కాపు రిజర్వేషన్‌: మంజునాథ కమిషన్ పర్యటన | manjunatha commision tour in West godavari district | Sakshi
Sakshi News home page

కాపు రిజర్వేషన్‌: మంజునాథ కమిషన్ పర్యటన

Published Tue, Nov 29 2016 8:37 PM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM

కాపు రిజర్వేషన్‌: మంజునాథ కమిషన్ పర్యటన - Sakshi

కాపు రిజర్వేషన్‌: మంజునాథ కమిషన్ పర్యటన

ఏలూరు: కాపు కులస్తులకు బీసీ రిజర్వేషన్‌ కల్పించే అంశంపై ఏర్పాటయిన మంజునాథ కమిషన్‌ క్షేత్రస్థాయి పర్యటన చేయనుంది. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం కమిషన్‌ మంగళవారం రాత్రి ఏలూరుకు చేరుకుంది.

కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ, సభ్యులు ప్రొఫెసర్ వి.సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ ఎం.పూర్ణచంద్రరావు, ఎస్.సత్యనారాయణ, మెంబర్ సెక్రటరీ ఎ.కృష్ణమోహన్‌లకు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లు స్వాగతం పలికారు. అనంతరం కమిషన్‌తో సమావేశమయ్యారు. డిసెంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జిల్లాలో కమిషన్ పర్యటిస్తుంది. బుధవారం ఉదయం ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో కుల సంఘాలు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement