
నర్సు దివ్యా(ఫైల్)
కర్ణాటక, యశవంతపుర: ఉడుపి జిల్లాలో కరోనాతోపాటు డెంగీ కూడా ప్రబలుతోంది. ఈక్రమంలో బెళ్మణ్కు చెందిన దివ్యా(23) అనే నర్సు డెంగీ లక్షణాలతో మృతి చెందింది. ఉడుపిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తున్న ఆమె 15 రోజులుగా జ్వరంతో బాధపడుతూ అదే ఆస్పత్రిలోనే చికిత్స పోందుతోంది. జ్వరం తీవ్రత ఆధికంగా ఉండటంతో మంగళవారం మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.