ఈ-రిక్షాలపై వచ్చేవారం తుది నోటిఫికేషన్ | Centre to issue final notification for e-rickshaws next week | Sakshi
Sakshi News home page

ఈ-రిక్షాలపై వచ్చేవారం తుది నోటిఫికేషన్

Oct 2 2014 10:43 PM | Updated on Sep 29 2018 5:26 PM

ఈ-రిక్షాలకు సంబంధించి నూతన నియమనిబంధనలతోకూడిన తుది నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం వచ్చేవారం విడుదల చేయనుంది. ఇందులో గరిష్ట వేగపరిమితి గంటకు 25 కి.మీ: డ్రైవింగ్ లెసైన్సు

 న్యూఢిల్లీ: ఈ-రిక్షాలకు సంబంధించి నూతన నియమనిబంధనలతోకూడిన తుది నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం వచ్చేవారం విడుదల చేయనుంది. ఇందులో గరిష్ట వేగపరిమితి గంటకు 25 కి.మీ: డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరివంటి నిబంధనలను పొందుపరచనుంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. న్యూ సెంట్రల్ వెహికల్ రూల్స్-2014 పేరిట దీనిని విడుదల చేస్తుందన్నారు. దసరా సెలవుల తర్వాత కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశముందన్నారు. కాగా నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగ తి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషేధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది.
 
 హస్తిన రహదారులపై ‘ఈ-కార్టు’లు: నగర రోడ్లపై ఈ-కార్ట్’ అనే కొత్త రకం వాహనాలను అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రిక్షాల్లో నలుగురు వ్యక్తులు, 40 కేజీల లగేజీని అనుమతిస్తుండగా, ఈ-కార్ట్‌లను కేవలం సరుకుల రవాణాకు వాడనున్నారు. ఇందులో 310 కేజీల వరకు బరువైన సరుకులను తరలించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ కేటగిరీ కింద అనుమతించనున్న వాహనాలు ప్రభుత్వ ఆమోదిత సంస్థలు నిర్వహించే భద్రత పరీక్షలకు తట్టుకోవాలని, తగిన ప్రామాణికాలను కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ వాహనాలు తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించాయని ఢిల్లీ హైకోర్టు నమ్మిన మీదటే రహదారులపైకి వచ్చే అవకాశముంది. అయితే నమూనా పరీక్షల విషయమై రోడ్డు భద్రతా నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement