త్వరలో భారత్లో జరిగే వరల్డ్ ట్వంటీ 20 పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీష్ ఆరా తీశారు.
ఇస్లామాబాద్: త్వరలో భారత్లో జరిగే వరల్డ్ ట్వంటీ 20 పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతపై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీష్ ఆరా తీశారు. ఈ మేరకు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి నిశార్ అలీ ఖాన్తో నవాజ్ చర్చించారు.
భారత్లో పర్యటించే పాకిస్తాన్ జట్టుకు భద్రతా పరంగా ఏ విధమైన లోటుపాట్లు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారత్ లో పాక్ జట్టు భద్రతపై నివేదిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా నిశార్ కు నవాజ్ సూచించారు. దీంతో పాటు ఆసియాకప్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆయన పీసీబీ నుంచి నివేదిక కోరారు.