణులను డీలాపడేలా చేయాలని చూశారు కమలనాథులు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన పొరపాటుతో వారి ఓట్లు చెల్లకుండాపోయి.. అహ్మద్పటేల్ అతికష్టం మీద గెలిచారు. పటీదార్లకు రిజర్వేషన్లు ఇస్తే తాము నష్టపోతామని ఓబీసీలు ఉద్యమించారు. ఓబీసీ ఏక్తా మోర్చా కన్వీనర్ అల్పేశ్ ఠాకోర్ను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంది. అలాగే ఉనాలో దళితులపై దాడుల నేపథ్యంలో ఆ వర్గం యువనేతగా జిఘ్నేష్ మేవానీ ఎదిగారు. సోమవారం రాహుల్ను కలవాల్సిందిగా జిఘ్నేష్ను కూడా కాంగ్రెస్ ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదని స్పష్టం చేసిన జిఘ్నేష్.. బీజేపీని ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్నానని చెప్పారు. దీన్నిబట్టి దళిత యువత మద్దతు కాంగ్రెస్కు ఉంటుందనేది స్పష్టమవుతోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పటీదార్లు, ఓబీసీలు ఉద్యమించినా.. బీజేపీకి వ్యతిరేకంగా కలసి పనిచేసే వారికి ఇప్పుడు కాంగ్రెస్ ఒక వేదికగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. గతంలో కాంగ్రెస్ ఖామ్(క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లిం)ల సమీకరణంతో గుజరాత్లో గెలిచేది. ఇప్పుడు వివిధ సామాజిక వర్గాల్లో బీజేపీపై గూడుగట్టుకున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. పటీదార్లు–ఓబీసీలు–దళితులను ఏకం చేసి.. బీజేపీ హిందూత్వకు చెక్ పెట్టాలని వ్యూహరచన చేస్తోంది. గతంలోలాగా ముస్లింల గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఎందుకంటే గుజరాత్లో పోటీ రెండు పార్టీల మధ్యే. ముస్లింలు బీజేపీకి ఓటేయరు కాబట్టి వారి మద్దతు ఎలాగైనా తమకే ఉంటుందనేది కాంగ్రెస్ ధీమా. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిచిన్న గ్రూపును కలుపుకుని పోవడం ద్వారా ఓట్ల చీలికను నివారించాలని చూస్తోంది. జేడీ(యూ)కు చెందిన చోటూభాయ్ వసావా ఆరుసార్లు ఎమ్మెల్యే. గిరిజనుల్లో పట్టున్న నేత. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలసి పనిచేస్తానని ఆయన ప్రకటించారు. ఎన్సీపీతో పాటు ఆప్లోని కొందరు ముఖ్యనేతలను కూడా కాంగ్రెస్ దువ్వుతోంది. పార్టీలో చేరకున్నా.. ఇండిపెండెంట్గా పోటీచేస్తే మద్దతిస్తామని కొంచెం పలుకుబడి ఉన్న నాయకులకు ఆఫర్లు ఇస్తోంది. తద్వారా బిహార్లో మహాకూటమి ఏర్పాటు ద్వారా సాధించిన ఫలితాన్ని గుజరాత్లోనూ పునరావృతం చేయాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఆ దిశగా ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మోదీ స్వరాష్ట్రంలో ఆయన్ని ఓడిస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు సానుకూల పవనాలుంటాయనేది ఆ పార్టీ ఆశ. యువతే టార్గెట్.. హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకోర్, జిఘ్నేశ్ మేవానీ ఆయా సామాజికవర్గ ప్రతినిధులే అయినా.. వీరికి యువతలో విపరీతమైన ఆదరణ ఉంది. కారణమేమిటంటే.. వీరు నవతరం ప్రతినిధులు. హార్దిక్కు 24 ఏళ్లు. జిఘ్నేష్కు 34 ఏళ్లు. అల్పేశ్ వయసు 39 ఏళ్లు. గుజరాత్ జనాభాలో ఏకంగా 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారే. ఈ యువనేతల జనాకర్షణ శక్తిని ఓట్లుగా మలచుకుని లాభపడాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీలు ఇస్తూ యువతను తమవైపు తిప్పుకునే యత్నం చేస్తోంది. హిందూత్వ, అభివృద్ధి మంత్రం.. రెండు దశాబ్దాల పైచిలుకు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజావ్యతిరేకతను అధిగమించడం అంత సులువేమీ కాదు. సమాజంలోని వివిధ వర్గాల్లో బీజేపీపై తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ మళ్లీ హిందూత్వ కార్డును తెరపైకి తెస్తోంది. తాజ్మహల్పై యూపీ బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్య లు, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై నాయకుల ప్రకటనలను ఈ కోణంలోనే చూడొచ్చని రాజకీయ వ్యాఖ్యాతలు విశ్లేషిస్తున్నారు. గుజరాత్లో అత్యంత ప్రాబల్యవర్గం వ్యాపారులు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మూలంగా వీరు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టే ప్రధాని మోదీ.. దీన్ని అన్ని పార్టీల సమష్టి నిర్ణయమని చెప్పే యత్నం చేశారు. అన్ని పార్టీలతో చర్చించామని, కాంగ్రెస్ కూడా జీఎస్టీని ఆమోదించిందని ఇటీవల గుజరాత్ పర్యటనలో నొక్కి చెప్పారు. అభివృద్ధి మంత్రం పఠించారు. గుజరాతీ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. కాంగ్రెస్కు గుజరాతీలంటే ఇష్టం లేదంటూ.. ప్రధానిగా ఉంటూ ఒక రాష్ట్ర నేత స్థాయిలో మాట్లాడారు.. వీటిని బట్టి..మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుజ రాత్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వ్యతిరేకులను ఏకం చేసే యత్నం.. వివిధ వర్గాల్లో బీజేపీపై నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సామాజికంగా కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. అత్యంత ప్రాబల్యం కలిగిన పటీదార్ల(పటేల్ సామాజికవర్గం)ను అక్కున చేర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. రెండేళ్ల కిందట విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కావాలంటూ పటీదార్లు తీవ్రంగా ఉద్యమించారు. దీనికి నేతృత్వం వహించిన ఫైర్బ్రాండ్ యువనేత హర్దిక్ పటేల్ పేరు మారుమోగింది. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) నాయకుడిగా ఆ సామాజిక వర్గానికి ప్రతినిధిగా హార్దిక్ పటేల్ ఎదిగారు. హార్దిక్పై దేశద్రోహం నేరం మోపి జైల్లో పెట్టడం, గుజరాత్లోకి ప్రవేశించకుండా కోర్టు ఆర్నెల్లు నిషేధం విధించడంతో.. పటీదార్లు బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యమ ఉధృతి తగ్గినా.. పటీదార్లు రిజర్వేషన్ల కోసం తమ డిమాండ్ నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవకాశం కోసం వేచి ఉన్న వీరు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం నేర్పాలని బహిరంగంగానే చెబుతున్నారు. గుజరాత్ జనాభాలో పటీదార్లు 12 నుంచి 14 శాతం దాకా ఉంటారు. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ఈ వర్గం బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది. ఇప్పుడు పటీదార్లలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. çహార్దిక్ను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తోంది. గుజరాత్ పర్యటనకు వచ్చిన రాహుల్ను సోమవారం కలవాల్సిందిగా హార్దిక్ను కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఇప్పుడు కలవలేనని, రాహుల్ తర్వాతి గుజరాత్ పర్యటనలో ఆయన్ని కలుస్తానని హార్దిక్ తెలిపారు. పార్టీలో చేరడం కుదరకపోతే.. ఎన్నికల్లో మద్దతు తెలపాలని, కలసి పనిచేయాలని కాంగ్రెస్ కోరుతోంది. ప్రస్తుతం ఉన్న 49 శాతం రిజర్వేషన్ల జోలికి వెళ్లకుండా.. తాము అధికారంలోకి వస్తే తమిళనాడు తరహాలో పటీదార్లతో కలిపి ఇతరులకు అదనంగా 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్లో చేరి తనకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపును కోల్పోయే బదులు.. సామాజికవర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతూ ఉద్యమ నేతగా ఉండేందుకే హార్దిక్ మొగ్గుచూపుతున్నారు. పటీదార్లను అవమానించిన బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తానంటున్నారు. బీజేపీకి భంగపాటు.. హార్దిక్ పటేల్ను తమవైపు తిప్పుకోవడం సాధ్యం కాదని గ్రహించిన కాషాయ పార్టీ.. ఆయన్ని బలహీనపర్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. హార్దిక్కు సన్నిహితులుగా పరిగణించే వరుణ్ పటేల్, రేష్మా పటేల్ను శనివారం బీజేపీలో చేర్చుకుంది. వీరిద్దరూ హార్దిక్ను కాంగ్రెస్ ఏజెంట్గా అభివర్ణించారు. ఆదివారం పాస్ ఉత్తర గుజరాత్ కన్వీనర్ నరేంద్ర పటేల్ను అక్కున చేర్చుకుంది. బీజేపీలో చేరిన కొద్దిగంటల్లోనే ఆదివారం నరేంద్ర పటేల్ ప్రెస్మీట్ పెట్టి సంచలనం సృష్టించారు. పార్టీలో చేరితే రూ.కోటి ఇస్తా మని బీజేపీ ప్రలోభ పెట్టిందని, అడ్వాన్సు గా రూ.10 లక్షలు ఇచ్చిందని.. ఆ నగదును మీడియా ముందు ప్రదర్శించారు. దీంతో బీజేపీ ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఇది కాంగ్రెస్ డ్రామాగా కొట్టిపారేసే యత్నం చేసింది. కొద్దిగంటల్లోనే 15 రోజుల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్న పటీదార్ ఉద్యమనేత నిఖిల్ సవానీ.. బీజేపీ ప్రలోభాలకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాహుల్ అపాయింట్మెంట్ కోరతానన్నారు. హార్దిక్ ముఖ్య అనుచరులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఆకర్‡్ష చేపట్టిన బీజేపీ అనూహ్యంగా ఇది బెడిసికొట్టి.. తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. -
కాంగ్రెస్కు హార్దిక్ డిమాండ్లు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతివ్వటంపై స్పష్టత ఇవ్వాలంటే.. ముందుగా తన డిమాండ్లను అంగీకరించాల్సిందేనని పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పటేళ్లకు రిజర్వేషన్లపై తేల్చాల్సిందేనన్నారు. గుజరాత్ కాంగ్రెస్ ఇంచార్జ్ అశోక్ గెహ్లాట్తో జరిగిన సమావేశంలో.. హార్దిక్ పటేల్ తన డిమాండ్లను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పటేళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గానికే ఎక్కువ టికెట్లు ఇవ్వాలని హార్దిక్ కోరినట్లు తెలిసింది. దీంతోపాటుగా కాంగ్రెస్ వ్యవస్థాగత నిర్మాణంలో పటేళ్ల ప్రాతినిధ్యం పెంచాలని.. పటేళ్ల రిజర్వేషన్ల అమలుపై న్యాయసమీక్ష లేకుండా రాజ్యాంగ భద్రత కల్పించాలనే ప్రతిపాదనలను కూడా హార్దిక్ గెహ్లాట్ ముందుంచినట్లు సమాచారం. ప్రస్తుత రిజర్వేషన్లకు భంగం కలిగించకుండా పటేళ్లకు వేరుగా రిజర్వేషన్ ఇవ్వాలని హార్దిక్ డిమాండ్ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి పేర్కొన్నారు. పటీదార్ ఆందోళన సందర్భంగా తమ వర్గం వారిపై దౌర్జన్యం చేసిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని హార్దిక్ పటేల్ కోరినట్లు తెలిసింది. తదుపరి పర్యటనలో కలుస్తా గెహ్లాట్, పటేల్ వర్గం నేతల సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఉన్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని హార్దిక్ పటేల్ తెలిపారు. ‘నేను రాహుల్ను కలవలేదు. ఆయన్ను కలిసినప్పుడు దేశం మొత్తానికి ఈ విషయాన్ని వెల్లడిస్తాం. రాహుల్ గాంధీ తదుపరి గుజరాత్ పర్యటనలో నేను కలుస్తాను’ అని హార్దిక్ ట్వీట్ చేశాడు. ఫైవ్స్టార్ హోటల్లోని సీసీటీవీ ఫుటేజీ ఎలా లీకయింది?’ అని ప్రశ్నించారు. ‘గూఢచర్యం చేయటంలో బీజేపీ వారు నిపుణులు’ అని పటేల్ ట్వీట్ చేశారు. -
గజదొంగను ఓడించడానికి దొంగకు మద్దతిస్తాం
అహ్మదాబాద్: బీజేపీ 'గజదొంగ' (మహాచోర్).. కాంగ్రెస్ 'దొంగ' (చోర్).. గజదొంగను ఓడించడానికి దొంగకు మద్దతిస్తే తప్పేంటి అని పటీదార్ ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ ప్రశ్నించారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తానంటూ ఆయన సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ అహ్మదాబాద్ హోటల్లో ఉన్న సమయంలోనే తాను ఆ హోటల్కు వెళ్లానని, కానీ తాను రాహుల్ను కలువలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఉత్తర గుజరాత్లో రోడ్షో, బహిరంగ సభల కారణంగా రాహుల్గాంధీతో సమావేశానికి వెళ్లలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు. గుజరాత్లోని పటీదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కోటా కల్పించాలంటూ హార్థిక్ పటేల్ ఉధృతంగా ఉద్యమం నిర్వహించడం ద్వారా ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఆయన రాహుల్గాంధీని రహస్యంగా కలిశారని హోటల్ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఆహ్వానం మేరకు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు తాను హోటల్కు వెళ్లానని, అయితే, ఆలస్యం అవుతుండటంతో తాను అశోక్ గెహ్లాట్ను మాత్రమే కలిసి వెనుకకు వచ్చానని చెప్పారు. బీజేపీ వాళ్లు హోటల్ సీసీటీవీ దృశ్యాలను తెప్పించుకొని.. వాటిని కావాలనే లీక్ చేశారని, గుజరాత్లో ఉన్నది ప్రతిదీ తమ ఆస్తి అన్నట్టు బీజేపీ తీరు ఉందని ఆయన విమర్శించారు. తానేమీ ప్రధాని నరేంద్రమోదీ లాగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలువలేదని హార్థిక్ విమర్శించారు. -
హార్థిక్ పటేల్ సీక్రెట్ భేటీ.. గుజరాత్ కుతకుత!
రహస్య సమావేశాలు.. చీకటి ఒప్పందాలు.. జంప్ జిలానీలు.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ను ఇప్పుడివే కుదిపేస్తున్నాయి. రహస్య సమావేశాలు.. చీకటి ఒప్పందాల గురించి గుజరాత్లో సంచలన కథనాలు వెలుగుచూస్తున్నాయి. పటేళ్లకు రిజర్వేషన్ కోసం తన ఉద్యమంతో రాష్ట్రాన్ని కుదిపేసిన హార్థిక్ పటేల్ రహస్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో భేటీ అయ్యారట. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో దృశ్యాలు అంటూ సోమవారం సాయంత్రం కొన్ని మీడియా చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. అహ్మదాబాద్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రాహుల్-హర్థిక్ భేటీ అయ్యారని, హోటల్లోని ఓ గదిలోకి హార్థిక్ వెళుతున్న దృశ్యాలను ఆ చానెళ్లు ప్రసారం చేశాయి. ఆ గదిలో రాహుల్ ఉన్నారని, వీరు సుదీర్ఘంగా చర్చించుకున్నారని పేర్కొన్నాయి. అయితే, ఈ కథనాలను హార్థిక్ పటేల్ అనుచరులు తోసిపుచ్చారు. ఆ హోటల్కు హార్థిక్ వెళ్లిన విషయం వాస్తవమేనని, కానీ ఆయన రాహుల్ను కలువలేదని తెలిపారు. హార్థిక్ రాహుల్ను కలువలేదని, కాంగ్రెస్ నేతలు మకాం వేసిన హోటల్పై గుజరాత్ పోలీసులు నిఘా పెట్టారని, పరారీ నేరస్తుల్లా తమ కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని గుజరాత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. హోటల్ సీసీటీవీ దృశ్యాలను పోలీసులు తీసుకొని.. మీడియాకు ఇచ్చారని ఆరోపించారు. హోటల్ సైతం పోలీసులకు ఈ సీసీటీవీ దృశ్యాలను ఇచ్చినట్టు అంగీకరించింది. బీజేపీ మాత్రం రాహుల్తో రహస్యంగా భేటీ కావాల్సిన అవసరం హార్థిక్కు ఏముందని ప్రశ్నిస్తోంది. అది హార్థిక్ వ్యూహమే..! తాజాగా బీజేపీలో చేరిన పటేల్ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర పటేల్.. అనూహ్యంగా కమలం పార్టీకి ఎదురుతిరిగిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన రెండుగంటల్లోపే నరేంద్ర పటేల్ మీడియా సమావేశం పెట్టి మాట మార్చారు. తను బీజేపీలోకి వచ్చేందుకు కోటిరూపాయలు ఇవ్వజూపారని ఆరోపించారు. తొలివిడతగా రూ.10లక్షలు ఇచ్చారని సమావేశంలో ఆ డబ్బును చూపించారు. పటేల్ ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన వరుణ్ పటేల్, రేష్మా పటేల్లు బీజేపీలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారని నరేంద్ర ఆరోపించారు. ఇలా ప్లేటు ఫిరాయించిన నరేంద్ర పటేల్ వెనుక హార్థిక్ పటేల్ ఉన్నారని, ఆయన వ్యూహంలో భాగంగానే కమలం పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు.. పార్టీలో చేరినట్టు చేరి.. చివరకు హ్యాండ్ ఇచ్చాని కథనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం గుజరాత్లో పెద్ద దుమారం రేపుతోంది. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగమని బీజేపీ విమర్శిస్తోంది. నరేంద్ర పటేల్ ఆరోపణలపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘పటీదార్ నేతలకు బీజేపీ లంచం ఇవ్వటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. ఈ కేసులో గుజరాత్ బీజేపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. గుజరాత్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. పటీదార్ల ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్థిక్ పటేల్ ఇటు బీజేపీకిగానీ, అటు కాంగ్రెస్ పార్టీకిగానీ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. ఎన్నికల్లో పటీదార్ వర్గం ఓటర్లు కీలకం కావడంతో ప్రస్తుతం హార్థిక్ పటేల్, పటేల్ ఓటుబ్యాంక్ చుట్టూ గుజరాత్ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. -
'బీజేపీలోకి వస్తే రూ. కోటి ఇస్తామన్నారు'
అహ్మదాబాద్ : పార్టీలోకి వస్తే రూ. కోటి ఇస్తామని, అడ్వాన్సుగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తనకు రూ.10 లక్షలు ఇచ్చిందని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) కన్వీనర్ ఆరోపించారు. త్వరలో గుజరాత్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీపై ఈ తరహా ఆరోపణలు రావడం నష్టదాయకమే. హార్థిక్ పటేల్కు సన్నిహితుడైన వరుణ్ పటేల్ శనివారం బీజేపీలో చేరారు. ఆ మరుసటి రోజే బీజేపీలో చేరేందుకు తనకు రూ.కోటి ఇవ్వజూపారని, అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఇచ్చారని.. ఆ డబ్బు ఇదేనని(మీడియా సమావేశంలో చూపుతూ) నరేంద్ర పటేల్ చెప్పారు. రూ.కోటి కాదు, మొత్తం రిజర్వ్ బ్యాంకును తన పేరు మీద రాసిస్తానన్నా.. పీఏఏఎస్ను వీడనని పేర్కొన్నారు. నరేంద్ర పటేల్ ఆరోపణలను వరుణ్ పటేల్ ఖండించారు. కాంగ్రెస్తో కుమ్మక్కై బీజేపీపై ఈ ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఆ డబ్బు బీజేపీ ఇచ్చిందనడానికి ఆధారాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కాగా, నరేంద్ర పటేల్ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించాల్సివుంది. సోమవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పీఏఏఎస్ నాయకుడు హార్థిక్ పటేల్ను కలిసే అవకాశం ఉంది. -
గుజరాత్లో కాంగ్రెస్ కొత్త వ్యూహం
అహ్మదాబాద్ : గుజరాత్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వివిధ ఉద్యమాల రూపంలో చుక్కలు చూపించిన హార్థిక్ పటేల్, జిగ్నేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్లను కలుపునే ప్రయత్నాలను కాంగ్రెస్ మొదలు పెట్టింది. పటేల్, ఠాకూర్, మేవార్లు వారి సామాజిక వర్గాల కోసం గుజరాత్లో భీకరమైన ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో వీరిని కలుపుకుని గుజరాత్ ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చేతులు కలుపుదాం హార్థిక్ పటేల్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే.. టిక్కెట్ ఇచ్చేందుకు తాము సిద్ధమని, అందులో సందేహం లేదని గుజరాత్ పీసీసీ చీఫ్ భరత్ సిన్హా సోలంకి చెప్పారు. అదే విధంగా దళితుల కోసం ఉద్యమాలు చేసిన జిగ్నేష్ మేవాని, అవినీతి, మద్యంపై పోరాటాలు చేసిన ఠాకూర్లు కాంగ్రెస్తో చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటే హార్థిక్ పటేల్ చేసిన ఉద్యమం.. గుజరాత్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకులకు ఆహ్వానం గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ సోలంకి... రాష్ట్రంలోని బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలబడదామని చెప్పారు. అందులో భాగంగా రాజ్యసభ ఎన్నికల్లో సహకరించిన జేడీయూ, ఎన్సీపీ, ఆప్ పార్టీ నేతలను ఆయన ఆహ్వానించారు. ఆలోచించాలి..! కాంగ్రెస్ ఆహ్వానంపై హార్థిక్ పటల్, ఠాకూర్, మేవానిలు భిన్నంగా స్పందించారు. తనకు ఎన్నికల్లో పోటీచేయడంపై ఆసక్తి లేదని హార్థిక్ పటేల్ తెలిపారు. అయితే తన సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే వరకూ పోరాటం చేస్తానని చెప్పారు. దళిత నేత మేవాని మాత్రం.. తన వర్గీయులతో చర్చించి నిర్ణయం చెబుతానని తెలిపారు. విమర్శలు - ప్రతివిమర్శలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న హార్థిక్ పటేల్ కాంగ్రెస్ ఏజెంట్ అని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. తాను ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకినని.. ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం నుంచి దూరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మేవాని బీజేపీని విమర్శించారు. -
ఎన్నికల్లో పోటీ చేయను: హార్థిక్
భోపాల్: రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తే లేదని పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్థిక్ పటేల్ స్పష్టం చేశారు. 'నాకు రాజకీయ లక్ష్యాలు లేవు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. నేను రైతులు, అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం పోరాడుతున్నాను. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను' అని హార్థిక్ విలేకరులతో తెలిపారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన స్ట్రాంగ్ లీడర్ శంకర్సిన్హా వాఘేలాతో కూడా చేతులు కలిపే అవకాశం లేదని హార్థిక్ కుండబద్దలు కొట్టారు. వాఘేలాతో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు చేయలేదని చెప్పారు. అయితే, గుజరాత్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చే విషయాన్ని ఆయన కొట్టిపారేయలేదు. గుజరాత్లో బలంగా ఉన్న పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ 2015లో ఆందోళనలు నిర్వహించి హార్థిక్ పటేల్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. -
‘ఉగ్రవాదిని కాదు.. లాహోర్ నుంచి రాలేదు’
న్యూఢిల్లీ: ‘నేనేం ఉగ్రవాదిని కాదు.. లాహోర్ నుంచి రాలేదు’అని పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ తనను అరెస్టు చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనను అరెస్టుచేయాల్సిన అవసరం ఏమిటని, తాను కూడా ఈ భారతదేశ పౌరుడినే అని చెప్పిన ఆయన తనకు ఎక్కడైనా సంచరించే హక్కు ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్లో రైతులపై కాల్పులు చోటుచేసుకున్న మాంద్సౌర్ ప్రాంతానికి హార్దిక్ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించడంతోపాటు పంటరుణాలు ఇప్పించాలని, పాత రుణాలు మాఫీ చేయాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఆంక్షలు ఉన్నాయి. అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. మంగళవారం అక్కడి వెళుతున్న హార్దిక్ను అరెస్టు చేస్తున్న సందర్భంలో ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేం ఉగ్రవాదిని కాదు.. నేనేం లాహోర్ నుంచి ఇక్కడికి రాలేదు. నేను భారతీయుడ్ని. నాకు ఈ దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది’ అంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
హార్దిక్ పటేల్ అరెస్టు
న్యూఢిల్లీ: పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ అరెస్టయ్యాడు. మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. మధ్యప్రదేశ్లో రైతులపై కాల్పులు చోటుచేసుకున్న మాంద్సౌర్ ప్రాంతానికి హార్దిక్ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించడంతోపాటు పంటరుణాలు ఇప్పించాలని, పాత రుణాలు మాఫీ చేయాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఆంక్షలు ఉన్నాయి. అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఆ రైతులకు సానుభూతిగా గుజరాత్లో పటేళ్ల తరుపున ఉద్యమం చేసిన హార్దిక్ పటేల్ వెళుతుండగా అతడిని అరెస్టు చేశారు. హార్దిక్ తన అరెస్టు విషయంలో ముందే మాట్లాడుతూ తన పని తాను చేసుకుపోతానని, పోలీసులు వారి పని వారు చేసుకుంటారని చెప్పారు. -
అమెరికా స్కామ్; భారతీయుల నేరాంగీకారం
టెక్సాస్: అమెరికాను కుదిపేసిన అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్ కమ్ హవాలా కేసులో భారత్కు చెందిన హార్దిక్ పటేల్ (31), రాజుభాయ్ పటేల్ (32), విరాజ్ పటేల్ (33), దిలీప్ కుమార్ అంబల్ పటేల్ (53), పాకిస్థాన్కు చెందిన ఫహద్ అలీ (25)లు అమెరికా, దక్షిణ టెక్సాస్లోని జిల్లా కోర్టు జడ్జీ డేవిడ్ ఇట్నర్ ముందు తమ నేరాన్ని అంగీకరించారు. వారికి శిక్షలు విధించే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. అమెరికా పౌరులను లక్ష్యంగా సాగిన ఈ స్కామ్ ఇటు అమెరికా, భారత్ దేశాలకు విస్తరించింది. 2012, ఆగస్టులో ప్రారంభమైన ఈ స్కామ్లో మొత్తం 52 మంది వ్యక్తులు, భారత్లోని ఐదు కాల్ సెంటర్లు పాత్రదారులు. ఇప్పటికే ఈ స్కామ్లో అరెస్టయిన వ్యక్తుల్లో కొందరు తమ నేరాన్ని అంగీకరించగా, మరికొందరు అభియోగాలను కోర్టు ముందు సవాల్ చేశారు. అలా సవాల్ చేసిన నిందితులు కేసు విచారణ పురోగతినిబట్టి తమ నేరాన్ని అంగీకరిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే గత నెల మే 26వ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ వరకు ఐదుగురు భారతీయులు, ఒక పాకిస్థానీయుడు నేరాన్ని అంగీకరించారు. తాజాగా నేరాన్ని అంగీకరించిన వ్యక్తుల్లో హార్దిక్ పటేల్ అహ్మదాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ నడిపారు. దానికి మేనేజర్గా పనిచేసిన ఆయన ఆ తర్వాత అమెరికాకు వచ్చారు. మిగతా నిందితుల్లో ఎక్కువ మంది అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తూ హవాలా దందాకు పాల్పడ్డారు. అమెరికా పౌరులకు చెందిన డాటాను భార™Œ లోని ఐదు కాల్ సెంటర్లు తస్కరించడం, అమెరికా చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించినందున జరిమానాలు, జైలు శిక్షలు పడతాయని వారిని బెదిరించి అక్రమంగా వసూళ్లు చేయడం, ఆ సొమ్మును హవాలా మార్గాల్లో మళ్లించడం ఈ మొత్తం స్కామ్ సారాంశం. ఆన్లైన్ ద్వారా, నగదు లోడెడ్ కార్డుల ద్వారా, ఇతర మార్గాల్లో స్కామ్ పాత్రదారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. -
బీజేపీకి 'పటేల్' ఝలక్!
ముంబై: పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్ మంగళవారం బీజేపీకి గట్టి ఝలక్ ఇచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన శివసేనతో ఆయన చేతులు కలిపారు. గుజరాత్లో శివసేన చీఫ్గా హార్దిక్ పటేల్ కొనసాగుతారని ఆ పార్టీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. హార్దిక్ పటేల్ మంగళవారం ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ గుజరాత్లో శివసేన ప్రచార బాధ్యతలను హార్దిక్ నిర్వహిస్తారని, పార్టీ ప్రధాన నేతగా ఆయన ప్రజల్లోకి వెళుతారని చెప్పారు. గుజరాత్లో శక్తిమంతమైన పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ కల్పించాలంటూ పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరిట హార్దిక్ పటేల్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. గుజరాత్లో ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లోని బీజేపీ సర్కారు ఒకవైపు ప్రజా వ్యతిరేకతతోపాటు మరోవైపు పటేల్ ఆందోళన సెగను ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో కేంద్రంలో, మహారాష్ట్రలోనే మిత్రపక్షంగానే కొనసాగుతూ.. గుజరాత్లో ఒంటరిగా పోటీచేస్తామని శివసేన ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకే ఉద్ధవ్-హార్దిక్ చేతులు కలిపినట్టు తెలుస్తోంది. -
5 వేల కార్ల కాన్వాయ్తో వస్తున్నాడు!