ఆస్ట్రేలియా జట్టు వచ్చేసింది... | Australia team arraival to india | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా జట్టు వచ్చేసింది...

Feb 14 2017 12:18 AM | Updated on Sep 5 2017 3:37 AM

ఆస్ట్రేలియా జట్టు వచ్చేసింది...

ఆస్ట్రేలియా జట్టు వచ్చేసింది...

టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో అడుగు పెట్టింది.

టీమిండియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు సోమవారం భారత్‌లో అడుగు పెట్టింది. దుబాయ్‌లో శిక్షణ శిబిరాన్ని ముగించుకున్న స్టీవ్‌ స్మిత్‌ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ముంబైకి చేరుకుంది. ఈనెల 17 నుంచి 19 వరకు ముంబైలో భారత ‘ఎ’ జట్టుతో ఆసీస్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది.

ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టుల్లో (ఫిబ్రవరి 23–27 పుణే; మార్చి 4–8 బెంగళూరు; మార్చి 16–20 రాంచీ; మార్చి 25–29 ధర్మశాల) భారత్‌తో తలపడుతుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement