నాల్గో టెస్టు:ఐదో రోజు ఆట ప్రారంభం | South Africa set to resume blockathon | Sakshi
Sakshi News home page

నాల్గో టెస్టు:ఐదో రోజు ఆట ప్రారంభం

Dec 7 2015 10:10 AM | Updated on Sep 3 2017 1:38 PM

దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో చివరి రోజు ఆట ప్రారంభమైంది.

ఢిల్లీ:దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో చివరి రోజు ఆట ప్రారంభమైంది. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా సోమవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. టీమిండియా నిర్దేశించిన 481 పరుగుల విజయలక్ష్యంతో ఆదివారం బ్యాటింగ్  దిగిన సఫారీలు అత్యంత రక్షణాత్మక ధోరణిని అనుసరిస్తున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా(25 బ్యాటింగ్; 229 బంతుల్లో 3 ఫోర్లు), ఏబీ డివిలియర్స్(13 బ్యాటింగ్ ; 119 బంతుల్లో 1 ఫోర్)లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా 80.0 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులతో ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పదేపదే బౌలర్లను మార్చుతూ సఫారీలపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement