maha dharna
-
ఇవాళ నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా
-
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
-
రేపటి కేటీఆర్ నల్లగొండ పర్యటన రద్దు
-
రేపటి బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ
సాక్షి, నల్గొండ జిల్లా: నల్లొండలో బీఆర్ఎస్(BRS Party) రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండ(Nalgonda)లో కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.ధర్నా కారణంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుందని పోలీసులు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారుహామీలను అమలు చేయాలని అడగడం తప్పా?రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమే ఇదంటూ ధ్వజమెత్తారు. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది. రేవంత్ ఇచ్చిన హామీల అమలును నిలదీయొద్దా?. హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?’’ అంటూ లింగయ్య ప్రశ్నించారు.ఇదీ చదవండి: కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు? -
బీఆర్ఎస్ రైతు మహాధర్నా మళ్లీ వాయిదా
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. నల్గొండలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి(Jagadish Reddy) నేతృత్వంలో మహాధర్నా నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతీ తెలిసిందే. రైతు భరోసా(Rythu Bharosa) కుదింపుపై రైతుల ఆగ్రహాన్ని ప్రజలను చూపించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించింది. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్న డిమాండ్తో నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఈ మహాధర్నా నిర్వహించాలని భావిస్తోంది. -
అల్లుడు, అదానీ కోసం రేవంత్ పని చేస్తున్నాడు
-
KTR: మోదీతోనే ఆందోళన చేసి సాధించుకున్నారు..
-
కేటీఆర్ ఫ్లెక్సీలను చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు
-
నేడు మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహా ధర్నా
మహబూబాబాద్: లగచ ర్ల బాధితులకు అండగా సోమవారం మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ దళిత, గిరిజన రైతులతో కలసి మహా ధర్నా నిర్వహించనుంది. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్ర మం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్రెడ్డిలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చేవరకూ వదిలి పెట్టమని ఎర్రబెల్లి అన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వందకుపైగా సీట్లతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సొంత గ్రామంలో ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ పోలీసులు సంఘవిద్రోహ శక్తులను ముందే అరెస్ట్ చేసి ధర్నాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ధర్నాకు అనుమతి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు చెంప పెట్టులాంటిందన్నారు. అనంతరం ధర్నా జరిగే ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు. -
విశాఖ స్టీల్ కు సొంత గనులుకేటాయించాలి..
-
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ మహాధర్నా
-
‘తప్పు చేసినోళ్లకు నోటీసులెందుకు ఇవ్వరు?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అన్నీ స్కామ్లే అని, లక్షల మంది నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారని, టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బీఆర్ఎస్ సర్కార్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద శనివారం బీజేపీ చేపట్టిన మహా ధర్నాలో ఆయన ప్రసంగించారు. తప్పు చేసిన టీఎస్పీఎస్సీని ఎందుకు రద్దు చేయరు. ఆ కమిషన్ చైర్మన్కు ఎందుకు నోటీసులు ఇవ్వరు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్షాలకు నోటీసులు ఇస్తున్నారు. టీఎస్పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్ చేయాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అని బండి సంజయ్ మహాధర్నా సాక్షిగా డిమాండ్ చేశారాయన. తెలంగాణలో అన్నీ స్కామ్లేనన్న బండి సంజయ్.. పేపర్ లీకేజీ కేసులో ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. మంత్రి కేటీఆర్ నిర్వాహకమే దీనికి కారణమని ఆరోపించిన బండి సంజయ్.. కేటీఆర్ రాజీనామా చేయాల్సిందేనని, లేకుంటే ఆయన్ని పదవి నుంచి దించి తీరతామని శపథం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను అంధకారం చేస్తున్నారని మండిపడ్డ బీజేపీ చీఫ్.. ముప్ఫై లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి తీరతామని ప్రకటించారు. -
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులతో కలసి నేడు(శనివారం) ధర్నాచౌక్ వద్ద బీజేపీ నిర్వహించనున్న మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇస్తూ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. 500 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనరాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆ పార్టీకి షరతులు విధించింది. షరతులను ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ధర్నాలో పాల్గొనే కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నేతల జాబితాను శుక్రవారంరాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని పిటిషనర్ను కోర్టు ఆదేశించింది. ఆ మేరకు పోలీసులు భద్రతాఏర్పాట్లు చేయాలని సూచించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ వ్యవహారంలో ప్రభుత్వతీరును నిరసిస్తూ ఈ నెల 25న హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగులతో కలసి మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ధర్నాకు అనుమతి కోరుతూ పోలీసులకు బీజేపీ నేతలు దరఖాస్తు చేసినా ఎటూ తేల్చకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాజకీయ పారీ్టలు నిరసనలు తెలపకూడదని లేదు కదా. ధర్నాచౌక్ ఉన్నది సమస్యలపై నిరసన నిర్వహించేందుకే.. ధర్నా చౌక్లో అనుమతి ఇవ్వకుంటే ప్రజలు ఎక్కడ ధర్నా చేసుకుంటారు? నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
కేసీఆర్ ప్రభుత్వ బడ్జెట్ ఓ పెద్ద స్కామ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబమని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విరుచుకుపడ్డారు. నిజామాబాద్లో శనివారం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో విశ్వేశ్వర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతూ అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా స్కాములు నడుస్తున్నాయన్నారు. ధరణి కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద స్కామ్, ఇక తెలంగాణ బడ్జెట్ మహా స్కామ్ అని విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతూ అందులో రూ.ఒక లక్ష కోట్లు కూడా ఖర్చు చేయడం లేదన్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.23,600 కోట్లు బడ్జెట్లో పెట్టి అందులో కేవలం రూ.380 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం నిదర్శనమని విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం లిక్విడ్ డైట్ (మద్యం అమ్మకాలు, చమురుపై పన్నులు)తో నడుస్తోందన్నారు. ఇక పోలీసు శాఖను చలాన్ల శాఖగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను అమ్ముతూ స్కాములు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం, మద్దతు ధర, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఉద్రిక్తంగా మారిన బీసీల మహాధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ బీసీల మహాధర్నాతో రెండోరోజు ఉద్రిక్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణల నేతృత్వంలో చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో బీసీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే, అందులో బీసీ ఉద్యోగులు 4.62 లక్షలు మాత్రమే ఉన్నారని తెలిపారు. దేశంలో బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ప్రదర్శనలో కోల జనార్ధన్, కర్రి వేణు మాధవ్, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
‘బీసీల మహాధర్నా’ ఉద్రిక్తం
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో జరిగిన బీసీల మహా ధర్నా ఉద్రిక్తంగా మారింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో వందలాదిమంది జంతర్మంతర్ వేదికగా మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమం పార్లమెంట్ ముట్టడిగా మారింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు నచ్చజెప్పడంతో బీసీ నేతలు వెనక్కి తగ్గారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి మార్చుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్ర మంత్రులను దేశంలో తిరగనివ్వబోమని, ఆగస్టులో 5 లక్షల మంది బీసీలతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుతో పాటు విద్యా, ఉద్యోగ, ఆర్థ్ధిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో జనాభా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం జగన్ను చూసి నేర్చుకోండి బీసీలకు హక్కులను కల్పించే విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. పార్లమెంటులో బీసీ బిల్లును పెట్టింది కేవలం వైఎస్సార్సీపీనే అని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50% బీసీలకే పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. -
జీవో 317పై ఉపాధ్యాయుల మహాధర్నా..
-
కేసీఆర్ దేవుడు.. ఆయననే ధర్నాలో కూర్చునేలా చేస్తారా..?
పంజగుట్ట: ‘కేసీఆర్ దేవుడు.. ఆయననే దీక్షలో కూర్చునేలా చేశారు.. కేసీఆర్ కన్నెర్ర చేస్తే ఎవ్వరూ ఉండరు’అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నినాదాలు చేస్తూ రాజ్భవన్ ముందు ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా చూడాలని మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతి నిధులు గవర్నర్ తమిళిసైను కలసి వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్భవన్లోకి వెళ్లగా బయట ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా మోతే మండలం లాల్తండాకు చెందిన బానోతు నాగరాజు(38) వ్యవసాయ కూలీ. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్రెడ్డిని అభిమానించేవాడు. అప్పులబాధతో ఇబ్బంది పడుతున్నాడు. గురువారం రాజ్భవన్ వద్దకు కేసీఆర్ గవర్నర్ను కలిసేందుకు వస్తున్నారని పలు పత్రికల్లో చూసి సూర్యాపేట నుంచి రాజ్భవన్కు వచ్చాడు. వచ్చే సమయంలో తన వెంట ఓ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చుకున్నాడు. అయితే రాజ్భవన్కు సీఎం రాకపోవడం, మంత్రులు మాత్రమే లోపలికి వెళ్లడం గమనించిన నాగరాజు.. మధ్యా హ్నం 2:55 గంటల ప్రాంతంలో రాజ్భవన్ ముందు ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. పోలీసులు అడ్డుకుని పంజగుట్ట పోలీస్స్టేషన్కు తరలించారు. -
పాలన చేతకాక ధర్నాలు చేస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలన చేతకాక ధర్నాలు చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. నేటి తెలంగాణను, రేపటి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం కొను గోలు చేయకుండా పలాయనవాదాన్ని అవలం బిస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తారు కానీ.. రైతుల పంటను మాత్రం కొన లేరా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘800 స్కూళ్లలో బువ్వ పెడ్తలె’.. ’ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య’.. అం టూ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను గురు వారం తన ట్విట్టర్ ఖాతాలో షర్మిల పోస్ట్ చేశా రు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తున్నారన్నారు. అంతే కాకుం డా బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలను చదు వుకు దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖాళీ గా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం చేతకాదా అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తన తొలి సంతకం.. ఉద్యోగ ప్రకటనల పైనే ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. నిరు ద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామని భరోసా కల్పించారు. -
యుద్ధం కాదు.. కేసీఆర్ పతనం మొదలైంది
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై యుద్ధం ఆరం భంకాదు.. సీఎం కేసీఆర్ పతనం ప్రారం భమైందని బీజేపీ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎవరిపై యుద్ధం చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. హుజూరాబాద్లో తన గెలుపును జీర్ణించుకోలేక దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ఈ ఫలితం తర్వాత టీఆర్ఎస్లోచాలా మంది పునరాలోచ నలో పడ్డారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్కు, టీఆర్ఎస్కు, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణలో ఇక భవిష్యత్ లేదన్నారు. గత 45 రోజులుగా ధాన్యం రోడ్ల మీదే ఉన్నా రైతులు వరి కుప్పలపైనే ప్రాణాలు వదులుతున్నా సీఎం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తనకే అన్నీ తెలుసనే అహం కారంతో చేస్తున్న పనులకు కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అధునాతన సాంకే తికతతో రైస్ మిల్లుల ఏర్పాటుకు సహకరి స్తామని సీఎం గతంలో చెప్పారే తప్ప దానిని అమలు చేయలేదని, సీఎంకు ముందుచూపు లేకపోవడంవల్లే ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. కేసీఆర్ తన కీర్తి గురించి తప్ప ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కరోనా వల్ల జరిగిన ఆర్థిక నష్టం కంటే కేసీఆర్ అనాలోచిత చర్యల వల్ల జరిగిందే ఎక్కువన్నారు. -
కొట్టుకున్నట్లు నటిస్తూ రైతులను చంపుతున్నారు..
రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్ యాక్టింగ్ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టుకున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్ను ఆందోళనకారులు ముట్టడించారు. సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వాలు పోటీ పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నా యని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్ యాక్టింగ్ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టు కున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరే ట్ను ముట్టడించారు. అక్కడ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ధాన్యం కొను గోలు చేయాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్ గార్డెన్స్ నుంచి బషీర్బాగ్ చౌరస్తాలోని కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 4 గంటల ధర్నా అనంతరం కాంగ్రెస్ నేతలు వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, మండలి సభ్యులు టీ జీవన్రెడ్డి, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహా, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, వీ హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ను కేంద్రమే కాపాడుతోంది సహారా కుంభకోణంలో జైలుకు వెళ్లకుండా కేసీఆర్ను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ‘ధాన్యం కొనుగోలు చేయమని రైతులు అడుగుతున్నారు. రైతులకు మేలు చేయాలంటే వెళ్లి కల్లాల్లో ఉన్న ధాన్యం చూడాలి. ఏసీలు, టెంట్లు వేసుకొని కూర్చుంటే పోరాటం ఎలా అవుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తే రైతులుకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో తిరిగి ఏం ఉద్ధరిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో కేసీఆర్ కార్యాచరణ ఏంటో ప్రకటించాలి. జంతర్మంతర్ వద్దకు ధర్నా చేయగలవా, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపగలవా?’ అని రేవంత్ అన్నారు. చైనా, పాకిస్తాన్ కొంటాయా: భట్టి రైతులు పండించిన పంటను రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాలు కాకుంటే.. చైనా, శ్రీలంక, పాకిస్తాన్, బర్మా దేశాలు కొంటాయా అని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క వ్యాఖ్యానించారు. ‘కేంద్ర సర్కార్ తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయని కేసీఆర్.. ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. కేసీఆర్కు పాలన చేతగాకుంటే దిగిపో వాలి. రోడ్లపై దీక్షలు, ధర్నాలు చేసిన ప్రభుత్వాల ను ఇప్పటివరకు చూడలేదు. కేసీఆర్ పాలనలో రైతుల గుండెలు ఆగిపోతున్నాయి’ అని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నాయని, డ్రామాలు ఆపి వడ్లు కొనాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
ఉప్పెనలా వస్తం..కేంద్రం దిగొచ్చేదాకా పోరు:: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కుటిలనీతి, దుర్మార్గ విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించా రు. తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయా లని కేంద్రాన్ని పదేపదే అడుగుతున్నా పట్టించుకో వడం లేదని.. పైగా ఇబ్బందులు సృష్టిస్తోందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతి రేక విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్తో మహాధర్నా చేపట్టామని.. కేంద్రంపై యుద్ధానికి ఇది ఆరంభమేనని చెప్పారు. హక్కులను కాపాడ టం కోసం ఉత్తర భారత రైతులను కలుపుకొంటామని.. కేంద్రం ప్రభుత్వం దిగివచ్చేదాకా ఉప్పెనలా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 100% ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద గురువారం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలపై కేసీఆర్ తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. రైతులను వరి పంట వేయమంటారా, వద్దంటారా స్పష్టంగా చెప్పాలని.. లేకపోతే తప్పు చేశామని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. పంట కొనుగోలు అంశం రైతుల జీవన్మరణ సమస్య అని స్పష్టం చేశారు. ధర్నాలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. రైతుల బాధను దేశానికి తెలిపేందుకే.. ‘తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలతో కేంద్రం మభ్యపెడుతోంది. తెలంగాణలో పండించే ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఆ తర్వాత సీఎం హోదాలో నేను కేంద్రాన్ని కోరి 50 రోజులు కావస్తున్నా ఉలుకూపలుకూ లేదు. వరిసాగు వద్దని రైతులకు చెప్పడం ఇష్టం లేకున్నా.. ఒకేసారి ప్రత్యామ్నాయ పంటలకు మారాలంటే కష్టమే అయినా.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వరి వద్దని చెప్తున్నాం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందించకున్నా.. రాష్ట్ర బీజేపీ వరి వేయండి అని రైతులకు చెప్తూ మభ్యపెడుతోంది. మన రైతుల బాధ దేశానికి, ప్రపంచానికి తెలియచేసేందుకే మహాధర్నా చేపట్టాం. ఇదేకాదు భారత రైతాంగ సమస్యలపై పోరాటానికి టీఆర్ఎస్ నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోతుంది. కొనుగోలు బాధ్యత కేంద్రానిదే.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపర్చుకుని పంటలు పండిస్తు న్నాం. దేశంలో పంటలను కొనుగోలు చేసి, నిల్వచేసే బాధ్యత కేంద్రానిదే. దేశంలో ఆహార కొరతను తీర్చేలా ధాన్యం కొనుగోళ్లకోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకోవాలి. కానీ వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తూ ప్రైవేటుపరం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమ లు చేయకపోయినా.. కొత్త రాష్ట్రం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలని అనుకున్నాం. వరి వేయాలని కేంద్రం చెప్తే.. విత్తనాలు, ఎరువులు అన్నీ ఇచ్చి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయించాం. గత యాసంగికి సంబంధించి 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇంకా తీసుకోవాల్సి ఉంది. మీరు తీసుకోకపోతే మా రైతుల చుట్టూ దిష్టితీసి ఆ బియ్యాన్ని మీ బీజేపీ ఆఫీసు ముందు కుమ్మరిస్తం. అబద్ధపు ప్రచారాలతో: బీజేపీ.. అడ్డగోలు అబద్ధాలతో, వాట్సా ప్, ఫేస్బుక్లో వితండ వాదాలతో వ్యక్తుల కేరక్టర్ దెబ్బతీసే ప్రచారాలు చేస్తూ పాలించాలని అనుకుంటోంది. సీఎం, మంత్రి పదవుల కోసం మేం భయపడే రకం కాదు. ఉద్యమ సమయం లో పదవులను చిత్తు కాగితాల్లా భావించి.. రాజీనామా చేశాం. బీజేపీది రాజకీయ డ్రామా.. ఉత్తర భారత్ రైతు ఆందో ళనలను అణిచివేస్తూ కార్లు ఎక్కించి చంపుతున్నవారు.. ఇక్కడ మన కల్లాల దగ్గర రాజకీయ డ్రామా ఆడుతున్నారు. ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబ ల్ హంగర్ ఇండెక్స్) సర్వే లో 116 దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కంటే అట్టడుగున భారత్ 101వ స్థానంలో ఉండటం సిగ్గుచేటు. దేశంలో 12 కోట్ల రైతులు, 40 కోట్ల ఎకరాల భూమి, జీవనదులు, అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నరు. బంగారు పంటలు పండే అవకాశం ఉంది. దేశ జనాభాలో సగం మందికి ఉపాధినిచ్చే వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదు. చిప్పపట్టుకుని, బిచ్చమెత్తుకుని బతిమిలాడితే మన సమస్యలకు పరిష్కారం దొరకదు. దేశానికి అన్నం పెడతామంటే ఇంత అరాచకమా? దేశం మూగబోతోంది. మాట్లాడితే కేసులు పెడతాం అంటున్నారు. కేసీఆర్ అలా భయపడే వాడే అయితే తెలంగాణ వచ్చేదే కాదు. మేం పదవుల కోసం, కేసుల కోసం భయపడేవాళ్లం కాదు. – కేసీఆర్ రైతాంగ ఉద్యమం రగలాలి దేశంలో కరెంటు, నీళ్లు ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడాలి. మరో పోరాటానికి సిద్ధం కావాలి. దేశంలో కచ్చితంగా ఉద్యమ జెండా ఎగసి.. రైతాంగ ఉద్యమం రగలాలి. దానికి తెలంగాణ నాయకత్వం వహించాలి. రాజకీయం పక్కన పెడితే రణంలో టీఆర్ఎస్ను మించిన పార్టీ లేదు. దేనికీ భయపడకుండా ముందుకు సాగుతాం. గ్రామాల్లో చావు డప్పు కొడతాం. చెట్లకు రైతుల శవాలు వేలాడాలా? ఇది రాజకీయ సమస్య కాదు.. రైతుల జీవన్మరణ సమస్య. ధాన్యం కొనుగోలు చేయక పోతే.. రైతులు విషం తాగాలా? చెట్లకు రైతుల శవాలు వేలాడాలా? మీ దుర్మార్గ చట్టాల కింద ప్రజలు నలిగి నాశనమవ్వాలా? ప్రధానికి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. యాసంగిలో వరి పంట వేయాలా వద్దా చెప్పండి. లేదంటే మా చావు మేము చస్తాం. రెండు రోజులు వేచి చూసి యుద్ధాన్ని ప్రజ్వరిల్లజేస్తాం. ఎందాకైనా తీసుకెళ్తాం. రాజకీయ కొట్లాటను పక్కనపెట్టి ప్రజల బతుకుదెరువు గురించి కేంద్రం సమాధానం చెప్పాలి. విద్వేషాలతో చిచ్చుపెడ్తున్నరు.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. అక్కర ఉన్నప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చుపెట్టి సెంటిమెంటును వాడుకునే రాజకీయాలకు కాలం చెల్లింది. మీ సర్జికల్ స్రైక్లు, మీరు సరిహద్దులో ఆడే నాటకాలు, మీరు చేసే మోసాలు మొత్తం బట్టబయలయ్యాయి. ఈ దేశానికి మంచి చేసే ఉద్దేశం, ఆ సంస్కారం బీజేపీకి లేదు. ఎన్నికలొస్తే భైంసా, పాకిస్తాన్ వంటి సెంటిమెంట్తో రాజకీయం చేస్తూ, అందులో తెలంగాణను కూడా భాగస్వామిని చేస్తోంది. ఈ దేశం ఎటుపోతుందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ రోజుతో వంద మందితో ప్రారంభమైన పోరాటాన్ని దేశవ్యాప్తం చేస్తాం. మోదీ విధానాల వల్లే ఇలా.. తెలంగాణ పోరాటాలు, విప్లవాల గడ్డ. పోరాటంతోనే పరాయి పాలన విషకౌగిలి నుంచి బయటపడింది. ఇప్పుడు కూడా ఎలా రక్షించుకోవాలో తెలంగాణకు తెలుసు. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైతే ఢిల్లీ యాత్ర చేస్తాం. ఇటీవల నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందా అంటూ వ్యాఖ్యానించారు. 2006లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ 51 గంటల ధర్నాకు కూర్చున్నారు. మోదీ విధానాల వల్లే సీఎంలు, మంత్రులు ధర్నాలో కూర్చునే పరిస్థితి వచ్చింది.’’ -
ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా
-
దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న మంట ఇప్పట్లో చల్లారేట్లు లేదు. ధాన్యాన్ని కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. చదవండి: ఇందిరాపార్క్ ధర్నా ముగిశాక రాజ్భవన్కు టీఆర్ఎస్ పాదయాత్ర? ఈ మేరకు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో పండించే వడ్లను కొంటరా.. కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గోస తెలంగాణలోనే కాదు..దేశం మొత్తం ఉందన్నారు.. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దేవా చేశారు. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం ఆ పార్టీలేనని విమర్శించారు. వాస్తవాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు మాట్లాడుతోందని మండిపడ్డారు. హంగర్ ఇండెక్స్లో భారత దేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ దీన స్థితిలో ఉందన్నారు. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు. ‘ఐటీఆర్ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు.. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలే. చాలా ఓపికతో ఉన్నాం. ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారు. నిన్న కూడా ప్రధానికి లేఖ రాసిన. వడ్లు కొంటరా, కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదు. రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దని చెప్పిన. పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తాం. అనేక సమస్యలను పెండింగ్లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు. సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్తాన్ అని విద్వేషాలు రెచ్చగొడుతోంది బీజేపీ. కరెంట్ కోసం తెలంగాణ 30ఏళ్లు ఏడ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్ సమస్య తీరింది. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి’ అని సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. -
టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వరి కొనుగోలుపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరి కొనుగోలుపై కేంద్రం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చదవండి: కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్ అయితే కేసీఆర్తో సహా మంత్రులంతా స్టేజి పైన కూర్చొని ఉండగా కేవలం కేటీఆర్ ఒక్కరే స్టేజి కింద కార్యకర్తలు ముందు కూర్చున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులను అంకరించుకొని.. భుజంపై నాగలి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇదే తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో ఇది నాలుగోది. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా నిరసనలో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపవడంపై టీఆర్ఎస్ రాష్ట్ర బంద్ను నిర్వహించింది. అనంతరం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్లో పాల్గొంది. ధాన్యం సేకరణ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టింది. తాజాగా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఈ నిరసనలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ మహాధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విపక్షాల సమరశంఖం
-
ఇందిరాపార్క్ వద్ద ఎమ్ఎస్వోల మహా ధర్నా
-
ఓటుతోనే కూల్చేస్తాం
టీడీపీ సర్కారు అనుసరిస్తున్న బీసీల అణచివేత వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేసి సబ్ప్లాన్ నిధులను సైతం దారి మళ్లిస్తోందని కన్నెర్ర చేశారు. గత ఎన్నికల సమయంలో వందకుపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏఒక్కటీ అమలు చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం పట్ల మండిపడ్డారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబుకు గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. తమ ఓటుతో గద్దెనెక్కిన టీడీపీ సర్కారుకు వచ్చే ఎన్నికల్లోఅదే ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.బీసీ వర్గాలకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు భారీ స్పందన వ్యక్తమైంది. అన్ని జిల్లాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. కుల వృత్తులతో నిరసన తెలిపారు. రాష్ట్రమంతా తన కుటుంబంగా భావించే వైఎస్ జగన్ను అధికారంలోకి తెస్తామని ప్రకటించారు. సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీసీ వర్గాలు మండిపడ్డాయి. చంద్రబాబు సర్కారు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. వారికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఏటా 10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తామన్న హామీని విస్మరించింది. విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చి, మోసం చేసింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పింది. బీసీలకు కొత్తగా ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న మాటనూ పక్కన పెట్టింది. నేతన్నలకు ఉచితంగా ఇళ్లు, మరమగ్గాలు ఇస్తామంటూ మాయ మాటలు చెప్పింది. మేకలు, గొర్రెల విక్రయ శాలలు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా వీటి పెంపకందార్లకు మేలు కలుగుతుందని ఆశలు కల్పించింది. కుల వృత్తి దారుల కోసం అన్ని మండల కేంద్రాల్లో అత్యాధునిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఇవే కాదు.. ఇలాంటివి అనేక హామీలిచ్చి, ఓట్లేయించుకొని నాలుగున్నరేళ్లు మాయ మాటలతో గడిపేసింది. ఒక్క హామీ నెరవేర్చలేదు. దీంతో బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాయి. ఇందులో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి నిరసన దీక్షలు, ర్యాలీలు నిర్వహించాయి. వంచనపై ప్రజాగ్రహం టీడీపీ గద్దెనెక్కాక బీసీలను వంచించడానికి నిరసనగా గుంటూరు, చిలకలూరిపేటల్లో వైఎస్సార్ సీపీ పిలుపుమేరకు ధర్నాలు చేపట్టి ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ బీసీ సంఘ అధ్యక్షుడు కూరాకుల కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు చంద్రగిరి ఏసురత్నం, ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి సుచరిత, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్వో శ్రీలతకు వినతిపత్రం సమర్పించారు. చిలకలూరిపేటలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళ రేవతి, వైఎస్సార్సీపీ నేత నిమ్మకాయల చినరాజనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కర్నూలు, నంద్యాలలో కదం తొక్కిన బీసీలు బీసీల ద్రోహి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బి.వై.రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో కర్నూలుతోపాటు నంద్యాలలో బీసీ మహార్యాలీ నిర్వహించారు. కర్నూలులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ బీసీల చేతిలో చంద్రబాబుకు చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో భారీ ప్రదర్శన గత ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ బీసీ సెల్ ఆధర్వంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆందోళన నిర్వహించిన అనంతరం జేసీ–2 మార్కండేయులుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ నెరవేర్చలేదని విమర్శించారు. విశాఖలో హోరెత్తిన బీసీ ర్యాలీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంలో టీడీపీ సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ బీసీ విభాగం విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించింది. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, నగర కో ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల కులవృత్తులను ప్రతిబింబించేలా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మళ్ల, తైనాల తదితరులు మాట్లాడుతూ ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గత నాలుగేళ్లలో కనీసం పదివేల కోట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీసీలంటే బాబుకు చిన్నచూపు బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు అని రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సామాజిక ర్యాలీకి హాజరైన ఎమ్మెల్యే గడికోట మాట్లాడుతూ బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అధ్యయన కమిటీని నియమించారని చెప్పారు. జస్టిస్ ఈశ్వరయ్య లేఖ ద్వారా బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకన భావం ఉందో బహిర్గతమైందన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును గద్దె దించేందుకు బీసీలు సమాయత్తం కావాలన్నారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ బీసీలను చిన్నచూపు చూడటం బాబుకు అలవాటన్నారు. బీసీలు రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ర్యాలీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మెయిన్రోడ్డు, పాతబస్టాండు, ఆర్ఎస్రోడ్డు మీదుగా సబ్కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం ఆర్డీవో కోదండరామిరెడ్డికి వినతిపత్రాన్ని అందచేశారు. ‘అనంత’లో నిరసన ర్యాలీ.. టీడీపీ సర్కారు బీసీలను మోసగించటానికి నిరసనగా అనంతపురం, హిందూపురంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కిష్టప్ప, రాగే పరుశురాం, కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషశ్రీచరణ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడి ర్యాలీకి సంఘీభావం తెలిపారు. హిందూపురంలో ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ హిందూపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘని తదితరులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు బీసీల ద్రోహి అని మండిపడ్డారు. త్వరలో బీసీ గర్జన... వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణ, రజక, వడ్డెర కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం బీసీల పట్ల వ్యవహరిస్తున్న మోసపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవినాష్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర పూర్తి కాగానే బీసీ గర్జన నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. బీసీలంతా వైఎస్ జగన్ను ఆశీర్వదించి పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నట్లే చంద్రబాబు బీసీలకు కూడా వెన్నుపోటు పొడిచారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్బాషా, మైదుకూరు శాసనసభ్యుడు ఎస్. రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం, పార్వతీపురంలో ర్యాలీలు.. బీసీలను అణచివేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయనగరం, పార్వతీపురంలో నిర్వహించిన నిరసన ర్యాలీల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బీసీలు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల ద్వారా సమాధానం చెప్పాలని పార్టీ నేతలు సూచించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై విజయనగరం డీఆర్వో జె.వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో అరకు పార్లమెంటరీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సాలూరు, పార్వతీపుం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పరిధిలోని బీసీ నాయకులు, నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సాలూరు, పాలకొండ ఎమ్మెల్యేలు పీడికరాజన్నదొర, వి.కళావతి ఇతర నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో కుల వృత్తులతో నిరసన.. ప్రభుత్వం బీసీలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ చిత్తూరు కలెక్టరేట్, తిరుపతిలోని సబ్కలెక్టరేట్ ఎదురుగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తిరుపతిలో బీసీ కుల వృత్తులను ప్రదర్శించారు. అన్నమయ్య సర్కిల్ నుంచి సబ్కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డబ్బులతో గెలవాలనుకునే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి... ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బీసీల ప్రయోజనాలను చంద్రబాబు హరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అ«ధ్యక్షతన విజయవాడలోని ధర్నా చౌక్లో వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలును మరచిన చంద్రబాబు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే భావిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు తీర్చకపోగా కొత్తవి సృష్టించేలా చంద్రబాబు పాలన తయారైందని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ప్రత్యక్షంగా గమనించిన ఇద్దరు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు చెబుతున్న విషయాలు వింటుంటే రాష్ట్రంలో ఏమేరకు అవినీతి జరిగిందో అర్ధమవుతోందన్నారు. రాష్ట్రమంతా తన కుటుంబంగా భావించే వైఎస్ జగన్కు అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటాయాన్నారు. అణగారిన ప్రజల అభివృద్థి పట్ల వైఎస్ జగన్కు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అ«ధ్యక్షుడు కసగోని దుర్గారావు గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోను రాజేష్, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. అనంతరం నేతలు ర్యాలీగా విజయవాడ సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందచేశారు. గత ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చి నెరవేర్చని వాటిలో ప్రధానమైనవి.. ►ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ►విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు 33 శాతానికి పెంపు.. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ►బీసీలకు కొత్తగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ► చేనేత కార్మికులకు రూ.1.5 లక్షలతో ఉచితంగా ఇళ్లు, మగ్గం ►రైతుబజార్ల తరహాలో మేకలు, గొర్రెల విక్రయ బజార్ల ఏర్పాటు ►అన్ని మండల కేంద్రాల్లో కుల ►వృత్తిదారులకు ఆధునిక అభివృద్ధి కేంద్రాలు ► బీసీ కులాలను ఒక గ్రూపునుంచి మరో గ్రూపులోకి మారుస్తాం -
27న విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఈనెల 27వ తేదీన మహా ధర్నా చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ (టీఎస్పీఈ) జేఏసీ గురువారం ప్రకటించింది. 2018 పీఆర్సీ అమలు, ఉద్యోగులు అందరికీ ఉచిత ఆరోగ్య పథకం సహా వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాలో టీఎస్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల నుంచి ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. -
కడప ఉక్కు-ఏపీ హక్కు
-
ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్సీపీ మహధర్నా
-
రాజంపేటలో ఉక్కు మహాధర్నా ప్రారంభం
సాక్షి, రాజంపేట : కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదం జిల్లాలో హోరెత్తుతోంది. గ్రామాల్లో ప్రచార సభలు మొదలుకొని పార్టీ సమావేశం , సంతకాల సేకరణ, రిలే దీక్షలతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాజంపేట కేంద్రంగా వైఎస్సార్సీపీ నేతలు పోరుబాట పట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలంటూ రాజంపేట కూడళ్లలో వైఎస్సార్పీపీ నేతలు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన మహధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటూ నినదించారు. మాజీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, ఎమ్మల్సీ గోపాల్ రెడ్డి, రాజంపేల పార్లమెంట్ అద్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, పార్టీ ఇతర నాయకులు సమన్వయ కర్తలు మహాధర్నాలో పాల్గొన్నారు. -
కడప స్టీల్ ప్లాంట్ను అడ్డుకుంది చంద్రబాబే!
సాక్షి, కడప: విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ.. కడపలో ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కడపలో స్టీల్ ప్లాంట్ సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కడపలో వెంటనే స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ శనివారం నగరంలో మహా ధర్నాను చేపట్టింది. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్ సీపీ నేతలు మహాధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, టీడీపీ, బీజేపీ నేతల మోసపూరిత వైఖరిపై పార్టీ నేతలు మండిపడ్డారు. కడప్ స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలు చేయడంలో అర్థమేమిటని నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ తలపెట్టిన స్టీల్ ప్లాంట్ను అడ్డుకుంది చంద్రబాబేనని.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఈ మహాధర్నాకు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. కడప స్టీల్ ప్లాంట్ సాధన పోరాటంలో భాగంగా జూన్ 23 నుంచి 26 వరకు కడపలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 24న (జూన్) బద్వేలులో మహాధర్నా, రాజాంపేటలో 25న మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని చెప్పారు. జూన్ 27న జాతీయ రహదారుల దిగ్బంధానికి, జూన్ 29న రాష్ట్ర బంద్కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. గత నాలుగేళ్లుగా కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదంతో ఉద్యమం జోరుగా నడుస్తున్న విషయం తెలిసిందే. కడప ఉక్కు సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని నేతలు చెప్పారు. ఈ మహాధర్నాలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, బద్వేలు సమన్వయకర్త వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు ప్రభుత్వ వైఫల్యాలపై మహాధర్నా
సాక్షి, కర్నూలు : సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వ వైఫల్యాలపై మే 16 వతేదీన కర్నూలు కలెక్టరేట్ ముందు మహాధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మే 14 వ తేదీన 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా ఈ నెల 14, 15 తేదీల్లో మండలాల వారిగా సంఘీభావ పాదయాత్రలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. సంఘీభావ పాదయాత్రలో గత నాలుగేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అంతేకాక టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. మహాధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం అందజేయనున్నారు. -
వైఎస్సార్సీపీ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా మద్ధతు
-
చంద్రబాబు డైరెక్షన్లోనే ధర్నాను అడ్డుకున్నారు
-
'ప్రత్యేక హోదాపై మా ఉద్యమం ఆగదు'
-
వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు : మధు
-
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
-
ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టు..
-
ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్ట్.. ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం అత్యంత శాంతియుతంగా ఢిల్లీలోని సంసద్మార్గ్లో మహాధర్నా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు నిర్బంధకాండను ప్రయోగించారు. తమ ఆందోళనలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా పార్లమెంటుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకొని.. బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. ఈ సందర్భంగా నేతలను తరలిస్తున్న పోలీసులను అడ్డుకునేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించడంతో కొంతసేపు సంసద్మార్గ్లో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, మిథున్రెడ్డి తదితరులను అరెస్టు చేసి.. వాహనంలో పోలీసు స్టేషన్కు తరలించారు. అత్యంత శాంతియుతంగా ప్రత్యేక హోదా కోసం ఆందోళన నిర్వహిస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాజీనామాలకు సిద్ధపడ్డామని, అలాంటిది అరెస్టులకు భయపడతామా? అని ఎంపీలు ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుకు తాము ఢిల్లీకి వచ్చామని, అరెస్టులు, ఆంక్షలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని వైఎస్ఆర్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. తమ నేతల అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నాయకులు భగ్గుమన్నారు. ‘ఢిల్లీ పెద్దలను ఎదిరించడం మాకు కొత్త కాదు. గతంలో చాలాసార్లు మేం ఢిల్లీ పెద్దలను ఎదిరించాం, గతంలో ఏం చేసిందో, ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలి’ అని వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ‘టీడీపీ-బీజేపీ కుట్రలతో ఏపీకి అన్యాయం జరుగుతోంది. అరెస్టులకు మేం భయపడం. మరింత ఉధృతంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం’ అని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, విశ్వరూప్ తెలిపారు. -
కుంభకర్ణుడు ఆరునెలలే.. కానీ చంద్రబాబు!
-
దేశంలోనే అవినీతిపరుడు చంద్రబాబు!
-
బాబును జైల్లో పెట్టాలి : ఎమ్మెల్యే సురేష్
-
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు లొంగిపోయారు
-
రాష్ట్రానికి బాబు వెన్నుపోటు పొడిచారు
-
వైఎస్ఆర్సీపీ మహాధర్నాకు నేతల సంఘీభావం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాకు పలువురు ఇతర పార్టీల నేతలు, ప్రజాసంఘాల కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆప్ నేత రామారావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు సదాశివారెడ్డి, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తదితరులు సంసద్మార్గ్లో కొనసాగుతున్న మహాధర్నాలో పాల్గొని.. వైఎస్ఆర్సీపీ పోరాటానికి అండగా నిలబడారు. అనంతరం సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు కూడా మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రత్యేక హోదా మన హక్కు అని, ప్రత్యేక హోదాను సాధించే పోరాటంలో అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. అందరూ కలిసి పోరాడితే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని అన్నారు. ఏపీకి హోదా రాకపోవడానికి మొదట ద్రోహి కేంద్ర ప్రభుత్వం, రెండో ద్రోహి రాష్ట్ర ప్రభుత్వమని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. ఈ రెండు ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెప్పాలని మేధావుల సంఘం నేత చలసాని శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. -
టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి
-
చంద్రబాబు నమ్మించి మోసం చేశారు
-
ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్
-
ఎన్నికలు రావడంతో బాబు మాట మార్చారు
-
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్సీపీ మహాధర్నా
-
ప్రతి ఒక్కరినీ చైతన్యవంతుల్ని చేసింది వైఎస్ జగనే!
-
బాబు మాదారిలోకొచ్చారు, అభినందనలు..
సాక్షి, న్యూఢిల్లీ : హోదా సాధన కోసం ఢిల్లీ హోరెత్తింది. ఐదు కోట్ల ఆంధ్రుల న్యాయమైన హక్కు ప్రత్యేక హోదా.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు హోదా ఇవ్వాల్సిందేనన్న నినాదాలు దేశ రాజధాని ఢిల్లీలో మార్మోగాయి. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని సంసద్మార్గ్లో చేపట్టిన మహాధర్నా ఉధృతంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ఆవేదనను యావత్ భారతావనికి వినిపించేలా వైఎస్ఆర్సీపీ నేతలు గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటివరకు సాగించిన సుదీర్ఘగా పోరాటాన్ని గుర్తుచేసిన నేతలు.. ఇప్పుటికైనా కేంద్రం స్పందించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోదా కోసం పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాడుతారని, ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడతామని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే.. తమ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. సంసద్మార్గ్లో కొనసాగిన ధర్నాలో నాయకులు ఏమన్నారంటే.. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేక హోదాను చేర్చడం సంతోషకరమని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు చంద్రబాబు తమ దారిలోకి వచ్చినందుకు అభినందనలు అని అన్నారు. హోదా కంటే ప్యాకేజీనే ముద్దని ఇన్నాళ్లు ప్రజలను మభ్యపెట్టినందుకు ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ధర్మాన డిమాండ్ చేశారు. దొంగ పేర్లతో నిధులను చంద్రబాబు దోచుకుంటున్నారని, అందుకే కేంద్రాన్ని నిలదీసే ధైర్యం చేయలేకపోతున్నారని విమర్శించారు. విభజన హామీలు అమలు కావాలంటే వైఎస్ జగనే సరైన నాయకుడని, ఆయన నాయకత్వంలో హోదాను సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మోదీని, బాబును ప్రజలు క్షమించరు! ‘పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇది ఆంధ్రుల హక్కు. హోదాతోపాటు ఏపీకి అనేక హామీలిచ్చారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం చాలా అమలైనట్టు చెప్తున్నారు. మోదీ, చంద్రబాబు ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు. వాళ్లిద్దరినీ ఏపీ ప్రజలు క్షమించరు. హోదా కోసం పార్లమెంటులో తీవ్ర పోరాటం చేస్తాం. ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడతాం. అప్పటికీ దిగిరాకపోతే ఏప్రిల 6న రాజీనామాలు చేస్తాం. మాకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలు చంద్రబాబుకు చాలాసార్లు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి జగన్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. కులం, మతం చూడని మహానాయకుడు వైఎస్ఆర్. తండ్రి బాటలోనే తనయుడూ నడుస్తాడనే నమ్మకం నాకుంది. వైఎస్ జగన్ను ఆదరించాలని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మెజారిటీ ఎంపీ స్థానాలు మనం గెలుచుకుంటే.. హోదాను సాధించడం అసాధ్యం కానేకాదు’ అని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి స్పష్టం చేశారు. కుంభకర్ణుడు ఆరునెలలే.. కానీ చంద్రబాబు! ‘కుంభకర్ణుడు ఆరునెలలు మాత్రమే నిద్రపోతాడు. కానీ చంద్రబాబు గత నాలుగేళ్లుగా నిద్రపోతూనే ఉన్నారు. నాలుగేళ్లలో లోకేశ్కు రాష్ట్రంలో తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదు. హోదా వస్తే లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికైనా చంద్రబాబు నిద్రమత్తు నుంచి బయటకు రావాలి’అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతుంటే.. చంద్రబాబు ఎమ్మెల్యేలు కొనే పనిలో ఉన్నారు. ప్రభుత్వ నిధుల్లో వాటాలను సమానంగా పంచుకోవాలని చంద్రబాబే చెప్పారని మంత్రులు అంటున్నారు’ అని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు అన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి: ఎంపీ వరప్రసాద్ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నారని ఎంపీ వరప్రసాద్ అన్నారు. చంద్రబాబు మాత్రం కేసుల భయంతో ప్రత్యేకహోదా విషయంలో రాజీపడుతున్నారని, నాలుగేళ్లలో ఏనాడు హోదా గురించి మాట్లడలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణం అని మండిపడ్డారు. కమీషన్లకోసం పోలవరం పనులను దక్కించుకున్నారని విమర్శించారు. ఏప్రిల్ 5లోపు ప్రత్యేకహోదాపై కేంద్రం దిగిరాకుంటే 6న ఎంపీలంతా రాజీనామా చేసి తీరుతామన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం ఏంపీలు కూడా తమతో కలిసి పోరాడితే కేంద్రం దిగొస్తుందన్నారు. తమతో కలిసి టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అవినీతిపరుడు చంద్రబాబు! ‘దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు. అందుకే ఏపీ ప్రయోనాలను ఆయన తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుంది. చంద్రబాబు సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి’ అని వైఎస్ఆర్సీపీ మైనారిటీ నేత రెహ్మాన్ మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు లొంగిపోయారు ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయారు. కేంద్రానికి లొంగకపోతే జైలుకు వెళాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారు. అందుకే ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారు. ఏపీ ప్రజల హక్కులను తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు లేదు. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పేందుకు ఢిల్లీకి వచ్చాం’ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ‘ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్నది వైఎస్ జగనే. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటే చంద్రబాబు ఏం మాట్లాడలేదు. చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి’ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ప్రతి ఒక్కరినీ చైతన్యవంతుల్ని చేసింది వైఎస్ జగనే! ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులను చేసింది వైఎస్ జగన్ ఒక్కరేనని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఢిల్లీలోని సంసద్మార్గ్లో వైఎస్ఆర్సీపీ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పుతున్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమంపై వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో మాయ చేసే స్వభావం చంద్రబాబుదన్నారు. ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. చంద్రబాబులా మోకరిల్లడం వైఎస్ జగన్కు చేతకాదని, ప్రజల సంక్షేమం కోసం ఢిల్లీ నడివీధుల్లో ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. విభజన హామీలపై తమ ఎంపీలు పోరాడుతూనే ఉంటారని చెప్పారు. ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిండర్ వైఎస్ జగన్ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా యువభేరీలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. స్వలాభం కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పవాణి మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన ఒ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవనీ కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి సైతం సిద్ధమయ్యారని, వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. బాబును జైల్లో పెట్టాలి : ఎమ్మెల్యే సురేష్ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాపై ఉద్యమిస్తే జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరించారని, కానీ ఇప్పుడు మాట మార్చిన చంద్రబాబును ఏంచేయాలని వైస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు చేయకుండా ఉండేందుకు, ఆంధ్రప్రదేశ్కు సంజీవని లాంటి ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్ఆర్పీసీకి ముఖ్యమని అందుకోసం రాజీనామాలకు వెనుకాడబోమని సురేష్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సాక్షిగా గత నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, ఇకపై కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తారని వెల్లడించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం నుంచి స్పందన రాకపోతే ఎంపీలు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా కోసం తాము కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికలు రావడంతో బాబు మాట మార్చారు: రాజన్న దొర ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబు ప్రత్యక హోదా కావాలంటూ మాట మార్చారని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర మండిపడ్డారు. గతంలో తమ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, కానీ ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ మాటమార్చారని విమర్శించారు. హోదాపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ఎంపీలు మాత్రం నాటకాలు ఆడుతున్నారని, రాజీనామాలకు వెనుకాడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి బాబు వెన్నుపోటు పొడిచారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే అంజాద్ బాషా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారని, అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని అన్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష పార్టీ చేస్తున్న పోరాటానికి అధికార పార్టీ నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. కలిసికట్టుగా పోరాడితే కేంద్రం కచ్చితంగా దిగొస్తుందన్నారు. -
చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు కలిసిరావాలి
-
హోదా కోసం హోరెత్తిన హస్తిన!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా సిద్ధమేనని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. హోదా కోసం పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా పోరాడుతారని, ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన తెలిపారు. అయినా, కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 6న పార్టీ ఎంపీలతా రాజీనామా చేస్తారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగబోదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని సంసద్ మార్గ్లో సోమవారం చేపట్టిన మహాధర్నా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’’ అన్న నినాదంతో చేపట్టిన ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతోపాటు శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హోదా కోసం మొదటినుంచి వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. హోదా కాకుండా కేంద్రం ప్యాకేజీ ఇస్తానంటే చంద్రబాబు ఏం మాట్లాడలేదని గుర్తుచేశారు. మహాధర్నా సందర్భంగా సంసద్మార్గ్ ప్రాంతమంతా వైఎస్సార్సీపీ శ్రేణులతో నిండిపోయింది. వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపలు.. కార్యకర్తల నినదాలతో ఆ ప్రాంతం హోరెత్తుతోంది. ‘ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా మహాధర్నాలో పాల్గొంటున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జాగృత భారత్ ఆధ్వర్యంలో మహా ధర్నా
హైదరాబాద్: కేరళలో సీపీఎం హత్యా రాజకీయాలను ఖండిస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో మహా ధర్నా జరిగింది. జాగృత భారత్, ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. మాజీ డీజీపీ దినేష్రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శ్యాంకుమార్, ఎనీవీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, బీజేపీ, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వివిధ సంఘాల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఈనెల 6న వైఎస్ జగన్ మహా ధర్నా
-
పులివెందులలో మహాధర్నా
-
'ఆయనకు డబ్బు పిచ్చి తప్ప మరేమీ లేదు'
-
ఆయనకు డబ్బు పిచ్చి తప్ప మరేమీ లేదు: వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డబ్బు పిచ్చి తప్ప రైతుల మీద అభిమానం ఏమాత్రం లేదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాగునీరు, సాగునీటి కోసం వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పులివెందుల మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టాం పులివెందులలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంది, రైతులు ఎలా బతుకుతున్నరన్న విషయాలు చంద్రబాబు దృష్టికి పోవాలి పంటలు పండని పరిస్థితి, కరువుతో అలమటిస్తున్న పరిస్థితితో ప్రజలు అవస్థలు పడుతున్నారు చిత్రావతిలో నీళ్లున్నా రైతులకు నీళ్లు వదలడం లేదు చిత్రావతి డ్యాం సామర్థ్యం 10 టీఎంసీలు. దీనికి జరిగిన కేటాయింపు కేవలం 3.2 టీఎంసీలు ఇందులోనూ మొదటి విడతగా ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 7 వరకు 1.8 టీఎంసీలు ఎంపీఆర్ నుంచి ఇచ్చారు చివరకు చిత్రావతికి చేరిన నీరు 0.67 టీఎంసీలు మాత్రమే.. అంటే 63 శాతం నష్టమైంది. రెండో విడతగా ఎంపీఆర్ నుంచి 1.4 టీఎంసీల నీళ్లు పంపారు. కానీ చేరినవి కేవలం 0.66 టీఎంసీలే, అంటే 53 శాతం నష్టాలు ఇప్పుడు చిత్రావతిలో మొత్తం 1.15 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి చిత్రావతి నుంచి సాగునీరు అందించాలంటే డ్రైవింగ్ హెడ్ కనీసం 0.9 టీఎంసీలు ఉంటే తప్ప సాధ్యం కాదు ఇప్పుడు 1.15 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి కనీసం సాగునీరు అందించే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 22 నుంచి చిత్రావతికి నీళ్లు ఇవ్వడం మానేసింది డ్రైవింగ్ హెడ్ ఉన్నప్పుడు చిత్రావతికి కాస్తోకూస్తో నీరు పంపి, పులివెందుల స్టోరేజి ట్యాంకులు, లింగాల చెరువులు నింపుకొని రైతులకు ఉపయోగపడచ్చు కానీ హడావుడిగా నీళ్లు ఇవ్వడం మానేశారు కదిరి, ధర్మవరం మునిసిపాలిటీలకు కూడా తాగడానికి 41 క్యూసెక్కుల చిత్రావతి నీళ్లు ఇస్తున్నారు ఆ తర్వాత నీళ్లు ఇచ్చినా దాన్ని డ్రైవింగ్ హెడ్ పెంచుకోడానికి పనికొస్తుంది తప్ప సాగునీరు ఇవ్వడం కుదరదు శ్రీశైలంలో నీళ్లున్నా గండికోట కట్టకపోవడంతో పులివెందులకు నీళ్లు రావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలు నెరవేరడం లేదు తుంగభద్ర నీళ్లు ఏవిధంగానూ సరిపోవు కాబట్టి కనీసం కృష్ణా నీళ్లయినా వస్తే బాగుండేది గండికోట, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తయితే నీళ్లు వచ్చేవి చంద్రబాబు పాలనలోకి వచ్చి మూడేళ్లయినా చాలీచాలని కేటాయింపులతో ప్రాజెక్టులు కడుతున్నారు గాలేరు - నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నికల ముందొచ్చి ప్రాజెక్టుల ముందు టెంకాయలు కొట్టారే తప్ప ఏనాడూ పైసలు విదల్చలేదు. గాలేరు - నగరి 13 కోట్లు, హంద్రీనీవాకు 17 కోట్లు ముష్టి వేసినట్లు ఇచ్చారు తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు హంద్రీనీవా, గాలేరు నగరిలకు తలో 4వేల కోట్లు కేటాయించి 80 శాతం పనులు పూర్తిచేశారు మిగిలిన 20 శాతం పనులు పూర్తిచేయడానికి కూడా చంద్రబాబు చాలీచాలని కేటాయింపులు చేస్తున్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు ఏమైనా వచ్చాయా.. అక్కడినుంచి ఇక్కడకు ఏమనా కెనాల్ వేశారా? పట్టిసీమ నుంచి 48 టీఎంసీలు ప్రకాశం బ్యారేజికి వచ్చాయి శ్రీశైలం నుంచి కిందకు వాడుకోవచ్చని జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా చివరకు ఏ స్థాయిలో అన్యాయాలు, మోసాలు ఉన్నయో చూద్దాం గండికోట ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని 22 గ్రామాల వాళ్లు అడుగుతుంటే, చంద్రబాబు సీఎం అయి మూడేళ్లయినా మాటలు చెబుతాడు గానీ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు గండికోటలో 26 టీఎంసీల సామర్థ్యం నిల్వచేయాల్సి ఉంది. ఇప్పటికి గాలేరు-నగరి పూర్తయి ఉంటే శ్రీశైలం నుంచి రోజుకు 22వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేవి, గండికోట కళకళలాడేది ఆ తర్వాత చిత్రావతి, పైడిపాలెం అన్నింటికీ కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు వచ్చేవి గొప్పగా నీళ్లు తెస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఎందుకని చంద్రబాబును అడుగుతున్నాం ఇచ్చామన్నట్లుగా భిక్షం వేసినట్లు కాదు.. పెండింగులో ఉన్న ప్రతి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి గండికోటకు 26 టీఎంసీల నీళ్లు తేవాలి చిత్రావతి, పైడిపాలెం లకు కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించాలి తుంగభద్ర నుంచి చిత్రావతికి మళ్లీ కేటాయిస్తూ ఆ తర్వాత పీబీసీ, లింగాల బ్రాంచి కెనాల్కు కూడా వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రైతుల దుస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఇక్కడ ధర్నా చేస్తున్నాం చంద్రబాబుకు రైతుల మీద ఏమాత్రం అభిమానం లేదు కేబినెట్ సమావేశాల్లో రైతుల భూములు ఎలా లాక్కోవాలి, పెద్దలకు ఎలా ఇవ్వాలనే చూస్తాడు రైతులకు రుణాలు ఇచ్చిన తీరును చూసి చంద్రబాబు సంతృప్తి చెందారట.. అది చూసి ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా అనిపించింది బ్యాంకులు రైతులకు 24వేల కోట్ల పంటరుణాలు, 10వేల కోట్ల టెర్మ్ లోన్స్ఇవ్వాల్సి ఉంటే మొత్తం కలిపి కేవలం 4700 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నాయి. రబీలో 9 లక్షల హెక్టార్లలో కూడా పంట వేయకపోయినా.. ఈయనకు సంతృప్తికరంగా ఉందట ఈ మనిషికి ఏం జరుగుతోందన్న అవగాహన లేదు. ఉండేదల్లా డబ్బు, డబ్బు డబ్బు అనే పిచ్చి తప్ప ఏమీలేదు ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యి, చిత్రావతికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రైతులు పడుతున్న అగచాట్లతో ఇప్పటికైనా బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా ఎంత ఎండ ఉన్నా, ధర్నా చేయకపోతే నీళ్లు రావేమోనని రైతులు వ్యక్తం చేసిన ఆవేదనను ఆయన గుర్తించాలి -
హామీలు అమలు చేయకపోతే తిరుగుబాటే
విజయవాడ(గాంధీనగర్) : బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోతిన వెంకటమహేష్ హెచ్చరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. బీసీ కులవృత్తిదారులు ధర్నాలో పాల్గొన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం వంటి కుల వృత్తుల చిహ్నాలను ధర్నాలో ప్రదర్శించారు. కుల వృత్తిదారులకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తిచాటారు. గంగిరెద్దులను ప్రదర్శించారు. వెంకటమహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆదరణ లేక బీసీల కులవృత్తులు కనుమరుగైపోయాయన్నారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్కై పార్లమెంట్లో బిల్లుపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపాలని డిమాండ్ చేశారు. బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయలేదన్నారు. ధర్నాలో బీసీ సంఘం నాయకులు తట్టి అర్జునరావు(యాదవసంఘం), పేరం శివనాగేశ్వరరావు (గౌడసంఘం), కర్రి వేణుమాధవ్ (స్వర్ణకార సంఘం), షేక్ గౌస్మొహిద్దీన్ (వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం), బాయన శేఖరరాబు (బీసీఐక్యవేదిక), కామరాజ్ హరీష్ (విద్యార్థి విభాగం), దాసరి సత్యం(బుడబుక్కల సంఘం), నాగేంద్ర (సూర్యబలిజ సంఘం), వివిధ కులవృత్తిదారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
"అనంత"లో మహాధర్నా
-
ఎండ మండుతున్నా..!
అనంతపురం టౌన్ : నడిరోడ్డు మీద వేదిక.. ఓ పక్క ఎండ మండుతోంది.. మరో పక్క అధినేత రాక ఆలస్యమైంది. అయినా ఎంతో ఓపికతో మహిళలు ఎదురుచూశారు. అలసటనేదే లేదు.. రాజన్న ముద్దుబిడ్డను చూడగానే సంతోషంతో మురిసిపోయారు. రైతు సమస్యలపై మంగళవారం ‘అనంత’ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన మహాధర్నాకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి జగన్కు జేజేలు పలికారు. • బెంగళూరు నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 10 గంటలకు బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకోగానే పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. • ఉదయం 10 గంటలకే అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వేలాదిగా జనం తరలివచ్చారు. • 11.35 గంటలకు వైఎస్ జగన్ వేదిక మీదకు వచ్చారు. • అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి రోడ్డుమీదే కూర్చుండిపోయారు. • నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జెండాలతో తరలివచ్చారు. • వేదిక ముందు కనుచూపు మేర జనం కన్పించగా.. వేదిక వెనుక భాగంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు, రైతులు ఉండిపోవాల్సి వచ్చింది. • వైఎస్ జగన్మోహన్రెడ్డి 42 నిమిషాల పాటు ప్రసంగించగా, అందరూ ఎంతో ఆసక్తిగా విన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా.. లేదా అంటూ జనంతోనే చేతులెత్తించి సమాధానం రాబట్టారు. • కరువు తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే చేసిన ఘనత చంద్రబాబుదేనని జగన్ ఎద్దేవా చేయగానే జనం కేరింతలు కొట్టారు. • ధర్నా ముగియగానే జగన్తో పాటు పార్టీ నేతలు కలెక్టర్ శశిధర్ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్లోకి వెళ్లారు. ఈ సమయంలో సిబ్బంది, జర్నలిస్టులు జగన్తో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. • చివరగా వైఎస్ జగన్ కొత్తూరు అమ్మవారి శాలకు వచ్చి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు సెల్ఫీలు దిగారు. • ఆ తర్వాత పులివెందులకు వెళ్లిపోయారు. -
మహాధర్నాకు భారీగా రానున్న రైతులు
-
రైతు మహాధర్నాకు తరలిన నాయకులు
బద్వేలు(అట్లూరు): రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించక పోవడానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కడపలో నిర్వహించిన మహాధర్నాకు శనివారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టరు వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో సుమారు 200 వాహనాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఉదయాన్నే కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల, బి.కోడూరు, గోపవరం, బద్వేలు మండలాల నాయకులు ఒక్కో మండలానికి సుమారు 30 వాహనాలలో ఆయా మండల నాయకులు ఆధ్వర్యంలో బద్వేలుకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ సమన్వయ కర్త వైఎస్సార్ సీపీ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా మహా ధర్నాకు పనులను వదులుకుని వచ్చారు. కార్యాక్రమంలో వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి శింగమల వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టరు మునెయ్య, వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శులు అందూరి రామకృష్ణారెడ్డి, కొండు శేఖర్రెడ్డి, పోరుమామిళ్ల మండలాధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్రెడ్డి, బి. కోడూరు జెడ్పీటీసీ సభ్యుడు చౌదరి రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుదర్శన్, శారదమ్మ, కాశినాయన, బ్రాహ్మణపల్లి, చిన్నకేశంపల్లి సింగిల్విండో అధ్యక్షులు రామిరెడ్డి, గుర్రంపాటి సుందరరామిరెడ్డి, వంకెల పోలిరెడ్డి, నాయకులు బిజి వేముల రామసుబ్బారెడ్డి, అంభవరం వెంకటేశ్వరరెడ్డి, శింగసాని గురుమోహన్, గోపాలస్వామి, అట్లూరు సర్పంచుల సంఘం అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, వేమలూరు సర్పంచు ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘పోడు’ పరిరక్షణకు నేడు మహా ధర్నా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: పోడు భూమిని సాగు చేసుకుంటున్న వారిపై ప్రభుత్వం దమనకాండకు దిగడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్న ధర్నాలో బీకేఎంయూ నేత నాగేంద్రనాథ్ ఓఝా, కె.నారాయణ, జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం, ప్రొ. హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. తరతరాలుగా పోడు చేసుకుని జీవిస్తున్న ఎస్టీ, ఎస్సీ, బడుగు బలహీనవర్గాల వారిని హరితహారం పేరిట ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఈ ధర్నాను చేపట్టినట్లు తెలియజేశారు. అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సిందిపోయి వారిని దౌర్జన ్యంగా ప్రభుత్వం గెంటేస్తోందని ధ్వజమెత్తారు. పోడు సాగుదారుల గ్రామాలపై అటవీ, పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తూ, పీడీ యాక్ట్ కింద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధిస్తున్నారని విమర్శించారు. -
ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా
హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మహాధర్నా నేటి సాయంత్రం 4.30 గంటలకు ముగియనుంది. -
జనగామ జిల్లా కోసం మహాధర్నా
- రోడ్డుపై భైఠాయిస్తున్న ఉద్యమ కారులు - పదికిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు జనగామ: వరంగల్ జిల్లా జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో అధికారపార్టీ నేతలతో పాటు విపక్షాల నేతలు. వ్యాపార వర్గాలు, కార్మిక, విద్యార్థివర్గాలతో పాటు పలు సంఘాలు పాల్గొన్నాయి. జిల్లా ప్రకటించాలని దాదాపు పదివేల మంది సకల జనులు భారీ ర్యాలీగా జనగామ చౌరస్తా వద్దకు వచ్చారు. క్రమ క్రమంగా పెద్ద ఎత్తున జనం రావడంతో జాతీయ రహదారిపై మూడు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు పది కిలో మీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి. మాజీ టీసీసీపీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రోడ్డుపై బైటాయించారు. జనగామను జిల్లాగా ప్రకటించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మహాధర్నా భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు దశలవారీగా పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. -
ఎమ్మెల్యే ఇంటి ముందు మహాధర్నా
వైఎస్సార్ సీపీ నాయకుడు జమ్మాన ప్రసన్న కుమార్ పార్వతీపురం: పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఇంటి ముందు ఈ నెలాఖరున మహా ధర్నాను చేపడతామని పార్వతీపురం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ...న వంబరులో పార్వతీపురం శాసనసభ్యుడు బొబ్బిలి చిరంజీవులు జంఝావతి బ్యాలన్సు పనులు పూర్తిచేసేందుకు గాను, కావలసిన రూ.39 కోట్లు మంజూరుకు ప్రభుత్వాన్ని ఒప్పించానని, ఆ నిధులు రూ.39కోట్లు ఈ బడ్జెట్ నుంచి విడుదలవుతాయని పత్రికల్లో ఊదరగొట్టారని గుర్తుచేశారు. 2016-17 సంవత్సరం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.3 కోట్ల రూపాయలను మాత్రమే జంఝావతి ప్రాజెక్ట్కు మంజూరు చేసిందన్నారు. ఈ రూ.మూడు కోట్లతో ప్రాజెక్టును ఎంతకాలానికి పూర్తిచేస్తారో తెలుగుదేశం నాయకులే చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. సుమారు 24వేల ఎకరాలు ఈ జంఝావతి కాలువ ద్వారా సాగులోకి రావలసి వుండగా, అరకొర మంజూరులో రైతులకు తీవ్రమైన అన్యాయము చేశారన్నారు. రైతులకు జరిగిన అన్యాయానికి, నిధుల మంజూరు విషయంలో జరిగిన అలసత్వానికి నిరసనగా ఈనెలాఖరులో ఎమ్మెల్యే ఇంటిముందు నియోజకవర్గ రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామన్నారు. సమావేశంలో బోను రామినాయుడు, చుక్క లక్ష్మునాయుడు, మడక విశ్వనాథం, తీళ్ల శివున్నాయుడు, బడే రామారావు, గండి శంకరరావు, శ్రీరాములునాయుడు యాళ్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
'ఇది ప్రజాస్వామ్య ఖూనీ'
బెలుగుప్ప: అనంతపురం జిల్లాలోని బెలుగుప్పలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వేధింపులకు నిరసనగా నేడు బెలుగుప్పలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మహా ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ధర్నాను భగ్నం చేయాలని టీడీపీ, పోలీసులు ఎత్తుగడ వేశారు. పయ్యావుల ఆదేశాలతో టీడీపీ వర్గీయులు పోటీ ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ ధర్నాలకు అనుమతి లేదని కల్యాణ దుర్గం డీఎస్పీ అనిల్ చెప్పారు. బెలుగుప్పలో 144 సెక్షన్ విధించారు. వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పోలీసుల తీరుపై విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. -
రోడ్డెక్కిన ఉస్మానియా
హైదరాబాద్: నిరసనలు, ఆందోళనలతో గత 25 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడుకుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు వేర్వేరు రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఓయూ క్యాంపస్ కళాశాలల అధ్యాపకులతో పాటు నిజాం, కోఠి మహిళా కళాశాల, సైఫాబాద్, సికింద్రాబాద్ పీజీ కాలేజీలు, జిల్లా పీజీ కేంద్రాల అధ్యాపకులు ఆర్ట్స్ కళాశాల నుంచి పాలన భవనం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం సెనేట్ హాలులో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్కుమార్ సమక్షంలో సమావేశమై తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ ప్రొ.భట్టు సత్యనారాయణ, ఉస్మానియా వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ.. ఓయూకు తక్షణం రెగ్యులర్ వీసీని, పాలక మండలి సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. లేదంటే ఈ నెల 24న సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త ప్రొ.పురుషోత్తమరెడ్డి, విశ్రాంత అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొ.ముర ళీమనోహర్, ఔటా కార్యదర్శి ప్రొ.లక్ష్మీకాంత్రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓయూలోని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా విధులను బహిష్కరించి శుక్రవారం వంటావార్పుతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం పంతానికి పోకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ వర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంచి మనోహర్ మాట్లాడుతూ.. ఓయూకు వీసీ లేనందున ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలు పార్థసారథి, జ్ఞానేశ్వర్, దీపక్కుమార్, అశోక్, తక్కెళ్ల మల్లేశ్, ఖదిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్డీ విద్యార్థుల ఆందోళన... పీహెచ్డీ ప్రవేశాలకు 2009, 2011 సంవత్సరాలలో అనుసరించిన విధానాన్ని అమలు చేయాలని విద్యార్థులూ ఆందోళన చేపట్టారు. ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు 15 మార్కులు, బీసీలకు 20, ఓసీలకు 25 మార్కుల విధానాన్ని అమలు చేయాలని రిజిస్ట్రార్ను కోరారు. దీనిపై ఇన్చార్జ్ వీసీ ఆచార్యకు వివరిస్తామని వారి నుంచి అనుమతి వస్తే మార్కులను తగ్గిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.7 కోట్ల మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. -
బాబు నిలువునా మోసం చేశాడు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం అనంతపురం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగమేఘాలపై పట్టిసీమ నిర్మిస్తున్న చంద్రబాబుకు హంద్రీ - నీవా ప్రాజెక్టు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ధర్నాలో పాల్గొన్న పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్లు వ్యవహారంలో బిజీగా ఉన్న చంద్రబాబుకు రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని చంద్రబాబును నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ మహాధర్నాలో జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా : కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, తెల్లం బాలరాజుతోపాటు పార్టీ నేతలు వంకా రవీంద్రనాథ్, టి. వాసుబాబు, తలారి వెంకట్రావ్, కొఠారు రామచంద్రరావు, కారుమంచి రమేష్, తెల్లం గోళ్ల శ్రీలక్ష్మి, బండి అబ్బులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఎడ్ల బండ్లపై వినూత్న ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా : కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవేర్చాలని వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. అందుకోసం కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా: ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బి ముత్యాల నాయుడు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ ఇంఛార్జ్లతోపాటు పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, ఎమ్మెల్యేలు వి.కళావతి, కంబాల జోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా: రైతుల సమస్యలపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ మహాధర్నా నిర్వహించింది. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రాజేంద్ర దొర, కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, అప్పలనాయుడుతోపాటు నెల్లిమర్ల, గజపతినగరం కన్వీనర్లు డా.సురేష్ బాఉ, శ్రీనివాసరావు, అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిశీలకురాలు కల్యాణి పాల్గొన్నారు. కృష్ణాజిల్లా : విజయవాడ: రైతుల సమస్యలపై సబ్ కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పనతోపాటు పార్టీ నేతలు కె.పార్థసారధి, గౌతంరెడ్డి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోచిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సునీల్కుమార్, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలంతోపాటు నాయకులు భూమన కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.చిత్తూరు: 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన స్వార్ధం కోసం చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని ఓ దొంగ పరిపాలిస్తున్నారన్నారు. అబద్దాలతో సీఎం అయి ఇప్పటికీ రైతుల సమస్యలు తీర్చలేదని విమర్శించారు. 20 శాతం రైతులకు కూడా విత్తనాలు పంపిణీ చేయని ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డ ఘనత చంద్రబాబుదన్నారు. గుంటూరు జిల్లా : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ముస్తఫా, డా.గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
మాదిగల మహా ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న హక్కుల కోసం మాదిగలు గొంతులు విప్పాల్సిన అవసరం వచ్చిం ది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చే మాదిగలతో హైదరా బాద్లోని ఇందిరా పార్క్ వద్ద చలో ఏపీ అసెంబ్లీ పేరిట మంగళవా రం మహాధర్నా జరుగనుంది. ఈ మహాధర్నాలో రాష్ట్రంలోని మాది గలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ పలు డిమాండ్లు చేయబోతున్నాం. రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీ ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణపై, కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేస్తూ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తీర్మానం చేయడానికి, ప్రధాన మంత్రితో మాట్లాడటానికి సీయం చర్యలు తీసుకోవాలి. దండోరా ఉద్యమంలో పాల్గొని అమరులైన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి. జనాభా నిష్పత్తి ప్రకారం పథకాలు, నిధులు, లబ్ధి అందే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని సవరించాలి. ఏపీ నూతన రాజధానిలోను, ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోను మాదిగ సంక్షేమ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. మాదిగల విద్యా వికాసాల కోసం చర్యలు చేపట్టాలి. మాదిగలంతా పెద్ద సంఖ్యలో తరలిరండి! హక్కుల కోసం గొంతులు విప్పుదాం! మాదిగ మహాధర్నా 23-12-2014 మంగళవారం ఉ. 10 గంటల నుండి, స్థలం: ధర్నా చౌక్, ఇందిరాపార్క్ వద్ద, హైదరాబాద్ - కృపాకర్ మాదిగ రాష్ట్ర మాదిగల నేత, ఒంగోలు -
మాట తప్పిన నేతపై దండెత్తిన జనం
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలుపు కోవడం అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ విధ్యుక్త ధర్మం. నీతి, న్యాయం కూడా. ఓటు వేయ డం ద్వారా అది ప్రజలు చెప్పే చట్టం. ఒకసారి అధి కారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అయిదేళ్ల వరకు ఎన్నికలు ఉండవన్న కారణంగా ధర్మం, న్యాయం, నీతి తప్పితే ఏమవుతుంది? ఆ రాజకీయ పార్టీ విశ్వసనీయత కోల్పోతుంది. ప్రజలు అసహ్యించు కుంటారు. ఓటు వేసిన ప్రజలకు ఓపిక, సహనం నశిస్తే వారిలో ఆగ్రహం పెల్లుబుకుతుంది. ప్రజా స్వామ్య వ్యవస్థలో అది ప్రజలకున్న హక్కు. అలా ప్రజాగ్రహం వెల్లువెత్తినప్పుడు పాలకపక్షం తన ధోరణి మార్చుకోవాలి. ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వందారి తప్పుతున్నప్పుడు ప్రజల్లో వ్యక్తమ య్యే ఆగ్రహావేశాలను గమనించైనా నేతల్లో చలనం రావాలి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఆరు నెలలు దాటు తోంది. పరిపాలనలో అపార అనుభవం కలిగిన వారికి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గడువు ఎక్కు వే. ఆ దిశగా అడుగులు పడనప్పుడు ప్రజల్లో ఆగ్ర హావేశాలు పెల్లుబకడం సహజం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వాటి సంగతేంటో ఏం చేయబోతు న్నారో కూడా ప్రజలకు జవాబు చెప్పలేనప్పుడు ప్రజలు పాలకులను నిలదీస్తారు. ప్రజల్లో వ్యక్తమవు తున్న ఆకాంక్షలకు అనుగుణంగా వారందరినీ సమీ కృతం చేసి ప్రభుత్వాన్ని తట్టిలేపడానికి ప్రతిపక్ష మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తమ బాధ్యతగా గొంతెత్తితే.... ఎన్ని కల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి చేయడానికి ప్రజాస్వామిక పోరాటమార్గం ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మహాధర్నా నిర్వహిస్తే... భారీ ఎత్తున ప్రజలు పాల్గొని గొంతు కలపడమంటే... అధికార పార్టీ పాలన తీరుతెన్ను లకు ఇది నిదర్శనం మాత్రమే. రుణ మాఫీ చేయ లేదని రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ సంగతేంటని మహిళలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాట ఏమైందంటూ యువకులు నినదించారు. ఎక్కడి కక్కడ ప్రభుత్వంపై మండిపడ్డారు. ధర్నాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వారు ఆవేశంగా చెబుతున్న మాటలను ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. మేనిఫెస్టో అపవిత్రమైందా...? తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో (ప్రణాళిక) ఆసాంతం పరిశీలిస్తే ఎవరికైనా ఒక అంశం సులభంగా అర్థమవుతుంది. 52 పేజీల ఆ రంగురంగుల పుస్తకంలో 90 శాతం వరకు హామీలతోనే నింపారు. ‘‘తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన అభివృద్ధి పథాన్ని, మేనిఫెస్టో రూపంలో మీ ముందు ఉంచుతున్నాం. ఇది మనం దరికీ ‘దశ-దిశ’ చూపించే ఒక పవిత్ర పత్రం. నిపు ణులతో చర్చించి, మాకున్న అపారమైన పరిపాలనా అనుభవాన్ని జోడించి దీనిని రూపొందించాం.’’ అంటూ పరిచయ భాగంలోనే మేనిఫెస్టోను ఒక పవిత్ర పత్రంగా పేర్కొన్నారు. ఆరు నెలలు తిరక్క ముందే దాన్ని విస్మరించి అపవిత్రం చేయడం సమంజసంకాదు. చంద్రబాబు రాజకీయ జీవితం లో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ తర్వాత ముఖ్య మంత్రి కావడం ఇదే మొదటిసారి. ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకున్నప్పుడు, ఆ తర్వాత ఏనాడూ ఆయన ప్రతిపక్షంలోలేరు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ప్రభుత్వాధినేతగా, ప్రతిపక్ష నేతగా ఉండటంలోని తేడాని ఆయనే పోల్చారు. మీకోసం పేరుతో పాదయాత్ర చేసినప్పు డు ప్రజలను మరింత దగ్గరగా చూశానన్నారు. ఇప్పు డు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత అందరిలోనూ తలెత్తుతున్న సందేహాలేంటంటే... ప్రజలను అత్యంత సన్నిహితంగా ఆయన వారిలో ఏం చూశారు? ఏం అర్థం చేసుకున్నారు? వారి బాధ లను ఏమేరకు అవగతం చేసుకున్నారు? ‘‘2817 కి.మీ. పాదయాత్రలో రాష్ట్రంలో రైతుల కష్టాలను స్వయంగా దగ్గరుండి పరిశీలించడం జరిగింది... దెబ్బతిన్న రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించి భవిష్యత్ పట్ల భరోసా నింపేందుకే తెలుగుదేశం పార్టీ రైతు రుణ మాఫీ ప్రకటించింది.’’ అని స్వర్ణాంధ్రను నిర్మిద్దామన్న పేరుతో మేనిఫెస్టో (8వ పేజీ) లో చెప్పుకున్నారు. మరి మాటలకూ చేతలకూ పొంత నేది? ఆరునెలలవుతున్నా... రైతుల భాషలో అయి తే (ఖరీఫ్, రబీ) రెండు సీజన్లు గడిచాయి. వారిలో ఏ రకంగా ఆత్మవిశ్వాసం కల్పించారు? అలా చేయ కపోగా తొలి సంతకంతోనే వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. పరిపాలనలో అపార అనుభవం ఉన్న వారెవరూ ఆ పని చేయరు. 2014 మార్చి వరకు ఉన్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని ముందు ఒక జీవో జారీచేసి ఆ తర్వాత 2013 డిసెంబర్ వర కున్న రుణాలకు మాత్రమేనంటూ సవరించారు. లక్షలాది వ్యవసాయదారులను ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదన్న సాకుతో వారిని ఆ జాబితాల్లోంచి తొల గిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆ మాట చెప్పా రా? ఎక్కడా చెప్పలేదు. ఆర్థిక సమస్యలలో చిక్కు కున్న డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రి యలో భాగంగా ఆ సంఘాలు తీసుకున్న రుణా లన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్న హామీ గురించి ఇప్పుడు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పగలరా? ఒకటేమిటి... సమాజం లోని అన్ని వర్గాలకు హామీలను గుప్పించారు. అధి కారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో షెడ్యూల్డ్ కులాల బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామన్నారు. ఇవి నిర్ణీత కాలంలో చేస్తా మని చెప్పిన కొన్ని హామీలు మాత్రమే. ఈ రకంగా మేనిఫెస్టో నిండా హామీలతో నింపి ఇప్పుడు కుదర దంటే వాటినే నమ్ముకుని ఓట్లేసిన వారు ఏం చేయాలి? కచ్చితంగా ప్రశ్నిస్తారు. సత్తా కలిగిన నేతలెవరు? ‘‘కొత్త రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు ఉంటుం దని ఆర్థిక శాఖ నివేదికలే పేర్కొంటున్నాయి... ముందుచూపు, నిధులు సేకరించగలిగిన సత్తా బాధ్యతాయుతంగా పనిచేయించగలిగిన నాయక త్వం, అంతర్జాతీయంగా పలుకుబడి, పరిచయాలు కలిగిన వ్యక్తి నాయకుడుగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వివిధ హామీల అమలుకు కావలసిన ఆర్థికపరమైన అన్ని అంశాలను పరిగణించాం.’’ నిధుల సమీకరణ విషయంలో మేనిఫెస్టో (10వ పేజీ)లో చంద్ర బాబు చెప్పిన మాట. ఈరోజు కాదనగలరా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే... అత్యంత ఆర్భాటంగా నిర్వహించిన పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి అన్ని శాఖలు కలిపి 30 కోట్ల మేరకు వెచ్చించాయి. ఇచ్చిన హామీ లను నెరవేర్చడంపై శ్రద్ధ చూపకుండా సింగపూర్ తర హాలో రాజధాని నిర్మిస్తామని గడిచిన ఆరు నెలల్లో అరవైసార్లు చెప్పారు. హైదరాబాద్లో మాకు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదని చెప్పిన చంద్ర బాబు రాజధాని కోసమంటూ ఏకంగా హుం డీలు పెట్టి చందాలు పోగుచేశారు. స్పందించిన పారిశ్రా మికవేత్తలు, మానవతావాదులు దాదాపు వంద కోట్ల రూపాయల విరాళాలు అందించారు. మరి చంద్రబాబు చేసిందేమిటి? సచివాలయంలో తన చాంబర్కు హంగులకు, క్యాంపు కార్యాలయం లేక్వ్యూ అతిథి గృహాన్ని తీర్చిదిద్దడానికి దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటుక ఇటుక పేర్చి రాజధాని నిర్మాణం చేపడుతానన్న చంద్రబాబు ఈ రకంగా తాత్కాలిక అవసరాల కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేయడం వల్ల రేపటి రోజున ఎవరికి ప్రయోజనం? రాష్ట్ర ప్రజలకేమైనా పనికొస్తుందా? దేశ విదేశాల్లో మీరు తిరిగే ప్రత్యేక విమానాలకయ్యే ఖర్చు ప్రజల కోసం వెచ్చించినట్టుగా భావించాలా? మాటలకు చేతలకు పొంతన లేని కారణంగానే ఈరోజు ప్రజల నుంచి స్పందన వస్తోందని గమనించాలి. నినదించిన జనం మీరిచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామంటూ ప్రతిపక్షం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల కేంద్రాల్లోని కలెక్టరేట్ల ముందు ధర్నా విజయవంతం కావడంతో ప్రభుత్వ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధర్నా ల్లో రైతులు, మహిళల నుంచి వచ్చిన స్పందనను బట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అధికారం చేపట్టిన ఆరు మాసాల్లోనే ప్రభుత్వంపై ప్రజల నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో జగన్మోహన్రెడ్డి ఆందోళన బాట పట్టినప్పుడు ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడమన్నది ఎవరి తప్పు! ప్రజలదా? ప్రతి పక్షానిదా? అసలే కాదు. కలెక్టరేట్ల ముందు జరిగిన ధర్నాల్లో పెద్దఎత్తున పాల్గొని ప్రజలు ఆ తీరుగా స్పందించారంటే... దాన్ని పాలకపక్షం అర్థం చేసు కోవాలి. జగన్ మహాధర్నాలో పెద్దఎత్తున ప్రజలు తరలిరావడం సీఎంకు రుచించకపోవచ్చు. దాంతో చంద్రబాబుతో సహా ఆయన మంత్రివ ర్గంలోని మంత్రులు, పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జగన్పై వ్యక్తిగత నిందలకు దిగారు. అలాంటి దూషణల కోసం జగన్ ధర్నా చేయలేదు. పైగా వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఇవేం ఎన్నికల ప్రచార సభలు కూడా కావు. ప్రజలు, ప్రతిపక్షం లేవ నెత్తిన అంశాలేంటి? వాటికి సమాధానం చెప్ప కుండా ఏకబిగిన ఎదురుదాడికి దిగారంటే దానర్థమేంటి? మీ పవిత్ర మేనిఫెస్టో మీరే అపవిత్రం చేశారని అర్థమవుతోంది. హామీలపై మసిపూసి మారేడు కాయ చేస్తూ మీడియాలో ప్రచారం చేసు కోవడం అన్నీ చేశామని తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటే పొరపాటే. భవి ష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అపార అనుభవజ్ఞులైన నేతలకు ఆ విషయాన్ని గుర్తుచేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన మాట నిల బెట్టుకోకపోతే... ముందుముందు మరింతగా ప్రజా గ్రహానికి గురికాకతప్పదు. ఇది ఆరంభంగా గుర్తించి ఆత్మపరిశీలన చేసుకోవలసిన బాధ్యత, విధ్యుక్త ధర్మం అధికార పార్టీదే. సుధాకర్ -
మాఫీ వంచనపై మహాగ్రహం !
సాక్షి, విజయనగరం: బంగారం లాంటి పంటలు నష్టపోయినా... ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రైతులు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తే కుటుంబ పోషణకు ఆసరా అవుతుందని సంబరపడ్డ మహిళలు, పింఛను ఐదింతలు పెరిగితే రెండు పూటలా కడుపునింపుకోవచ్చనుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బాబు వస్తే జాబు వస్తుందని నమ్మి వీధి పాలైన యువకులు..హుద్ హుద్ తుపాను మిగిల్చిన కష్టంలో ఉన్న వారు.. ఇలా ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా చంద్రబాబు చేతిలో వంచనకు గురైన ప్రజలందరూ ఒక్క సారిగా తమ గెండెల్లోని బాధను బయటపెట్టారు. పచ్చి మోసాలకు వ్యతిరేకంగా న్యాయం కోసం నిన దించారు. వైస్సార్(వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన మహాధర్నాలో దుమ్మెత్తిపోశారు. పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జన సమూహం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ట వీరభద్రస్వామి ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి రెండు వేల ద్విచక్రవాహనాలతో 11.40 గంటలకు ర్యాలీగా కలెక్టరేట్కు బయలు దేరారు. కోట జంక్షన్, గంట స్తంభం, వైఎస్సార్ జంక్షన్, ఆర్అండ్బీ, పోలీస్ బ్యారెక్స్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. అప్పటికే కలెక్టరేట్ వద్దకు వేలాది మంది ప్రజలు చేరుకుని వేచి ఉన్నారు . కళాకారులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గళమెత్తారు. అనంతరం ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహాధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను ఎండగట్టారు. ‘ఎన్నికల మేనిఫెస్టో’పై చంద్రబాబు లేదా విజయనగరం జిల్లా టీడీపీ నేతలెవరైనా బహిరంగ చర్చకు వస్తారా?’అని సవాలు విసిరారు. ఎన్నికల హామీలను భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిన చంద్రబాబు మాటలను ఆ పార్టీ వారే నమ్మలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి అర్హులకు పింఛన్లు ఇవ్వకపోయినా, అనర్హులకు ఇచ్చినా ప్రజల తరఫున న్యాయస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. ఈ మహా ధర్నా ఆరంభం మాత్రమేనని, ఎన్నికల హామీలు నెరవేర్చేంతవరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అంధించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ బి.రామారావుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు. అడుగడుగునా అవాంతరాలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా విజయవంతం కాకుండా ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. అధికారాన్ని ఉపయోగించి అడ్డుకోవాలని చూసింది. ఓ వైపు ధర్నాకు అనుమతిస్తూనే మరోవైపు పట్టణంలోకి వచ్చే జన ప్రవాహానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేసింది. జనం ధర్నాకు రాకుండా చేసి, కార్యక్రమాన్ని విఫలం చేయాలని భావించింది. దానిలో భాగంగా నగరానికి వచ్చే అన్ని దారుల్లోనూ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. జనం వచ్చే వాహనాలను నిలిపివేసి ఆ పత్రాలు, ఈ పత్రాలు అంటూ హడావుడి చేశారు. పలు వాహనాలకు జరిమానాలు విధించారు. కొన్నింటిని వెనక్కు పంపించేశారు. మరికొన్నింటిని శివారుల్లోనే నిలిపివేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అదరలేదు, బెదరలేదు. ప్రభుత్వ కుట్రలను ముందే ఊహించి కొన్ని వాహనాలతో జనాలు ఉదయమే పట్టణంలోకి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్న వాహనాల్లోని జనం కాలినడకన కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నప్పటికీ సంయమనం పాటించి శాంతి యుతంగా ధర్నా నిర్వహించి విజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ పరిశీలకుడు ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు ( బేబినాయన), విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, మార్క్ఫెడ్ డెరైక్టరు కేవీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, సవరపు జయమణి, గజపతినగరం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, నెల్లిమర్ల సమన్వయకర్త డాక్టరు పెనుమత్స సురేష్బాబు, ఎస్కోట సమన్వయకర్త నెక్కలి నాయుడుబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎస్సీ సెల్ విభాగం నాయకుడు జైహిందుకుమార్, రైతు విభాగం నాయకుడు సింగుబాబు, యువజన నాయకులు అవనాపు విజయ్, జెడ్పీ మాజీ చైర్మన్ గుల్లిపల్లి సుదర్శనరావు, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ మామిడి అప్పలనాయుడు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. -
అడుగడుగునా ఖాకీలే!
శ్రీకాకుళం క్రైం: ఆమె ప్రజాప్రతినిధి. పాలకొండ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే. ఆమె వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కారణం.. కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు ఆమె వెళుతుండటమే. ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం పార్టీలు, ప్రజల ప్రజాస్వామిక హక్కు. అందులో పాల్గొన్న ఆయా పార్టీల నాయకుల బాధ్యత. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఆ హక్కులను కాలరాస్తున్నారని సాక్షాత్తు ఎమ్మెల్యేను అడ్డుకోవడమే నిరూపిస్తోంది. ఈ అనుభవం ఒక్క కళావతిదే కాదు.. మహాధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు చాలామంది ఇదే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన మహాధర్నాను విఫలం చేయాలని కుట్ర పన్నిన ప్రభుత్వం, టీడీపీ పెద్దలు.. దానికి పోలీసులను పావులను వినియోగించున్నారు. శాంతియుతంగా చేపట్టిన మహాధర్నాను ఎన్నడూ లేని రీతిలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహాధర్నాలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయమే జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ట్రాక్టర్లు, లారీలు, ఆటోల్లో బయలుదేరారు. అయితే శ్రీకాకుళంతోపాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీల పేరుతో నిలిపివేశారు. శ్రీకాకుళం పట్టణంలో కూడా పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కాపు కాసి మహాధర్నాకు వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా కలెక్టరేట్కు వెళ్లే 80 అడుగుల రోడ్డులో కాపు కాసి, మహా ధర్నకు వచ్చే వాహనాల్లో కొన్నింటిని నిలిపివేశారు. కార్లలో వెళ్తున్న నాయకులను కూడా అడ్డుకునేందుకు కొన్ని చోట్ల పోలీసులు ప్రయత్నించారు. పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేల వాహనాలను అడ్డుకున్నా వారు ప్రతిఘటించి.. హెచ్చరించడంతో విడిచిపెట్టారు. కలెక్టరేటు మార్గంలో ఎక్కడ చూసినా లాఠీలు, తుపాకులు ధరించిన పోలీసులే కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. కాగా ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్న మహాధర్నాను అడ్డుకోవటంలో పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం కనబరిచిందన్న ఆరోపణలను శ్రీకాకుళం డిఎస్పీ కె.భార్గవరావ్ నాయుడు ఖండించారు. మహాధర్నాకు వచ్చే వారిని ఎక్కడ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. -
దుర్నీతిపై దండయాత్ర
⇒ కదిలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ⇒ మద్దతుగా నిలిచిన ప్రజాదండు ⇒ పోలీసుల ఆంక్షలను అధిగమించి వేలాదిమంది హాజరు ⇒ శ్రీకాకుళంలో మహాధర్నా విజయవంతం ⇒ చంద్రబాబు పాలనను ఎండగట్టిన నేతలు, సామాన్యులు ⇒ ఇదే పరిస్థితి కొనసాగితే గుణపాఠం తప్పదని ెహ చ్చరిక సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బధిర సర్కారు చెవికి సోకని జనం బాధలు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైఎస్ఆర్సీపీ చేపట్టిన మహాధర్నాలో సామాన్యుల గుండెల నుంచి తన్నుకొచ్చిన కన్నీటి గాధలు ఎన్నెన్నో. రుణమాఫీ లేదు. ఫీజు రియింబర్స్మెంట్ రాదు. రుణాలు ఇవ్వరు. డ్వాక్రా సంఘాల మాటే మరిచారు. తుపాను బాధితుల్ని పక్కన పెట్టేశారు. సాయం పక్కదోవ పట్టింది. ఇసుకను బంగారంగా మార్చేశారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఉన్నవే ఊడగొడుతున్నారు. అంతా కార్పొరేట్ల పాలన.. ఆరునెలలైనా కాకముందే టీడీపీ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు వైఎస్ఆర్సీపీ మహాధర్నా వేదికగా నిలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ మహాధర్నా అడుగడుగునా పోలీసుల ప్రతిబంధకాలను ఛేదించి మరీ విజయవంతమైంది. రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, విద్యార్థులు, ఇసుక బళ్ల యజమానులు, సోంపేట బీల ప్రాంత వాసులు, తాపీ మేస్త్రీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున హాజరై చంద్రబాబు దుర్మార్గ పాలనను ఎండగట్టారు. ప్రధాన ప్రతిపక్షం చేపట్టిన ఆందోళన కార్యక్రమం తమదే అన్నట్లు వ్యవహరించారు. ఇలా జరిగింది ⇒ ఉదయం ఆరు గంటల నుంచే జిల్లా నలువైపుల నుంచి నేతలు జిల్లా కేంద్రానికి బయల్దేరారు. ⇒ ఏడుగంటల నుంచి పోలీసులు ఆంక్షలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ధర్నాకు వస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పెద్ద వాహనాలతోపాటు ద్విచక్ర వాహనాలనూ నిబంధనల పేరిట అడ్డుకున్నారు. తెలుగుదేశం నేతల ఒత్తిళ్లతో ఎక్కడికక్కడ భారీ బందోబస్తు పేరుతో ఆటంకాలు సృష్టించారు. ⇒ 8 గంటల నుంచే ధర్నా వేదిక వద్ద ప్లకార్డులు, హోర్డింగ్లు, పోస్టర్లు వెలిశాయి. వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. ⇒ 9 గంటలకే ధర్నా ప్రాంగణానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, నాయకులు, ఎమ్మెల్యేలు రావడం మొదలెట్టారు. ⇒ 11 గంటలకు కార్యక్రమం మొదలైంది. నాయకులు చంద్రబాబు దుర్నీతిని ఎండగట్టారు. బాధిత ప్రజలకు బాసటగా ఉంటామని ప్రసంగాలతో భరోసా ఇచ్చారు. ⇒ ఎండ సుర్రున మండుతున్నా ఎవరూ వెరవలేదు. వేలాది జనం వేదిక వద్దే ఉండిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ఓ అవ్వ, ఓ వృద్ధుడు, ఓ భవన నిర్మాణ కార్మికుడు, ఓ ఇసుక బండి యజమాని, ఓ డ్వాక్రా సంఘం సభ్యురాలు తమ మాటల్లో వివరించారు. ⇒ మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వైఎస్సార్సీపీ నేతలు జేసీ వివేక్ యాదవ్కు విజ్ఞాపన పత్రం అందించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు..ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ ఇబ్బందుల్ని విడమర్చి చెప్పారు. ⇒ అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించినా, వాహనాలను అడ్డుకున్నా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే తామంతా నడుస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. -
బ్రిటిష్ పాలనే నయం
వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి ఏలూరు : మహాధర్నా సభలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ 200 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలనలో కూడా ప్రజలు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా రైతుల వద్ద ఒక బస్తా ధాన్యం కూడా కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా బాబు నిలబెట్టుకోలేదన్నారు. రుణమాఫీ అమలు చేయాలనే డిమాండ్తో తమ పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేసిందని సుబ్బారాయుడు ఆరోపించారు. ధర్నాకు రావడానికి బస్సులను ఇవ్వవద్దని, ఆయా రూట్లల్లో నిత్యం తిరిగే ఆర్టీసీ బస్సులను కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశించడం దివాలకోరుతనమని విమర్శించారు. చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కనుసైగ చేస్తే జిల్లా ప్రజలు తమ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నారని కొత్తపల్లి పేర్కొన్నారు. ప్రభుత్వం మెడలు వంచి, కళ్లు తెరిపించి హామీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయించడం కోసం తమ పార్టీ పోరాడుతుందని, అవసరమైతే నిరాహారదీక్షలకు కూడా వెనుకాడబోమని సుబ్బారాయుడు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, అధికారం కోసం చంద్రబాబునాయుడు చెప్పని అబద్ధం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం వాటి ఊసు కూడా ఎత్తడం లేదని విమర్శించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చిన ఈ ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
జనం కోసం అలుపెరగని కదనం
* మహాధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ * రైతుల్ని ముంచి, మహిళల కంట నీరొలికించారని ‘బాబు’పై ధ్వజం కాకినాడ/మండపేట : రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి ఈ ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైనా, అసెంబ్లీలోనూ అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. రైతులను, మహిళలను దగా చేశామన్న ఆనందంతోనే టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో శుక్రవారం కాకినాడలో కలెక్టరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో జ్యోతుల మాట్లాడుతూ తొలి విడతలో రూ.14,492 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం ఇప్పుడు కేవలం రూ.5,000 కోట్లు మాత్రమే కేటాయించడంలో ఆంతర్యమేమిటన్నారు. మిగిలిన నిధులు ఎక్కడ నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేదంటూనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులను నిలువునా ముంచి, ఆడపడుచులతో కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రైతుల్ని మభ్యపెడుతున్న చంద్రబాబు కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ గతంలోనే రూ.ఐదు వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి ఇప్పుడు అదే మాటను చెప్పడం ద్వారా రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తానని గొప్పగా ప్రకటించిన జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ రైతులకు, మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఏమయ్యారని నిలదీశారు. సీఎం చంద్రబాబు రైతులకు లెక్కలు రావన్న భ్రమలో ఉన్నారని రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు విమర్శించారు. రూ.ఐదు వేల కోట్లు ఎందరు రైతులకు సరిపెడతారని ప్రశ్నించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుకు, మంత్రులకు మధ్య సమన్వయం లేదని, పొంతన లేని ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల రాజుబాబు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రుణమాఫీకి అరకొర కేటాయింపులతో చంద్రబాబు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నాలో ప్రత్తిపాడు, కొత్తపేట, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, కార్యక్రమ జిల్లా సమన్వయకర్త గొల్ల బాబూరావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, పార్టీ రాష్ర్ట కార్యదర్శులు కొల్లి నిర్మలకుమారి, సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని. కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, రాజమండ్రి కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, నయీమ్, మార్గాని గంగాధర్, అనంత ఉదయభాస్కర్, డాక్టర్ యనమదల గీతామురళీకృష్ణ, మట్టపర్తి మురళీకృష్ణ, మంతెన రవిరాజు, అమలాపురం పట్టణ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, ట్రేడ్ యూనియన్ కార్యదర్శి అల్లి రాజబాబు, జిల్లా వక్ఫ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు జమీల్, పార్టీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాలరావు, నక్కా రాజబాబు, పెంకే వెంకట్రావు, వట్టికూటి సూర్యచంద్రరాజశేఖర్, మాకినీడి గాంధీ, చెల్లుబోయిన శ్రీనివాస్, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, కాలే రాజబాబు, గొల్లపల్లి డేవిడ్రాజు, వర్మ, అత్తిలి సీతారామస్వామి, సత్తి వీర్రెడ్డి, సిరిపురపు శ్రీనివాసరావు, పెట్టా శ్రీనివాస్, కుసనం దొరబాబు, గోలి దొరబాబు, ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. -
వంచనపై ఉరిమి.. దగాపై రగిలి..
గద్దెనెక్కడమే ధ్యేయంగా ప్రజలను నానా వాగ్దానాలతో ఊరించిన చంద్రబాబు.. తీరా అధికారం దక్కాక వారి జీవితాల్లో కనీసపు వెన్నెలను ప్రసరించడానికి ప్రయత్నించడం అటుంచి.. తనలోని చీకటి కోణాన్ని మరింత విశ్వరూపంలో ప్రదర్శిస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ నుంచి ఇంటికో ఉద్యోగం వరకూ పెక్కు హామీలను సీఎం సింహాసనాన్ని అధిష్టించేందుకు సోపానాలుగా వాడుకున్న ‘బాబు’.. తర్వాత జనజీవితాన్ని జారుడుమెట్లపైకి నెట్టారు. ఈ నయవంచనపై జనం నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ సర్కారు కుటిలనీతిని ఛీత్కరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం జరిగిన మహాధర్నాకు పోటెత్తిన జనం.. ఒక్కొక్కరూ ఒక్కో ‘అగ్నికణం’లా రగలడమే అందుకు నిదర్శనం. - మహాధర్నాకు జిల్లా నలుమూలల నుంచీ వెల్లువెత్తిన జనం - వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిపి సర్కారుపై నిరసన గళం - బాబు ఆరునెలల పాలనపై ఆగ్రహాన్ని ప్రతిబింబించిన ఆందోళన సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాట తప్పిన చంద్రబాబు సర్కారుపై పెల్లుబికిన జనాగ్రహానికి కాకినాడలోని కలెక్టరేట్ వేదికైంది. ప్రజలను అనేక విధాలుగా దగాచేసిన సర్కార్పై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునందుకుని జిల్లా ప్రజలు శుక్రవారం నాటి మహాధర్నాకు తరలివచ్చారు. రుణమాఫీ హామీని నమ్మి భంగపడ్డ రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు పింఛన్లు రాని పండుటాకులు సైతం ప్రయాసను లెక్కచేయక పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొనడం సర్కారుపై ప్రజా వ్యతిరేకతకు దర్పణం పట్టింది. ధర్నాకు వైఎస్సార్ సీపీ పిలుపు ఇచ్చినా పార్టీ రహితంగా వివిధ వర్గాలు ధర్నాకు సంఘీభావం తెలపడంతో ఆరునెలల చంద్రబాబు పాలనపై నెలకొన్న వ్యతిరేకత ప్రస్ఫుటమైంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు వారికి సంఘీభావంగా రైతులు, మహిళలు, వృద్ధులు కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. ధర్నాకు తరలివచ్చిన జనంతో కలెక్టర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. జనం, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలు..ఇలా అందుబాటులో ఉన్న వాహనాలపై సర్కార్ దగాను ఎండగట్టేందుకు తరలివచ్చారు. జగ్గంపేట నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో మెట్ట ప్రాంత పార్టీ శ్రేణులు, రైతులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో తరలిరాగా, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు తమ తమ నియోజకవర్గ కేంద్రాల నుంచి కేడర్, రైతులు వెంట రాగా వాహనాల్లో కలెక్టరేట్కు చేరుకున్నారు. అవరోధాల్ని అధిగమించి.. మహాధర్నాకు వైఎస్సార్ సీపీ ముందుగానే పిలుపు ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు కలెక్టరేట్కు వచ్చే మార్గాలన్నింటికీ అడ్డంగా ట్రాఫిక్ గేట్లు ఏర్పాటుచేసి మూసేశారు. వాహనాలను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లా అదనపు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పోలీసుల ఆటంకాలను సైతం లెక్కచేయకుండా రైతులు, స్వయంశక్తి సంఘాల మహిళలు, పార్టీ శ్రేణులు ట్రాఫిక్గేట్లను దాటుకుంటూ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు జరిగిన ఆందోళనలో ఏ ఒక్కరూ చివరి వరకూ వీడి వెళ్లలేదు. సూరీడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా జనం..పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ముఖ్యనేతలు జాయింట్ కలెక్టర్కు విజ్ఞాపన పత్రాన్ని అందించి తిరిగొచ్చే వరకు కలెక్టరేట్ను విడిచి వెళ్లలేదు. ధర్నాలో నెహ్రూ సహా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,కో ఆర్డినేటర్లు...ఇలా దాదాపు నేతలు చంద్రబాబు రుణమాఫీపై చేసిన మోసాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సర్కార్ నిర్వాకాన్ని ఎండగట్టిన ప్లకార్డులు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్లు ఏర్పాటు చేసిన ప్లకార్డులు ఆలోచింపచేశాయి. ‘వినేవాడు వెర్రిబాబు అయితే చెప్పే వాడు చంద్రబాబు అట’, ‘బాబు హామీలు ఎండమావిలో నీళ్లు’, ‘చంద్రబాబు పాలనలో ఆరు నెలలు-50 మోసాలు’, ‘ఎకానమిస్ట్ అన్నాడు-ఏక నామం పెట్టాడు’, ‘అధికారం కోసం అప్పుడు బాబు అన్నిటికీ సై..సై-ఆంక్షల పేరిట ఇప్పుడు మాత్రం నై..నై..’ వంటి ప్లకార్డులతో మహిళలు, రైతులు ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారు. సొమ్మసిల్లిన విశ్వరూప్, పాపారాయుడు ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు సొమ్మసిల్లిపోయారు. మహాధర్నా ప్రారంభానికి ముందు విశ్వరూప్, పాపారాయుడు బిగ్గరగా అరుస్తూ రుణమాఫీపై దగా చేసిన చంద్రబాబు సర్కార్ను ఎండగడుతున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యారు. వైద్యుడైన పార్టీ అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి హుటాహుటిన పాపారాయుడును పరీక్షించారు. అనంతరం నేతలు సపర్యలు చేయడంతో కొద్దిసేపటికి తేరుకున్నారు. కాగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా నిశ్చితార్థం ఏర్పాట్లతో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, విశాఖలో జరిగే మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో పాటు పాల్గొనడంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కాకినాడ ధర్నాకు హాజరు కాలేకపోయారు. మరో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వ్యక్తిగత పనులుండడంతో కార్యక్రమానికి రాలేకపోయారు. -
విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం విశాఖపట్నం వెళ్లారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి విశాఖ చేరుకున్నారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు చేపడుతున్న మహాధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటారు. ఉదయం 10గంటలకు ధర్నా నిర్వహించే కలెక్టరేట్కు వైఎస్ జగన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటవరకు ధర్నా నిర్వహిస్తారు. అనంతరం వై.ఎస్.జగన్ సర్క్యూట్ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యాక సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళతారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఈ రోజు వైఎస్ఆర్ సీపీ ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. -
నేడు మహా ధర్నాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి
విశాఖపట్నం: జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సర్క్యూట్ గెస్ట్హౌస్కు వస్తారు. అక్కడ కొంతసేపు ఉన్న తరువాత ఉదయం 10గంటలకు ధర్నా నిర్వహించే కలెక్టరేట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంటవరకు ధర్నా నిర్వహిస్తారు. అనంతరం వై.ఎస్.జగన్ సర్క్యూట్ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యాక సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళతారు. -
‘మాఫీ’ మాయ ఇంకెన్నాళ్లు..?
‘నాకు అనుభవం ఉంది. రుణమాఫీపై పూర్తి అధ్యయనం చేశాను. అందుకే హామీలు ఇస్తున్నా...’ అని ఎన్నికల సందర్భంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు ఆ అనుభవాన్ని ఉపయోగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలపై ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం తీరును వారు ఖండిస్తున్నారు. నిబంధనలతో కూడిన మాఫీలు వద్దని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం పూర్తి రుణమాఫీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనైక్యత వల్లనే... రాష్ర్టంలో రైతుల అనైక్యత కారణంగానే చంద్రబాబు నాయుడు నెట్టుకువ స్తున్నారు. మిగిలి ఉన్న నాలుగేళ్ల పదవీ కాలాన్ని ఇలాగే మోసపూరితంగా గడిపేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీని యదాతథంగా అమలు చేయకుండా వడపోస్తూ, అర్హులను తగ్గించుకుంటూ పోతోంది. ఇది సరి కాదు. వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయాల్సిందే. ఇప్పటికే జనంలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. - గేదెల సత్యనారాయణ, ఏపీ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు, సాలూరు జగన్ పిలుపుతోనే కదలిక రైతులు, మహిళల అవస్థలను గుర్తించి వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాధర్నాకు పిలుపునివ్వడంతోనే రాష్ర్ట ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి చేసిన రుణమాఫీ విధాన ప్రకటన మోసపూరితంగా ఉంది. వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని నమ్మించి, నేడు పంటరుణాలనే మాఫీ చేస్తానని హామీ ఇచ్చానని చెప్పుకుంటున్నారు. రుణమాఫీ అర్హుల బ్యాంక్ అకౌంట్లు కోటికి పైగా ఉండగా, వాటిని 83 లక్షలకు తగ్గించి దగా చేస్తున్నారు. దానికీ సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. అడుగడుగునా దగా, మోసం స్పష్టంగా కనిపిస్తోంది. - పీడిక రాజన్నదొర, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, సాలూరు బాబును నమ్మి మోసపోయాం ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను పూర్తి మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా డ్వాక్రా రుణాల మాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బాబును నమ్మి మోసపోయాం. - పూడి జయలక్ష్మి, డ్వాక్రాసంఘ ఆర్గనైజర్,వాడాడ, బాడంగి మండలం మోసపూరిత విధానాలకు నిదర్శనం రైతు రుణమాఫీపై చంద్రబాబు చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీ మోసపూరిత వైఖరిని తెలియజేస్తోంది. ఎన్నికల్లో రు ణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు డొంకతిరుగుడు విధానాన్ని అనుసరించడం పద్ధ తి కాదు. రబీ సీజన్లో కూడా పంట రుణాలు లభించక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. రుణ మాఫీని పూర్తిగా అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలి. - ఎన్వై నాయుడు, సీపీఎం పట్టణ కార్యదర్శి, సాలూరు హామీలు అమలు చేయాలి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. చేయలేను అంటే కుదరదు. చంద్రబాబు మాయ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయాలి. - ఎం.కృష్ణమూర్తి, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోసం చేశారు... ఎన్నికల ముందు రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు రూ.50వేల లోపు రుణాలే మాఫీ చేస్తానని చెప్పడం దారుణం. రూ.50వేల కంటే ఎక్కువుంటే ఐదు దఫాలుగా చెల్లిస్తానని, అది కూడా కుటుంబానికి మొత్తం పరమితి విధించడం సరి కాదు. రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా రైతులను మోసం చేసింది. - పెద్దిమటి రామారావు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు, బాడంగి అధికారం కోసమే... చంద్రబాబు అధికారం కోసం అవగాహన లేని ప్రకటనలు చేశారు. ఇది రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రైతు, డ్వాక్రా సంఘాలకు పూర్తిగా రుణమాఫీ చేయాలి - భీశెట్టి బాబ్జి, లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్ ధర్నా ఉంది కాబట్టే... రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేయాలని 5న జగన్ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి చంద్రబాబు ఆదరాబాదరాగా కొంత రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి అధ్యయనం చేసే హామీలు ఇస్తున్నానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాలి. పక్కనున్న కొత్త ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ అమలు చేస్తే సీనియర్గా చెప్పుకునే చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రుణాలను మాఫీ చేయాలి. లేదంటే రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. - మర్రాపు సూర్యనారాయణ, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇలాంటి రుణమాఫీ ఎక్కడా వినలేదు రైతు రుణమాఫీ అంటే రై తులకు ఉన్న రుణాలు మొత్తం మాఫీ జరగాలి. ఇలా విడతల వారీగా జరగడం ఇదే ప్రథ మం. మొత్తం మాఫీ చేస్తామ ని, ఇలా విడతల వారీగా, జాబితాల వారీగా ఇవ్వడం దారుణం. రైతులందరికీ రుణమాఫీ జరగాలి. ఆంక్షలు లేని మాఫీ జరగాలి. అప్పుడే చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. - కోరాడ నారాయణరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు, పెదనడిపల్లి ఇంటిలో డబ్బులు తీయండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబా బు నాయుడు అమలుచేయాలి. ఇంటిలో డ బ్బు తీసైనా రుణమాఫీ చేయాలి. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేశారు, రైతులకు ఇవ్వడానికి ఏమైంది. ఆంక్షలు లేని రుణమాఫీ చెయ్యాలి. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రుణమాఫీ జరగాలి. లేదంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. - రెడ్డి లక్షుంనాయుడు, లోక్సత్తా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, చీపురుపల్లి మాట తప్పిన చంద్రబాబు ఎన్నికల ముందు రైతుల కు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోందని, కంటి తుడుపు చర్య కింద రూ.50 వేలు ఇవ్వడం దారుణం. అది కూడా తొలి జాబితాలో ఉన్న వారికి ఇవ్వడమేంటి. రైతులందరికీ ఇవ్వాలి. మొత్తం రుణమాఫీ జరిగేంత వరకు పోరాటం చేస్తాం. - వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, చీపురుపల్లి ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలి... ‘నేను తప్పు చేశాను. ఎన్నికల్లో అబద్దమాడాను. నేను ఎన్నికల్లో ఇచ్చి న హామీలను అమలు చేయలేకపోతున్నాను’ అని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి మోసా లు, దగా లు భవిష్యత్లో చేయకూడదు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి ఎన్నికల మేనిఫెస్టోను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని వారి ఎన్నికను రద్దు చేయాలి. - పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
సర్కార్పై ధర్నాగ్రహం
విజయనగరం కంటోన్మెంట్ : సర్కారు మాఫీ మాయలపై సమరానికి సర్వం సిద్ధమైంది. చంద్రబాబు మాటల గారడీ రంగు తేల్చడానికి వైఎస్ఆర్ సీపీ నడుం బిగించింది. మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని ముళ్లకర్రతో తట్టిలేపేందుకు, రైతన్నలకు అండగా నిలిచేందుకు ఎందాకైనా వెళతామని హెచ్చరించింది. ఎన్నికలకు ముందు ఓ మాట తర్వాత మరో మాటను పలుకుతున్న ముఖ్యమంత్రి తీరును నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చింది. పూర్తిగా రుణమాఫీ బాబు సర్కార్పై ధర్నాగ్రహం !చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు శుక్రవార కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాకు ఏర్పాట్లు పూర్తి రుణమాఫీని అటకెక్కించిన తెలుగుదేశం ప్రభుత్వం తీరును ఎండగడుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ మహా ధర్నా కు కార్యకర్తలు, నాయకులతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు కూడా హాజరుకానుండడంతో అదే స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ధర్నాకు పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా తటస్థంగా ఉండే ప్రజలు కూడా హాజ రవుతున్నారు. కలెక్టరేట్ వద్ద ఐదు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ధర్నాను ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా చేపట్టి విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ సీపీ నా యకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గంట్యాడ రూట్లో కొన్ని నియోజకవర్గాలు, బొబ్బిలి వైపు మరికొన్ని నియోజకవర్గాలు, ఆర్అండ్బీ బంగ్లా వైపు కొన్ని మండలాలు, కంటోన్మెంట్ గూడ్స్ షెడ్ వైపు మరికొన్ని మండలాల ప్రజలు వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్నా సమయం ఆసన్నమవగానే అన్ని మండలాలు, నియోజకవర్గాల ప్రజలంతా క్రమశిక్షణతో ఒకేసారి వచ్చి చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ధర్నాకు అన్నివర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఒక ప్రకటనలో కోరారు. వాహనాలను అడ్డుకోవాలని ఆదేశాలు వైఎస్ఆర్ సీపీ నిర్వహిస్తున్న మహాధర్నాకు రైతులు,ప్రజలు వచ్చే వాహనాలను అడ్డుకోవాలని పోలీసులకు లోపాయికారీగా ఆదేశాలు అందినట్టు తెలిసింది. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్న నెపంతో ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుని ప్రజలు ధర్నాకు వెళ్లకుండా నిరోధించాలన్న ప్రణాళికతో ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ధర్నా ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ విజయనగరం క్రైం : కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ధర్నా ప్రాంతాన్ని ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవావెల్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న రెండు గేట్లును పరిశీలించారు. ధర్నాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయనతో పాటు విజయన గరం డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, సీఐలు ఉన్నారు. -
దగాపడ్డ రైతు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :పశ్చిమ రైతు మరోసారి దగా పడ్డాడు. అప్పులే పెట్టుబడిగా పెట్టి చివరికి కన్నీళ్ల దిగుబడితో కొన్నేళ్లుగా సాగు చేస్తున్న జిల్లాలోని అన్నదాతలు చంద్రబాబునాయుడు రుణమాఫీ ఉచ్చులో చిక్కుకుని ఇప్పుడు విలవిల్లాడిపోతున్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే రుణమాఫీని అమలు చేస్తామన్న బాబు మాటలు విని పట్టం కట్టిన రైతన్నలు, మహిళలు తీరా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్నెల్లుగా పూటకో మాట.. గడియకో విధానం చూస్తూ దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. రుణమాఫీ పేరిట రైతులు, మహిళల పట్ల సర్కారు వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టరేట్ల వద్ద శుక్రవారం రైతు మహాధర్నా చేయూలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు గురువారం హడావుడిగా చేసిన ప్రకటన రైతులను గందరగోళంలో పడేసింది. రూ. 50 వేల లోపు ఉన్నవారికి ఒకేసారి రుణమాఫీ చేస్తామని, పదో తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రూ.50వేల పైన ఉంటే.. ఇరవై శాతం ఇచ్చి తర్వాత మిగిలిన మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో వడ్డీతో సహా కడతామని పేర్కొన్నారు. జిల్లాలో సగానికి సగం ఖాతాల్లో కోత జిల్లాలో 8.50 లక్షల మంది రైతులకు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు ఉన్నాయి. వీటిలో 5.60 లక్షల రైతుల ఖాతాలు పరిశీలించి పంపాలని తహసిల్దార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆధార్, రేషన్ కార్డుల వివరాలను ముడిపెడుతూ 33 కాలమ్స్ ఉన్న ఫారం నింపాలన్న నిబంధనతో చాలామంది రైతులు సకాలంలో వివరాలు ఇవ్వలేకపోయారు. ఈ సాకుతో జిల్లాలోని 92 వేల మంది ఖాతాలకు సర్కారు కోత పెట్టింది. ఇక సరైన వివరాలు ఇచ్చిన ఖాతాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. అనంతపల్లి ఆంధ్రాబ్యాంక్ అధికారులు తమ శాఖలో రుణమాఫీకి అర్హులైన ఖాతాలు 2200 ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే 942 మందిని మాత్రమే తొలి విడత కింద అర్హులైన వారిగా పేర్కొంది. కన్నాపురం ఆంధ్రాబ్యాంక్లో 2500 మంది రైతులకు రుణ ఖాతాలు ఉండగా, ప్రభుత్వం మాత్రం 800 ఖాతాలే రుణమాఫీకి అర్హమైనవని స్పష్టం చేసింది. ఎర్నగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2800 ఖాతాలు రుణమాఫీకి అర్హమైనవి ఉంటే కేవలం 356 మంది రైతులే అర్హులని, ఆచంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ 860 ఖాతాలు పంపిస్తే 362 ఖాతాలే అర్హమైనవని పేర్కొంది. ఇక గున్నంపల్లి సొసైటీకి సంబంధించి 474 ఖాతాలు పంపిస్తే.. తొలి జాబితాలో 377మందినే అర్హులుగా గుర్తించారు. ఈ లెక్కన చూస్తే జిల్లాలో కేవలం 40 శాతం మంది రైతులనే రుణమాఫీకి అర్హులుగా సర్కారు పేర్కొన్నట్టు స్పష్టమవుతోంది. రూ.50 వేల లోపు రుణాలు ఎన్ని? చంద్రబాబు తాజాగా ప్రకటించిన 50 వేల లోపు రుణాలు ఒకేసారి రద్దు ప్రకటన కూడా జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువని తెలుస్తోంది. 50వేల పైన ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్నా ఇప్పుడు కేవలం 20 శాతం మాత్రమే మాఫీ అవుతుందని, మిగిలిన లెక్క ఎప్పుడు తేలుతుందో స్పష్టత లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకూ తెలీదు : ఎల్డీఎం లక్ష్మీనారాయణ జిల్లాలో యాభైవేల లోపు వ్యవసాయ రుణాలు తీసుకున్నవారు ఎంతమంది ఉన్నారు.. మిగిలినవారికి బాండ్లు ఏ విధంగా ఇస్తారన్న సమాచారం నా వద్ద కూడా లేదు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారుల వద్దే ఈ సమాచారం ఉంటుంది. జిల్లా కలెక్టర్ కూడా నన్ను అడుగుతున్నారు... కానీ నాకూ తెలియడం లేదని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణ గురువారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. డ్వాక్రా రుణాలదీ అదే దారి.. గడువులోగా డ్వాక్రా రుణాలు చెల్లిస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీ పడదని, ఇప్పుడు జాప్యం కారణంగా వివిధ బ్యాంకులను బట్టి 13 నుంచి 15 శాతం వడ్డీ పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో డ్వాక్రా రుణాలు రూ. వెయ్యికోట్లకు పైగా ఉన్నాయి. డ్వాక్రా రుణాలనూ మాఫీ చేస్తానని, కానీ ఎప్పుడనేది తర్వాత మాట్లాడతానన్న సీఎం ఆ రుణాలపై వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందా అనేదానిపై స్పష్టతనివ్వలేదు. అయోమయంలో కౌలు రైతులు జిల్లాలో రెండున్నర లక్షలమంది కౌలు రైతులు ఉన్నారు. గతేడాది వీరిలో 54 వేలమందికి రూ.138 కోట్ల రుణాలిచ్చారు. కౌలు రైతు గుర్తింపు కార్డులున్న వారికే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రైతుమిత్ర గ్రూపుల్లో ఉన్న వారిపై ఆయన స్పష్టతనివ్వలేదు. దీంతో జిల్లాలోని కౌలు రైతులందరికీ రుణ మాఫీ వర్తిస్తుందా లేదా ఇంకా పజిల్గానే ఉంది. వాస్తవానికి ప్రభుత్వపరంగా తమకు ఇచ్చిన రుణం తక్కువని అది మాఫీ చేసేందుకు సిద్ధం కాకపోవడం బాధాకరమని కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీమా సొమ్ము పాతబాకీల్లో జమ ఖరీఫ్లో వచ్చిన తుపాన్లు కారణంగా ఒక లక్షా 13 వేల 452 మంది రైతులు పంట నష్టాలు చవిచూశారు. దీనికి ప్రభుత్వం ఇటీవలే రూ. 120 కోట్లు విడుదల చేసింది. అయితే ఒకపక్క రుణమాఫీ సొమ్ము జమ కాక, రానున్న రబీకి బీమా సొమ్ము ఉపయోగించుకోవడానికి కూడా వీలు లేకుండా వాటిని వాణిజ్య బ్యాంకులు, సొసైటీలు కూడా తమ ఖాతాల్లోకి జమ వేసుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నేడు ఏలూరులో మహాధర్నా రుణమాఫీ కొర్రీతో రైతన్నలు, మహిళలనే కాదు.. నిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను, వెయ్యిరూపాయల పెన్షన్ ఇస్తామంటూ సగానికి సగం మంది లబ్ధిదారులను తగ్గించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను దారుణంగా వంచించిన చంద్రబాబు సర్కారు విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉదయం పదిగంటల నుంచి మహాధర్నా నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీని గెలిపించిన పశ్చిమ రుణం తీర్చుకోలేనిదంటూ చెబుతున్న బాబుకు శుక్రవారం నాటి ధర్నాతో సర్కారుపై ఇక్కడి ప్రజల ఆగ్రహం ఎలా ఉందో అర్థం కానుందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, వేలాదిమంది తరలివచ్చే ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఘోరంగా వంచించారు రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఘోరంగా వంచించారు.రేషన్, ఆధార్, ఇతర పత్రాలు లేకుండానే రుణమాఫీ చేస్తానని చెప్పి తీరా వడపోతకు అవన్నీ ఉపయోగించి రైతులను నట్టెట ముంచారు. - డేగా ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి కౌలు రైతుల రుణాన్ని మాఫీ చేయాలి కౌలు రైతులందరికీ ప్రభుత్వం ఐడీ కార్డులు ఇవ్వలేదు. ఇవ్వని కౌలు రైతులు రైతుమిత్ర గ్రూపు ద్వారా రుణాలు పొందారు. రాష్ట్రంలో కౌలు రుణాలు రూ.160 కోట్లని బ్యాంకర్లు అంటున్నారు. ఈ మొత్తాన్ని మాఫీ చేయాలి. - కె.శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హామీలు తుంగలో తొక్కారు ఎన్నికల్లో షరతులు, రుణపరిమితి లేకుండా అందరికీ రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రైతుల నడ్డివిరిచారు. రూ. 50 వేల లోపు రుణమాఫీ వల్ల చిన్న, సన్నకారు రైతులకు మేలు జరగదు. - మంతెన సీతారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి పూర్తి రుణామాఫీ కావాలి రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులు 83 లక్షల మంది ఉన్నారని ఎన్నికలప్పుడు చెప్పారు. ఇప్పుడు 23 లక్షల మందికి మాఫీ అంటున్నారు. దీనిలో ఏది నిజం. వెంటనే రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకోవాలి. -బి.బలరాం, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి -
సమరభేరి!
ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసింది... ప్రభుత్వ మోసపూరిత విధానం బట్టబయలైంది... ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాభేరి మోగనుంది. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. రుణమాఫీ అమలులో ప్రభు త్వ వైఖరి, హుద్హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం మహాధర్నాకు సర్వం సిద్ధమైంది. ⇒ ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యక్ష కార్యాచరణ ⇒ నేడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ధర్నా ⇒ సమాయత్తమవుతున్న వైఎస్సార్కాంగ్రెస్ శ్రేణులు ⇒ భారీగా తరలిరానున్న ప్రజలు ⇒ అధికార జులుంతో ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్ర సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చరిత్రాత్మక ప్రజాపోరాటానికి జిల్లా కలెక్టరేట్ వేదికగా నిలవనుంది. కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించే ఈ ధర్నాలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పాల్గొననుండటం జిల్లాకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. దాంతో ఈ ధర్నాను విజయవంతం చేయడానికి జిల్లా యావత్తూ కదలివస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కొన్ని రోజులుగా సన్నాహాలను ముమ్మరం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడ గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజులతోపాటు నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ధర్నా విజయవంతం చేయాల్సిన ఆవశ్యతకను కార్యకర్తలను వివరించారు. రైతులు, మహిళలు, తుపాను బాధితులు, అని వర్గాల ప్రజలు వారికి సంఘీభావం ప్రకటించారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్కృష్ణరంగారావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం జిల్లావ్యాప్తంగా పర్యటించి పార్టీ శ్రేణులను సమాయత్తపరిచారు. దాంతో శుక్రవారం ధర్నాకు జిల్లావ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చేందుకు సంసిద్ధమయ్యారు. పోలీసుబలంతో అధికార జులుం: వెల్లువెత్తుతున్న సానుకూలత ప్రభుత్వంలో కలవరం కలిగిస్తోంది. అందుకే పోలీసు బలాన్ని ప్రయోగిస్తోంది. 2వేలమంది పోలీసులను మోహరించడం గమనార్హం. ధర్నాకు వచ్చే వాహనాలను అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే పోలీసులు విశాఖలోనూ గ్రామాల్లోనూ పోలీసులు ప్రైవేటు వాహన యజమానులను బెదిరిస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏదో ఒక సాకుతో నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీ సుకోవాలని కుట్ర పన్నుతోంది. మరోవైపు ధర్నాలకు అనుమతిలేదం టూ పోలీసులు గురువారం రాత్రి హడావుడిగా ఓ ప్రకటన విడుదల చేయ డం సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గే పోలీ సులు ఈ ప్రకటన విడుదల చేశారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ధర్నా ను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు కూడా కుట్రలు పన్నుతున్నారు. శాంతియుతంగా ధర్నా...: వైఎస్సార్ కాంగ్రెస్ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా శుక్రవారం ధర్నా నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆద్యంతం పార్టీ కార్యకర్తలు శాంతియుతంగానేవ్యవహరిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు. వై.ఎస్.జగన్ పర్యటన ఇలా... జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించిన వివరాల ప్రకారం... జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సర్క్యూట్ గెస్ట్హౌస్కు వస్తారు. అక్కడ కొంతసేపు ఉన్న తరువాత ఉదయం 10గంటలకు ధర్నా నిర్వహించే కలెక్టరేట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంటవరకు ధర్నా నిర్వహిస్తారు. అనంతరం వై.ఎస్.జగన్ సర్క్యూట్ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యాక సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళతారు. -
మరోసారి ఉద్యమబాటకు వైఎస్ఆర్ సీపీ శ్రీకారం
విశాఖ : ప్రజలకిచ్చిన వాగ్ధానాలు, ఇచ్చిన హమీలను గాలికొదిలేసిన పాలకపక్షంపై ప్రతిపక్షం పోరుబాటకు సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విశాఖ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. వైఎస్ఆర్సీపీ పిలుపుకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజాపక్షంగా పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి ఉద్యమబాటకు శ్రీకారం చుట్టింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఆరునెలలవుతున్నా ప్రజలకిచ్చిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకపోవడంపై ప్రతిపక్షం మండిపడుతోంది. తెలుగుదేశం నేతలు రోజుకో కట్టుకధ, పూటకో పిట్టకధ చెబుతూ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దగాలు...జనం దిగాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు డిసెంబర్ 5న జరిగే మహధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆన్ని జిల్లాల్లో ఇప్పటికే విడుదల చేశారు. మాట తప్పిన ప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ ధర్నాలు, నిరసనల కార్యక్రమం కొనసాగుతోందని వైఎస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే. మొదటి ఐదు సంతకాలతో స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానంటూ ప్రజల సాక్షిగా చేసిన ప్రమాణాలు ఇప్పుడేమయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, పింఛన్లు కోల్పోయిన లబ్ధిదారులు ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజాగ్రహం ఏ స్ధాయిలో చాటి చెప్పింది. అయితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలకు సిద్దమయ్యారు. -
రేపే వైఎస్సార్సీపీ మహా ధర్నాలు
-
వైఎస్ఆర్ సీపీ 'మహాధర్నా'కు కోఆర్డినేటర్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే మహాధర్నాకు కో ఆర్డినేటర్లకు నియమించారు. ధర్నాను జయప్రదం చేసేందుకు జిల్లాలవారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం-బేబినాయన విజయనగరం-సుజయ్కృష్ణ రంగారావు విశాఖపట్నం-తలశిల రఘురాం తూర్పుగోదావరి-గొల్ల బాబూరావు పశ్చిమగోదావరి-ధర్మాన ప్రసాదరావు కృష్ణా-మోపిదేవి వెంకటరమణ గుంటూరు-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకాశం-బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు-భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కడప-జంగా కృష్ణమూర్తి అనంతపురం-విజయసాయి రెడ్డి కర్నూలు-భూమా నాగిరెడ్డి -
5న మహాధర్నా జయప్రదం చేయండి...
‘మచిలీపట్నం’ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పార్థసారథి, నాని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 5వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న మాహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం కంకిపాడులో జరిగిన సమావేశంలో ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పు కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, దక్షిణ కృష్ణాఅధ్యక్షుడు, మాజీమంత్రి కె.పార్థసారథి, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పార్టీనేతలు దుట్టా రామచంద్రరావు, బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రా్రంపసాద్ పాల్గొన్నారు. కంకిపాడు : ‘ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరిచి ఉద్యమంలో భాగస్వాములను చేయాలి’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, తూర్పు కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పార్టీ ఏదైనా బాధితులు మాత్రం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పోరాట పంథా వైపు చూస్తున్నారన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఓ కమిటీని రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పంపిన తరువాతే రైతులు, కౌలుదారులు, కూలీల అగచాట్లు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. తేలప్రోలు పంచాయతీని టీడీపీ కార్యాలయంలా పచ్చ రంగు వేశారని, మద్దూరులో పల్లెకారుల గుడిని లాక్కునేందుకు చూస్తున్నారని చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళలకు అవస్థలు : నాని రైతు, డ్వాక్రా రుణాలు రద్దు కాక ఆయా వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని పార్టీ తూర్పు కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలకు పొంతనే లేకదన్నారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ రుణమాఫీ జాబితా గందరగోళంగా ఉందని చెప్పారు. నేత బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారన్నారు. రైతు నాయకుడు నరేంద్ర మాట్లాడుతూ రానున్న రోజుల్లో చంద్రబాబు, పవన్లను రాళ్లతో కొట్టే రోజులు ముందున్నాయని చేసిన వ్యాఖ్యలతో సమావేశంలో చప్పట్లు మారుమోగాయి. అవనిగడ్డ నియోజకవర్గ నేత సింహాద్రి రమేష్బాబు మాట్లాడుతూ మాట్లు వేస్తామంటూ వచ్చి ప్రజలను మోసం చేసి సత్తు సామాన్లతో ఉడాయించినట్లుగా బాబు వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు, గన్నవరం నేత రామచంద్రరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎం. రాము, స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు అయూబ్ఖాన్, పఠాన్ కరీముల్లా ఖాన్, సయ్యద్బాబు, ఉయ్యూరు మండల కన్వీనర్ వి. శ్రీనివాస ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్(బుడ్డి), మద్దాలి రామచంద్రరావు, కొణతం గిరిధర్ పాల్గొన్నారు. -
సర్కారు వంచనపై నిరసన భేరి
5న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు విశాఖలో జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా గుంటూరు జిల్లా నేతలతో ఏర్పాట్లపై చర్చించిన వైసీపీ అధినేత ఈ ఆందోళనలు విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు సాక్షి, హైదరాబాద్: మాట తప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా డిసెంబర్ అయిదో తేదీన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో పాల్గొంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన గుంటూరు జిల్లా నాయకుల సమావేశంలో ఐదో తేదీ ధర్నా నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించారు. అధికారంలోకి వస్తే రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు ఆ తరువాత వారిని మోసం చేశారని, పింఛన్ల, రేషన్కార్డుల తొలగింపు, ఊరూరా లెసైన్సు పొందిన మద్యం దుకాణాల ఏర్పాటు వంటి నిర్ణయాలతో టీడీపీ ప్రభుత్వం వంచన పరాకాష్టకు చేరుకుందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఐదు నెలలుగా ప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఈ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 15 నాటికి కమిటీల ఏర్పాటు పూర్తి డిసెంబర్ 15వ తేదీ నాటికల్లా జిల్లా, మండల, పట్టణ, గ్రామ కమిటీల అనుబంధ సంఘాల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని జగన్ జిల్లా నేతలకు సూచించారు. మిగతా జిల్లాల్లో కూడా ఇదే విధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని ఆయా జిల్లాల నేతలకు వర్తమానం పంపాలని సంబంధిత రాష్ట్ర నేతలను ఆదేశించారు. సమావేశానంతరం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ... రైతుల, మహిళల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇపుడు మాట తప్పారని, ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో మళ్లీ పర్యటన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఏపీ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో మరో రెండు రోజులపాటు పర్యటిస్తారని పార్టీ పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇప్పటికే అక్కడ కొన్ని గ్రామాల్లో రెండు రోజులపాటు కమిటీ పర్యటించి వచ్చిందని, అక్కడ రైతుల మనోభావాలు ఎలా ఉన్నాయో జగన్కు సమావేశంలో వివరించామని తెలిపారు. అన్ని గ్రామాల్లో పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పార్టీ అధ్యక్షుడు తమకు సూచించారని చెప్పారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష కమిటీ సమావేశానికి ఆహ్వానిద్దామని కూడా జగన్ అభిప్రాయ పడ్డారని తెలిపారు. పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (ప్రకాశం), సామినేని ఉదయభాను (కృష్ణా), కె.ఆగస్టీనాతో సహా పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు. -
విశాఖ మహాధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డిసెంబర్ 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించనుంది. విశాఖపట్నంలో జరిగే మహాధర్నాలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా నేతలతో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూముల వ్యవహారంపై రైతుల అభిప్రాయాలను వైఎస్ జగన్ కు వివరించినట్టు ఆయన తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించిందని తెలిపారు. మిగిలిన గ్రామాల పర్యటన పూర్తైన తర్వాత వైఎస్ జగన్ కు నివేదిక ఇస్తామని చెప్పారు. అవసరాన్ని బట్టి అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసే విషయం కూడా చర్చించామన్నారు. -
చలో ఢిల్లీ వెళ్తున్న రైలుపై రాళ్లదాడి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమవారం నాడు ఢిల్లీలో జరుగుతున్న మహాధర్నాలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు వెళ్తున్న ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ సమీపంలో కొంతమంది దుండగులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. దాంతో కొన్ని బోగీల అద్దాలు పగిలిపోయాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఈ రైలునే లక్ష్యంగా కొంతమంది దుండగులు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. కేవలం సమైక్య నినాదాలతోనే తాము వెళ్తున్నామని, తమను తాము రక్షించుకోడానికి కూడా ఎలాంటి అవకాశం లేదని శ్రీనివాస్ అనే ప్రత్యక్ష సాక్షి ఫోన్ ద్వారా తెలిపారు. -
తిరుపతిలో మహిళల ఆత్మహత్యాయత్నం
తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సమైక్యవాదులు వేలాదిగా తరలి వచ్చారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా కొంతమంది మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో సీత, రమణమ్మ అనే మహిళలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
17న ఢిల్లీలో వైఎస్ఆర్సిపి మహాధర్నా
-
సీమాంధ్ర లాయర్ల మహాధర్నాలో పాల్గొన్న వైఎస్సాఆర్ నేతలు
-
ధర్నా చేపట్టిన రోజా
-
సమైక్యం తప్ప ప్రత్యామ్నాయం లేదు: భూమన
సమైక్య రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేనే లేదన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకరరెడ్డి. తిరుపతి సత్యనారాయణపురం సర్కిల్లో చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఎగసి పడుతున్న సమైక్య సెగలను చూశాకయినా విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ప్రాభవాన్ని తగ్గించేందుకే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రె స్, టీడీపీ నాయకులు నిందలు వేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం దుయ్యబట్టారు. వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోరుతూ 2001 ముందే కేంద్రానికి వైఎస్ లేఖ రాసినట్లు అసత్యాలు పలుకుతున్నారని చెప్పారు. ప్రజల్లో వైఎస్కున్న అభిమానాన్ని తగ్గించాలనే దురుద్దేశంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.