
- పులివెందుల మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టాం
- పులివెందులలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంది, రైతులు ఎలా బతుకుతున్నరన్న విషయాలు చంద్రబాబు దృష్టికి పోవాలి
- పంటలు పండని పరిస్థితి, కరువుతో అలమటిస్తున్న పరిస్థితితో ప్రజలు అవస్థలు పడుతున్నారు
- చిత్రావతిలో నీళ్లున్నా రైతులకు నీళ్లు వదలడం లేదు
- చిత్రావతి డ్యాం సామర్థ్యం 10 టీఎంసీలు. దీనికి జరిగిన కేటాయింపు కేవలం 3.2 టీఎంసీలు
- ఇందులోనూ మొదటి విడతగా ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 7 వరకు 1.8 టీఎంసీలు ఎంపీఆర్ నుంచి ఇచ్చారు
- చివరకు చిత్రావతికి చేరిన నీరు 0.67 టీఎంసీలు మాత్రమే.. అంటే 63 శాతం నష్టమైంది.
- రెండో విడతగా ఎంపీఆర్ నుంచి 1.4 టీఎంసీల నీళ్లు పంపారు. కానీ చేరినవి కేవలం 0.66 టీఎంసీలే, అంటే 53 శాతం నష్టాలు
- ఇప్పుడు చిత్రావతిలో మొత్తం 1.15 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి
- చిత్రావతి నుంచి సాగునీరు అందించాలంటే డ్రైవింగ్ హెడ్ కనీసం 0.9 టీఎంసీలు ఉంటే తప్ప సాధ్యం కాదు
- ఇప్పుడు 1.15 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి కనీసం సాగునీరు అందించే అవకాశం ఉంది
- కానీ ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 22 నుంచి చిత్రావతికి నీళ్లు ఇవ్వడం మానేసింది
- డ్రైవింగ్ హెడ్ ఉన్నప్పుడు చిత్రావతికి కాస్తోకూస్తో నీరు పంపి, పులివెందుల స్టోరేజి ట్యాంకులు, లింగాల చెరువులు నింపుకొని రైతులకు ఉపయోగపడచ్చు
- కానీ హడావుడిగా నీళ్లు ఇవ్వడం మానేశారు
- కదిరి, ధర్మవరం మునిసిపాలిటీలకు కూడా తాగడానికి 41 క్యూసెక్కుల చిత్రావతి నీళ్లు ఇస్తున్నారు
- ఆ తర్వాత నీళ్లు ఇచ్చినా దాన్ని డ్రైవింగ్ హెడ్ పెంచుకోడానికి పనికొస్తుంది తప్ప సాగునీరు ఇవ్వడం కుదరదు
- శ్రీశైలంలో నీళ్లున్నా గండికోట కట్టకపోవడంతో పులివెందులకు నీళ్లు రావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నెరవేరడం లేదు
- తుంగభద్ర నీళ్లు ఏవిధంగానూ సరిపోవు కాబట్టి కనీసం కృష్ణా నీళ్లయినా వస్తే బాగుండేది
- గండికోట, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తయితే నీళ్లు వచ్చేవి
- చంద్రబాబు పాలనలోకి వచ్చి మూడేళ్లయినా చాలీచాలని కేటాయింపులతో ప్రాజెక్టులు కడుతున్నారు
- గాలేరు - నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నికల ముందొచ్చి ప్రాజెక్టుల ముందు టెంకాయలు కొట్టారే తప్ప ఏనాడూ పైసలు విదల్చలేదు.
- గాలేరు - నగరి 13 కోట్లు, హంద్రీనీవాకు 17 కోట్లు ముష్టి వేసినట్లు ఇచ్చారు
- తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు
- హంద్రీనీవా, గాలేరు నగరిలకు తలో 4వేల కోట్లు కేటాయించి 80 శాతం పనులు పూర్తిచేశారు
- మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయడానికి కూడా చంద్రబాబు చాలీచాలని కేటాయింపులు చేస్తున్నారు.
- పట్టిసీమ నుంచి రాయలసీమకు ఏమైనా వచ్చాయా.. అక్కడినుంచి ఇక్కడకు ఏమనా కెనాల్ వేశారా?
- పట్టిసీమ నుంచి 48 టీఎంసీలు ప్రకాశం బ్యారేజికి వచ్చాయి
- శ్రీశైలం నుంచి కిందకు వాడుకోవచ్చని జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా
- చివరకు ఏ స్థాయిలో అన్యాయాలు, మోసాలు ఉన్నయో చూద్దాం
- గండికోట ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని 22 గ్రామాల వాళ్లు అడుగుతుంటే, చంద్రబాబు సీఎం అయి మూడేళ్లయినా మాటలు చెబుతాడు గానీ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు
- గండికోటలో 26 టీఎంసీల సామర్థ్యం నిల్వచేయాల్సి ఉంది. ఇప్పటికి గాలేరు-నగరి పూర్తయి ఉంటే శ్రీశైలం నుంచి రోజుకు 22వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేవి, గండికోట కళకళలాడేది
- ఆ తర్వాత చిత్రావతి, పైడిపాలెం అన్నింటికీ కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు వచ్చేవి
- గొప్పగా నీళ్లు తెస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఎందుకని చంద్రబాబును అడుగుతున్నాం
- ఇచ్చామన్నట్లుగా భిక్షం వేసినట్లు కాదు.. పెండింగులో ఉన్న ప్రతి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి
- గండికోటకు 26 టీఎంసీల నీళ్లు తేవాలి
- చిత్రావతి, పైడిపాలెం లకు కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించాలి
- తుంగభద్ర నుంచి చిత్రావతికి మళ్లీ కేటాయిస్తూ ఆ తర్వాత పీబీసీ, లింగాల బ్రాంచి కెనాల్కు కూడా వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తున్నాం
- ఇప్పుడున్న పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
- రైతుల దుస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఇక్కడ ధర్నా చేస్తున్నాం
- చంద్రబాబుకు రైతుల మీద ఏమాత్రం అభిమానం లేదు
- కేబినెట్ సమావేశాల్లో రైతుల భూములు ఎలా లాక్కోవాలి, పెద్దలకు ఎలా ఇవ్వాలనే చూస్తాడు
- రైతులకు రుణాలు ఇచ్చిన తీరును చూసి చంద్రబాబు సంతృప్తి చెందారట.. అది చూసి ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా అనిపించింది
- బ్యాంకులు రైతులకు 24వేల కోట్ల పంటరుణాలు, 10వేల కోట్ల టెర్మ్ లోన్స్ఇవ్వాల్సి ఉంటే మొత్తం కలిపి కేవలం 4700 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నాయి.
- రబీలో 9 లక్షల హెక్టార్లలో కూడా పంట వేయకపోయినా.. ఈయనకు సంతృప్తికరంగా ఉందట
- ఈ మనిషికి ఏం జరుగుతోందన్న అవగాహన లేదు. ఉండేదల్లా డబ్బు, డబ్బు డబ్బు అనే పిచ్చి తప్ప ఏమీలేదు
- ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యి, చిత్రావతికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
- రైతులు పడుతున్న అగచాట్లతో ఇప్పటికైనా బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా
- ఎంత ఎండ ఉన్నా, ధర్నా చేయకపోతే నీళ్లు రావేమోనని రైతులు వ్యక్తం చేసిన ఆవేదనను ఆయన గుర్తించాలి