మూడో టెస్టుకు వర్షం అంతరాయం | 3rd test delayed by rain | Sakshi
Sakshi News home page

మూడో టెస్టుకు వర్షం అంతరాయం

Published Mon, Dec 29 2014 8:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

3rd test delayed by rain

మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా  మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్ నాలుగో రోజు లంచ్ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.  రోజర్స్ (33), వాట్సన్ (15) క్రీజులో ఉన్నారు. వార్నర్ (40)ను అశ్విన్ అవుట్ చేశాడు.

అంతకుముందు 462/8 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ (169), రహానె (147) సెంచరీలు సాధించారు. హారిస్ 4, జాన్సన్ 3, నాథన్ లియోన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement