ఆయన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు కాదు: విజయసాయిరెడ్డి | gautham reddy is not our party member, says vijayasai reddy | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 10 2018 7:10 PM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM

gautham reddy is not our party member, says vijayasai reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్: విజయవాడకు చెందిన  పూనూరు గౌతమ్‌రెడ్డి తమ పార్టీ సభ్యుడు కాదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. ఆయనను గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

‘గౌతమ్‌రెడ్డి తనను తాను వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడిగా పేర్కొంటూ కొద్దిరోజులుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్న విషయం పార్టీ దృష్టికి వచ్చింది. గౌతమ్‌రెడ్డి పార్టీ సభ్యుడు కాదు. ఆయన అభిప్రాయాలకూ పార్టీకి ఏ సంబంధమూ లేదు. ఆయనను వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడిగా  పరిగణించరాదు’ అని మీడియా సంస్థలకు తెలియజేస్తున్నట్టు ప్రకటనలో విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement