
విరాట్ కోహ్లి
లీడ్స్: సుధీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్కు ఇంగ్లండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో నెగ్గి ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఓ బంతికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి షాక్కు గురయ్యాడు. ఈ విషయం మ్యాచ్ అనంతరం అతనే తెలిపాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడు మీద ఉన్నాడు. ఈ దశలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ స్పెల్ టీమిండియాను దెబ్బ తీసింది. ముందుగా కార్తీక్ను బౌల్డ్ చేసిన రషీద్ ఇన్నింగ్స్ 31వ ఓవర్లో చెలరేగాడు. అతను వేసిన అద్భుతమైన లెగ్ బ్రేక్ కోహ్లి బ్యాట్ను ఛేదించి వికెట్లను కూల్చింది. అనూహ్యమైన ఈ బంతికి బిత్తరపోయిన కోహ్లి కొద్దిసేపు పిచ్ను, బౌలర్ను చూస్తూ షాక్లో నిలిచిపోయాడు! అదే ఓవర్ చివరి బంతికి రైనా (1) కూడా ఔట్ కావడంతో భారత్ కష్టాలు పెరిగాయి. దీంతో భారతస్వల్ప స్కోర్కే పరిమితమైంది. ప్రస్తుతం కోహ్లి వికెట్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.