dengue fever
-
రాష్ట్రానికి చలిజ్వరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ మొదలు ఏజెన్సీ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. ఏ ఆస్పత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో ఔట్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కిక్కిరిసిపోతున్న పెద్దాస్పత్రులు ⇒ హైదరాబాద్లోని ఒక్క ఫీవర్ ఆస్పత్రికి ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన జ్వరాల బాధితులు 12,080 మందికావడం ఆందోళనకరం. నాలుగైదు రోజులుగా రోజూ 800 వరకు ఔట్ పేషెంట్లుగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ జ్వర సంబంధ సమస్యలతో సుమారు 700 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ⇒ ఇక చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్కు సోమవారం 1,600 మంది ఔట్ పేషెంట్లుగా నమోదుకాగా.. ఇందులో చలి కారణంగా ‘న్యుమోనియా’వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్ పేషెంట్లుగా 1,300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ⇒ ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం జనరల్ మెడిసిన్ కింద వైద్యం కోసం వచ్చిన ఔట్పేషెంట్లు 290, ఇక గాంధీ ఆస్పత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన ఔట్ పేషెంట్ల సంఖ్య 35,547. అంటే సగటున ప్రతీరోజు 1,500 మంది వస్తున్నారు. ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతీరోజు 300 నుంచి 500 మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు. ⇒ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రతీరోజు 50కి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఉట్నూరు ఐటీడీఏ, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట మన్ననూరు, కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కానీ చాలా మంది గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గరే సొంత వైద్యం చేసుకుంటున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. తగ్గిన డెంగీ, చికున్గున్యా... ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులు.. నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. డెంగ్యూ కేసులు సెప్టెంబర్, అక్టోబర్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,500కు పైగా డెంగీ కేసులు నమోదవగా..సెపె్టంబర్లో 1,542, అక్టోబర్లో 854 కేసులు ఉన్నాయి. ఈ నెలలో 22వ తేదీ వరకు 168 కేసులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇక చికున్గున్యా కేసులు సెప్టెంబర్లో 183, అక్టోబర్లో 13 నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 13 కేసులే వచ్చాయని వివరిస్తున్నారు. మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి... కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది. దీని కారణంగా న్యుమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఇబ్బందిపడుతున్న వారు అధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది కూడా. చలితో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.ఈ చిత్రంలోని తల్లీకొడుకులు ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామానికి చెందినవారు. తల్లి మిరియాల రాజమ్మకు వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, కుమారుడు అనుపాల్కు టైఫాయిడ్. ఇద్దరూ ఇప్పుడు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి పెరగడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.చలిజ్వరంతో బాధపడుతున్నా..చలి, తీవ్ర జ్వరం, కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా దవాఖానాకు వచ్చిన. డాక్టర్లు పరీక్షించి వార్డులో చేర్చుకున్నారు. పొద్దున, సాయంత్రం వచ్చి చూస్తున్నారు. కొంచెం నయమైంది. – తూడి సోమక్క, వనపర్తి, లింగాల గణపురంశ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో 2,350 మంది ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చారు. అందులో 80 మంది జ్వరాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల టెస్టులు చేయడానికి ఎక్స్రే, ఈసీజీ, ట్రెడ్మిల్, టూడీ ఈకో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సరిపడా టెక్నీíÙయన్స్ లేక అన్ని టెస్టులు ఒక్కరే చేస్తున్నారు. సరిపడా మందులు ఉన్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీయడం లేదు. – డాక్టర్ గోపాలరావు, జిల్లా వైద్యాధికారి, ములుగుసీజనల్ వ్యాధులతో జాగ్రత్త శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి గాలిలో తిరగవద్దు. బయటికి వెళ్లినప్పుడు మాసు్కలు ధరించడం మంచిది. వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి -
జ్వర భద్రం
డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇంతకుముందులా కాకుండా ‘మిక్స్డ్ ఇన్ఫెక్షన్ల’తో జనాల ఆరోగ్యాన్ని నిలువునా పీలి్చపిప్పిచేస్తోంది. రెండు, మూడు రకాల వైరస్లు సోకుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. జ్వరంతోపాటు తీవ్ర నీరసం, ఒళ్లంతా నొప్పులతో.. కనీసం బెడ్పై నుంచి లేచి నడవలేనంతగా బాధపెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే తగిన వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ‘నిలువు దోపిడీ’ సమరి్పంచుకోలేక.. శారీరకంగానే కాదు, మానసికంగానూ జనం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషజ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతున్నా, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం జ్వరాలతో మంచాన పడింది. డెంగీ, చికున్గున్యా, మలేరియా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. పెరుగుతున్న డెంగీ తీవ్రత రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే జరుగుతోంది. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 6,051 డెంగీ కేసులు, 164 చికున్గున్యా కేసులు, 197 మలేరియా కేసులు నమోదయ్యాయి. కానీ లెక్కలోకి రాని కేసులు భారీ స్థాయిలో ఉన్నాయనే అంచనా. ముఖ్యంగా డెంగీ దడ పుట్టిస్తోంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే ఏకంగా 3,317 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్లో అత్యధికంగా 1,267 కేసులు, నల్లగొండ జిల్లాలో 276 కేసులు, ఖమ్మం జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరిగినా.. అధికారికంగా నమోదవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలదాకా వసూళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు వసూలు చేస్తున్నాయని డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులు వాపోతున్నా రు. ముఖ్యంగా డెంగీ వచ్చి ఆస్పత్రిలో చేరితే చాలు.. పరిస్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చికిత్సల కోసం వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిక్కడంలో వైద్యశాఖ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణ, బాధితులకు చికిత్స అందించడంపై దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దడంపై ఫోకస్ చేస్తున్నా.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రికార్డు స్థాయిలో రోగులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,680 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. హైదరాబాద్లోని ఉస్మానియాకు 2,566 మంది, గాం«దీకి 2,192 మంది, వరంగల్ ఎంజీఎంకు 2,385 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. ఓపీ నమోదైంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.ప్లేట్లెట్స్ టెస్టు కోసం బయటికి.. నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో మూడు రోజులుగా వైద్యం తీసుకుంటున్నా. నా భర్తకు కూడా జ్వరమే. ఆస్పత్రిలో ప్లేట్లెట్ టెస్ట్ చేసే సదుపాయం లేదని టెస్టుల కోసం బయటికి పంపించారు. – కె.లక్ష్మీతిరుపతమ్మ, సత్తుపల్లి మందులు సరిగా ఇవ్వడం లేదు నేను నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. వైద్యులు పారాసెటమాల్ 650 ఎంజీ మాత్రలు రాశారు. కానీ సిబ్బంది 500 ఎంజీ మాత్రలు, అదీ రెండు రోజులకు సరిపడానే ఇచ్చారు. 650 ఎంజీ మాత్రలు బయట కొనుక్కోవాలని చెప్పారు. – మశమ్మ, నాగర్కర్నూల్మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావంసీరో టైప్–1, 2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్.. కోవిడ్ వచ్చి తగ్గినవారిలో నీరసం మరింత ఎక్కువఅడిషనల్ డీఎంఈ రాజారావు వెల్లడి ‘‘ఏ వైరల్ జ్వరం అయినా వీక్నెస్ ఉంటుంది. కోవిడ్ వచి్చపోయిన వారిలో నీరసం మరింత ఎక్కువగా ఉంటోంది. వైరల్ జ్వరం వచ్చిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. డెంగీలో సీరో టైప్–2 అనేది మన వద్ద ఎక్కువగా వ్యాపిస్తోంది. మిగతా డెంగీ వేరియంట్ల కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తీవ్రత మరింత పెరుగుతుంది. ఎవరికైనా సీరో టైప్–1 డెంగీ ఒకసారి వచి్చ, రెండోసారి సీరో టైప్–2 వస్తే.. మొదటిదాని యాంటీబాడీస్, రెండో టైప్ ఇన్ఫెక్షన్ క్రాస్ రియాక్షన్ వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇక డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం కంటే.. ప్లాస్మా లీకేజీ చాలా ప్రమాదకరం. రక్తంలోని నీరు రక్తనాళాల నుంచి లీక్ అవడమే ప్లాస్మా లీకేజీ. దీనివల్ల పల్స్, బీపీ పడిపోవడం, తర్వాత తీవ్ర కడుపునొప్పి, వాంతులు రావడం, చెమటలు పట్టడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, అవయవాలు విఫలమయ్యే కూడా వెళ్తుంది. అయితే వంద మందికి డెంగీ వస్తే.. అందులో ఐదుగురికి మాత్రమే ప్లాస్మా లీకేజీ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం సాధారణ లక్షణమే. చాలా మందిలో వాటంతట అవే పెరుగుతాయి. ఒకవేళ రక్తస్రావం జరుగుతున్నా, 20 వేలకన్నా తక్కువకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయినా.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్ టెస్టులను పెథాలజిస్ట్ చూసి నిర్ధారించాలి. మిషన్లో లెక్కిస్తే.. ఉన్నదానికంటే తక్కువగా చూపించే చాన్స్ ఉంటుంది. – ప్రొఫెసర్ ఎం.రాజారావు, అడిషనల్ డీఎంఈఏ ఆస్పత్రిలో చూసినా అవే సమస్యలు.. ⇒ మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు పీహెచ్సీలలో మందుల కొరత ఉంది. అన్ని రకాల యాంటీ బయాటిక్స్ అందుబాటులో లేవు. జలుబు సిరప్, కంటి చుక్కల మందులు, క్లేవమ్ వంటి మందులు కూడా లేవు. ఇంజక్షన్లు అందుబాటులో లేవు. వైద్యులు ఐదారు రకాల మందులు రాస్తే వాటిలో రెండు, మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ⇒ నాగర్కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో జ్వరం, ఇతర జబ్బులకు కేవలం రెండు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. ⇒నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. వారం రోజులకు మందులు రాస్తే.. మూడు రోజుల మందులే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు లేకపోవడంతో బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ⇒బోధన్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు.డెంగీతో ఇద్దరి మృతిపాపన్నపేట(మెదక్)/సిద్దిపేట అర్బన్: వేర్వేరు జిల్లాల్లో డెంగీతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్కు చెందిన వడ్ల రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హర్షిత్చారి (11)కి వారం రోజుల క్రితం డెంగీ సోక గా.. కుటుంబ సభ్యులు మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డబ్బులు కట్టలేక, నిలోఫర్కు తరలించగా.. హర్షిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి జ్వరంతో బాధ పడుతుండటంతో సిద్దిపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా నయం కాకపోవడంతో నిమ్స్కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపుతాం ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహఅడ్డగోలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీసు కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయొచ్చు ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహసాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచి్చందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు టాస్్కఫోర్స్ పనిచేస్తోందని.. ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆస్పత్రులను పరిశీలించిందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై శనివారం సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. డెంగీని గుర్తించేప్పుడు టెస్టు రిపోర్టులు సరిగా ఉంటున్నాయా లేదా పరిశీలిస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఆస్పత్రులు డెంగీ పరీక్షలు చేసిన, నిర్ధారణ అయిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయండి: ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూం నడుస్తోందని.. విషజ్వరాల బాధితులు తమ సమస్యలపై దానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులంతా ఆస్పత్రుల పర్యటనకు వెళ్లాలని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించాం. మందుల కొరత ఉండకూడదని చెప్పాం..’’ అని మంత్రి వెల్లడించారు. కోఠి ఆస్పత్రిలోని వెక్టార్ బార్న్ డిసీజెస్ విభాగం కంట్రోల్ రూం నంబర్ 94404 90716 -
జ్వరం.. కొత్త లక్షణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా ప్రజలను వింత జ్వరాలు వేధిస్తున్నాయి. జ్వరం ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతున్నా ఆ తరువాత కీళ్ల వాపులు, శరీరంపై ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో జ్వరం వస్తే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉండేది. కానీ ప్రస్తుతం జ్వరం ఒక్కరోజు మాత్రమే ఉంటోంది. 103 నుంచి 104 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. కానీ దుష్ఫలితాలు పది నుంచి 15 రోజుల పాటు వెంటాడుతూనే ఉన్నాయి.మలేరియా, డెంగీ అనుమానిత కేసులువిజయవాడ నగరంలోని మొగల్రాజపురం, మారుతీనగర్, గుణదల, పాతబస్తీలోని చిట్టినగర్, కేఎల్రావు నగర్ వంటి ప్రాంతాల్లో డెంగీ, మలేరియా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. కొందరిలో డెంగీ ఎన్ఎస్1 పరీక్షలో పాజిటివ్ వస్తూ, ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయి. అలాంటి వారిలో డెంగీ ఎలీజా పరీక్ష చేస్తే నెగిటివ్ వస్తోంది. గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు సోకగా, పదిహేను రోజులుగా నగరంలో కూడా జ్వర బాధితులు పెరుగుతున్నారు. దోమకాటుతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కూడా జ్వరాలు పెరుగుతున్నాయి.దోమల నివారణ ప్రచార ఆర్భాటమేవిజయవాడ నగరంలో వ్యాధులు సోకకుండా దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారమే కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు జరగడం లేదు. ఏదైనా అనుమానిత కేసు వచ్చిన ప్రాంతంలో వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది వెళ్లి చుట్టు పక్కల ఇళ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాలు సైతం యాప్లో ఫొటోలు అప్లోడ్ చేసేందుకు రెండు, మూడు ప్రాంతాల్లో పర్యటించి సరిపెడుతున్నారు. దోమల నియంత్రణ క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు. దీంతో నగర ప్రజలు దోమకాటు వ్యాధులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు.కనిపిస్తున్న లక్షణాలు ఇవీ.. ⇒ తొలుత జ్వరం వచ్చి ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతుంది.⇒ ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ప్రారంభమవుతున్నాయి.⇒ క్రమేణా కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. ⇒ ఇలాంటి వారిలో కొందరు రెండు మూడు రోజులు మంచం మీద నుంచి కిందకు దిగి నడవలేని పరిస్థితి తలెత్తుతోంది.⇒ కొందరిలో కాళ్ల వాపులు సైతం ఎక్కువగా వస్తున్నాయి.⇒ వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.⇒ ఈ లక్షణాలు పది రోజుల నుంచి 15 రోజులు పాటు ఉంటూ ప్రజలను బాధిస్తున్నాయి.⇒ కొంత మందిలో జ్వరం తక్కువగా ఉండి గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వేధిస్తున్నాయి.⇒ ఇలాంటి వారు తీవ్రంగా నీరసించి పోతున్నారు. రెండు మూడు రోజులకు దగ్గు కూడా ప్రారంభమవుతుంది. వారం నుంచి పది రోజుల పాటు దగ్గు ఇబ్బంది పెడుతోంది.జ్వరాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి..ప్రస్తుతం ప్రబలిన జ్వరాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఒక రోజు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఆ తర్వాత చాలా మందిలో కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. కొందరైతే, రెండు, మూడు రోజులు మంచంపై నుంచి దిగలేని పరిస్థితి ఏర్పడుతోంది. పది నుంచి పదిహేను రోజుల పాటు నొప్పులు ఉంటున్నాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నారు. డెంగీ ఎన్ఎస్1 పాజిటివ్ వచ్చి, ప్లేట్లెట్స్ తగ్గినా, ప్రమాదకరంగా మారడం లేదు. వాటికవే పెరుగుతున్నాయి. కొందరిలో భరించలేని తలనొప్పి, బాడీపెయిన్స్ కూడా ఉంటున్నాయి. నిపుణులైన వైద్యులను సంప్రదించి వైద్యం పొందితే మంచిది.– డాక్టర్ ఎస్.డి.ప్రసాద్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ -
తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్..
-
డబ్ల్యూహెచ్వో చెప్పినా.. పెడచెవిన..
‘ఈ సీజన్లో తెలంగాణకు డెంగీ ప్రమాదం పొంచి ఉంది. డెంగీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండగా, డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. డీఈఎన్వీ1, డీఈఎన్వీ2, డీఈఎన్వీ3, డీఈఎన్వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు కూడా ఒకేసారి రోగులపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది.’ – రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికసాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు తగ్గట్టే రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ప్రజారోగ్య సంచాలకుల విభాగం మాత్రం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే..ఈ ఏడాది ఆరు నెలల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ నివేదిక పేర్కొంది.లక్షలాది మందికి జ్వరాలు.. ఆస్పత్రులు కిటకిటరాష్ట్రంలో లక్షలాది మందికి జ్వరాలు సోకాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఒక వైద్యాధికారి వెల్లడించారు.దీంతో రాష్ట్రంలో జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికున్గున్యా కేసులు భారీగా నమోదయ్యాయి. చాలామంది రోగులు జ్వరంతో బాధపడుతూ ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు పెరి గారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 40 మంది వచ్చేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య వందకు పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెయ్యిచొప్పున ఓపీ ఉంటోంది.రక్తస్రావం జరిగితే ప్రమాదకరండెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వారు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.– డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, హైదరాబాద్ -
డేంజర్ బెల్స్.. ఫీవర్ హాస్పిటల్
-
డేంజర్ డెంగ్యూ
-
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్వీ1, డీఈఎన్వీ2, డీఈఎన్వీ3, డీఈఎన్వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి?లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ దోమ కాటు వల్ల వస్తుంది. సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది. DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనే నాలుగు రకాల వైరస్ల కారణంగా డెంగ్యూ జ్వరం వస్తుంది. దోమలు కుట్టిన 5-8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణం కాగా, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (ప్రమాదకరమైనది). డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి కండరాలు, కీళ్ళ నొప్పి వాంతులు అవుతున్నట్లు అనిపించడం డీహ్రైడ్రేషన్కు గురి కావడం పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరల్లోని హాస్పిటల్లో చూపించుకోవాలి. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. వ్యాధి వ్యాపించే విధానం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పగలు కుట్టే దోమల వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో నీళ్లు ఎక్కువగా నిలిచిఉన్నా దోమలు వృద్ది చెందుతాయి. ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్,పూలకుండీలు, టైర్లు, మూత పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్ ద్వారా దోమలు గుడ్లు పెట్టి తర్వాత ఇతరులకు వ్యాపిస్తుంది. డెంగ్యూ.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. ♦ప్లేట్లెట్లు 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు. ♦ 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావొచ్చు. ♦ 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ♦ 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్లెట్ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం. ♦ డాక్టర్లు సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి బలమైన, పౌష్టికాహారం తినాలి. డీహైడ్రేషన్కు గురి కాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూకు ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క, ఉమ్మెత్త మొక్క సారాన్ని జ్వరం, నొప్పులు తగ్గడానికి వాడతారు. తులసీ, పుదీనా, అల్లం, యాలకులు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాన్ని జ్వరం తగ్గడానికి వాడతారు. ► ఊద రంగులో ఉండే చిలకడదుంపల కషాయం డెంగ్యూని తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చిలకడదుంపల ఆకుల్లో డెంగ్యూని నివారించే యాంటీ ఆక్సిడైజింగ్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు నిర్థారించారు. ఈ ఆకుల్లో ఉన్న సహజమైన ఫోలిఫినోలిక్ అందుకు కారణం అని తేల్చారు. ► బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు. దీనికోసం బొప్పాయి చెట్టు ఆకులు, కాండము లేకుండా మెత్తగా దంచి పసరు తీయాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు (గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికే. డాక్టర్ల సలహాతోనే వాటిని పాటించాలి. ) -
డెంగీ జ్వరంతో బాలింత మృతి
జైపూర్: మండలంలోని రామారావుపేట గ్రామ పంచాయతీ పరిధి దుబ్బపల్లికి చెందిన బాలింత కామెర రుచిత(22) జ్వరంతో శుక్రవారం మృతిచెందింది. కొడుకు పుట్టిన 12 రోజులకే కన్నతల్లి ప్రేమను పంచకుండానే దూరమైంది. వివరాలిలా ఉన్నాయి. రుచితకు దుబ్బపల్లికే చెందిన కామెర సంతోష్కుమార్తో ఏడాది క్రితం వివాహామైంది. 12రోజుల క్రితం మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె బాబుకు జన్మనిచ్చింది. వారం రోజుల తర్వాత ఇంటికి చేరింది. మూడు రోజులుగా రుచితకు జ్వరం వస్తుండడంతో గురువారం మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. రక్తకణాలు తగ్గాయని, డెంగీ పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించి కరీంనగర్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు నిర్దారించారు. కాగా, రుచిత తండ్రి లక్ష్మణ్ ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి చంద్రమ్మ కూలీ పని చేస్తూ కూతురి వివాహం జరిపించింది. కొడుకు జన్మించిన సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. -
ఇంజక్షన్ వికటించి వివాహిత మృతి
వరంగల్: మండల కేంద్రానికి చెందిన శ్యామల స్వాతి(23) ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెండు రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో స్వాతి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ స్రవంతి నర్సింగ్ హోమ్లో చేరింది. దీంతో ఆమె రక్తాన్ని టెస్ట్ చేయగా మలేరియా, డెంగీ నెగెటివ్ వచ్చాయి. అయితే ప్లేట్స్ లెట్స్, బీపీ తక్కువగా ఉండడంతో సాయంత్రం వైద్యుడు వరప్రసాద్ చికిత్స నిర్వహించారు. బీపీ అదుపులోకి రావడానికి ఇంజక్షన్ ఇవ్వగా ఆమె మృతి చెందింది. ఈ విషయంపై మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు వరప్రసాద్ను నిలదీశారు. ఇంజక్షన్ చేసిన తర్వాతే స్వాతికి మాట రాలేదనని, పిచ్చిగా అరిచిందని తెలిపారు. వరంగల్ తీసుకెళ్తుంటే మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఒక్కొకసారి రిపోర్ట్లో నెగెటివ్ వచ్చినా పరిస్థితి విషమిస్తుందన్నారు. బీపీ తక్కువగా ఉండడం వల్ల ఇంజక్షన్ చేసి వరంగల్కు తీసుకెళ్లాలని చెప్పానన్నారు. స్వామి మృతి విషయంలో తన నిర్లక్ష్య ఏమీ లేదన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ అప్పయ్యను వివరణ కోరగా బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మృతురాలికి భర్త కార్తీక్, కూతురు ఉంది. -
డెంగీతో విద్యార్థిని మృత్యువాత?
కర్ణాటక: టీబీ డ్యాం ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక డెంగీతో మృతి చెందిన ఘటన జరిగింది. నగరంలోని విజ్ఞాన్ ఈ టెక్నో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాహ్నవి(13)కి డెంగీ జ్వరం సోకింది. జాహ్నవి టీబీ డ్యాం వంకాయ క్యాంపునకు చెందిన తిరుమలేష్ కుమార్తె. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విద్యార్థిని హొసపేటెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఈనెల 18న దావణగెరె బాపూజీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక ఆసుపత్రిలో బుధవారం మృతి చెందింది. జాహ్నవి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విజయనగర జిల్లాలో ఈ ఏడాది డెంగీతో మృతి చెందిన మొట్టమొదటి వ్యక్తి విద్యార్థిని జాహ్నవి. బాలిక మృతికి వైరల్ ఫీవరా లేక డెంగీ కారణమా అనే విషయంపై విజయనగర జిల్లా ఆరోగ్య శాఖ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!
మహబూబాబాద్: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది. రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరు నెలల పాప.. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్కే.గౌస్– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్ తెలిపారు. -
ప్రబలుతున్న జ్వరాలు.. ఆందోళనలో ప్రజలు..!
చింతలమానెపల్లి మండలం నందికొండ గ్రామానికి చెందిన భీంరావుకు జ్వరం రావడంతో కాగజ్నగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కొద్దిగా కోలుకోవడంతో ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించి పదిరోజుల క్రితం ఇంటి వద్ద మృతి చెందాడు. భీంరావు మరణంతో భార్య, పిల్లలు పెద్దదిక్కును కోల్పోయారు. కుమరం భీం: పల్లెలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాలతోపాటు గ్రామీణ మండలాల్లోని ప్రజలు జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నాణ్య మైన వైద్యం అందక ఇటీవల పెంచికల్పేట్ మండలంలోని కొండెపల్లిలో ఓ మహిళ, చింతలమానెపల్లి మండలం నందికొండలో యువకుడు మృత్యువాత పడ్డారు. అయితే జిల్లావ్యాప్తంగా జ్వరాల వ్యాప్తిపై అధికారికంగా రికార్డులు లేవు. కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని పరీక్షలనే రికార్డులుగా అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారే అధికంగా ఉండటం గమనార్హం. జ్వరాల వ్యాప్తి గ్రామీణ మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరా యంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కారణంగా నే దోమలతో వ్యాప్తిచెందే మలేరియా, డెంగీ వి జృంభిస్తున్నాయి. కలుషితమైన వాతావరణం, ఆహారం కారణంగా టైఫాయిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులతో చిన్నారులపై ఫ్లూజ్వరం ప్రభావం చూపుతోంది. జలుబు, దగ్గు, స్వల్ప జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. టైఫాయిడ్ సోకిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం, వాంతులు, విరోచనాలు ఉంటాయి. డెంగీ వ్యాధిగ్రస్తులకు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక భాగంలో తలనొప్పి ఉంటుంది. వీపు భాగంలో ద ద్దుర్లు, మచ్చలను కూడా గమనించవచ్చు. మలేరియా బానిన వారిలో చలి జ్వరం ఎక్కువగా ఉంటుంది. పీహెచ్సీల్లో పరీక్షలు టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాపిడ్ పరీక్షల ద్వారా మలేరియాను నిర్ధారిస్తున్నా.. టైఫాయిడ్, డెంగీ శాంపిళ్లను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఫలితాలు రావడానికి ఒక రోజు సమయం పడుతోంది. దీంతో కొన్నిచోట్ల అనుమానిత లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కట్టడి చర్యలేవి.? జ్వరాల కట్టడికి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు పంచాయితీ కార్యాలయాల్లో ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతుండడంతో ఫాగింగ్ నిలిచిపోయింది. మరోవైపు పారిశుధ్యం అధ్వానంగా ఉండడం కూడా దోమలు ఉధృతికి కారణమవుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు దిక్కవుతోంది. నియంత్రణకు చర్యలు జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. తిర్యాణి వంటి ఏజన్సీ ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎలిసా పరీక్ష ద్వారా డెంగీని కచ్చితంగా నిర్ధారిస్తున్నాం. ఈ ఫలితాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నాం. – కృష్ణప్రసాద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డెంగీతో ఒకరి మృతి పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన గోలేటి మారుతి(42) డెంగీతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతికి నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఈస్గాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య శారద, కుమార్తె ఉన్నారు. కాగా.. మారుతి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా 20 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. -
తీవ్రస్థాయిలో జ్వరం.. చిన్నారి మృతి! తండ్రి తిరుగు ప్రయాణం..
జగిత్యాల: డెంగీతో చిన్నారి మృతిచెందిన ఘటన ఆదివారం రాయికల్ మండలం రామాజిపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోనే గౌతమి–రాజరెడ్డి కూతురు గోనే మోక్ష(5)కు వారం రోజులుగా తీవ్రస్థాయిలో జ్వరం రాగా జగిత్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్థారించారు. రక్తకణాలు తక్కువగా ఉన్నాయని తెలపడంతో కరీంనగర్ తరలించి వైద్యం అందిస్తుండగా మృతిచెందింది. రాజరెడ్డి ఇటీవలే ఉపాధి నిమిత్తం గల్ఫ్వెళ్లాడు. చిన్నారి మృతితో తండ్రి తిరుగు ప్రయాణం అయ్యాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
డెంగీతో వివాహిత మృతి
భద్రాద్రి: డెంగీతో ఓ వివాహిత మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన మలిపెద్ది సంధ్య (22)కు ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో భర్త రామకృష్ణ ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అనంతరం పరీక్షించిన వైద్యులు ఆమెకు డెంగీ లక్షణాలున్నాయని నిర్ధారించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి 18 నెలల కుమారుడు ఉన్నాడు. -
ప్రముఖ స్టార్ హీరో సల్మాన్కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డెంగ్యూ బారిన పడ్డాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న సల్మాన్ పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. దీంతో రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సల్మాన్కు డెంగ్యూ రావడంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగులు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం ఆయన ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు బిగ్బాస్ సీజన్-16 ను సల్మాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో కరణ్ జోహార్ కనిపించనున్నారు. దీంతో సల్మాన్ కోలుకునేవరకు బిగ్బాస్ సీజన్ను కరణ్ హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే గతంలో కరణ్ బిగ్బాస్ ఓటీటీ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణకు ‘ఫుల్ ఫీవర్’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వానలు.. దోమలతో.. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా.. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తీవ్రత గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. ► నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ► కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. ► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్ గున్యా కేసులు వచ్చాయి. ► ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ► సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మూడు రోజులుగా జ్వరంతో.. మా బాబు మహేశ్ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. – మహేశ్ తల్లి, ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్ లెట్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. – సాయి కిరణ్ (20), బాగ్ అంబర్పేట ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
వైరల్ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష
సాక్షి, అమరావతి: సీజనల్ జ్వరాల బారినపడుతున్న ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. ఓ వైపు వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు జ్వరాలబారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 1,237 మలేరియా, 2,174 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సీజనల్ వ్యాధుల బారినపడే వారికి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స లభిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సల సంఖ్యను ప్రభుత్వం ఏకంగా 2,446కు పెంచింది. త్వరలో వీటిని 3,118కి పెంచనుంది. 7,032 మందికి చికిత్స ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 689 మంది మలేరియా బాధితులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందారు. వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య ఉంటోంది. ఈ క్రమంలో ఎలీసా నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ.. ర్యాపిడ్ కిట్లో పాజిటివ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగ్యూ చికిత్స అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు వరకు 6,343 మంది చికిత్స పొందారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 1,612 మంది ఉన్నారు. పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకి ఉచిత చికిత్స.. ఎలీసా పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,174 డెంగ్యూ కేసులను మాత్రమే నిర్ధారించారు. ఎలీసా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయితేనే డెంగ్యూ ఉన్నట్టు. అయితే కొన్ని రకాల వైరల్ జ్వరాల్లో ఎముక మజ్జ అణచివేత (బోన్మ్యారో సప్రెషన్)తో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ జ్వరాల బారినపడి.. ప్లేట్లెట్స్ తగ్గినవారికి ఎలీసా పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి పరిస్థితులున్న బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు -
డెంగీపై సర్కారు యుద్ధం.. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, దీనిపై సర్కారు యుద్ధం ప్రకటించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ప్రతీ ఐదేళ్లకోసారి కేసులు పెరుగుతుంటాయని, ఇది ఐదో సంవత్సరం అయినందున పెరుగుతున్న తీరు గమనిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మంత్రి కేటీఆర్తో కలిసి సోమవారం ఆయన జూమ్ ద్వారా వైద్య, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలో జూలైలో 542 డెంగీ కేసులుంటే, ఆగస్టులో 1,827 కేసులు నమోదయ్యాయన్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించామని, ఎంత రక్తం అవసరమైనా ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 17న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు పెట్టి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాట్లు చేస్తామన్నారు. డెంగీ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జ్వర సర్వేతోపాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ను ప్రతీ ఒక్కరికి జీహెచ్ఎంసీ పరిధిలో వేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు: కేటీఆర్ ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించాలని, నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రణాళిక రూపొందించాలన్నారు. ‘గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బాగా చేశాం. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు, మహిళలనూ భాగస్వాములను చేయాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు కూడా తమ గృహాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టర్లు జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసేలా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. విద్యార్థులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలి. డిజిటల్ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలి’ అని కేటీఆర్ చెప్పారు. డెంగీ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచినీటిలో ఉంటాయని అందువల్ల నీరు నిలువ లేకుండా చూడాలని చెప్పారు. పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలన్నింటిలో జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో, డెంగీ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే ఉద్యమంలా నిర్వహించాలన్నారు. ఇదీ చదవండి: ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్ -
హైదరాబాద్లో పెరుగుతోన్న డెంగ్యూ కేసులు
-
హైదరాబాద్ను వణికిస్తున్న డెంగీ కేసులు.. షార్ట్స్ వేసుకుంటే కాటేస్తాయి
సాక్షి, హైదరాబాద్: దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి నగరంలో ప్రబలుతోంది. సాధారణంగా వానాకాలంలో ఎక్కువగా కనపడే డెంగీ.. ఇప్పుడు సీజన్స్కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. నగరవాసులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. సంపన్న ప్రాంతాల్లో అధికం.. కొంత కాలంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లలోని సంపన్న ప్రాంతాల్లో సైతం కేసులు బాగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. డెంగీ దోమకి గుడ్డు పెట్టడానికి 10మి.లీ ద్రవం చాలు. కూలర్స్, ఫ్రిజ్లు, ఏసీలు తదితరాల నుంచి వృథా నీరు ఎప్పటికప్పుడు తొలగించకపోవడం, ఇళ్లల్లో ఇంటీరియర్ అందం కోసం ఎక్వేరియమ్స్ నీళ్లలో తాబేలు, ఫ్లవర్ పాట్స్ లాంటి డెకరేటివ్ ఉత్పత్తుల్లో నీళ్లు రోజూ మార్చకపోవడం దోమల విజృంభణకు కారణమవుతోంది. వేసవి సెలవులు కారణంగా.. ఊరు వెళుతున్నప్పుడు వారం, పదిరోజుల పాటు ఆ నీటిని అలాగే వదిలేస్తుండడం.. ఈ నిల్వ నీటిలో సులభంగా డెంగీ దోమ గుడ్లు పెడుతోంది. షార్ట్స్ వేసుకుంటే.. కాటు.. డెంగీ దోమ అడుగున్నర మించి ఎగరలేదు. మోకాళ్ల పైదాకా వచ్చి కుట్టలేదు. కాబట్టి డెంగీ దోమ షార్ట్స్ వేసుకునే అలవాటు ఉన్నవారికి తరచుగా కాటేస్తున్నట్టు గుర్తించారు. సిబ్బంది దోమల మందు పిచికారీ చేయడానికి కూడా కొన్ని కాలనీస్లలో అడ్డుకుంటున్నారు. ఇది సరికాదు.. ప్రస్తుతం తుంపర్లు లేకుండా గాలిలోనే కలిసిపోయేలా మందు పిచికారీ చేస్తున్నారు. కాబట్టి కాలనీలలో అడ్డు చెప్పకుండా సహకరించాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 48.5 శాతం అంటే 2,091 కేసులు హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. డెంగీ లక్షణాలు, చికిత్స ►ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల. ►ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్తోపాటు తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ►డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే వెంటనేవైద్యుని సలహా తీసుకోవాలి. ►ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే దాన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించాలి. ►జ్వరం తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ►రోగికి ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు మళ్లీ పెరుగుతాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి ఖాళీ బీరు, విస్కీ తదితర బాటిల్స్ ఇంట్లో, మేడమీద ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దు. ఫ్లవర్ పాట్స్ కింద ఉంచే ప్లేట్స్ నుంచి నీటిని తొలగిస్తూ ఎప్పటిప్పుడు శుభ్రం చేస్తుండాలి. ప్రతి నాలుగైదు రోజులకోసారి ఇంట్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రం చేస్తుండాలి. పగిలిన వినియోగించని ప్లాస్టిక్ కంటైనర్లు, వాడేసిన కొబ్బరి చిప్పలు, పాత సామాన్లు పడేసే స్టోర్ రూమ్స్ దోమల నివాసాలని గుర్తించాలి. షౌకత్నగర్లో ఎక్కువ... నాన్ సింప్టమాటిక్ డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటిదాకా ఇన్ పేషెంట్ చికిత్స అవసరం ఎవరికీ రాలేదు. ఒక్క కేసు వచ్చినా చుట్టూ 100 ఇళ్లు ఫీవర్ సర్వే చేస్తూ, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. కేవలం షౌకత్ నగర్లో తప్ప ఒకసారి డెంగీ గుర్తించిన ప్లేస్లో మళ్లీ కేసులు రావడం లేదు. సిటీలో షౌకత్ నగర్లో 6 కేసుల వరకూ వచ్చాయి. నగరంలోని 152 బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు.. ఇలా అన్ని చోట్ల ఉచిత పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. – నిరంజన్, జిల్లా మలేరియా ప్రోగ్రామ్ అధికారి, హైదరాబాద్ -
ఢిల్లీలో డెంగీ తొలి మరణం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో డెంగీ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది ఇదే తొలి మరణమని వెక్టార్ డిసీజ్ పౌర నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సరితా విహార్కు చెందిన మమత(35) డెంగీ బారిన పడి సెప్టెంబర్ 20న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె సెప్టెంబర్ 25న మృతి చెందారని వివరించింది. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో 723 డెంగీ కేసులు నమోదు అయ్యాయని, గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9 వరకూ 480 కేసులు వెలుగులోకి రాగా ఒక్క వారంలోనే 243 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. గడిచిన 2 వారాలుగా ఢిల్లీలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి పేర్కొన్నారు. 2020లో 1,072 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారని, 2019లో ఇద్దరు, 2018లో నలుగురు, 2017లో 10 మంది, 2016లో 10 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు, మార్చిలో ఐదు, ఏప్రిల్లో పది, మేలో 12, జూన్లో ఏడు, జూలైలో 16, ఆగస్ట్లో 72, సెప్టెంబర్లో 217 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో మలేరియా కేసులు 142, చికున్గున్యా కేసులు 69 నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. (చదవండి: కోవాగ్జిన్పై అదనపు సమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ) -
Body Aches: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి..
అనేక వ్యాధుల్లో అత్యంత సాధారణ ప్రాథమిక లక్షణం ఒళ్లునొప్పులు. ఓ వయసు దాటాక అప్పుడప్పుడూ ఒళ్లునొప్పులు కనిపిస్తుంటాయి. అయితే అవి మామూలుగానే వచ్చే ఒళ్లునొప్పులా లేక ఏదైనా వ్యాధి కారణంగానా అని రోగనిర్ధారణ చేయడం డాక్టర్కు ఎప్పుడూ సవాలే. ఎందుకంటే... అది జ్వరంగానీ, జలుబుగానీ లేదా ఏదైనా వైరల్, బ్యాక్టీరియల్, ఇతరత్రా ఇన్ఫెక్షన్లన్నింటిలోనూ చాలా కామన్గా కనిపిస్తుంటాయి కాబట్టే ఆ ఇబ్బంది. అలాగే మనం సాధారణంగా వాడే కొలెస్ట్రాల్ మందులు మొదలుకొని అత్యంత తీవ్రమైన వ్యాధి వల్ల కూడా కావచ్చు. మామూలుగానైతే ఒళ్లునొప్పులు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. అలాగని నిర్లక్ష్యమూ తగదని చెబుతూ... ఏయే సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించే కథనమిది. కండరాల నొప్పుల్లో చాలా రకాలుంటాయి. కండరాల నొప్పుల్ని మయాల్జియా అని, కీళ్ళనొప్పుల్ని ఆర్థ్రాల్జియా అని, కీళ్ళలో వాపు ఉంటే ఆర్థ్రరైటిస్ అని, మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూ)లో నొప్పులు/ఇన్ఫెక్షన్లు ఉంటే టెండనైటిస్ అని, నరాల్లో నొప్పులుంటే న్యూరాల్జియా అని, ఎముకల్లో నొప్పులుంటే బోన్ పెయిన్స్ అంటాం. నొప్పులకు చాలా కారణాలుంటాయి. ఇందులో కొన్ని... ►ఇన్ఫెక్షన్లు... ∙వైరల్ జ్వరాల్లో : సాధారణ ఫ్లూ (ఇన్ఫ్లుయెంజా), అప్పట్లో చికున్ గున్యా మొదలుకొని ఇటీవల చాలా ఎక్కువగా ప్రబలుతున్న డెంగీ వరకు. అలాగే హెపటైటిస్–బి, హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లలో. ►ప్రోటోజోవన్ ఇన్ఫెక్షన్లు : మలేరియా, పిల్లి వల్ల వ్యాప్తిచెందే టాక్సోప్లాస్మోసిస్ వంటి ఏకకణజీవి ఇన్ఫెక్షన్లలో. ►బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు: టైఫాయిడ్, రికెట్సియల్ వంటి జ్వరాల్లో, బొరిలియా ప్రజాతికి చెందిన బ్యాక్టీరియాతో వచ్చే లైమ్ డిసీజ్ వంటి జబ్బుల్లో. ►ఇరతత్రా ఇన్ఫెక్షన్లు : ట్రైకినెల్లా స్పైరాలిస్, సిస్టిసెర్కోసిస్ (బద్దెపురుగు) వంటి సరిగ్గా ఉడికించని పోర్క్ ద్వారా వ్యాపించే పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లలో. ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన కండిషన్లు... డెంగీ : ఇటీవల అనుమానించాల్సిన జబ్బు ఇది. డెంగీలో ఒళ్లునొప్పుల తీవ్రత చాలా ఎక్కువ. అందుకే దీన్ని ‘బోన్ బ్రేకింగ్ ఫీవర్’ అని కూడా అంటారు. ఇలాంటి నొప్పులతో పాటు విపరీతమైన నడుమునొప్పి ఉంటే దాన్ని ‘డెంగీ’గా అనుమానించాలి. ►ఫ్లూ. ఇతర జ్వరాలు: ఫ్లూ జ్వరం ఇన్ఫ్లుయెంజా వైరస్ల వల్ల వస్తుంది. ఇందులో ‘ఇన్ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్ఫ్లుయెంజా బి’, ‘ఇన్ఫ్లుయెంజా సి’ అని మూడు రకాలున్నాయి. వీటన్నింటిలో తీవ్రమైన ఒళ్లునొప్పులతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉంటాయి. చాలామందిలో అవి వాటంతట అవే తగ్గుతాయి. లక్షణాలనుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్ తీసుకుంటే చాలు. చాలా అరుదుగా కొందరిలో నిమోనియా, శ్వాస అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలి. ►చికున్గున్యా: ఇదీ వైరల్ జ్వరమే అయినా ఇందులో మిగతా వైరల్ ఇన్ఫెక్షన్ల కంటే కీళ్లనొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. నొప్పుల కారణంగా రోగి నడవలేక పూర్తిగా ఒంగిపోతాడు. దీనికి ఉపశమనం కోసం పారాసిటమాల్ వాడి, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ►లెప్టోస్పైరోసిస్ : ఒళ్లునొప్పులతో మొదలయ్యే జ్వరమిది. ప్రస్తుత వర్షాకాలంలో మురుగునీటివల్ల, ఎలుకల ద్వారా వ్యాప్తిచెందే అవకాశాలెక్కువ. ఇందులోనూ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిమందిలో మాత్రం కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి అనేక కీలక అవయవాలు ఒకేసారి దెబ్బతినే ప్రమాదం (మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్) జరిగి అది ప్రాణాంతకం కావచ్చు. లెప్టోస్పైరోసిస్ను ముందే తెలుసుకుంటే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్ వంటి మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. ►క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్: ఈ జబ్బులో త్వరగా అలసిపోవడం, తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోవడం, శక్తి లేనట్టు అనిపించడం ముఖ్యలక్షణాలు. ఆర్నెల్లకు పైగా ఇవే లక్షణాలు ఉండి, జ్ఞాపకశక్తి క్షీణించడం, నిద్రలేమి వంటివి కూడా ఉంటే, ఆ లక్షణాలన్నీ చూసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ జబ్బుకు సరైన కారణం తెలియదు. క్రానిక్ ఇన్ఫెక్సియస్ మోనోన్యూక్లియోసిస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ కూడా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్కు కారణం కావచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ►మందులతో : కొన్ని జబ్బులకు మనం వాడే మందులతో కూడా ఒళ్లునొప్పులు రావచ్చు. ఇందులో కొలెస్టరాల్ తగ్గించడానికి సాధారణంగా వాడే స్టాటిన్స్ వంటివీ ఉంటాయి. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మందులు మార్చడమో, మోతాదు తగ్గించడమో చేస్తారు. కొన్ని విషసర్పాలు కాటు వేసినప్పుడు కండరాల మీద కనిపించే దుష్ప్రభావం వల్ల కూడా కండరాల నొప్పులు వస్తాయి. అలాగే మనకు తెలియకుండా మన దేహంలోకి వెళ్లే విషాల వల్ల కూడా కండరాల నొప్పులు రావచ్చు. కీళ్లనొప్పులకు సంబంధించిన వ్యాధులతో నొప్పులు... కీళ్లనొప్పులతో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో, జన్యుపరమైన లోపాల వల్ల ముక్కుకు ఇరువైపులా మచ్చలా కనిపించే సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్లో, పాలీమయాల్జియా రుమాటికా (అంటే గ్రీకు భాషలో అనేక కండరాల్లో నొప్పి అని అర్థం), పాలీమయోసైటిస్, జోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి కీళ్లవ్యాధుల్లో ►నరాలు, కండరాలకు సంబంధించిన వ్యాధులు: – మయోపతి, మయస్థేనియా గ్రేవిస్, ఫైబ్రోమయాల్జియా వ్యాధుల్లో. ►ఎండోక్రైన్ వ్యాధులు : – హైపోథైరాయిడిజం, హైపర్పారాథైరాయిడిజం, హైపర్పారాథైరాయిడిజం వంటి వాటితోపాటు... ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్లలో. పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ వల్ల: శరీరంలో ఎక్కడ క్యాన్సర్ సోకినప్పటికీ... ఇతర కండరాలపై దాని ప్రభావం వల్ల వచ్చే కండిషన్ అయిన ‘పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్’లో. ►మల్టిపుల్ మైలోమా: ప్లాస్మాకణాల క్యాన్సర్లలో ఇలా ఒకింత తీవ్రమైన కారణాల్లోనే కాకుండా... సాధారణంగా అంతగా అపాయం లేని సమస్యల్లోనూ ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అవి... ∙తీవ్రమైన అలసటతో వచ్చే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్లో ►మందులు, విషపదార్థాలు: డీ–పెన్సిల్లెమైన్స్, క్లోరోక్విన్, స్టెరాయిడ్స్, జిడోవిడిన్ వంటి మందులతోపాటు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగించే మందుల వల్ల కూడా ఒళ్లునొప్పులు వస్తుంటాయి. ∙ఒక్కోసారి ఆల్కహాల్ మితిమీరి తీసుకున్న మర్నాడు కూడా. ►క్యాన్సర్ రోగుల్లో కీమో థెరపీ తీసుకుంటున్నప్పుడు కూడా ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటాయి. చేయించాల్సిన పరీక్షలు: పైన మనం చెప్పుకున్నట్లుగా ఎన్నెన్నోరకాల సమస్యల వల్ల ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. కాబట్టి ఏ కారణం వల్ల అవి వస్తున్నాయో కనుగొనడం ప్రధానం. అందుకే చేయించాల్సిన కొన్ని సాధారణ పరీక్షలివి... ►మూత్రపరీక్ష ►ఈఎస్ఆర్ ►హీమోగ్రామ్ ►కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు ►సీరమ్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరోసిస్ (ఎస్పీఈపీ ►స్కెలెటల్ సర్వే ►బోన్ స్కాన్ ►సీరమ్ క్యాల్షియమ్ ఫాస్ఫరస్ ►ఆల్కలైన్ ఫాస్ఫోటేజ్ పరీక్షలు ►25 హైడ్రాక్సీ వైటమిన్ డి లెవెల్స్ ►సీరమ్ పారాథోర్మోన్ లెవెల్స్ ►బోన్మ్యారో (ఎముక మూలగ) పరీక్ష ►యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ పరీక్ష ►రుమటాయిడ్ ఫ్యాక్టర్ ►హెచ్ఐవీ ►హెచ్బీఎస్ఏజీ ►హెచ్సీవీ పరీక్షలు ►మజిల్ బయాప్సీ ►ఈఎంజీ... ఒక్కోసారి అన్ని పరీక్షలు చేశాక కూడా రోగనిర్ధారణ జరగకపోవచ్చు. అలాంటివారిలో అందుకు కారణం యాంగై్జటీ, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కారణం కావచ్చు. అలాంటివారికి సైకియాట్రిస్ట్లతో తగిన మందులు, సలహాలతో మంచి ఫలితం ఉంటుంది. చాలా సందర్భాల్లో నిరపాయకరమైన కారణాల వల్లనే ఒళ్లునొప్పులు వస్తుంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం సాధారణంగా ఉపయోగించే నొప్పినివారణ పూత మందులు వాడితే చాలు. అయితే ఇవి ఉపయోగిస్తున్నప్పటికీ రెండుమూడు వారాల తర్వాత కూడా తగ్గకుండా ఒళ్లునొప్పులు కనిపిస్తూనే ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. - డాక్టర్ కె. శివ రాజు సీనియర్ ఫిజీషియన్ -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడివి శేష్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నటుడు హైదరాబాద్లో ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కాగా గతవారం అడివి శేష్ డెంగ్యూ బారిన పడగా.. తాజాగా ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శేష్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు హీరో అరోగ్యం విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా హీరో శేష్ ప్రస్తుతం “మేజర్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. దీంతోపాటు ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘గూఢచారి 2’ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ‘హిట్’కు సీక్వెల్గా రూపొందుతున్న ‘హిట్2’లో శేష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపిస్తారట. ‘హిట్’ తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనుయే ‘హిట్ 2’ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. చదవండి: నగరంలో వరుస హత్యలు.. రావాలి ఓ గూఢచారి Sonu Sood: ప్రతి రూపాయి పేదల కోసమే.. ఐటీ సోదాలపై సోనూసూద్ -
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న విషజ్వరాలు
-
విషజ్వరాలూ ఆరోగ్యశ్రీలోకి..
సాక్షి, విశాఖపట్నం: సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు విషజ్వర పీడితులకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, వైద్యులతో మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. (చదవండి: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి) రాష్ట్రవ్యాప్తంగా విశాఖ జిల్లాలోనే అత్యధిక మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 462 డెంగీ, 708 మలేరియా, 24 చికున్గున్యా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లోతట్టు, నీటి నిల్వలున్న ప్రాంతాలు, దోమల లార్వా నిల్వ ప్రాంతాల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయడమే కాకుండా వైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశామని మంత్రి నాని చెప్పారు. అలాగే, ఐటీడీఏ పరిధిలోని పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాలు, పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాట్స్పాట్ ప్రాంతాల గుర్తింపు విషజ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాలను ‘హాట్ స్పాట్’ ప్రాంతాలుగా గుర్తించి.. అక్కడే వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రే చేయిస్తున్నామని, ఏజెన్సీలో దోమ తెరలు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Bigg Boss 5 Telugu: జనాలను పిచ్చోళ్లను చేసిన లోబో, సిరి) -
TS: రాష్ట్రానికి జ్వరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రంలో 5 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా. జూలైలో 2 లక్షలు, ఆగస్టులో 3 లక్షల మంది జ్వరం బారినపడ్డారు. తరచూ వర్షాలు పడటం, వాతావరణం చల్లబడటం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక.. తదితర కారణాలతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దోమలు కుడుతున్నాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విషజ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య ఒక్కసారిగా గణ నీయంగా పెరిగినట్లుగా వైద్య యంత్రాంగం అంచనా. ఈ నెలంతా కూడా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. డెంగీ, మలేరియా కేసులు మరింత అధికంగా నమోదయ్యే పరిస్థితులున్నాయి. ఒకవైపు కరోనా అనుమానం... మరోవైపు వైరల్ ఫీవర్లతో జనం హడలిపోతున్నారు. కొన్నిచోట్ల వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారింది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు రావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో డెంగీ కోరలు... రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆగస్టులోనే అత్యధికం వెలుగుచూశాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ కేసులున్నాయి. ఇక మలేరియా కేసులు కూడా భారీగానే నమోదువుతున్నాయి. ఒక్క ఆగస్టులోనే 116 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మలేరియా జ్వరాలు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ప్రభుత్వ అంచనాకు మించి జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం... అధికారికంగా ఒక కేసును గుర్తిస్తే, గుర్తింపునకు నోచుకోకుండా సమాజంలో పదింతలు అధికంగా కేసులున్నట్లుగా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో కేసుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను పీల్చి పిప్పిచేస్తున్నాయి. 50 వేల వరకు ప్లేట్లెట్లు ఉన్నా, ప్లేట్లెట్ రక్తం ఎక్కిస్తూ లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అయితే 10 వేల వరకు తగ్గినా, వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరంలేదని వైద్య నిపుణులు అంటున్నారు. పగటిపూట కుట్టే దోమతో డెంగీ... డెంగీ కారక ఈడిస్ ఈజిప్ట్ దోమ పగటిపూటే కుడుతుంది. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పెరుగుతుంది. పగిలిన చిన్నముంతలో ఒక వారం రోజులు కదపకుండా దోసెడు నీరున్నా చాలు. అందులో పునరుత్పత్తి కొనసాగిస్తుంది. ఎయిర్ కూలర్లలో, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన మంచినీటిలో, వాడకుండా పక్కన పడేసిన పాత టైర్లు, రేకు డబ్బాల్లోని నీటిలో జీవనం సాగిస్తుంది. ఇక మలేరియా దోమ మురుగునీటిలో వృద్ధి చెందుతుంది. అందుకే పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగీని నిర్లక్ష్యం చేయొద్దు – డాక్టర్ బి.సౌమ్య, జనరల్ పిజీషియన్, కాంటినెంటల్ ఆసుపత్రి, హైదరాబాద్ ప్రస్తుతం జ్వరాల కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గొంతునొప్పి, జ్వరంతో అనేకమంది ఆసుపత్రులకు వస్తున్నారు. డెంగీ, కరోనా కలిపి గతంలో అధికంగా కేసులు రాగా, ఇప్పుడు డెంగీ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. డెంగీలో 102–103 జ్వరం కూడా వస్తుంది. పారసిటమాల్ మాత్ర వేసినా తగ్గే పరిస్థితి ఉండదు. కరోనాలో మాత్ర వేశాక తగ్గుముఖం పడుతుంది. డెంగీ లక్షణాలున్న తర్వాత నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం సంభవిస్తుంది. మాకు వస్తున్న కేసుల్లో 90 శాతం వరకు ఇళ్లలోనే ఉంచి చికిత్స చేస్తున్నాం. 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినప్పుడే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. 10 వేల వరకు తగ్గినా కూడా ఒక్కోసారి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరంలేదు. రక్తస్రావం జరగడం ఇతరత్రా ప్రమాదకర లక్షణాలుంటేనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. సోమవారం ఆదిలాబాద్లోని రిమ్స్లో ఒకే బెడ్పై చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు -
విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకపక్క ప్రజలు జలుబు, దగ్గుతో బాధపడుతుండగా.. మరోవైపు విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ప్రాణాలు తీస్తున్నాయి. ప్రబలుతున్న వ్యాధులపై సాక్షి ప్రత్యేక కథనం. – కుత్బుల్లాపూర్ ► కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో చెత్తా చెదారాలకు తోడు ఆయా ప్రాంతాల్లో పందులు, దోమల బెడద అధికంగా ఉంది. ► మలేరియా సిబ్బంది తూతూ మంత్రంగా కాలనీల్లో పర్యటిస్తూ పనులు చేస్తున్నా దోమలు విజృంభిస్తున్నాయి. ► దీంతో అనేకమంది డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ► ఓ యువ డాక్టర్ ప్రస్తుతం డెంగీతో మరణించడంతో స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. ► నిజామాబాద్కు చెందిన అర్పిత రెడ్డి (32) జీడిమెట్ల డివిజన్ మీనాక్షి ఎస్టేట్స్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తోంది. 5 రోజుల క్రితం త్రీవమైన జ్వరం రావడంతో నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించగా డెంగీగా తేలింది. చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మృత్యువాత పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈమెకు ఒక కూతురు ఉంది. ఓ డాక్టర్ విధంగా డెంగీతో చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. పత్తాలేని వైద్యాధికారులు... చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి! ► ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలం మురికివాడల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య అధికారులు పత్తా లేకుండా పోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. ఒకవైపు విషజ్వరాలు సోకి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికం అవుతోంది. స్థానికంగా పారిశుద్ధ్యం విషయంలో జంట సర్కిల్ వైద్యాధికారులు తమ పరిధి కాదన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గాజులరామారం సర్కిల్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఫొటోలకే పరిమితం అన్నట్లుగా స్థానికంగా విధులు నిర్వహించే వైద్యాధికారి తీరుపై పలు మురికివాడ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు.. ► కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో విష జ్వరాలు సోకడం వల్ల మరింత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. మీనాక్షి ప్రాంతానికి చెందిన ఓ మహిళ సుచిత్ర సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతుండగా, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల పేట్బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడింది. -
ఫిరోజాబాద్లో డెంగ్యూ మహమ్మారి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో డెంగ్యూ మహమ్మారి చెలరేగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులు బృందం నిర్ధారించింది. ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో 200 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా వాటిలో 50 శాతం మందికి డెంగ్యూ పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో గత 10 రోజుల్లో 60 మందికి పైగా డెంగ్యూ కారణంగా మరణించగా, అందులో 50 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులకు ప్రమాదకరమైన హీమరాజిక్ ఫీవర్ వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. హీమరాజిక్ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ల సంఖ్య ఉన్నట్టుండి పడిపోతుంది. దీంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. దీంతో చిన్నారులు తక్కువ సమయంలోనే మరణిస్తున్నట్లు నిపుణులు బృందం తెలిపింది. యూపీలో చిన్నారులకు వ్యాపిస్తున్న జ్వరాలు హీమరాజిక్ డెంగ్యూ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలిపినట్లు ఫిరోజాబాద్ కలెక్టర్ ఇటీవలే వెల్లడించారు. జనావాసాల పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే వాటిని శుభ్రం చేయాలని తాజాగా ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ బృందంలో ఎంటొమాలజిస్టులు సహా పలు వెక్టర్–బోర్న్ వ్యాధుల నిపుణుల ఉన్నారు. వారు పరిశీలించిన అంశాలను కేంద్రానికి సోమవారం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఎన్సీడీసీకి చెందిన తుషార్ ఎన్ నేల్ ఆధ్వర్యంలోని బృందం తమ ప్రాంతాన్ని పర్యటించి పరిస్థితులను పరిశీలించినట్లు ఫిరోజాబాద్లోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అలోక్ కుమార్ శర్మ చెప్పారు. కేవలం ఫిరోజాబాద్లో మాత్రమేగాక మథుర, ఆగ్రా వంటి చోట్ల కూడా డెంగ్యూ ప్రబలుతోంది. మథురలో కేవలం 15 రోజుల్లోనే 11 మంది చిన్నారులు కన్నుమూశారు. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం నేర్చుకోలేదని, ఇప్పటికే వైరల్ ఫీవర్ కారణంగా 100 మందికి పైగా మరణించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. -
యూపీ: వైరల్ ఫీవర్తో 50 మంది చిన్నారుల మృతి!
లక్నో: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. ఉత్తర ప్రదేశ్లో వైరల్ జ్వరం ప్రజలను బెంబేలేత్తిస్తుంది. వైరల్ జ్వరంతో ఫిరోజాబాద్లో ఇప్పటి వరకు 50 మంది చిన్నారులు మృతి చెందినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా, ఈ ఘటనను సీఎం యోగి తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ను విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదేశాలతో, అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్లేట్లేట్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సోమవారం (ఆగస్టు 30)న సీఎం యోగి ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ప్రతి ఇంటికి వెళ్లి వైరల్ జ్వరం పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైన జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ వైరస్ జ్వరాన్ని డెంగీగా వైద్యఅధికారులు భావిస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. చదవండి: Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి -
కోవిడ్ మూడో వేవ్ ముంగిట.. పులి మీద పుట్ర! జర జాగ్రత్త
కరోనా అన్నది సీవోవీ–2 వైరస్తో వచ్చినట్టే డెంగీ కూడా డెంగీ వైరస్ వల్ల వ్యాపించే ఒక రకం వైరల్ జ్వరం. ఏడిస్ ఈజిపై్ట అనే టైగర్ మస్కిటో ఈ వైరల్ జ్వరాన్ని వ్యాప్తి చేస్తుంది. చాలా వైరల్ జ్వరాల్లాగే ఇది తనంతట తానే తగ్గిపోయే జ్వరం. కాకపోతే ప్లేట్లెట్స్ విపరీతంగా తగ్గిపోవడం వల్ల కొందరిలో ఇది ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటివారిలో మినహా మిగతావారిలో ఇది అంత ప్రమాదం కాదు. అయితే డెంగీ కారణంగా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న వారు, బీపీ పడిపోతున్నవారు, చిగుళ్లలోగానీ లేదా అంతర్గతంగాగాని రక్తస్రావం అవుతున్నవారు (ఇలా జరిగినప్పుడు మలం నల్లగా వస్తుంది), లేదా స్పృహతప్పిపోయినా... వారు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవాల్సిందే. అందుబాటులో వ్యాక్సిన్ ఉన్నప్పటికీ: డెంగీకి టీకా (వ్యాక్సినేషన్) ఉంది. అయితే ఈ టీకాను గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మొదటిసారి కంటే రెండోసారి డెంగీ (సెకండరీ డెంగీ ఇన్ఫెక్షన్) రావడం చాలా ప్రమాదకరం కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిబంధనను విధించింది. డెంగీలో జ్వరం వచ్చి తగ్గాక వ్యాధి పూర్తిగా తగ్గిందని అనుకోకూడదు. నిజానికి ప్లేట్లెట్స్ తగ్గడం అన్నది జ్వరం తగ్గాకే మొదలవుతుంది. అందుకే ప్లేట్లెట్స్ తగ్గి, మళ్లీ నార్మల్కు వచ్చాక మాత్రమే డెంగీ తగ్గిందని అనుకోవాలి. డెంగీలో కనిపించే లక్షణాలేమిటి? ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన అంతర్గత అవయవాల్లో ఆగకుండా రక్తస్రావం కారడమనే ప్రమాదకరమైన లక్షణమే కాకుండా కొందరిలో ఒంట్లోని నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎర్రరక్తకణాల సాంద్రత (హీమోగ్లోబిన్ కాన్సంట్రేషన్) పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. కొంతమందిలో కడుపులో, ఊపిరితిత్తుల పొరల్లో నీరుచేరుతుంది. దీన్ని క్యాపిల్లరీ లీక్ అంటారు. ఇది మరింత వేగంగా, తీవ్రంగా (అగ్రెసివ్గా) చికిత్స అవసరమైన కండిషన్. బీపీ తగ్గడం వల్ల రక్తపోటు పడిపోతుంది. జబ్బు తీవ్రంగా ఉంటే కొందరిలో లివర్, మూత్రపిండాలూ దెబ్బతినవచ్చు. ఆగకుండా రక్తస్రావం కావడం, ఫిట్స్ రావడం సంభవించి మెదడు కూడా దెబ్బతినవచ్చు. కొందరిలో గుండె స్పందనలు (హార్ట్బీట్) 60 కంటే తక్కువకు పడిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి బాధితులకు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలి. నిర్ధారణ పరీక్షలు : ప్లేట్లెట్స్ తగ్గిన సందర్భాల్లో ప్రతి 24 గంటలకు ఒకసారి రక్తపరీక్ష (సీబీపీ) చేయాలి. డెంగీ ఎన్ఎస్1 (స్క్రీనింగ్), ఐజీఎమ్, ఐజీజీ పరీక్షలు (నిర్ధారణ కోసం) అవసరం కావచ్చు. ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనేది డెంగీ నిర్ధారణకు పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునికమైన నిర్ధారణ పరీక్ష. అయితే ఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో రిపోర్టులు వచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున, వాటికోసం వేచిచూడకుండా లక్షణాల ఆధారంగానే చికిత్స కొనసాగించాలి. చికిత్స: డెంగీ అన్నది వైరస్తో వచ్చేది కాబట్టి దానికంటూ మందులు లేవు. లక్షణాల ఆధారంగా చికిత్స అందించాలి. అంటే డీ హైడ్రేషన్కు నోటి ద్వారా ఓఆర్ఎస్ వంటివి ఇస్తూ ఉండాలి. పరిస్థితి మరీ విషమిస్తే రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ అందించాలి. రక్తస్రావం జరుగుతుంటే అవసరాన్ని బట్టి రక్తాన్ని, ప్లేట్లెట్స్ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) ఇవ్వాలి. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేలు – 15 వేలకు పడిపోతే ప్లేట్లెట్స్ ఇవ్వడం తప్పనిసరి. డెంగీ జ్వరానికి సాధారణ జ్వరం వచ్చిన వారికిలా ఆస్పిరిన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబరుస్తుంది కాబట్టి రక్తస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. నివారణ ఎంతో మేలు... ఎందుకంటే? అన్ని వ్యాధుల లాగే డెంగీకి కూడా చికిత్స కంటే నివారణ మేలు. డెంగీని కలిగించే టైగర్ దోమ సాధారణంగా పట్టపగలే కుడుతుంటుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఇంట్లోని మూలల్లోని చీకటి / చల్లని ప్రదేశాల్లో ఆవాసం ఏర్పరచుకుంటుంది. అందుకే పగలు అవి కుట్టకుండా ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నీళ్లు ఎక్కడా నిల్వ కాకుండా చూసుకోవాలి. ఇల్లంతా గాలి వెలుతురు వచ్చేలా జాగ్రత్తపడాలి. - డాక్టర్ కె. శివ రాజు, సీనియర్ ఫిజీషియన్ -
హైదరాబాద్ లో హడలెత్తిస్తున్నడెంగ్యూ
-
World Mosquito Day: ఫీవర్ సర్వేలో.. డెంగీ కలకలం..
కరీంనగర్లోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన రమాదేవికి ఈనెల 13న జ్వరం వచ్చింది. మొదటి కోవిడ్గా అనుమానించి నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. జ్వరం తీవ్రంగా ఉండడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలు చేయగా సీజనల్గా వచ్చే వైరల్ ఫీవర్గా నిర్ధారణ అయింది. దోమ కాటు వల్ల వచ్చిన జ్వరంతో నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోగా.. రూ.10 వేల వరకు ఖర్చఅయింది. హైరిస్క్ ప్రాంతాలు.. నగరంలోని ఖాన్పురా, రాంనగర్, కార్ఖానగడ్డ, మార్కండేయనగర్, వావిలాలపల్లి, కట్టరాంపూర్తో పాటు దుర్శేడ్, అన్నారం, ఇందుర్తి, వెలిచాల, గర్శకుర్తి, గద్దపాక, జోగినపల్లి గ్రామాలను సీజనల్ వ్యాధులు సంభవించే హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదు కాగా, జిల్లా కేంద్రంలోని రాంనగర్కు చెందిన వంగల హన్మండ్లు(60) డెంగీతో జూన్ 30న మృతి చెందారు. మరో 10 డెంగీ కేసుల్లో కరీంనగర్లో 6, గ్రామాల్లో 4 కేసులు గుర్తించారు. సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషజ్వరాలు క్రమంగా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాణాంతక డెంగీ, మలేరియా కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ జిల్లాలో మొత్తం 11 కేసులు డెంగీ కేసులు నిర్ధారణ కాగా.. ఒకరు మరణించడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండు విషజ్వరాలతో చిన్న జ్వరం వచ్చినా జనాలు ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. అక్కడ సాధారణ జ్వరానికి కూడా డెంగీ బూచిచూపి మరోవైపు టెస్టుల పేరుతో వారు దోపిడీకి తెరలేపుతున్నారు. మొత్తానికి చిన్న జ్వరం వచ్చినా.. జనాలు వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో కరీంనగర్ జిల్లా చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషజ్వరాలకు ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం, దోమల స్వైరవిహారం. జిల్లాల్లో ఇప్పటికీ పలు మారుమూల గ్రామాల్లో ఓపెన్ డ్రైనేజీ, మురికి కుంటలు, పందుల స్వైర విహారం వల్ల దోమల సంతతి పెరుగుతోంది. దీనికితోడు ఇటీవలి వర్షాలతో కుంటలు నిండి దోమల అమాంతం పెరిగాయి. వాస్తవానికి జిల్లాల్లో దోమల సమస్య ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమయంలోనూ కరీంనగర్ జిల్లా డెంగీ కేసుల్లో ముందున్న విషయం తెలిసిందే. కరోనా తరువాత ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో చాలా మార్పులు వచ్చాయి. పదే పదే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, శుభ్రమైన తాగునీరు తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, జనసంచారం మీద ఆంక్షలతో డయేరియా, జ్వరాలు, చర్మవ్యాధులు గణనీయంగా తగ్గడం గమనార్హం. నెమ్మదిగా సెకండ్ వేవ్ నుంచి నెమ్మదిగా బయటపడుతున్న వేళ విషజ్వరాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. శుక్రవారం(ఆగస్టు 20) ‘ప్రపంచ మస్కిటో దినోత్సవం’ సందర్భంగా దోమల వల్ల కలుగుతున్న ప్రాణాంతక జ్వరాలు, వాటి వెనక ఉన్న కారణాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పెరిగిన ఓపీ..! సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే జ్వరాలతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారం రోజులుగా జ్వరబాధితుల కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఓపీలకు వ్యాధిగ్రస్తులు క్యూ కడుతున్నారు. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రతిరోజూ 150 మించి ఉండని ఓపీ సేవలు ప్రస్తుతం 300 వరకు ఓపీ పెరిగింది. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఇందులో ఏది డెంగీ, మలేరియా అన్న ఆందోళనతో జనాలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. కానరాని వైద్య శిబిరాలు.. జ్వర పీడితులు పెరుగుతున్న పట్టణంలోని స్లమ్ ఏరియాల్లో, గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్లు సమయపాలన పాటించడం లేదు. వ్యాక్సినేషన్, కోవిడ్ నిర్ధారణ పరీక్షల పేరుతో వైద్య సేవలను మరిచినట్లు తెలుస్తోంది. కొంత మంది మధ్యాహ్నం లోపే విధులకు డుమ్మాకొట్టి వెళ్తుండగా, మరికొంత మంది వివిధ కారణాల చూపుతూ ఆరోగ్య కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొంత మంది వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఫీవర్ సర్వేతో వెలుగుచూస్తున్న వ్యాధులు.. జిల్లాలో ఇప్పటికే కోవిడ్తో చాలా మంది ఇబ్బందులు పడుతుండగా తాజాగా.. జిల్లా వ్యాప్తంగా సాధారణ వ్యాధులు పెరుగుతూ మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ఫీవర్సర్వేలో సీజనల్ జ్వరాలు బయటపడుతున్నాయి. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తుండడంతో వ్యాధుల తీవ్రత తెలుస్తోంది. గడిచిన 8 నెలల్లో కరీంనగర్ జిల్లాలో 11 డెంగీ కేసులు బయటపడ్డాయి. ఒకరు డెంగీ మరణించడం కలకలం రేపుతోంది. ఈ కేసులు ఎక్కువగా పట్టణాల పరిధిలోనే నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మలేరియా కేసులు ఈ యేడాది కేవలం 2 మాత్రమే నమోదయ్యాయి. డెంగీ, మలేరియా ఎక్కువగా వచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టడంలో తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
డెంగ్యూ డేంజర్ బెల్స్
-
డేంజర్ బెల్స్.. భారీగా డెంగీ కేసులు, గుట్టుగా చికిత్సలు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ భయంతో గత ఏడాది బస్తీల్లో విధిగా హైడ్రోక్లోరైడ్తో శానిటైజ్ చేయడం, ఫాగింగ్ నిర్వహించడం వల్ల దోమలు పెద్దగా లేకుండా పోయాయి. ఫస్ట్వేవ్తో పోలిస్తే.. సెకండ్ వేవ్లో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయా చర్యలు చేపట్టలేదు. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి చుట్టూ ఒకవైపు వరద.. మరోవైపు బురద పేరుకు పోయి డెంగీ దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. గ్రేటర్లో 2019లో అత్యధికంగా 3366 డెంగీ కేసులు నమోదైతే.. అదే 2020లో కేసుల సంఖ్య 346 తగ్గిపోయింది. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అధికారికంగా ఇప్పటికే 250 కేసులు నమోదు కాగా అనధికారికంగా ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సంపన్నులు ఎక్కువగా నివసించే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, నానాక్రామ్గూడ, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం. గుట్టుగా చికిత్సలు ఇప్పటికే కరోనా వైరస్ సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. తాజాగా డెంగీ దోమలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు ఇంటి చుట్టు వరద నీరు చేరి దోమలకు నిలయాలుగా మారాయి. – నిల్వ ఉన్న ఈ నీటిగుంతల్లో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని మరింత పెంచి పోషిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎప్పటికప్పడు దోమల నియంత్రణ కోసం యాంటిలార్వ, ఫాగింగ్ నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా దోమలు దాడి చేస్తుండటంతో ఇటీవల బాధితులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. మనిషి రక్తంలో ప్లేట్లెట్స్ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. డెంగీ జ్వరం వచి్చనప్పుడు వీటి సంఖ్య తగ్గుతుంది. వీరికి వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. చికిత్సల పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను భయభ్రాంతులకు గురిచేసి అత్యవసర చికిత్సల పేరుతో రోజుకు రూ.50 వేలకుపైగా చార్జీలు వేస్తున్నాయి. డెంగీ కేసుల వివరాలను ఏ రోజుకారోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చేరవేయాల్సి ఉన్నా.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఆ సమాచారం ఇవ్వడం లేదు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను సస్పెక్టెడ్ డెంగీ కేసుల జాబితా లో ఉంచి చికిత్సలు చేస్తుండటం గమనార్హం. -
మరింత తగ్గిన దోమకాటు జ్వరాలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది దోమకాటు జ్వరాలు మరింతగా తగ్గాయి. జ్వరాల తీవ్రత లేకపోవడంతో పెద్ద ఉపశమనం లభించినట్లయింది. 2019–20తో పోలిస్తే 2020–21లో మలేరియా, డెంగీ, చికున్గున్యా కేసులు భారీగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లోను, 2020తో పోలిస్తే 2021 రెండు నెలల్లోను ఈ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది అంటే జనవరి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఏడు వారాల్లో లెక్కిస్తే చికున్గున్యా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఫిబ్రవరి చివరికి వేసవిలోకి వచ్చినట్లే. దీంతో దోమకాటు జ్వరాల ప్రమాదం తక్కువే. ఇక చూసుకోవాల్సిందల్లా కలుషిత నీటివల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి కేసులను నియంత్రించుకోవడమే. కొద్దినెలలుగా కోవిడ్ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నా దోమకాటు వ్యాధుల నియంత్రణపై పైచేయి సాధించింది. కలుషిత నీటి నియంత్రణకు కార్యాచరణ సాధారణంగా వేసవి కాలంలో కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి కేసులు వస్తుంటాయి. వీటి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్శాఖ సంయుక్త కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. పల్లెటూరి నుంచి పట్టణాల వరకు తాగునీరు పరిశుభ్రంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించారు. 26 లక్షల దోమతెరల పంపిణీ లక్ష్యం రాష్ట్రంలో ఏజెన్సీతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా దోమల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట దోమతెరల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 25.94 లక్షల దోమతెరలు పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 1.14 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. ఎల్ఎల్ఐఎన్ (లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్) పేరుతో ఇచ్చే ఈ దోమతెరలు దోమల నుంచి ఊరటనివ్వగలవు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి మంచి ఫలితాలిచ్చాయి. వచ్చే సీజన్ నాటికి వీలైనంత వరకు దోమతెరలు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. తగ్గిన కేసుల తీవ్రత గతంతో పోలిస్తే దోమకాటు జ్వరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మా ముందున్న లక్ష్యం సురక్షిత మంచినీరు అందించి డయేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు రాకుండా నియంత్రించడమే. దీనికోసం కార్యాచరణ రూపొందించాం. మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. – డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
జ్వరమొస్తే కరోనా, డెంగీ టెస్టులు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఒకవైపు, కరోనా మరోవైపు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, కరోనాతో జనం గజగజలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండూ ఒకేసారి వస్తే చికిత్స అందించడం వైద్యులకు సవాల్గా మారిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే కరోనా, డెంగీ పరీక్షలు రెండూ చేయించాలని సూచించింది. కరోనా, డెంగీ జ్వరాల్లో లక్షణాలు దాదాపు దగ్గరగా ఉండటం వల్ల వ్యాధిని గుర్తించడంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని తెలిపింది. మరో విషయం ఏంటంటే రెండింటిలోనూ 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది. ఇవి తీవ్రమైతే మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన స్థితి ఎదురవుతుంది. కాబట్టి వేగంగా చికిత్స అందించడమే ముఖ్యమని తెలిపింది. రెండింటికీ నిర్దిష్టమైన చికిత్స లేనందున వైద్యుల సమక్షంలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. పైగా రెండింటికీ వేర్వేరు చికిత్స చేయాలి. ఎందుకంటే డెంగీలో ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు. కరోనా రోగుల్లో వాటిని ఇవ్వడం ద్వారా అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్, ఊపిరితిత్తుల్లో వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టకుండా ఇచ్చే హెపారిన్ మందు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. డెంగీ రోగుల్లో హెపారిన్ ఇస్తే రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్లో కరోనా, డెంగీ బారిన ప్రజలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం కోరింది. ఇంకా ఏం చేయాలంటే? ► రెండింటి బారిన పడిన బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి. బాధితుడిలో లక్షణాలు, సమస్యలను బట్టి చికిత్స చేసే విధానాన్ని మార్చాలి. ► డెంగీ బాధితుల్లో ‘ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ)’ఎక్కువగా ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అలాగే ప్లేట్లెట్స్ ఎక్కించే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. ► రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడూ పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించాలి. ► ఛాతీలో ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడానికి ఎక్స్రే, సీటీ స్కాన్ చేయించాలి. ► ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగీ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ముఖానికి మాస్కు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి కరోనా నివారణ పద్ధతులు పాటించాలి. -
అపోలో హాస్పిటల్స్- పనాసియా బయో స్పీడ్
మార్కెట్లు పతన బాటలో సాగుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలతో అపోలో హాస్పిటల్స్ కౌంటర్కు డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క డెంగ్యూ వ్యాధి నివారణకు రూపొందిస్తున్న వ్యాక్సిన్ తొలి రెండు దశల పరీక్షలను విజయవంతంగా ముగించినట్లు వెల్లడించడంతో హెల్త్కేర్ కంపెనీ పనాసియా బయోటెక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. అపోలో హాస్పిటల్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాలపై అశావహ అంచనాలతో అపోలో హాస్పిటల్స్ కౌంటర్ మరోసారి బలపడింది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 8.5 శాతం దూసుకెళ్లి రూ. 1,974ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 1,948 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1లో నిపుణులు రూ. 110 కోట్ల నష్టాన్ని అంచనా వేయగా.. అపోలో హాస్పిటల్స్ కేవలం రూ. 43 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లాక్డవున్ల కాలంలోనూ ఈ ఫలితాలు ప్రోత్సాహాన్నివ్వడంతో గత రెండు వారాల్లో 21 శాతం ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలియజేశారు. పనాసియా బయోటెక్ డెంగీఆల్ పేరుతో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలి రెండు దశల పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ఫార్మా కంపెనీ పనాసియా బయోటెక్ తెలియజేసింది. ఈ పరీక్షలలో మొత్తం నాలుగు రకాల డెంగ్యూ వైరస్లకు వ్యతిరేకంగా యాంటీబాడీలు యాక్టివేట్ అయినట్లు వివరించింది. తద్వారా ఎలాంటి ఇతర సమస్యలూ ఎదురుకాలేదని తెలియజేసింది. సింగిల్ డోసేజీ ద్వారా పరీక్షించిన 80-95 శాతం మందిలో మంచి రెస్పాన్స్ కనిపించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పనాసియా బయో షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 9.40 ఎగసి రూ. 198 ఎగువన ఫ్రీజయ్యింది. -
డెంగీ లక్షణాలతో నర్సు మృతి
కర్ణాటక, యశవంతపుర: ఉడుపి జిల్లాలో కరోనాతోపాటు డెంగీ కూడా ప్రబలుతోంది. ఈక్రమంలో బెళ్మణ్కు చెందిన దివ్యా(23) అనే నర్సు డెంగీ లక్షణాలతో మృతి చెందింది. ఉడుపిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తున్న ఆమె 15 రోజులుగా జ్వరంతో బాధపడుతూ అదే ఆస్పత్రిలోనే చికిత్స పోందుతోంది. జ్వరం తీవ్రత ఆధికంగా ఉండటంతో మంగళవారం మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
డెంగీతో ఐఐటీ విద్యార్థిని మృతి
వనపర్తి, అమరచింత: పట్టణానికి చెందిన దీక్షిత (18) ఐఐటీ విద్యార్థిని డెంగీ జ్వరంతో కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని చంద్రనాయక్ తండాకు చెందిన సీత్యానాయక్ కూతురు దీక్షిత ఐఐటీలో ఆల్ఇండియా 241వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి సీత్యానాయక్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. స్వగ్రామమైన చంద్రనాయక్ తండాకు విద్యార్థిని దీక్షిత మృతదేహంను తీసుకువచ్చి ఖననం చేశారు. (రానున్న రోజుల్లో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు..) -
రానున్న రోజుల్లో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు..
సాక్షి, సిటీబ్యూరో: సీజన్ మారుతోంది. వ్యాధుల ముప్పు పెరగనుంది. ప్రస్తుతం కోవిడ్–19 బెంబేలెత్తిస్తుంటే..లాక్డౌన్ ఆంక్షల సడలింపునకు తోడు.. సీజన్లో వస్తున్న మార్పులతో గ్రేటర్లో మలేరియా, డెంగీ, స్వైన్ఫ్లూ జ్వరాలు విస్తరించనున్నాయి. వీటిని గుర్తించడం వైద్యారోగ్య శాఖకు పెద్ద సవాల్గా మారనుంది. ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు ఇతర విష జ్వరాలతో గ్రేటర్ ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ప్రాణాలకు వాళ్లే భద్రత కల్పించుకోవాల్సిన అవసరం ఉందని వైద్యారోగ్య నిపుణులు స్పష్టం చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఆంక్షల సడలింపు తర్వాతే.. మార్చి 2న నగరంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి 22న జనతా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాతి రోజునుంచి వరుస లాక్డౌన్లుకొనసాగుతూనే ఉన్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 7 వరకు తొలి విడత, ఆ తర్వాత 21 వరకు రెండో విడత, మే ఏడో తేదీ వరకు మూడో విడత, మే 28 వరకు నాలుగో విడత, ఆ తర్వాతఐదో విడత లాక్డౌన్ అమలైన విషయం తెలిసిందే. మార్చి రెండు నుంచి మార్చి 31 వరకు నగరంలో 64 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఏప్రిల్లో 537 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 15 మంది మృత్యువాతపడ్డారు. మే 1 నుంచి 15 వరకు 363 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీర్ఘకాలిక లాక్డౌన్తో ఉపాధి అవకాశాలు దెబ్బతిని శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన ప్రభుత్వం మే 15 నుంచి పలు ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. వైన్షాపులు, మార్కెట్లు, ఇతరషాపులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సహా తెరుచు కోవడంతో ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా జనం రద్దీ పెరిగింది. ఆంక్షల సడలింపును చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. వైరస్ పూర్తిగా తగ్గిపోవడం వల్లే ప్రభుత్వం ఆంక్షలు సడలించినట్లు భావించారు. మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చారు. పుట్టిన రోజు, ఇతర వేడుకల పేరుతో అంతా ఒక్క చోట చేరి విందులు చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారిన పడుతున్నారు. ఫలితంగా లాక్డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. కేవలం 15 రోజుల్లోనే 569 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు 49 మంది మృతి చెందడం గమనార్హం. రోగులతో కిటకిటలాడుతున్న గాంధీ.. తెలంగాణ వ్యాప్తంగా మే 30 వరకు 2,499 మంది కరోనా వైరస్ బారిన పడగా, వీరిలో 1,533 మంది గ్రేటర్ వాసులే. చికిత్సల తర్వాత 1,412 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 1010 మంది చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి గత వారం రోజుల నుంచి రోజుకు సగటున 150 మంది కొత్తగా వస్తున్నారు. ఐసీయూ సహా ఐసోలేషన్ వార్డులన్నీ దాదాపు నిండిపోయాయి. ఆస్పత్రిలో 1500 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ.. విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి వైద్యులు గత మూడు నెలలుగా విరామం లేకుండా పని చేస్తున్నారు. చాలా కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందించలేని దుస్థితి నెలకొంది. అంతేకాదు బాధితుల్లో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు. కేవలం ఐదు శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ సేవలు, 15 శాతం మందికి ఐసీయూ సేవలు అవసరం అవుతున్నాయి. పెద్దగా వైద్యసేవలు అవసరం లేకుండానే మిగిలిన వారు కోలుకుంటున్నారు. పాజిటివ్ నిర్ధారణయిన 50 ఏళ్లలోపు వారిని, ఏ ఇతర జబ్బులు లేని వారిని ఇకపై ఆస్పత్రిలో ఉంచడం కంటే.. స్థానిక వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్లో ఉంచడమే ఉత్తమని వైద్యులు భావిస్తున్నారు. కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయి ఏ లక్షణాలు లేని సుమారు 350 మందిని త్వరలోనే డిశ్చార్జి చేసి, వైద్యులపై రోగుల భారం పడకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. -
నగరానికి జ్వరమొచ్చింది
పెదవాల్తేరు(విశాఖతూర్పు): జీవీఎంసీ ఎన్ని చర్యలు చేపట్టనా విశాఖ నగరంలో జ్వరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఏ కాలనీలో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో నగరంలోని సీఎం ఆరోగ్యకేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. చినవాల్తేరు, పెదజాలారిపేట, ఎంవీపీ కాలనీ, అక్కయ్యపాలెం, కంచరపాలెం, బర్మాక్యాంపు, కప్పరాడ, బుచ్చిరాజుపాలెం, ప్రసాద్గార్డెన్స్, పాతపోస్టాఫీసు, రెల్లివీథి, హెచ్బీకాలనీ, రేసపువా నిపాలెం ప్రాంతాల్లో సీఎం ఆరోగ్యకేంద్రాలు రోజూ అధికసంఖ్యలో వస్తున్న రోగులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ జ్వరాలు, విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలతో జనాలు బా ధపడుతున్నారు. మలేరియా, డెంగ్యూ రక్తపరీక్షల కోసం ప్రజలు ఆరోగ్యకేంద్రాలను ఆశ్రయి స్తున్నారు. కొన్ని ఆరోగ్యకేంద్రాలు చిన్న చిన్న గదులలో ఉండటంతో రోగులు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేంద్రాలన్నీ ప్రతి ఆదివారం, సెలవు దినాలలో కూడా పనిచేస్తాయి. తగినంత ప్రచారం లేనందు ఆదివారాలలో ఓపీ తగ్గుముఖం పట్టడం గమనార్హం. కంచరపాలెం కేంద్రంలో రోజూ 180 నుంచి 200 వరకు ఓపీ నమోదవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చినవాల్తేరు, హెచ్బీకాలనీ, ఎంవీపీ కాలనీ వంటి కేంద్రాలలో రోజూ 60 నుంచి 70 వరకు మాత్రమే ఓపీ ఉండేది. ప్రస్తుత జ్వరాల సీజన్లో మాత్రం రోజూ 110 నుంచి 150 వంతున ఓపీ నమోదు కావడం గమనార్హం. జ్వరాల సీజన్ కావడంతో దాదాపుగా ప్రతీ కేంద్రంలోను ఓపీ వందకు పైగా దాటేయడం గమనార్హం. పనివేళలివీ: సీఎం ఆరోగ్యకేంద్రాలన్నీ రోజూ ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయి. మళ్లీ సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదివారాలు, పండగరోజులలో కూడా సెలవు లేకుండా పనిచేస్తాయి. మందుల చీటీలను కంప్యూటర్ ప్రింటవుట్రూపంలో అందజేస్తారు. ఇక్కడ మలేరియా, డెంగ్యూ తదితర రక్తపరీక్షలు చేస్తారు. ఇంకా బీపీ, షుగర్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. పారిశుద్ధ్య లోపంతో.. పలు జోన్ల పరిధిలో డస్ట్బిన్ఫ్రీ సిటీ అంటూ డంపర్బిన్లు తొలచేశారు. దీంతో ప్రజలు, అటు పారిశుద్ధ్య కార్మికులు చెత్తచెదారాలను రోడ్లపైనే వేస్తున్నారు. ఈ చెత్త తరలింపులో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఫలితంగా దోమలు, ఈగలు వృద్ధిచెంది జ్వరాలు వ్యాప్తి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఫాగింగ్ చేస్తున్నా సరే సత్ఫలితాలు ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. కాలువలు, గెడ్డలు కూడా చెత్తతో నిండిపోతున్నాయి.అధిక సంఖ్యలో ప్రజలు ఇళ్లలోని నీటిపాత్రలను వారంలో ఒకరోజు ఖాళీచేయడం లేదని ఇందువల్ల కూడా దోమల లార్వా వృద్ధి చెందుతుందని జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే, సెప్టిక్ట్యాంక్ ఔట్లెట్ గొట్టాలకు అధికశాతం మంది మెస్క్లాత్లు అమర్చడం లేదు. ఈ కారణాల చేత కూడా నగరంలో దోమలు బాగా వృద్ధి చెందుతున్నాయి. -
ప్రతి నలుగురిలో ఒకరికి డెంగీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ మహమ్మారిలా విజృంభించింది. మూడు నాలుగు నెలలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. సీజన్ దాటినా ఇప్పటికీ డెంగీ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. డెంగీ అనుమానంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి డెంగీ ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా ప్రభుత్వానికి ఆ శాఖ అధికారులు ఒక నివేదిక అందజేశారు. దాని ప్రకారం రాష్ట్రంలో 40,434 మంది రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 10,237 మంది కి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని తెలిపారు. మరణాలు మాత్రం రెండే సంభవించినట్లు పేర్కొన్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 20 వేల మంది వరకు డెంగీకి గురయ్యారని, 150 మందికిపైగా చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ లోని కొందరు చెబుతున్నారు. డెంగీ కేసుల సంఖ్యను, మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సర్కారు నివేది క ప్రకారం అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 2,709 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 1,847 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 713 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, ఖమ్మం జిల్లాలో ఒకరు చనిపోయారని నివేదిక తెలిపింది. ఆగని జ్వరాలు.. ఆదుకోని యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర విష జ్వరాలతో వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సరాసరి ప్రతీ ఇంట్లోనూ ఒకరు వైరల్ జ్వరాల బారినపడినట్లు వైద్య ఆరోగ్య వర్గాలే అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు సరిపోక నేలపైన పడుకోబెడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఒక్కోసారి ఐసీయూ లు నిండి సాధారణ వార్డుల్లో ఉంచుతున్నారు. ఇటువంటి పరిస్థితి నెలకొంటున్నా వైద్య ఆరోగ్యశాఖ పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నా యి. ఒక కీలక అధికారి జ్వరంతో సెలవు పెట్టగా, మరికొందరు టూర్ల పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిరావడం విమర్శలకు తావిస్తోంది. మంచిర్యాల జిల్లాలో నలుగురు చనిపోయినా అధికారులు కనీసం అక్కడకు వెళ్లి పరిస్థితిని అంచనా వేయకపోవడంపైనా విమర్శలొస్తున్నాయి. ఇటు జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో సాయం త్రం ఓపీ చూడాలన్న నిర్ణయాన్ని అనేకచోట్ల అమలు చేయడం లేదు. మరోవైపు జిల్లాలకు సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లను సరఫరా చేయడంలోనూ వైఫల్యం కనిపిస్తుంది. మంచిర్యాలలో యువతి మృతి మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని బీజోన్కు చెందిన కల్వల స్నేహ (23) అనే యువతి ఆదివారం డెంగీతో మరణించింది. ఆమె 10 రోజుల క్రితం జ్వరంతో మంచిర్యాల ఆస్పత్రిలో చేరగా ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వచ్చింది. 4 రోజుల అనంతరం డిశ్చార్జి చేశారు. మళ్లీ రెండ్రోజుల్లో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కరీంనగర్కి తీసుకెళ్లగా పరిస్థితి చేజారింది. స్నేహ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. డెంగీ మరణాలపై కమిటీ తర్జనభర్జన రాష్ట్రంలో డెంగీ మరణాల సంఖ్యను తేల్చడంలో అందుకు ఏర్పాటైన కమిటీ తర్జన భర్జన పడుతోంది. రాష్ట్రంలో డెంగీ మరణాలపై నెలన్నర కిందట ప్రభుత్వం ఆడిట్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జిల్లాల నుంచి డెంగీ మరణాల సంఖ్యను, కేసుల వివరాలను తెప్పించుకున్న ఆ కమిటీ మంగళవారం సమావేశమైంది. అనుమానిత డెంగీ మరణాలపై ఆరా తీసింది. మరోవైపు బుధవారం జిల్లాల డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనుమానిత డెంగీ మరణాలపై విచారించాలని నిర్ణయించింది. అధిక ఫీజులు వసూలు... ఈ సీజన్లో అనేకమంది ఆసుపత్రులకే వేలు లక్షలు ధారపోశారు. డెంగీ, చికున్గున్యాల అనుమానంతో అనేకమంది ఆసుపత్రుల్లో చేరారు. అవసరమున్నా లేకున్నా జ్వరంతో వచ్చే వారికి వైద్య పరీక్షలు చేయడంపై ఆరోపణలొచ్చాయి. ఇక డెంగీతో బాధపడే వారి నుంచి ప్లేట్లెట్ల పేరుతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు భారీగానే డబ్బులు దండుకున్నాయి. మామూలుగా 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలుంటే 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే అనేక ప్రైవేటు ఆసుపత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లున్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలా నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల సంగతి సరేసరి. పెద్ద సంఖ్యలో రోగులు వస్తుండటం, వైద్య పరీక్షలకే రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడం, తగిన మందులు అందుబాటులో లేకపోవడంతో ఇక తప్పదంటూ రోగులు ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు. లక్ష ఖర్చు.. –ఇమ్మడి రాజ్యలక్ష్మి, సుబేదారి, హన్మకొండ డెంగీతో నెల క్రితం హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చేరాను. ప్లేట్లెట్ల సం ఖ్య 30 వేలకు తగ్గడం తో వైద్యులు హైదరాబాద్ తరలించారు. అప్పటికే ఆ ఆస్పత్రిలో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నాం. రూ.లక్ష ఖర్చు చేస్తే కానీ ఆరోగ్యం బాగుపడలేదు. మా ఇంట్లో ముగ్గురికి డెంగీ – వెంకన్న, గార్ల, మహబూబాబాద్ జిల్లా మా ఇంట్లో నాకు, నా భార్య మొగిలి రేణుక, కూతురు దివ్యకు డెంగీ వచ్చింది. గార్ల ఆసుపత్రిలో జ్వరం తగ్గేందుకు రూ.25 వేలు ఖర్చు చేశాను. అయినా ప్లేట్లెట్లు పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాం. ఖమ్మం ఆసుపత్రిలో రూ.75 వేలు వైద్యం కోసం ఖర్చుపెట్టా. జ్వరాలకే రూ.లక్ష వరకు అప్పులయ్యాయి. ప్రస్తుతం కోలుకుంటున్నాం. -
డెంగీతో పెళ్లికూతురు మృతి
-
పెళ్లి కూతురును కబళించిన డెంగీ
సాక్షి, పాలసముద్రం(చిత్తూరు): కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతిని డెంగీ జ్వరం బలితీసుకుంది. మూడుముళ్ల బంధంతో నూరేళ్లు సంసార జీవితాన్ని గడిపేందుకు సిద్ధమవాల్సిన వేళ...పెళ్లికూతురిని డెంగీ జ్వరం కబళించింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్ఆర్పురం గ్రామానికి చెందిన కృష్ణంరాజు, రెడ్డెమ్మల కుమార్తె చంద్రకళ అలియాస్ కావ్య (18) గత నెల 30న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆమెకు డెంగీ సోకింది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం తమిళనాడులోని షోళింగర్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి వేలూరులోని అడుకుంబారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు బంధుమిత్రులు, గ్రామస్థులు బుధవారం పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఎలాగైనా ఆసుపత్రి నుంచి వధువును తీసుకొచ్చి తాళి కట్టించాలని పెద్దలు ప్రయత్నించారు. పరిస్థితి బాగా లేనందున వైద్యులు నిరాకరించడంతో పెళ్లి ఆగింది. శుక్రవారం ఆమె మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన కుమార్తెను శ్మశానానికి పంపించాల్సి వచ్చిందంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే అధికారులు మాత్రం అది డెంగీ కాదని జ్వరం కారణంగా చనిపోయిందని చెబుతున్నారు. బాలుడిని మింగిన డెంగీ మదనపల్లె టౌన్: డెంగీతో బాలుడు మృతి చెందిన సం ఘటన శుక్రవారం మదనపల్లెలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు, పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉంటున్న మణికంఠరెడ్డి కుమారుడు చరణ్రెడ్డి (5) మూడు రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా జ్వరం తగ్గలేదు. గురువారం నుంచి జ్వరం తీవ్రం కావడంతోపాటు కడుపు నొప్పితో వాంతులు, విరేచనాలు చేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. కన్నుమూసిన బిడ్డను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మెదక్లో ఉద్రిక్తత; విద్యార్థిని మృతదేహంతో నిరసన
సాక్షి, మెదక్ : మెదక్ పట్టణంలోని గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ నేపథ్యంలో కావ్య కుటుంబసభ్యులు మృతదేహంతో పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డుపై బైటాయించి తమ నిరసన తెలిపారు. దీంతో ఈ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. గత నెల రోజులుగా కావ్య డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్నరెసిడెన్షియల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని పేర్కొన్నారు. దీనికి పాఠశాల ప్రిన్సిపాల్ భాద్యత వహించాలని, ఆమె నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు రేపు ఉదయం హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది. డెంగీ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. -
దోమ కాటుకు చేప దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ నివారణ చర్యలు చేపట్టింది. గణేశ్ నిమజ్జనాల కోసం నిర్మించిన కొలనుల్లో (బేబీ పాండ్స్) దోమల ఉత్పత్తికి కారణమయ్యే లార్వా నివారణకు 50వేలకు పైగా గంబూసియా చేపలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీహెచ్ఎంసీ 23 నిమజ్జన కొలనులను ప్రత్యేకంగా నిర్మించింది. ఇవి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారకుండా ఉండేందుకు వీటిల్లో లార్వాలను తినే గంబూసియా చేపల్ని ఎంటమాలజీ విభాగం వదులుతోంది. ప్రస్తుతం వదులుతున్న 50వేల గంబూసియా చేపలు నెల రోజుల్లోనే 5లక్షలకు పెరుగుతాయని, మిగతా చేపల్లా ఇవి గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలనే ఉత్పత్తి చేస్తాయని చీఫ్ ఎంటమాలజీ అధికారి రాంబాబు తెలిపారు. ప్రస్తుతం 23 కొలనులు, చిన్న కుంటల్లో వదిలిన అనంతరం చెరువుల్లోనూ వేస్తామని చెప్పారు. కొలనులు ఇవే... ఊరచెరువు (కాప్రా), చర్లపల్లి ట్యాంక్ (చర్లపల్లి), అంబీర్ చెరువు (కూకట్పల్లి), పెద్ద చెరువు (గంగారం), శేరిలింగంపల్లి, వెన్నెల చెరువు (జీడిమెట్ల), రంగధాముని కుంట (కూకట్పల్లి), మల్క చెరువు (రాయదుర్గం), నలగండ్ల చెరువు (నలగండ్ల), పెద్ద చెరువు (మన్సూరాబాద్), సరూర్నగర్, హుస్సేన్సాగర్ లేక్, సికింద్రాబాద్, పెద్ద చెరువు (నెక్నాంపూర్), లింగం చెరువు (సూరారం), ముళ్లకత్వ చెరువు (మూసాపేట్), నాగోల్ చెరువు, అల్వాల్ కొత్త చెరువు, నల్ల చెరువు (ఉప్పల్), పత్తికుంట (రాజేంద్రనగర్), బోయిన్చెరువు (హస్మత్పేట్), మియాపూర్ గురునాథ్ చెరువు, లింగంపల్లి గోపీ చెరువు, రాయసముద్రం చెరువు (రామచంద్రాపురం), కైదమ్మకుంట (హఫీజ్పేట), దుర్గం చెరువు. గణేశ్ నిమజ్జనానికి ఉపయోగించిన ఈ కొలనులను బతుకమ్మ నిమజ్జనాలకు కూడా వినియోగిస్తున్నారు. -
డెంగీ.. భయపడకండి
వాతావరణం ముసురేసింది... పరిసరాలను అపరిశుభ్రత కమ్మేసింది. వ్యాధుల కాలం వచ్చేసింది. ఏ ఇంట చూసినా జ్వర బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. జ్వరమనే మాట వింటే చాలు పల్లె, పట్నమనే తేడా లేకుండా వణికిపోతోంది. అది డెంగీ కావచ్చేమోనంటూ అనుమానపు రోగం ముందుగా భయపెడుతూ.. పేదల జేబులు గుల్ల చేస్తోంది. ప్లేట్లెట్స్ పేరిట ప్రైవేటు వైద్యుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. డెంగీపై అవగాహన పెంచుకుని అప్రమత్తతనే మందు బిళ్ల వేసుకుంటే వ్యాధిని తరిమికొట్టొచ్చని ప్రభుత్వ వైద్య యంత్రాంగం సూచిస్తోంది. అందుకే ఈ డెంగీ కథేంటో తెలుసుకోండి. దానిని దరి చేరకుండా జాగ్రత్త పడదాం రండి. గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా ప్రజలను 2013లో, 2017లో డెంగీ వణికింది. ఆ కాలంలో ఈ వ్యాధి బారిన పడిన ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనికి అవగాహనే ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. నాలుగో దశ ప్రమాదకరం పగటి వేళ కుట్టే ఎడిస్ ఈజిస్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. డెంగీ జ్వరం మొదటి దశలో జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రగా మారతాయి. రెండో దశలో ప్లేట్లెట్స్ తగ్గటం, జ్వరం, వాంతులు, కాళ్లు వాపులు వస్తాయి. మూడో దశలో బీపీ తక్కవగా ఉండటం, ప్లేట్లెట్స్ తగ్గటం, శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. నాలుగో దశలో రోగికి కామెర్లు రావటంతోపాటుగా షాక్లోకి వెళ్లతాడు. బీపీ తగ్గటంతోపాటు కిడ్నీల పనితీరు మందగించి రక్తం బయటకు పోతుంది. నాలుగో దశను డెంగీ హెమరేజ్ షాక్ సిండ్రోమ్ అంటారు. మొదటి మూడు దశలో ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పని లేదు. దోమలు పెరిగే ప్రదేశాలు నిలువ ఉండే నీటిలో డెండీ దోమ పిల్లలు పురుగుల వలే కదులుతూ ఉంటాయి. నీటిని నిల్వ చేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బు రోళ్ళు, టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, కొబ్బరి చిప్పలు, బోండాలు, ఫ్రిజ్, ఎయిర్ కూలర్స్ వెనుక భాగాలు, పూల కుండీలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, నీటి సంపుల్లో దోమ లార్వాలు పెరుగుతాయి. డెంగీ పేరుతో దోపిడీ డెంగీ జ్వరంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.బొప్పాయి కాయ తిన్నా, రసం తాగినా ప్లేట్లెట్స్ పెరుగుతాయనే అపోహల్లో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోనే అధికం గ్రామీణ ప్రాంతాల్లో కంటే మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఎక్కువగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. గుంటూరులోని ఏటీ అగ్రహారం, నల్లచెరువు, లాలాపేట, ఆర్ అగ్రహారం, పాత గుంటూరు, సుద్దపల్లిడొంక, బ్రాడీపేట, ఆనంద్పేట, కొత్తపేట, సంగడిగుంట, జిల్లాలోని కొప్పురావూరు, తమ్మవరం, తాడికొండ, తెనాలి చెంచుపేట, చిలుమూరు, వడ్డెరపాలెం, గంగిరెడ్డిపాలెం, మేడికొండూరులో ఈ ఏడాది డెంగీ కేసులు నమోదయ్యాయి. రాజధాని ప్రాంతాలైన తుళ్లూరు, తాడేపల్లి ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజూ జ్వర పీడితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్లేట్లెట్స్పై అపోహలు వీడండి ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గటం సహజం. సాధారణంగా రక్తంలో 2 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి రక్తం బయటకు రావటం, మూత్రంలో, దగ్గుతున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడడం జరిగితే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.– డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరు -
డెంగీ.. స్వైన్ఫ్లూ.. నగరంపై ముప్పేట దాడి
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ను సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ఇప్పటికే డెంగీ జ్వరాలు మృత్యు ఘంటికలు మోగిస్తుండగా, తాజాగా విస్తరిస్తున్న స్వైన్ఫ్లూ కూడా ప్రజల ప్రాణాలు తీస్తోంది. డెంగీతో ఇప్పటి వరకు 38 మంది మృతి చెందగా, స్వైన్ఫ్లూతో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 21 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ గ్రేటర్ వాసులపై ముప్పేట దాడి చేస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం నిలోఫర్లో ఓ బాలిక డెంగీతో ప్రాణాలు వదలగా.. బోడుప్పల్కు చెందిన మరోవిద్యార్థి విషజ్వరంతో మరణించాడు. 1106 ఫ్లూ కేసులు నమోదు హైదరాబాద్లో మొదటిసారిగా 2009లో ‘హెచ్1ఎన్1’ ఇన్ఫ్లూయెంజా వైరస్ వెలుగులోకి వచ్చింది. తర్వాత నగరంలో స్వైన్ఫ్లూ కేసులు, మరణాలు భారీగా నమోదయ్యాయి. ఏడాది పాటు నిశ్శబ్దంగా ఉన్న వైరస్ మళ్లీ 2012లో తన ప్రతాపం చూపించింది. 2017కు ముందు ‘కాలిఫోర్నియా స్ట్రెయిన్’గా వ్యాప్తిలో ఉన్న వైరస్ రెండేళ్ల కిందట ‘మిషిగాన్ స్ట్రెయిన్’గా కొత్త అవతారమెత్తింది. గతేడాది కొంత తగ్గిన ఈ వైరస్ ఈ ఏడాది ఆరంభం నుంచే విజృంభిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తీవ్రస్థాయిలో ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,366 మంది నుంచి నమూనాలు సేక రించి పరీక్షించగా, వీరిలో 1297 మందికి స్వైన్ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 671, రంగారెడ్డి జిల్లాలో 208, మేడ్చల్ జిల్లాలో 227 ప్లూపాజిటివ్ కేసులు నమోదవగా 21 మంది మృత్యువాత పడ్డారు. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసమూహం లో ఎక్కువగా గడపడం వల్ల ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సులభంగా విస్తురించినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. డెంగీతో 38 మంది మృతి గ్రేటర్లో డెంగీ జ్వరాల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పెద్దలతో పోలిస్తే చిన్నప్లిలల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, స్కూలు పరిసరాల్లో పారిశుధ్య లోపం, ఇంటి పరిసరాల్లో పూలకుండీల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వీరు ఎక్కువగా డెంగీ బారిన పడుతున్నారు. గ్రేటర్లో కేవలం పది రోజుల్లో 1,767 డెంగీ కేసులు నమోదు కాగా, బాధితుల్లో 50 శాతం మంది 14 ఏళ్లలోపు పిల్లలే. ఒక్క నిలోఫర్లోనే జూలై నుంచి ఇప్పటి వరకు సుమారు 900కి పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గాంధీ జనరల్ మెడిసిన్ విభాగంలో కేవలం 12 రోజుల్లో 471 మంది జ్వరపీడితుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి, పరీక్షించగా వీరిలో 109 మందికి డెంగీకి పాజిటివ్ నిర్థారణ అయింది. ఇప్పటి వరకు 38 మంది మృతి చెందగా, వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఈ మరణాలను డెంగీ మరణాలుగా ధృవీకరించడం లేదు. డెంగీ లక్షణాలు ఇలా ఈడిస్ ఈజిఫ్టై (టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. పగటి పూట కుట్టే ఈ దోమ.. ప్రస్తుతం లైటింగ్ ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట కూడా దాడి చేస్తోంది. దోమకుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావడంతో పాటు కళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. డెంగీ బాధితుల్లో ఈ సంఖ్య 40 వేలలోపు పడిపోతుంది. 20 వేలకంటే తగ్గిపోతే ప్రమాదం. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులు పూర్తిగా కవర్ చేసే దుస్తువులు వేయాలి. ఇంట్లో మస్కిటో మ్యాట్, మస్కిటో కాయిల్స్, ఆల్ అవుట్ వంటివాటితో దోమలను నియంత్రించాలి. ఇంట్లోని పూలకుండీలతో పాటు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇంటి, పాఠశాల ఆవరణతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో పారిశుధ్యం లోపం లేకుండా చూడాలి. ఫాగింగ్, యాంటీ లార్వా చర్యల ద్వారా ఎప్పటికప్పుడు దోమలను నియంత్రించాలి. – డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్,నిలోఫర్ ఆస్పత్రి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారు జన సమూహంలోనికి వెళ్లక పోవడమే ఉత్తమం. బాధితులు ఉపయోగించిన రుమాలు, టవల్ వంటివి వాడవద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా ఖర్చీఫ్ను పెట్టుకోవాలి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారితో కరచాలనం, ఆలింగనాలు చేయొద్దు. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే స్వైన్ఫ్లూ కావచ్చేమోనని అనుమానించి వైద్యున్ని సంప్రదించాలి. – డాక్టర్ శ్రీహర్ష, నోడల్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా -
దోచేందుకే పరీక్ష
మహేంద్ర కుమార్తెకు జ్వరంగా ఉండడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతికి డెంగీ సోకినట్లు అనుమానంగా ఉందని వైద్యులు రాసిచ్చిన పరీక్షలకు రూ.6వేలు ఖర్చు చేశాడు. అయినా సరే ఏ జ్వరం అనే దానిపై నివేదికల్లో స్పష్టత లేదు. మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ రూ.4వేలు ఖర్చు అయ్యింది. అయినా జ్వరం తగ్గకపోవడంతో నెల్లూరులోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా రూ.800 ఖర్చుతో వైరల్ జ్వరం వచ్చినట్లు తేల్చారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి సైతం కుదుటపడింది.’’ చిత్తూరు అర్బన్ : ఇది మహేంద్ర ఒక్కడి సమస్యే కాదు జిల్లాలోని చాలామంది తల్లిదండ్రుల ఆవేదన. ఇటీవల జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో నివాసాల మధ్య నీటి నిల్వ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా దోమల వ్యాప్తి పెరిగింది. ఇదే అదునుగా జ్వరమొచ్చి రక్తపరీక్షల్లో ప్లేట్లెట్లు కాస్త తగ్గినా కొందరు వైద్యులు డెంగీని బూచిగా చూపుతూ బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. డెంగీ జ్వరాలపై ప్రజలకు కనీస అవగాహన ఉంటే తప్ప ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేటట్లు కనిపిం చడం లేదు. డెంగీ వ్యాప్తి ఇలా.. డెంగీ జ్వరం ఎడిస్ ఈజిప్టి (టైగర్ దోమ) దోమవల్ల వ్యాప్తి చెందుతుంది. ఆర్బో అనే వైరస్ ఎడిసన్ దోమలోకి ప్రవేశించి అది మనిషిని కుట్టడం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశి స్తుంది. దోమ కుట్టిన ఐదు రోజులుతర్వాత డెంగీ లక్షణాలు కనిపిస్తాయి. ఈ దోమలు ఇళ్లల్లోని మంచినీళ్లు, పూలకుండీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, నిల్వ ఉన్న వర్షపు నీళ్లల్లో వృద్ధి చెందుతుంటాయి. కేవలం ఇది పగటి పూట కుట్టడం ద్వారానే డెంగీ వ్యాప్తి చెందుతుంది. నిర్ధారణ పరీక్షలు మ్యాక్ ఎలీసా పరీక్ష తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో మ్యాక్ ఎలీసా ద్వారా డెంగీ నిర్థారణ పరీక్ష ఉచితంగా చేస్తారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి నుంచి రక్తనమూనా సేకరిస్తారు. రక్తంలోని సీరంకు ఐజీజీ, ఐజీఎం పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి 8 గంటల సమయం పడుతుంది. ఇందులో పాజిటివ్ వస్తే డెంగీ జ్వరం ఉన్నట్లు నిర్థారిస్తారు. డెంగీ జ్వరం నుంచి కోలుకున్న ఆరునెలల వరకు మ్యాక్ ఎలిసా పరీక్ష ఎప్పుడు నిర్వహించినా పాజిటివ్ వస్తుంది. అంతమాత్రాన డెంగీ జ్వరం ఆరునెలలుగా ఉందని అర్థం కాదు. ఈ పరీక్షలకు కొన్ని ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రుల్లో రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్డీటీ పరీక్ష ర్యాపిడ్ డయోగ్నస్టిక్ టెస్ట్ (ఆర్డీటీ) ద్వారా ఇటీవల డెంగీ జ్వరాలను నిర్థారణ చేయడం చాలా ల్యాబ్లకు అలవాటైపోయింది. ఈ పరీక్ష ద్వారా రక్త నమూనా సేకరించి ఐదు రోజుల్లోపు జ్వరంతో బాధపడుతుంటే ఎన్ఎస్–1 పరీక్ష చేస్తారు. ఐదు రోజులకు పైబడి జ్వరం వస్తూనే ఉంటే ఐజీజీ, ఐజీఎం పరీక్షలు చేస్తారు. ఇది అరగంటలో పూర్తయిపోతుంది. అయితే డెంగీ నిర్థారణకు ఇది సరైన పరీక్ష కాదు. డెంగీతో పాటు ఇతర వైరల్ జ్వరాలు వస్తే కూడా ఈ పరీక్షలో పాజిటివ్ వస్తుంది. ఈ పరీక్ష చేయడానికి రూ.300 పైన చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రైవేటు వైద్యులు రూ.2వేల వరకు తీసుకుంటున్నారు. ప్లేట్లెట్ల పరీక్ష సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రక్తంలోని ప్లేట్లెట్లు సంఖ్య 2లక్షల వరకు ఉంటుంది. వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్యను తెలిపే పరీక్షకు రూ.100 – 200 చెల్లిస్తే సరిపోతుంది. గంటలో ఫలితాన్ని ఇచ్చేస్తారు. పౌష్టికాహారం, వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే ప్లేట్లెట్లు పెరుగుతాయి. ఒక్కోసారి ప్లేట్లెట్లు 10వేలకు కూడా పడిపోతాయి. అంతమాత్రాన కంగారు పడాల్సినవసరం లేదు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో రోగికి నేరుగా ప్లేట్లెట్లనే ఎక్కించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు రోజుల్లో ప్లేట్లెట్లు పడిపోయిన వ్యక్తికి 1.40లక్షల వరకు ప్లేట్లెట్లను పునరుత్పత్తి చేసే యంత్రాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉన్నాయి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారంటే ♦ ప్లేట్లెట్లు తగ్గినా, ఆర్డీడీ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా డెంగీ వచ్చినట్లు కాదు. ♦ కొందరు ల్యాబ్ నిర్వాహకులు, మరికొందరు ప్రైవేటు వైద్యులు డెంగీపై కంగారు పెట్టేస్తుంటారు. అలాంటి వాటికి భయపడొద్దు. ♦ ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక, సామాజిక, ఉప ఆరోగ్య కేంద్రాల్లో అనుభవమున్న వైద్యులున్నారు. విడవని జ్వరంతో బాధపడుతున్న వారిని అక్కడికి తీసుకెళ్తే రోగికి ఉన్న లక్షణాల ఆధారంగానే డెంగీ ఉందా, లేదా అని చెప్పేస్తారు. ♦ డెంగీ నిర్ధారణ కోసం మ్యాక్ ఎలీసా పరీక్షలకు రక్తనమూనా సేకరించి తిరుపతికి పంపిస్తారు. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత డెంగీ ఉంటే చికిత్స ప్రారంభిస్తారు. ఇవన్నీ ఉచితంగా చేయాలి. ఇక డెంగీ వైరస్ ద్వారా వచ్చే జ్వరానికి పారాసిట్మాల్ మాత్ర వేస్తేనే క్రమంగా తగ్గిపోతుంది. బొప్పాయి, దానిమ్మ పండ్లను బాగా తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ప్లేట్లెట్లు కూడా పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.– డాక్టర్ పి.సరళమ్మ, జిల్లా ప్రభుత్వవైద్యశాలల సమన్వయాధికారి -
వారి ఆలస్యం పాప ప్రాణాలను తీసింది
సాక్షి, తుని : చిన్నారి ప్రాణాలను కాపాడుకొనేందుకు ఆ తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఎంతో ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. చివరికి ఆమెకు డెంగీ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో కాకినాడ తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఇంటిలోంచి సొమ్ము తెచ్చుకోవడంలో ఆలస్యమైంది. ఆ ఆలస్యమే పాప ప్రాణాలను తీసింది. డెంగీతో ఆ పాపకు ఊపిరి తీసుకోలేకపోతుంటే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ పెట్టి కాకినాడ జీజీహెచ్కు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. సొమ్ము కోసం ఇంటికి పరుగున వెళ్లిన ఆ పాప తిరిగి ఆస్పత్రికి వచ్చేసరికి.. ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. స్థానిక 4వ వార్డుకు చెందిన నాగులాపల్లి స్వాతిశ్రీ (5)కి తొలుత సాధారణ జ్వరమని ఆర్ఎంపీతో వైద్యం చేయించారు.టైఫాయిడ్, మలేరియాకు మందులు కూడా వాడించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె డెంగీతో మృతి చెందింది. నాగులాపల్లి నాగేశ్వరరావు, జ్యోతిలకు ఇద్దరు పిల్లలు. ఇందులో స్వాతిశ్రీ ఆఖరి కుమార్తె. రెండు వారాల క్రితం జ్వరం వస్తే పట్టణంలోని ఆర్ఎంపీతో వైద్య పరీక్షలు చేయించి టైఫాయిడ్, మలేరియాకు మందులు వాడించారు. రెండు రోజల క్రితం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు పిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుడు ఆమెకు డెంగీ ఉన్నట్టు చెప్పారు. ఆమె రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ 47వేలకు పడిపోయింది. వెంటనే కాకినాడ తీసుకువెళ్లాలని వైద్యుడు రిఫర్ చేశారు. దీంతో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో ఆమెకు ఆక్సిజన్ పెట్టి అంబులెన్స్లో ఎక్కించారు. చేతిలో సొమ్ము లేకపోవడంతో తల్లి జ్యోతి ఇంటికి వెళ్లి రావడం ఆలస్యమైంది. ఈలోగా పాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కట్టలు తెంచుకున్న తల్లిదండ్రుల ఆవేదన కంటికి రెప్పలా చూసుకున్న చిన్నారి ఇక తిరిగిరాదన్న విషయం తల్లిదండ్రుల ఆవేదన కట్టలు తెచ్చుకుంది. ముందే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే ప్రాణాలను కాపాడుకునే వాళ్లమని దుఃఖంతో కన్నీరుమున్నీరయ్యారు. డెంగీ చికిత్సకు ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించినప్పటికీ చిన్నారిని బతికించుకోలేక పోయామని ఆవేదన చెందారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. డెంగీ నిర్ధారణ పరీక్ష తునిలో అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. పురపాలక సంఘం అధికారులు పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టెన్షన్ పెట్టిస్తున్న డెంగ్యూ ఫీవర్
-
డెంగీ భయం వద్దు: ఈటల
సాక్షి, పెద్దపల్లి : ‘వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. 99 శాతం ప్రజలు వైరల్ ఫీవర్తోనే బాధపడుతున్నారు. 12 జిల్లాలు తిరిగి వచ్చా.. గతంలో మాదిరిగా ఈ సారి డెంగీ ప్రభావం పెద్దగా లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి ముందుగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ సంస్థ రూ.7.89 కోట్ల నిధులతో చేపట్టబోయే 50 అదనపు పడకల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖలఅధికారులతో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పారిశుధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా విషజ్వరాలను నివారించవచ్చని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీదేవసేన, వివిధశాఖల అధికారులతో సీజనల్వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వైరల్ జ్వరాలు వస్తాయన్నారు. నివారణకు వైద్య,పంచాయతీరాజ్,మున్సిపల్శాఖల సమన్వయంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం 99శాతం వైరల్జ్వరాలు మాత్రమే వస్తున్నాయని స్పష్టం చేశారు. రోగాల బారినపడ్డ వారికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్న మంత్రి వైద్యసిబ్బందికి నెలరోజుల పాటు సెలవులు రద్దు చేసినట్లు వివరించారు. వందశాతం ఓడీఎఫ్ జిల్లాగా పెద్దపల్లి జిల్లాను ఓడీఎఫ్గా ప్రకటించుకుని, గ్రామీణ ప్రాంతాల్లోని మురికి కాల్వలను మూసివేయడం ఆ దిశగా ఇప్పటికే జిల్లా పయనించడం ఆనందంగా ఉందన్నారు. పారిశుధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.ఆశావర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎంల ద్వారా గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. దోమల నివారణకు అవసరమైన ఫాగింగ్ చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పేదప్రజలను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేయవద్దని స్పష్టం చేశారు. యోగా సెంటర్ను ప్రారంభిస్తున్న ఈటల ప్రభుత్వ సలహాలను అనుసరిస్తాం: కలెక్టర్ శ్రీదేవసేన కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం అందిస్తున్న సలహాలను అనుసరిస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు నాలుగు నెలలుగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జిల్లాలో కేవలం వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పటి వరకు జిల్లాలో 17 డెంగీ, 4 చికెన్గున్యా కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్టమధు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, పెద్దపల్లి, రామంగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకుంటి చందర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, డీఎంహెచ్ఓ ప్రమోద్కుమార్ తదతరులు పాల్గొన్నారు. రూ.7.89 కోట్లతో అదనపు 50 పడకల నిర్మాణానికి శంకుస్థాపన అంతకుముందు గోదావరిఖనిలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో 50 అదనపు పడకల నిర్మాణం కోసం, ఎన్టీపీసీ సీఎస్ఆర్ సంస్థ రూ.7.89 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టబోయే పనులకు శుక్రవారం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్నేత, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్టమధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ శ్రీదేవసేనతో కలిసి మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.మంత్రి మాట్లాడుతూ... అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఆస్పత్రిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామన్నారు.నిధులు కేటాయించిన ఎన్టీపీసీ అధికారులను మంత్రి అభినందించారు. అనంతరం ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు.డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ సౌకర్యం ఇప్పించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ‘ఖని’లో వైద్య కళాశాల ఏర్పాటు, మాతా శిశు కేంద్రం ఏర్పాటు, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, డయాలసిస్ సెంటర్ను విస్తరించాని, ఆస్పత్రిలో నెలకొన్ని వైద్యులు, సిబ్బంది కొరత తీర్చాలని ఎమ్మెల్యే చందర్ మంత్రికి విన్నవించారు. గర్భిణుల యోగా కేంద్రం ప్రారంభం ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన గర్భిణీల యోగా కేంద్రం(ఆంటినెంటల్ ఎక్సెర్సైజ్ రూం)ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. గర్భిణులకు ఆపరేషన్లు చేయడం కన్నా, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యులకు మంత్రి సూచించారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, జెడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, నారాయణ, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ డీజీఎం రమేష్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు గోలివాడ చంద్రకళ, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ అశోక్కుమార్, డీఎంహెచ్ఓ ప్రమోద్కుమార్, డీసీహెచ్ఎస్ రమాకాంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
13 రోజుల్లో ఆరుగురు చిన్నారుల మృత్యువాత
సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: డెంగీ దోమలు పసిపిల్లలపై పంజా విసురుతున్నాయి. తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిలోఫర్ ప్రభుత్వ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం సహా నగరంలోని పలు ప్రైవేటు చిన్నపిల్లల ఆస్పత్రులు సైతం జ్వర బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని పీడియాట్రిక్ విభాగాలన్నీ హౌస్ఫుల్ కావడంతో పడకల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. వైద్యం అటుంచి.. కనీసం పడుకునేందుకు బెడ్ దొరికితే చాలు అన్నట్లుగా ఉంది. గ్రేటర్లో పది రోజుల్లో 1767 కేసులు నమోదు కాగా, బాధితుల్లో 50 శాతం మంది 14 ఏళ్లలోపు పిల్లలే కావడం గమనార్హం. జ్వర పీడితులతో నిలోఫర్, గాంధీ పీడియాట్రిక్ వార్డులు నిండిపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు విధిలేని పరిస్థితిలో ప్రైవేటు ఆస్పత్రులు, క్లీనిక్స్ను ఆశ్రయిస్తున్నారు. తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల రద్దీ దృష్ట్యా జ్వరం పూర్తిగా తగ్గకుండానే బాధితులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, కొత్తవారిని అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుందని ప్రైవేటు వైద్యులు పేర్కొంటున్నారు. 13 రోజుల్లో ఆరుగురు చిన్నారుల మృత్యువాత నిలోఫర్ ఆస్పత్రిలో జులై నుంచి ఇప్పటి వరకు సుమారు 900 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గాంధీ జనరల్ మెడిసిన్ విభాగంలో కేవలం 12 రోజుల్లో 471 మంది జ్వరపీడితుల నుంచి రక్తపు నమూనాలను పరీక్షించగా వారిలో 109 మందికి డెంగీకి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 32 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది చిన్నారులే. డెంగీతో మృతి చెందిన వారిలో ఆరుగురు చిన్నపిల్లలే ఉండటం గమనార్హం. అయితే మృతుల వివరాలను ఆస్పత్రి పాలనా యంత్రంగా గోప్యంగా ఉంచుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెంగీతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 31న ఫలక్నుమాకు చెందిన మహ్మద్ నబీల్(9) మృతి చెందగా, సెప్టెంబర్ 5న గోషా మహల్కు చెందిన అపూర్వ(3), 7న సింగరేణి కాలనీకి చెందిన రాకేష్(9), 10న గాంధీనగర్కు చెందిన వర్షిణి(8), 11న బడంగ్పేటకు చెందిన హర్షిత(4), 12న మాణికేశ్వర్ నగర్కు చెందిన నవీన్కుమార్(12) మృతి చెందారు. కేవలం 13 రోజుల వ్యవధిలోనే ఆరుగురు చిన్నారులు మృతి చెందడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల్లో చిన్నపిల్లలే ఎక్కువ.. పెద్దలతో పోలిస్తే చిన్నప్లిలల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సీజన్ మారినప్పుడు పలువురు చిన్నారులు జ్వరం, దగ్గు, జలుబు, నిమోనియాతో బాధ పడుతుంటారు. డెంగీ దోమలు ఎక్కువగా పగటిపూట కుడుతుంటాయి. మూడేళ్లలోపు చిన్న పిల్లలు ఎక్కువగా పగటిపూట నిద్రపోతుంటారు. కాళ్లు, చేతులు పూర్తిగా కవర్ చేసే దుస్తులకు బదులు ఆఫ్షర్ట్స్, షార్ట్స్ ధరిస్తుంటారు. వీరిని దోమలు కుట్టడంతో త్వరగా డెంగీ బారిన పడుతుంటారు. ఇక స్కూలు పరిసరాల్లో పారిశుద్ధ్య లోపంతో విద్యార్థులకు జ్వరాలు వస్తున్నాయి. డెంగీ లక్షణాలు గుర్తించడం ఇలా ♦ ఈడిన్ ఈజిఫ్టై(టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ♦ కేవలం పగటి పూట మాత్రమే కుట్టే ఈ దోమ...ప్రస్తుతం లైటింగ్ ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట కూడా కుడుతుంది. ♦ దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావడంతో పాటు కళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ♦ ఎముకలు, కండరాల్లో భరించ లేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. ♦ సాధారణంగా మనిషి రక్తంలో 1.50 నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. ♦ డెంగీ బాధితుల్లో రక్త కణాలు(ప్లేట్స్ లెట్స్) సంఖ్య 40 వేలలోపు పడిపోతుంది. ♦ 20 వేలలోపు పడిపోతే ప్రమాదం. ఆ సమయంలో తిరిగి ఎక్కించాల్సిఉంటుంది. ♦ లేదా అవయవాలు పనిచేయడం మానేసి, మృత్యువాతపడే ప్రమాదం ఉంది. ♦ లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ రమేష్ దంపూరి,చిన్నపిల్లల వైద్యనిపుణుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ ♦ పిల్లలకు సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులు పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేయాలి. ♦ పిల్లలు పగలు నిద్ర పోయే సమయంలో పడకపై రక్షణ కోసం దోమ తెరలు వాడాలి. ♦ మస్కిటో మ్యాట్, మస్కిటో కాయిల్స్, ఆల్ అవుట్ వంటి వాటితో దోమల నియంత్రించాలి. ♦ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్యలోపం లేకుండా చూసుకోవాలి. ♦ ఇంట్లోని పూల కుండీలను, వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ♦ పాఠశాల ఆవరణతో పాటు ఆ చుట్టూ పక్కల పరిసరాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలి. ♦ ఫాగింగ్, యాంటీ లార్వా చర్యల ద్వారా ఎప్పటికప్పుడు దోమలను నియంత్రించాలి. ♦ ఇంట్లోని మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టడం ద్వారా డెంగీ దోమలను దరి చేరకుండా చూడొచ్చు.– డాక్టర్ రాజన్న,చిన్నపిల్లల వైద్యనిపుణుడు -
‘విష జ్వరాలన్నీ డెంగీ కాదు’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ప్రతి విష జ్వరం డెంగీ కాదని, ప్రతి జ్వరం మలేరియా కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రకరకాల వైరల్ ఫీవర్స్కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు, సెలైన్ బాటిళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం మంత్రులు జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావులతో కలసి సూర్యాపేటలోని జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలపై రోగులను ఆరా తీశారు. మెడికల్ కళాశాల భవనా న్ని పరిశీలించారు. విషజ్వరాలపై ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవా లని సూచించారు. డాక్టర్లు, సిబ్బంది నెల రోజులు సెలవు పెట్టొద్దని ఆదేశించారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఆస్పత్రులకు ఏ లోటు లేకుండా చూస్తామని చెప్పారు. కాగా, నల్లగొండ రహ్మత్నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్రఫీ కుమార్తె ఆఫీయా మెహ్వీన్ (7) డెంగీ వ్యాధి సోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. -
డెంగీ బూచి.. రోగులను దోచి..
సాక్షి, నంద్యాల(కర్నూలు) : నంద్యాల పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ పేరిట దోపిడీ సాగుతోంది. జ్వరమని వెళితే చాలు..ప్లేట్లెట్లు తగ్గాయని, డెంగీ ఉండొచ్చంటూ భయపెడుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు ఎక్కువయ్యాయి. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగాన పల్లె, నందికొట్కూరు, ఆత్మకూరు నియోజక వర్గాల ప్రజలు ఎక్కువగా నంద్యాలకు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అనుమతి లేకున్నా.. వాస్తవానికి నంద్యాలలోని ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయడానికి అనుమతి లేదు. పైగా ఏ ఆసుపత్రిలోనూ అందుకు అవసరమైన పరికరాలు కూడా లేవు. నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. ఈ వైద్య పరీక్ష కిట్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆగస్టులో 1,200 మందికి డెంగీ పరీక్షలు చేశారు. ఒక్కరికీ వ్యాధి నిర్ధారణ కాలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా.. పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు మాత్రం ‘డెంగీ నిర్ధారణ పరీక్ష చేశాం, మీకు పాజిటివ్ వచ్చిందం’టూ రోగులను బెంబేలెత్తిస్తున్నారు. రోగులు విధిగా ఆసుపత్రిలో చేరేలా, వారు చెప్పిన వైద్యపరీక్షలన్నీ చేయించుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఐసీయూలో ఉంచి అడ్డంగా దోపిడీ కొన్ని ఆసుపత్రుల్లో దోపిడీ మరీ శ్రుతిమించుతోంది. జ్వరం తగ్గే వరకు రోగులను బలవంతంగా ఐసీయూలో ఉంచుతున్నారు. ఇందుకు గాను రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచిన తర్వాత ప్రత్యేక గదికి మార్చి.. అక్కడ కూడా కనీసం వారం రోజులు ఉంచుతున్నారు. అలాగే మందుల చీటీపై ఖాళీ ఎంత ఉంటుందో అన్ని రకాల ఔషధాలు రాస్తున్నారు. సదరు ఆసుపత్రి మెడికల్ స్టోర్లోనే కొన్పిస్తున్నారు. ఇలా రోగి స్థోమతను బట్టి ఎంత వీలైతే అంత గుంజుతున్నారు. ఒక్కో రోగి కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్ష దాకా సమర్పించుకోవాల్సి వస్తోంది. ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన.. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల ప్లేట్లెట్లు ఉంటాయి. అనారోగ్యానికి గురైనప్పుడు ఇవి కొంతమేర తగ్గుతుంటాయి. సాధారణ జ్వరాల్లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. డెంగీ బారిన పడితే మాత్రం బాగా తగ్గుముఖం పడతాయి. 20 వేల కంటే దిగువకు పడిపోయి.. కళ్లు, మూత్రంలో రక్తం రావడం, జ్వరం ఎంతకీ తగ్గకపోవడం, శరీరంపై దద్దుర్లు, తీవ్ర తల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పించినప్పుడు మాత్రమే ఆందోళన చెందాల్సి ఉంటుంది. డెంగీ నిర్ధారణ ఇలా.. డెంగీ అనే అనుమానం ఉంటే ఎన్ఎస్–1, ఐజీఎం పరీక్షలు చేస్తారు. పాజిటివ్గా నివేదిక వస్తే ఎలిసా పరీక్ష చేసి..నిర్ధారిస్తారు. కొన్నిసార్లు మొదటి, రెండు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా..ఎలీసా పరీక్షలో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రైవేటు ఆసుపత్రికి డెంగీ అనుమానిత రోగి వెళ్తే వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా ప్రైవేటు వైద్యులు కొందరు రోగులను భయపెట్టి వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ ఆర్థికంగా దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ అని నిర్ధారిస్తే చర్యలు నంద్యాల చుట్టుపక్కల ఏ ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే డెంగీ అనుమానితుల వివరాలను వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు తెలియజేయాలి. వెంటనే అవసరమైన వైద్యపరీక్షలు చేయిస్తాం. ఎలిసా వంటి పరీక్షలు చేసి, పాజిటివ్ అని తేలితేనే డెంగీగా గుర్తిస్తాం. దాంతో పాటు రోగి నివాసం ఉండే పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచిస్తాం. అలా కాకుండా కార్పొరేట్, ప్రైవేటు వైద్యశాలల్లో డెంగీగా నిర్ధారించినట్లు తేలితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. నంద్యాల ఆసుపత్రిలో ఇంత వరకు ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన అది డెంగీగా భావించవద్దు. –డాక్టర్ రామకృష్ణారావు, డీసీహెచ్ఎస్, నంద్యాల వాస్తవాలు ఇవీ.. ⇔ నంద్యాలలో ఏ ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ నిర్ధారణ పరీక్ష చేయడానికి అనుమతి లేదు. ⇔ నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. ⇔ నంద్యాల ప్రాంతంలో మూడు నెలలుగా ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. ⇔ ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన డెంగీ కాదు. సాధారణ జ్వరపీడితుల్లోనూ ఈ లక్షణం కన్పిస్తుంది. దగ్గు, జ్వరానికే రూ.70 వేలు 247 ఏళ్ల వయస్సుండే ఓ ప్రైవేటు ఉద్యోగి దగ్గు, జ్వరంతో నంద్యాల వన్టౌన్ ఏరియాలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్లు శ్రీనివాస సెంటర్లోని ఓ ప్రైవేటు ల్యాబ్కు పంపి వైద్యపరీక్షలు చేయించారు. ప్లేట్లెట్లు 50 వేలు ఉన్నట్టు రిపోర్టు వచ్చింది. దీంతో వైద్యులు మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచి, అనంతరం మరో వారం రోజులు జనరల్వార్డులో ఉంచుకుని రూ.70 వేలు వసూలు చేశారు. మరో 10 రోజులకు మందులు రాసిచ్చి పంపారు. ప్లేట్లెట్లు తగ్గాయని రూ.40 వేల వసూలు 2నంద్యాల గిరినాథ్ సెంటర్ ప్రాంతంలో ఉండే పదేళ్ల బాలికకు పది రోజుల క్రితం జ్వరమొచ్చింది. రెండు రోజుల పాటు జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు సంజీవనగర్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ టైఫాయిడ్, మలేరియా, ప్లేట్లెట్ కౌంట్ పరీక్షలు రాశారు. ప్లేట్లెట్లు 60 వేలకు తగ్గకూడదని, మీ పాపకు 55 వేలు ఉన్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని భయపెట్టారు. చేసేది లేక చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారం రోజులు ఉంచుకుని రూ.40 వేల బిల్లు వేశారు. -
ప్రైవేటు ఆస్పత్రులపైనా డెంగీ అదుపు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: డెంగీ వంటి రోగాల బారిన జనం పడినప్పుడు ప్రభుత్వాస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా యుద్ధప్రాతిపదికపై రోగులకు వైద్య సేవలు అందించాలని హైకోర్టు సూచించింది. ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేసే బాధ్యత ప్రభుత్వంపై మాత్రమే ఉందనుకోరాదని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా మానవీయకోణంలో స్పందించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. డెంగీ వంటి రోగాలతో జనం నానాకష్టాలుపడుతున్నారని, ప్రభుత్వ చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొంటూ కొంపల్లి ప్రాంతానికి చెందిన వైద్యురాలు ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి ధర్మాసనం శనివారం విచారించింది. డెంగీ, ఇతర జ్వరాలతో బాధపడే రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయని, పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఇప్పటి వరకూ 60 డెంగీ కేసులు నమోదయ్యాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాస్పత్రుల్లోనే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడం కష్టమవుతున్న తరుణంలో ప్రైవేటు ఆస్పత్రులు తక్షణమే స్పందించి ఆ రోగాల్ని కనీస స్థాయికి తగ్గించేందుకు కృషి చేయాలని హైకోర్టు హితవు చెప్పింది. దోమలు వ్యాప్తి కాకుండా జీహెచ్ఎంసీ ఫాగింగ్ స్ప్రే చేస్తోందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. పూర్తి వివరాల్ని అందించేందుకు సమయం కావాలని కోరడంతో విచారణ 11కి వాయిదా పడింది. -
విషజ్వరాలతో వణికిపోతున్న భాగ్యనగరం
-
విశ్వనగరంలో విషజ్వరాలు
-
దోమలపై డ్రోనాస్త్రం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి.ప్రాణాంతక డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్ని చర్యలు తీసుకున్నా నివారణ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో బల్దియా దోమల నివారణకు ఆధునిక ఆయుధాలను ప్రయోగిస్తోంది. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. దోమ లార్వాలను తుదముట్టించేందుకు అవసరమైన మందును స్ప్రే చేసేందుకు ప్రత్యేక డ్రోన్లను వినియోగిస్తోంది. మరోవైపు కొత్తగా నానో టెక్నాలజీతో ప్రత్యామ్నాయ మందును స్ప్రే చేసే ప్రయోగం సైతం చేపట్టింది. డ్రోన్లతో ఇప్పటికే సత్ఫలితాలు వెలువడగా... ప్రత్యామ్నాయ మందు ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. జీహెచ్ఎంసీకి చెందిన 650 ఎంటమాలజీ బృందాలు రోజుకు సగటున 1.40 లక్షల ఇళ్లలో తనిఖీలు చేస్తూ దోమల నివారణ మందు స్ప్రే చేస్తున్నాయి. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాయి. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవి ఇళ్లల్లో చేసే కార్యక్రమాలు కాగా...దోమలకు ఆవాసాలైన చెరువులు, సరస్సుల్లో యాంటీ లార్వా ఆపరేషన్లకు పడవలు వేసుకొని వెళ్లాల్సి వస్తోంది. ఫీకల్ స్లడ్జ్తో కూడిన చెరువుల్లోకి దిగినప్పుడు సిబ్బందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా టీహబ్లోని ఓ అంకుర సంస్థ దోమల నివారణ మందును స్ప్రే చేయడానికి తగిన నాసిల్స్తో కూడిన డ్రోన్ను ప్రత్యేకంగా రూపొందించింది. దీన్ని తొలుత మియాపూర్ గుర్నాథం చెరువులో ప్రయోగించారు. సత్ఫలితాలు రావడంతో దాదాపు పది రోజుల క్రితం నగర మేయర్ రామ్మోహన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తగ్గిన లార్వా... ఒక లాడిల్ (సాంబారు గరిటె లాంటి పరికరం) పరిమాణంలోని (దాదాపు 40 మీ.లీ) నీటిలో లార్వాలు 120 నుంచి 20కి తగ్గాయి. లార్వా నివారణకు ఎంతో కాలంగా వాడుతున్న పైరిథ్రిన్, సిఫనోథ్రిన్ లాంటి ఆయిల్స్ స్ప్రేతోనే ఇది సాధ్యమైంది. డ్రోన్ ద్వారా చెరువు మొత్తం మందు పిచికారీ చేయడంతో ఇది సాధ్యమైందని భావిస్తున్నారు. దీని వినియోగం ద్వారా ఎంటమాలజీ కార్మికులు దుర్గందభరిత చెరువుల్లోకి దిగాల్సిన పని లేదు. అంతేకాదు దాదాపు 10 మంది నెల రోజుల పాటు చేసే పనిని డ్రోన్ ద్వారా ఒక్క రోజులో చేయడం సాధ్యమైంది. మిగతా చెరువుల్లోనూ... శేరిలింగంపల్లి జోన్లోని గుర్నాథం చెరువులో వచ్చిన ఫలితాలతో దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువు, గోపీ చెరువు, హైటెక్స్ దగ్గరి చెరువుల్లోనూ డ్రోన్తో స్ప్రే చేశారు. ఖైరతాబాద్ జోన్లోని అహ్మద్నగర్ నాలా, గోల్కొండ, లంగర్హౌస్, సాతం చెరువు తదితర ప్రాంతాల్లో కూడా డ్రోన్తో స్ప్రే ప్రారంభించినట్లు జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖి తెలిపారు. గుర్రపుడెక్క తొలగింపునకు తాము డీవీడింగ్ యంత్రాలు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఎంటమాలజీ సిబ్బందితో చెరువుల్లో దోమల మందు పిచికారీకి దాదాపు నెల రోజులు పడుతుంది. 10మంది బృందం పని చేయాల్సి ఉంటుంది. చెరువు ఒడ్డు నుంచి దాదాపు పది అడుగుల లోపలికే తప్ప.. చెరువు మధ్యలోకి వెళ్లడం కుదరదు. అదే డ్రోన్ ద్వారా చెరువు మొత్తం స్ప్రే చేయొచ్చ’ని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ తెలిపారు. డ్రోన్ ద్వారా ఒక పర్యాయం 10 లీటర్ల మందు తీసుకెళ్లొచ్చన్నారు. మూసీలోనూ... వివిధ చెరువులతో పాటు దోమలకు నిలయమైన మూసీలోనూ యాంటీ లార్వా ఆపరేషన్ చేపడుతున్నాం. దోమల నివారణకు డ్రోన్లను వినియోగిస్తున్నాం. మెరుగైన ఫలితాలు కనిపిస్తుండడంతో క్రమేపీ నగరంలోని అన్ని చెరువులకూ వీటిని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తాం. – బొంతు రామ్మోహన్, మేయర్ త్వరలో నానోటెక్నాలజీతో... దోమల నివారణకు సంప్రదాయ మందుల స్థానంలో ప్రత్యామ్నాయ మందుగా నానో టెక్నాలజీ, సిల్వర్ పార్టికల్స్తో లార్వాలను నివారించవచ్చని ఓయూ ప్రొఫెసర్ ఒకరు కనిపెట్టారు. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈటీపీఆర్ఐ (ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఆమోదం తెలపడంతో పీసీబీకి కూడా లేఖ రాశాం. దాని స్పందనను బట్టి వినియోగిస్తాం. సిల్వర్ వాడకంతో మనుషులకు ఎలాంటి హానీ ఉండదు. ఇప్పటి వరకు లార్వాల నివారణకు డ్రోన్ల ద్వారా స్ప్రే కూడా ప్రపంచంలోనే ఎక్కడా లేదు. పైన వేలాడే తీగలు లేని, తగినంత ఓపెన్ ప్లేసెస్ ఉన్న చెరువులకు మాత్రమే డ్రోన్ వినియోగం సాధ్యం. ఇరుకు ప్రాంతాల్లో డ్రోన్ వెళ్లలేదు. గుర్రపుడెక్కను తొలగించేందుకు వీడిసైడ్స్కు కూడా డ్రోన్లను వాడుతున్నప్పటికీ, ఫలితాలను పరిశీలించేందుకు సమయం పడుతుంది. దాదాపు 25 ఎకరాల చెరువులోనైనా డ్రోన్తో ఒకే రోజులో స్ప్రే సాధ్యమవుతుంది. ఇందుకు డ్రోన్ అద్దె దాదాపు రూ.25వేలు. – హరిచందన దాసరి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (లేక్స్ విభాగం) సత్ఫలితాలు ⇔ ప్రత్యేక డ్రోన్తో మందు స్ప్రే చేయడం ద్వారా నీటిలో లార్వాల సంఖ్య తగ్గింది. ⇔ 10 మంది బృందం నెల రోజుల పాటు పిచికారీ చేసే మందును ఈ డ్రోన్ ఒక్క రోజులోనే చేస్తుంది. ⇔ దీనితో ఒకేసారి 10 లీటర్ల మందు తీసుకెళ్లొచ్చు. ⇔ దాదాపు 25 ఎకరాలచెరువులోనైనా ఒకే రోజులో స్ప్రేసాధ్యమవుతుంది. -
రాష్ట్రంలో డెంగీ ఎమర్జెన్సీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. డెంగీ సోకడంతో రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు దాదాపు 50 మంది వరకు మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది. అయితే ఈ మరణాల సంఖ్యను వెల్లడించకుండా అధికారులు దాచిపెడుతున్నారు. తెలంగాణ చరిత్రలో ఇంతమంది డెంగీకి చనిపోయిన పరిస్థితి గతంలో లేనేలేదు. 2017లో మరణాలు సంభవించలేదు. 2018లో ఐదుగురు చనిపోయారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐదేళ్ల వయసు చిన్నారులు మృత్యువాత పడటంపైనా ఆందోళన వ్యక్తం అవుతోంది. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రెండ్రోజులుగా వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సుదీర్ఘ సమీక్షల్లో మునిగిపోయారు. మంగళవారం ఫీవర్ ఆసుపత్రి సందర్శించారు. డెంగీపై ఏం చేయాలన్న దానిపై వైద్యాధికారులతో చర్చలు జరిపారు. ప్రైవేటులోనూ ఉచిత పరీక్షలు.. డెంగీ మరణాలు అధికంగా నమోదు కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సంభవిస్తున్న మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సరైన వైద్యం అందించాలని ప్రైవేటు ఆసుపత్రులను సర్కారు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే బోధనాసుపత్రులు, ఫీవర్ ఆసుపత్రి, ఐపీఎం కేంద్రాల్లో ప్రజలకు ఉచిత డెంగీ పరీక్షలు నిర్వహిస్తుండగా, ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలోనూ ఉచితంగా పరీక్షలు చేసేందుకు కొన్ని ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఉచిత హోమియో మందు.. డెంగీ జ్వరాలు రాకుండా ఉచిత హోమియో మందు సరఫరా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆయుష్ విభాగం ద్వారా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ రామంతాపూర్లోని హోమియో కాలేజీలో, ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్ల వద్ద ఉచిత హోమియో మందులు సరఫరా చేయనున్నారు. అందుకు తక్షణమే 3 లక్షల డోసుల డెంగీ నివారణ మందు సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డెంగీ నివారణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రత్యేక వార్డులు.. ఏరియా, జిల్లా ఆసుపత్రులు, నిలోఫర్, గాంధీ, ఉస్మానియా వంటి అన్ని బోధనాసుపత్రుల్లోనూ డెంగీ జ్వరాలతో వచ్చే వారికి ప్రత్యేక వార్డులు కేటాయిస్తారు. ప్రతి ఆసుపత్రిలో దాదాపు 20 పడకలు డెంగీ బాధితుల కోసం కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే వైద్యులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేశారు. సెలవులు, ఆదివారాల్లోనూ ఉదయం సాయంత్రం ఓపీ సేవలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే 600 వైద్య శిబిరాలు నిర్వహించారు. ములుగు, భద్రాద్రి, హైదరాబాద్ జిల్లాలో మలేరియా, ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, మేడ్చల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాలో డెంగీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండటంతో వాటిని హైరిస్క్ జిల్లాలుగా ప్రకటించారు. -
డెంగీ పంజా
మణికొండ: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు వ్యాధుల బారినపడి ఆస్పత్రుల బాట పట్టారు. ఈ క్రమంలో డెంగీ పంజా విసురుతోంది. తీవ్ర జ్వరం బారినపడిన ప్రజలు మంచాన పడ్డారు. డెంగ్యూతో బాధపడుతూ ఆదివారం ఒక్కరోజే ఇద్దరు బాలికలు మృతిచెందారు. తాండూరులో ఒక బాలిక, నార్సింగిలో మరో బాలిక డెంగీకి బలయ్యారు. దీంతో వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాలిక పర్హీన్ (15) శుక్రవారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. సాధారణ జ్వరమేనని భావించి తల్లితండ్రులు తగ్గిపోతుందని అనుకున్నారు. అయితే శనివారం తీవ్ర జ్వరం రావడంతో స్థానికంగా ఓ వైద్యుడికి చూపించారు. ఆ వైద్యుడు రాసిన మందులు బాలిక వేసుకుంది. అయితే ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే బాలిక మృతి చెందిన తరువాత రిపోర్టులు వచ్చాయి. రిపోర్టుల్లో డెంగీ సోకిందని ఉంది. ఈ విషయం తెలియక తల్లిదండ్రులు తమ కూతురును కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరులో.. తాండూరు టౌన్: డెంగీతో బాధపడుతూ 11 ఏళ్ల విద్యార్థిని మృతిచెందింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని సీతారాంపేట్కు చెందిన రాంచందర్ కూతురు ఆశ్రిత (11) గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఇటీవల తీవ్ర జ్వరం బారిన పడడంతో తాండూరులోని ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఎంతకూ తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న బాలిక శనివారం రాత్రి మృతిచెందింది. ఎప్పుడూ చలాకీగా ఉండే పాప మరణించడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గతంలోనే భార్యను కోల్పోగా ఇప్పుడు కూతురు కూడా మరణించడంతో తండ్రి రాంచందర్ కుంగిపోయాడు. -
డెంగీ జ్వరాల పై హైకోర్టులో పిల్
-
రాఖీ కట్టేందుకు వచ్చి...
సాక్షి, పాచిపెంట(సాలూరు): సోదరుడికి రాఖీ కట్టేందుకు అత్తవారింటి నుంచి రాష్ట్రం దాటి వచ్చిన చెల్లెలు అన్న వద్దే అనారోగ్యంతో మృత్యు కౌగిలికి చేరుకుంది. మృతురాలి తోటికోడలు దమయంతి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం కల్హండి జిల్లా ముఖీగుండికు చెందిన సిల్ పార్వతి (32) తన అన్న గణేష్కు రాఖీ కట్టేందుకు సాలూరు పట్టణంలోని బోను మహంతివీధికి ఈ నెల 14న వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఈ నెల 16, 21 తేదీలలో సాలూరు పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతిని విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి ఈ నెల 24న తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతి చెందింది. వైరల్ ఫీవర్, డెంగీతో మరణించిందని దయయంతి, మృతురాలి సోదరుడు గణేష్ తెలిపారు. మృతురాలికి భర్త పవిత్రో, పిల్లలు హుస్సేన్, వైష్ణవి ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు మాట్లాడుతూ, పార్వతి మృతికి సంబంధించి వైద్యుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటామని చెప్పారు. బిడ్డకు సైతం.. మృతురాలు పార్వతి కుమారుడు హుస్సేన్ (3) సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పార్వతి మృతదేహాన్ని ఆదివారం ఖననం చేసి హుస్సేన్ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు డెంగీ అనుమానిత కేసులు.. ఈ క్రమంలో సాలూరు సీహెచ్సీ నుంచి ఆరు డెంగీ అనుమానిత కేసులను విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి దిలీప్కుమార్ అన్నారు. సాలూరు పట్టణానికి చెందిన ఎస్.రమాదేవి, హుస్సేన్, పాచిపెంట, సాలూరు మండలాలకు చెందిన జి.రాధ, బి.శ్యామల, యు.సీతారాం, యు.పైడిరాజులను కేంద్రాస్పత్రికి పంపించామన్నారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
డెంగీ.. డేంజర్
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం వర్షాలు కూడా లేవు. ఇంటి ఆవరణలోని పూల కుండీలు, వాటర్ ట్యాంకులు, ఇంటిపై ఉన్న టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ డబ్బాల్లోనూ నీరు లేదు. కానీ డెంగీ దోమలు మాత్రం విజృంభిస్తున్నాయి. బస్తీలు, కాలనీలు, శివార్లు అనే తేడా లేకుండా ఇటీవల ఆయా ప్రాంతాల్లో కొత్తగా అనేక బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటి కింద ఉన్న నీళ్ల ట్యాంకులపై మూతలు లేకపోవడం, క్యూరింగ్ కోసం వాడిన నీరు రోజుల తరబడి నిల్వఉంచుతుంటంతో అవి డెంగీ(టైగర్)దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఆ పక్కనే ఉన్న సిటిజన్లపై పగటిపూట తమ పంజా విసురుతున్నాయి. ఫలితంగా ఒక్క హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోనే కేవలం 45 రోజుల్లో 50కి పైగా కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇన్ని కేసులు నమోదైతే... అనధికారికంగా మరింత మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. 30 వేలకుపైగా డయేరియా కేసులు ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారం, మంచినీరు కలుషితమవుతోంది. ఇవి తీసుకోవడం వల్ల అనేక మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జూన్ చివరి నాటికి 1.50 లక్షల మంది డయేరి యా బారిన పడగా, వీటిలో హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 2018లో 71,918 డయేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 30 వేలకుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇటీవల బోరబండ గురుకుల పాఠశాల విద్యార్థులు సహా నాంపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన సుమారు 30 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తీసుకుని వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా, తాజాగా విజయనగర్ కాలనీ మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిను 33 మంది విద్యార్థులు ఇదే కారణంతో నిలోఫర్లో చేరగా.. బాధిత చిన్నారులకు వైద్యులు చికిత్స చేసి పంపించారు. ఫీవర్కు పొటెత్తుతున్న జ్వరపీడితులు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 21776 టైఫాయిడ్ జ్వరాలు నమోదు కాగా, వీరిలో 1400 మంది బాధితులు గ్రేటర్వాసులే కావడం విశేషం. సాధారణంగా ‘సాల్మోనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరియా కలిసిన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. జర్వంతో మొదలై...అలసట, తలనొప్పి, అధిక జ్వరం, కడుపునొప్పి, మలబద్దకం, వికారం, ఛాతిపై గులాబీరంగు మచ్చలు వంటి లక్షణాలతో బాధపడుతూ.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు. సాధారణ జ్వర పీడితులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు నగరంలో 85 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, వందకుపైగా బస్తీదావాఖానా లు ఉన్నాయి. ఆయా ఆరోగ్య కేంద్రా ల్లో మెడికల్ ఆఫీసర్లు, మౌళిక సదుపాయాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఫలితంగా చికిత్స కోసం బాధితులు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా బస్తీల్లో పర్యటించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజారోగ్యశాఖ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. డెంగీకి కారణం ఇదే.. ఈడిన్ ఈజిఫ్టై(టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాలు(ప్లేట్స్ లెట్స్) సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయ టపడొచ్చు. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టడం, చెట్లపొదలను శుభ్రం చేయడం, పూల కుండీల్లో నీటినిల్వ లేకుండా చేయడం ద్వారా డెంగీ దోమలను దరి చేరకుండా చూడొచ్చు. – డాక్టర్ సందీప్రెడ్డి, జనరల్ ఫిజీషియన్ నీటి కలుషితం వల్లే డయేరియా నగరానికి చెరువుల నుంచి నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో నీరు దగ్గరపడటం, ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరదనీరు వెళ్లి చెరువుల్లో చేరుతుండటం వల్ల నీరు కలుషితమవుతుంది. దీనికి తోడు కుళ్లిన పదార్థాలతో ఆహారం వండటం, తెలియక దీన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ డయేరియా కేసులు ఎక్కువ నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మల, మూత్ర విసర్జన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం, వేడివేడి ఆహారం తీసుకోవడం, కాచి వడపోసిన నీటిని తాగడం ద్వారా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారినుంచి బయటపడొచ్చు.– డాక్టర్ హరిచరణ్, జనరల్ ఫిజీషియన్ -
డేంజర్ డెంగీ..
సాక్షాత్తూ అది రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప నియోజకవర్గంలోని పెద్దాపురం మున్సిపాలిటీ. మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో డెంగీ మహమ్మారి జడలు విప్పుతోంది. పారిశుద్ధ్య నిర్వహణను ఆ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డుల కౌన్సిలర్లే చెబుతున్నారంటే అక్కడి అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధుల మాటకే విలువ ఇవ్వని అధికారులు ఇక ప్రజల మాట ఎందుకు వింటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పలువురు డెంగీ వంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. తూర్పుగోదావరి, పెద్దాపురం: డెంగీ మహమ్మారీ జడలు విప్పుతోంది. గతంలో మండలంలోని గోరింట, చదలాడ గ్రామాల్లోని పలువురితో పాటు పెద్దాపురం పట్టణంలోని ఒకటో వార్డు కౌన్సిలర్కు ఈ వ్యాధి సోకింది. అపారిశుద్ధ్యంపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించని మున్సిపల్, వైద్య శాఖాధికారుల వైఫల్యానికి తాజాగా 17వ వార్డు కౌన్సిలర్ తాళాబత్తుల కామేశ్వరి కుమార్తె సావిత్రి (22) ఈ డెంగీ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్య విభాగ అధికారుల పనితీరు అసంతప్తిగా ఉందనడానికి నిదర్శనం ఈ డెంగీ కేసులు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గతంలో డయేరియా మహమ్మారి పట్టణాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంఘటనలు మరచిపోయి కనీసం శానిటేషన్ పనులు పూర్తిగా చేయకపోవడం పట్ల పాలనా యంత్రాంగానికి ప్రజారోగ్యంపై ఎంత బాధ్యత ఉందో అర్థమవుతూనే ఉందని పలువురు వాపోతున్నారు. రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఇళ్ల వద్ద పరిశుభ్ర వాతావరణం కల్పించాలని వైద్యాధికారులు కరపత్రాల ద్వారా బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అది కాస్తా తూతూ మంత్రంగానే చేయడంతో చాలా చోట్ల అపరిశుభ్ర వాతావరణ మధ్యనే ప్రజలు జీవిస్తున్నారు. సంబంధిత వార్డు కౌన్సిలర్ కామేశ్వరి భర్త సాయి పలుమార్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేరుకుపోయిన పూడిక తీయాలని ఐదు నెలలుగా అధికారులకు చెబుతున్నా వారు పట్టించుకోలేదు. ఫలితంగా తన కుమార్తెకు డెంగీ ప్రబలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిపినా కనీసం డ్రెయిన్లో పూడిక చేపట్టకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్, వైద్య శాఖల ఉన్నతాధికారులు స్పందించి డెంగీ కారణాలపై ప్రజలకు అవగాహనతో పాటు పారిశుద్ధ్య పనులు మెరుగు పర్చాలని పలువురు కోరుతున్నారు. -
పడగ విప్పుతున్న డెంగీ!
కర్నూలు(హాస్పిటల్): జ్వరమా..ఒళ్లునొప్పులా..కళ్లు ఎర్రగా మారాయా..తీవ్రంగా తలనొప్పి వస్తోందా? అయితే డెంగీ జ్వరం కావచ్చు అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగా డెంగీ పరీక్ష చేస్తున్నారు. కొందరు అవసరం ఉన్నా లేకపోయినా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. ఈ రక్తకణాలకు డబ్బులు కట్టలేక రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోని, ఎమ్మిగనూరు లో ఏరియా ఆసుపత్రులు, 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు 700లకు పైగా నర్సింగ్హోమ్లు, క్లినిక్లు రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. నెలరోజుల నుంచి వాతావరణంలో మార్పులు రావడంతో వైరల్ ఫీవర్లు అధికమయ్యాయి. ఇందులో మలేరియా, డెంగీ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో డెంగీ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి రాగానే వైద్యులు ముందుగా ర్యాపిడ్ పరీక్ష చేయిస్తున్నారు. అందులో డెంగీగా నిర్ధారణ అయితే వెంటనే రక్తకణాల పరీక్షలు చేస్తున్నారు. కణాల సంఖ్య తక్కువగా ఉంటే వెంటనే రక్తం, ప్లేట్లెట్లు తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ప్రతి ఆసుపత్రిలో కనిపిస్తోంది. సగటున ప్రతి ఆసుపత్రిలో ఒకరు డెంగీ లక్షణాలతో బాధపడుతున్న రోగులు ఉన్నారు. జిల్లాలో 208 మందికి డెంగీ లక్షణాలు జిల్లాలో డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 208 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఇందులో వ్యాధి నిర్ధారణ అయింది 9 మందికి మాత్రమే అని వారు చెబుతున్నారు. వాస్తవంగా డెంగీ బాధితుల సంఖ్య దీనికి రెట్టింపుగానే ఉంటోందని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు స్పష్టం చేస్తున్నారు. డెంగీ వ్యాధి ఉందని చెబితే అధికారుల నుంచి తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, ఈ కారణంగానే ఆసుపత్రిలోనే వైద్యం చేసి పంపిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. రెండు నెలల నుంచి ఇండియన్ రెడ్క్రాస్ రక్తనిధిలో ప్లేట్లెట్లు(ఎస్డీపీ) తీసుకున్న వారు 15 మంది, పీఆర్పీ తీసుకున్న వారు 45 మందికి పైగా ఉండగా, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నెలకు పది మంది చొప్పున ఎస్డీపీ, 40 మంది దాకా పీఆర్పీ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే స్థాయిలో ప్రైవేటు బ్లడ్బ్యాంకుల్లోనూ రక్తకణాల కోసం ప్రజలు వెళ్తున్నారు. పారిశుద్ధ్యలోపం.. కర్నూలు నగర పాలక సంస్థతో పాటు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీలలో పారిశుద్ధ్యం లోపించింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరుతో కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అవి ఉపయోగపడటం లేదు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి.. దోమలు విజృంభిస్తున్నాయి. వీటి నిర్మూలనకు ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డెంగీ వ్యాధి ఇలా సోకుతుంది.. శరీరంపై తెల్లటి చారలు ఉండే ఏడిస్ ఈజైప్టె అనే దోమకాటు కారణంగా డెంగీ వస్తుంది. ఈ దోమ పగలు మాత్రమే కుడుతుంది. ఇది నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. రెండు వారాలు మాత్రమే జీవించే ఇది మూడుసార్లు వంద గుడ్ల చొప్పున పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టెన్స్ వెనుక దాక్కుంటాయి. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు డెంగీ వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న ఇంటి పరిసరాల్లోని 50 ఇళ్లలో లార్వా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నాం. గత జులై నుంచి నవంబర్ వరకు మొబైల్ మలేరియా, డెంగీ వాహనాల ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాం. గిరిజన ప్రాంతాల్లో డీడీటీ స్ప్రే చేయించాం. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని ఆదేశించాం.–డేవిడ్రాజు, మలేరియా నియంత్రణాధికారి -
అమ్మో జ్వరం
సాక్షి,సిటీబ్యూరో: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు తోడు ప్రస్తుతం స్వైన్ఫ్లూ, డెంగీ వంటి ఇతర సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ జ్వర పీడితులే కాదు.. దగ్గు, జలుబు, తలనొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వారిని చేర్చుకుని చికిత్స అందించే విషయంలో వైద్యులు సైతం చేతులెత్తేస్తున్న దుస్థితి. వస్తున్న రోగులకు తగ్గట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండడంతో ప్రాణాంతకమైన స్వైన్ఫ్లూ, డెంగీ జ్వరాలతో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న నిరుపేద రోగులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఒక్క గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే కాదు.. హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఇలాగే ఉంది. ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రి ఔట్పేషంట్ విభాగానికి రోజుకు సగటున మూడు వేల మందిరోగులు వస్తున్నారు. 1,062 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం 1500 మందికి పైనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 500 పైగా పాజిటివ్ స్వైన్ కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడ్డారు. స్వైన్ఫ్లూ బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం గాంధీ జనరల్ ఆస్పత్రిని ప్రత్యేక నోడల్ కేంద్రంగా ఎంపిక చేసింది. 20 పడకలు, 10 వెంటిలేటర్లతో ప్రత్యేక వార్డు ను ఏర్పాటు చేసింది. స్వైన్ఫ్లూ అనుమానితులు ఇతర ఆస్పత్రుల నుంచి రెఫరల్పై వచ్చిన రోగులకు క్యాజువాలిటీలోనే చుక్కెదురవుతోంది. రోగులకు తగ్గ పడ కలు లేకపోవడంతో చాలా మంది ఫ్లోర్ బెడ్పైనే ఉంచి చికిత్సలు అందించాల్సి వస్తోంది. బుధవారం 1,929 మంది ఇన్పేషంట్లు ఉన్నారు. స్వైన్ఫ్లూ, డెంగీ పాజిటివ్ కేసులనే చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. అనుమాని తులను ఓపీలోనే నమూనాలు సేకరించి పంపుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయి వైద్యుల చేతికి నివేదికలు అందే సమయానికి వ్యాధి తీవ్రత మరింత పెరిగి రోగులు మృత్యువాతపడుతు న్నా.. వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవట్లేదు. ఉస్మానియాకు తరలింపు.. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. రోగులకు తగ్గ పడకలు ఏర్పాటు చేసే అవకాశమున్నా స్థలం సమస్యగా మారింది. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడం, ఇప్పటికే పలుమార్లు పైకప్పు కూలడం, మూడు, రెండు అంతస్తుల్లోని వార్డులను పూర్తిగా ఖాళీ చేయడం తెలిసిందే. సాధారణ రోగులతోనే సతమతమవుతున్న ఆస్పత్రి యంత్రాంగం.. తాజాగా వస్తున్న స్వైన్ఫ్లూ, డెంగీ బాధితులతో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వచ్చే రోగులతోనే ఉస్మానియా కిక్కిరిసిపోతుంటే, మూడు రోజుల కింద గాంధీ ఆస్పత్రి నుంచి 20 మంది స్వైన్ఫ్లూ అనుమానితులను ఇక్కడికి పంపడం గమనార్హం. ప్రస్తుతం ఆస్పత్రిలో అధికారికంగా 1,165 పడకలు ఉండగా, అనధికారికంగా 1,385 పడకలు నిర్వహిస్తోంది. జనరల్ మెడిసిన్ విభాగంలో 320 పడకలు ఏర్పాటు చేసింది. అయితే ఆస్పత్రికి వస్తున్న జ్వరపీడితులతో ఈ వార్డు కిక్కిరిసిపోతోంది. కొత్తగా వచ్చిన వాళ్లకు కనీసం పడక కూడా కేటాయించలేని దుస్థితి. ఆస్పత్రిలో 90 వెంటిలేటర్లు ఉండగా, 40 వెంటిలేటర్లు సాంకేతిక లోపాలతో మూలన పడ్డాయి. స్వైన్కు ఇదే అసలైన కాలం! చలి తీవ్రతకు హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తుంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెం బర్, జనవరిలో ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపుతుంది. అనేక మంది వీటి బారినపడి చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తుంటారు. వీరి లో డెంగీ, స్వైన్ఫ్లూ అనుమానితులు కూడా ఉం టారు. అడ్మిట్ చేసుకుని వీరి నుంచి నమూనా లు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపిన 48 గంటల తర్వాత రిపోర్ట్ వస్తుంది. ఆస్పత్రులకు వస్తున్న వారిలో పాజిటివ్ బాధి తులతో పోలిస్తే అనుమానితులే అధికం. వీరిని ఇతర వార్డుల్లో ఉంచి చికిత్సలు అందించలేరు. అలాగని పాజిటివ్ కేసుల సరసన చేర్చలేరు. ఇలాంటి వారితో పడకలు నిండిపోతున్నాయి. మూడు, నాలుగు రోజుల వరకు ఖాళీ కావట్లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైద్యాధికారు లు ముందే దృష్టి సారించకపోవడం, తీరా సమస్య జఠిలమైన తర్వాత హడావుడి చేయ డం తప్ప కనీస చర్యలు కూడా చేపట్టట్లేదు. ప్రభుత్వఆస్పత్రులకే ఎందుకంటే..? సాధారణ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే వైద్య పరీక్షలు, ఐసీయూలో చికిత్సల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ జ్వరానికి కూడా రూ.4 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటం, డెంగీ, మలేరియా జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెరగటం.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు జరుగుతుండటంతో.. చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకే మొగ్గు చూపుతున్నారు. -
ఒకరు పాడెపై.. మరొకరు స్ట్రెచర్పై..
సాక్షి, ఏటూరునాగారం: డెంగీ మహమ్మారి ఆ కుటుంబంతో ఆడుకుంటోంది. చేతిలో చిల్లిగవ్వలేక.. ఆపదలో ఆదుకునే ఆరోగ్యశ్రీ కూడా వర్తించకపోవడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మెరుగైన వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఒక కొడుకు పాడెపై పడుకుంటే.. మరో కుమారుడు వెంటిలెటర్పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హృదయవిదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు పంచాయతీ పరిధిలోని సింగారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వావిలాల పోతరాజు, జయమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు వావిలాల వినయ్ (9) డెంగీ జ్వరంతో బాధపడుతూ శనివారం ఉదయం ఎంజీఎంలో మృతి చెందాడు. వినయ్కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో ఏటూరునాగారంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ నయం కాలేదు. కాలేయానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని, రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయాయని వైద్యులు చెప్పడంతో ఆర్థిక స్థోమత లేని ఆ తల్లిదండ్రులు కుమారుడిని చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాలుగు రోజులుగా చికిత్స అందిస్తుండగా శనివారం మృతిచెందాడు. వెంటిలెటర్పై రెండో కుమారుడు పెద్ద కుమారుడు చనిపోవడంతో తల్లి జయమ్మ ఆయన మృత దేహాన్ని పట్టుకుని సింగారం గ్రామంలోని తన ఇంటికి చేరింది. రెండో కుమారుడు వావిలాల వినోద్కు కూడా జ్వరం రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సేవలు చేస్తున్నాడు. వినోద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్పై పెట్టి చికిత్సలు అందిస్తున్నారు. ఇటు మృతిచెందిన పెద్ద కుమారుడికి దహన సంస్కారాలు నిర్వహించలేక.. చిన్న కుమారుడిని ఎలా బతికించుకోవాలో తెలియక గుండెలవిసేలా రోదిస్తున్నాడు. బిడ్డా.. కానరాని లోకానికి పోతివా... పండుగొచ్చిందని కొత్త బట్టలు కూడా కుట్టిస్తిని బిడ్డా.. అవి మాసిపోకుండానే మట్టిలో కలిసిపోతివా.. నీ దగ్గర నేను ఉన్నా... తమ్ముడి దగ్గర అయ్య ఉన్నాడు. ఏం చేయాలి బిడ్డా.. దేవుడా మమ్మల్లి ఇంత కష్టంలో ఎందుకు నెట్టావు. ఆలన పాలన తెలియని బిడ్డలను ఆగం చేస్తివి. నా కొడుకును పొట్టనపెట్టుకుంటివి అంటూ వినయ్, వినోద్ తల్లి జయమ్మ విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అయ్యా.. నా బిడ్డను కాపాడండి... మాకు ఆరోగ్య శ్రీ కూడా లేదు. నా పెద్ద కొడుకును డబ్బులేకనే పోగొట్టుకున్నా. నా చిన్న కొడుకు వినోద్కు కూడా జ్వరం రావడంతో హన్మకొండలో చికిత్స చేయిస్తున్నా. చేతిలో చిల్లిగవ్వలేదు. ఆడ ఈడ అప్పులు చేసి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి. డబ్బులుంటనే నా కొడుకు బతుకుతాడు. తెలిసిన వారికల్లా ఫోన్ చేసి అడుగుతున్నా. నా కొడుకును కాపాడాలని. – పోతరాజు, వినోద్ తండ్రి -
జ్వర పీడితులను దాచేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జ్వరాలతో అల్లాడుతున్న బాధితుల వివరాల నమోదులో గోల్మాల్ జరుగుతోంది. ప్రతి జిల్లాలో డెంగీ జ్వరాలు, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాటిలో కనీసం 5 శాతం కూడా రికార్డుల్లో నమోదు చేయడం లేదు. జ్వరాల కేసులను ఎక్కువగా నమోదు చేస్తే సస్పెండ్ చేస్తామంటూ ప్రభుత్వం నుంచి ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో 30 కేసులు నమోదైతే కేవలం ఒకటి లేదా రెండు కేసులను మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు వంటి ప్రాంతాల్లో బాధితుల నమోదులో అవకతవకలు జరుగుతున్నట్టు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. జ్వరాల తీవ్రత అధికంగా ఉన్నట్లు తేలితే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావని ప్రభుత్వం భయపడుతోందని, అందుకే బాధితుల వివరాలను నమోదు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగర పరిధిలో గడిచిన 10 నెలల్లో 922 డెంగీ కేసులు వెలుగుచూడగా, కేవలం 43 కేసులనే ప్రభుత్వ రికార్డుల్లో చూపడం గమనార్హం. ఎంఎఫ్–7 రికార్డులేవీ? మలేరియా లేదా డెంగీ కేసులను ఎంఎఫ్–7(మలేరియా ఫ్యాక్ట్–7) రిజిస్టర్లో నమోదు చేశారు. ఇందులో బాధితుల పేర్లు, చిరునామా ఉంటాయి. కానీ, కొన్నినెలలుగా ఈ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తెల్లకాగితంపై వివరాలు రాసి, ఉన్నతాధికారులకు పంపిస్తే వాళ్లు ఒకటో రెండో కేసులను ఎంఎఫ్–7 రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అంతిమంగా ఈ వివరాలే అధికారికంగా ప్రభుత్వ వెబ్సైట్లో, ముఖ్యమంత్రి కోర్డ్యాష్ బోర్డులో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తన పరువు కాపాడుకోవడానికే జ్వర పీడితుల వివరాలను దాచేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎస్ఎస్హెచ్ ల్యాబొరేటరీల్లో అసలు నిజాలు ప్రతి జిల్లాలో డెంగీ, మలేరియా, స్వైన్ఫ్లూ కేసుల నిర్ధారణకు సివిలిటేనియస్ శాంపుల్ అండ్ హోల్డ్(ఎస్ఎస్హెచ్) ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ వచ్చిన ప్రతి కేసునూ బాధితుడి పేరు, చిరునామాతో సహా నమోదు చేస్తారు. కొన్ని జిల్లాల్లో ఎస్ఎస్హెచ్ ల్యాబ్ల్లో ‘సాక్షి’ పరిశీలించగా.. వాస్తవ జ్వరాల కేసులకు, ప్రభుత్వం వెల్లడించిన బాధితుల గణాంకాలకు పొంతనే లేదు. రాజధాని ప్రాంతం విజయవాడలో గత 10 నెలల్లో 1,600కు పైగా మలేరియా కేసులు బయటపడగా, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది కేవలం 25 కేసులే. అంటే కనీసం 2 శాతం కేసులను కూడా రికార్డుల్లో చేర్చలేదు. డెంగీ, మలేరియా, ఏవైనా విష జ్వరాలతో ఎవరైనా మృతి చెందితే ఆ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం కరాలవలస గ్రామంలో నెల రోజుల్లో విష జ్వరాలతో 11 మంది మృతి చెందారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాధితులు డెంగీ జ్వరంతో మరణించారు. ఇవేవీ ప్రభుత్వ రికార్డుల్లోకి చేరకపోవడం గమనార్హం. -
మళ్లీ డెంగీ..
వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడకు చెందిన సురేశ్ (పేరు మార్చాము)కు ఇటీవల డెంగీ జ్వరం సోకింది. ప్లేట్లెట్స్ ఆరువేలకు పడిపోయి ప్రమాదకర స్థితికి చేరాడు. ఆర్మూర్లోని ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందగా కోలుకుంటున్నాడు. ఇలా జిల్లాలో డెంగీ జ్వర పీడితులు పెరుగుతున్నారు. జూన్, జూలైలో డెంగీ నామమాత్రంగా ఉండగా ప్రస్తుతం తీవ్రమవుతోంది. ఇదే నెలలో ఆస్పత్రుల్లో 24 కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా డెంగీ ఉనికి వెలుగులోకి వస్తోంది. నిజామాబాద్అర్బన్ : జిల్లా వ్యాప్తంగా 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 59 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. ఇదే నెలలో 24 కేసులు నమోదు కావడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. డెంగీ జ్వరంతో ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో 32 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 15 కేసుల వరకు బోధన్ ప్రాంతంలో ఉన్నాయి. మిగితా కేసులు ఆయా ప్రాంతాల్లో నమోదు అయ్యాయి. గురువారం నిజామాబాద్లోని పూలాంగ్ ప్రాంతానికి చెందిన 12 సంవత్సరాల బాలుడికి డెంగీ సోకడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలిం చారు. నవీపేట మండలం దర్యాపూర్ గ్రామానికి చెందిన రెండు సంవత్సరాల బాలిక డెంగీ సోకడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. బోధన్ పట్టణానికి చెందిన ఒకరు డెంగీ బారినపడ్డాడు. వీరు చికిత్స పొందుతున్నారు. డెంగీ కేసుల నమోదుతో వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఎక్కడైతే కేసు నమోదు అవుతుందో అక్కడ నివారణ చర్యలు చేపడుతున్నారు. చెడిపోయిన వస్తువులు, టైర్లు, కొబ్బరి చిప్పలు, ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండేచోట డెంగీ దోమ ఉత్పత్తి అవుతుంది. వాస్తవానికి జూన్లోనే ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో మలేరియా శాఖ అవగాహన కల్పించి నీరు నిల్వ ఉండకుండా స్థానికులను అప్రమత్తం చేయాలి. దోమలు వృద్ధి కాకుండా నివారణ మందులు చల్లడం, ఫాగింగ్ చేయడం చేపట్టాలి. నివారణ చర్యలు చేపట్టక పోతే డెంగీ తీవ్రతకు కారణమవుతుందని అంటున్నారు. కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్యసిబ్బంది శిబిరాలకు వెళ్లడంతో గ్రామాల్లో వ్యాధుల నియంత్రణ పడకేసింది. ప్రస్తుతం అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తే వ్యాధులను నియంత్రించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందస్తు జాగ్రత్తలే మేలు.. డెంగీ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమలు పెరగకుండా, నీరు నిల్వ ఉండకుండా చూడాలి. డెంగీ బారిన పడితే ప్లేట్లేట్ సంఖ్య తగ్గిపోయి ప్రమాదం పొంచి ఉంటుంది. అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. డాక్టర్ తిరుపతిరావు, జనరల్ ఫిజీషియన్ నివారణ చర్యలు కొనసాగుతున్నాయి.. జిల్లాలో డెంగీ నివారణకు చర్యలు కొనసాగుతున్నాయి. అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైతే వ్యాధి వెలుగులోకి వస్తుందో అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించి సర్వే చేపడుతున్నాం. ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి డెంగీ మరణాలు సంభవించలేదు. జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సుదర్శనం జనరల్ ఆస్పత్రిలో పెరిగిన ఓపీ నిజామాబాద్అర్బన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం అత్యధికంగా అవుట్ పేషెంట్లు నమోదు అయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓపీ పెరిగింది. 1491 మందికి ఆస్పత్రిలో అవుట్ పేషెంట్ సేవలు అందాయి. 158 మంది ఇన్పేషెంట్లుగా చేరారు. ఆస్పత్రిలో మొత్తం 500 పడకలు కాగా 608 పడకలతో ఇన్పేషెంట్ సేవలు అందుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున రోగులు రావడం మొదటిసారని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రాములు తెలిపారు. -
ఆగని డెంగీ మరణాలు
శ్రీకాకుళం, నరసన్నపేట: జిల్లాలో డెంగీ వ్యాధి మరణాలు ఆగడం లేదు. ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ మాయదారి జ్వరానికి గురువారం మరో ఇద్దరు బలైయ్యారు. నరసన్నపేటలో బాలింత, మెళియాపుట్టిలో విద్యార్థిని ప్రాణాలు విడిచారు. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు ఇలావున్నాయి. మేజరు పంచాయతీ నరసన్నపేటలో జ్వరాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వీరన్నాయుడు కాలనీకి చెందిన వెంకుమహంతి దివ్య(29) డెంగీ లక్షణాలతో ప్లేట్లైట్స్ పడిపోవడంతో మరణించింది. ఈ నెల 15వ తేదీన పాపకు జన్మనిచ్చిన దివ్వ అమ్మ మాతృత్వాన్ని అనుభవించక ముందే లోకంవిడిచింది. నాలుగు రోజుల క్రితం ఇదే వీధికి చెందిన ప్రశాంతి అనే వివాహిత జ్వరంతో మృతి చెందింది. ఇప్పుడు దివ్వ చనిపోవడంతో వీరన్నాయుడు కాలనీ వాసులు భయాందోళలన చెందుతున్నారు. మరో మహిళ అనుపోజు సైలజ జ్వరంతో మూడు రోజులుగా బాధపడుతుంది. ఈమెకు ఏమవుతుందో అని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం గురువారం తరలించారు. కాగా మూడు రోజుల క్రితం జ్వరంతో బాధపడిన దివ్వను తండ్రి చిట్టిబాబు స్థానిక వైద్యుల వద్ద తనిఖీలు చేయించినప్పటికీ తగ్గకపోవడంతో శ్రీకాకుళం కిమ్స్కు బుధవారం తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. 2016 ఏప్రిల్లో సారవకోట మండలం అల్దుకు చెందిన హరికృష్ణ చరణ్తో దివ్వకు వివాహం అయింది. పాప పుట్టిన కొద్ది రోజులకే దివ్వను జ్వరం కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కిమ్స్ వైద్యులు డెంగీ జ్వరంగానే గుర్తించారని దివ్వ సమీప బంధువు రఘుపాత్రుని శ్రీధర్ తెలిపారు. దీని కారణంగానే చనిపోయినట్టు వైద్యులు చెప్పారన్నారు. అయితే స్థానిక వైద్యులు, గుప్పిడిపేట పీహెచ్సీ సిబ్బంది మాత్రం జ్వరం అని అంటున్నారు. ఈ సమాచారంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీ పరిసరాల్లో ఉన్న అపారిశుధ్యమే కారణమని కాలనీ వాసులు వాపోతున్నారు. జ్వరాలతో ప్రజలు బాధలు పడుతున్నట్టు పత్రికల్లో వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యులు వచ్చి హడావుడి చేస్తున్నారని, తనిఖీలు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. పరిసరాల్లో ఉన్న మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు అధికంగా ఉంటున్నాయని దీంతో జ్వరాలు అధికంగా వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. విద్యార్థిని మృతి మెళియాపుట్టి: మెళియాపుట్టిలోని కుమ్మరి వీధికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని టి.సంతు డెంగీ జ్వరంతో మృతి చెందినట్టు స్థానికులు భావిస్తున్నారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంగా ఉండేది. కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం పర్లాకిమిడి ఆస్పత్రికి గురువారం తరలించారు. అక్కడి వైద్యులు సూచనల మేరకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించేలోపలే బాలిక వృతి చెందింది. బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు పాతపట్నంలో నివాసం ఉండగా, బాలిక మెళియాపుట్టిలో తాతగారి ఇంటి వద్ద ఉంటూ ఇక్కడే చదువుకుంటుంది. -
కారేపల్లి యువతి.. అసోంలో ...
కారేపల్లి (ఖమ్మం): కారేపల్లి యువతి.. అసోంలో మృతిచెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... కారేపల్లి అంబేడ్కర్ సెంటర్కు చెందిన బాణోతు శిరీష(22), పేరుపల్లి గ్రామానికి చెందిన వరుసకు బావ అయిన అజ్మీర నరేష్ను ప్రేమ వివాహం చేసుకుంది. నరేష్, బీఎస్ఎఫ్ (సరిహద్దు రక్షణ దళం) కానిస్టేబుల్గా అసోం రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ దంపతులు ఇక్కడి నుంచి రైలులో అస్సాం బయల్దేరారు. మంగళవారం సాయంత్రం అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆమె జ్వరంతో బాధపడుతోంది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయినప్పటికీ జ్వరం తగ్గలేదు. అలాగే అసోం వెళ్లింది. మంగళవారం రాత్రి జ్వరం (డెంగీ) మరింత తీవ్రమైంది. అదే రోజు రాత్రి మృతిచెందింది. ఆమె తండ్రి జామ్లా నాయక్, టేకులపల్లి మండలంలో ఆర్ఐగా పనిచేస్తున్నారు. తల్లి జమున, గార్ల మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తమ కూతురు ఇక లేదన్న సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అసోం కోల్కతాకు, అక్కడి నుంచి సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు విమానంలో మృత దేహం చేరుకుటుందని, అక్కడి నుంచి అంబులెన్స్లో కారేపల్లికి గురువారం తెల్లవారుజామున తీసుకొస్తామని కుటుంబీకులు తెలిపారు. -
డెంగీ పంజా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గత ఏడాది 449 మందిలో డెంగీ లక్షణాలు కన్పించాయి. వీరిలో 322 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 134 మంది డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడగా అందులో ఐదుగురికి వ్యాధి ఉన్నట్లు ఎలీసా టెస్ట్లో బయటపడింది. ఐదులో ఒకటి గత నెల, మిగిలినవి జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు, నన్నూరు, కడుమూరు, ప్రాతకోట, కొత్తబురుజు, క్రిష్ణగిరి, పుచ్చకాయలమడ, నందవరం, శిరువెళ్ల, నంద్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కేసులు నమోదు కాగా, కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి. కాగా డెంగీ వ్యాధి లక్షణాలతో కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురం గ్రామంలో గొల్ల లీలావతి(27), నందికుంట గ్రామానికి చెందిన లక్ష్మిదేవి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అధికారుల లెక్కల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు కూడా చనిపోలేదు. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆదోని, ఎమ్మిగనూరుఏరియా ఆసుపత్రులు, నంద్యాల జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. ఇవి గాక 800 దాకా ప్రైవేటు నర్సింగ్హోమ్లు, క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లోని వైద్యుల వద్దకు ప్రస్తుతం వస్తున్న రోగుల్లో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇదే క్రమంలో మలేరియా, డెంగీ కేసులూ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ కేసులు పక్కనున్న అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల నుంచి అధికంగా కర్నూలులోని ఆసుపత్రులకు వచ్చేవి. ఈసారి ఆయా జిల్లాలతో పాటు జిల్లాలోని రోగులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలోనూ మలేరియా కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత ఏడాది 91మందికి మలేరియా నిర్ధారణ అయ్యింది. ఈసారి ఇప్పటి వరకు 37 మందిలో గుర్తించారు. ఇందులో ప్రమాదకరమైన పాల్సీఫారమ్ మలేరియా తొమ్మిది మందికి ఉన్నట్లు గుర్తించారు. అధికారులు..ప్రైవేటు ఆసుపత్రుల మధ్య పేచీ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ర్యాపిడ్ టెస్ట్ ద్వారా డెంగీ నిర్ధారణ కాగానే చికిత్స ప్రారంభిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ రిపోర్ట్ వస్తే తమకు సమాచారం అందించాలని, ఈ మేరకు రక్తం సీరా తీసి కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజీ ల్యాబ్కు పంపితే అసలు డెంగీనో, కాదో నిర్ధారణ చేస్తామని చెబుతోంది. ఇక్కడి నివేదిక ఆధారంగా మాత్రమే డెంగీగా ప్రకటించాలని ఆసుపత్రులకు స్పష్టం చేస్తోంది. అయితే.. కేఎంసీలోని ల్యాబ్కు వెళ్లి రిపోర్ట్ రావాలంటే 15 నుంచి 30 రోజులు పడుతుందని, ఈలోగా రోగికి చికిత్స చేయకుండా ఆపాలా అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలతో నిమిత్తం లేకుండా వారు డెంగీ లక్షణాలున్న వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు వైద్యులు మాత్రం సాధారణ జ్వరానికి సైతం డెంగీ పేరు చెప్పి దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. డెంగీ ఎలా సోకుతుందంటే.. ఏడిస్ ఈజిపై్ట అనే దోమకాటు వల్ల డెంగీ సోకుతుంది. ఈ దోమ ఒంటిపై నల్లటి, తెల్లటి చారలు ఉంటాయి. అందుకే దీనిని పులిదోమ అని కూడా అంటారు. ఇది శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. సూర్యోదమైన రెండు గంటల వరకు, సూర్యోదయానికి రెండు గంటల ముందు మాత్రమే ఇది కుడుతుంది. ఇది కేవలం రెండు వారాలు మాత్రమే జీవిస్తుంది. ఇది తన జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది. ప్రతిసారీ వంద గుడ్లకు పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టన్స్ వెనుక దాక్కుంటాయి. దోమల నివారణ చర్యలు చేపట్టాం జులై ఒకటి నుంచి 9 మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్ల ద్వారా దోమల నివారణకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ప్రతి క్లినిక్లో ఎంపీహెచ్ఈవో, ఎంపీహెచ్ఎస్, హెల్త్ అసిస్టెంట్, మున్సిపల్ సిబ్బంది ఉంటారు. వీరు ఇంటింటికి వెళ్లి పరిసరాలు పరిశీలించి నీటిలో లార్వా ఉందో..లేదో పరిశీలించి చర్యలు చేపడతారు. జ్వరపీడితులుంటే రక్తపూతలు సేకరించి పరీక్షలకు పంపిస్తారు. మలేరియాలో పాల్సిఫారమ్ నమోదైతే వ్యాధిగ్రస్తుని ఇంటి పరిసరాల్లో డీటీటీ స్ప్రే చేస్తారు. ఇప్పటి వరకు పాల్సీఫారమ్ మలేరియా నమోదైన 15 గ్రామాల్లో 50 శాతం డీటీటీ స్ప్రే చేశాం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తమ జేఈవీఎం యూనిట్ సిబ్బంది వార్డులు తిరిగి డెంగీ, మలేరియా లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. – డేవిడ్రాజు, మలేరియా నియంత్రణాధికారి డెంగీ పేరుతో భయపెడితే చర్యలు ర్యాపిడ్ టెస్ట్లోనే డెంగీగా నిర్ధారించి రోగికి నేరుగా చెప్పకూడదు. ఈ టెస్ట్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా, రోగి రక్తాన్ని కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజి ల్యాబ్కు పంపించాలి. అక్కడ ఎలీసా టెస్ట్లో వ్యాధి నిర్ధారణ అయితేనే డెంగీగా నిర్ధారించాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను ధిక్కరించే ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు తీసుకుంటాం. 20వేల కంటే తక్కువగాసంఖ్య ఉంటేనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. సాధారణ జ్వరంలోనూ ప్లేట్లెట్లు తగ్గుతాయని ప్రజలు గుర్తించాలి. – డాక్టర్ జేవీవీఆర్కె ప్రసాద్, డీఎంహెచ్వో, కర్నూలు వ్యాధి లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. ఒంటిపై ఎర్రటి దురదలు కనిపిస్తాయి. ముక్కు, చిగుళ్లలో రక్తం స్రవిస్తుంది. -
పెళ్లైన ఆనందం తీరక ముందే..
శ్రీకాకుళం, నరసన్నపేట: పెళ్లైన ఆనందం తీరకముందే ఓ యువకుడ్ని డెంగీ మహమ్మారి బలితీసుకుంది. కట్టుకున్న యువతిని కన్నీరు పాల్జేసింది. వివరాల్లోకి వెళితే.. రేగిడి ఆమదాలవలస మండలం పుర్లికి చెందిన బూరాడ గణేష్ (26) నరసన్నపేట గాంధీనగర్లో నివసిస్తున్నాడు. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన లుకలాం గ్రామానికి చెందిన గౌతమితో వివాహం అయింది. ప్రస్తుతం గౌతమి గర్భిణి. గడిచిన వారం రోజులుగా గణేష్ జ్వరంతో బాధపడుతూ స్థానిక వైద్యుల వద్ద చికిత్స పొందాడు. అయితే జ్వరం తగ్గక పోగా ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని విశాఖలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గణేష్ తన వైవాహిక జీవతంపై ఎన్నో కలలు కన్నాడు. పుట్టిన పిల్లలను బాగా చదివించాలని, ఆదర్శంగా పెంచాలని భార్యతో అంటుండేవాడు. గణేష్ది వ్యవసాయక కుటుంబం. స్వశక్తితో జీవనం సాగించాలనే ఆశయంతో వెల్డింగ్ పనులు చేస్తూ తల్లిదండ్రులకు కొంత డబ్బు పంపిస్తూ తన భార్యను అపురూపంగా చూసుకొంటూ వస్తున్నాడు. ఈ దశలో అతన్ని డెంగీ వ్యాధి బలితీసుకుంది. భర్త ఆకస్మిక మృతితో భార్య గౌతమి కన్నీరు మున్నీరవుతోంది. విధివంచితురాలు.. కాగా పదేళ్ల క్రితం విద్యుత్ షాక్తో గౌతమి తండ్రి రామారావు మృతి చెందారు. వివాహానికి కొద్దిరోజుల ముందు తల్లి రాజేశ్వరి కిడ్నీ వ్యాధితో మరణించింది. తాజాగా భర్త గణేష్ మృతితో గౌతమి తీవ్ర విషాదంలో ఉంది. -
డెంగీ పంజా
సాక్షి, తూర్పు గోదావరి,రాజమహేంద్రవరం: ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా జిల్లాలో ప్రాణాంతక డెంగీ జ్వరం పంజా విప్పుతోంది. దీంతోపాటు వైరల్ జ్వరాలు కూడా విస్తృతంగా ప్రబలుతున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో డెంగీ జ్వరంతో నలుగురు మృతి చెందారు. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ 258 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే డెంగీ మరణాలను తక్కువ చేసి చూపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య ఇందులో కలిపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జగ్గంపేట మండలం మల్లిశాలకు చెందిన పాలిపిరెడ్డి నూకరత్నం డెంగీతో కాకినాడ జీజీహెచ్లో శనివారం మృతి చెందగా, వైద్య సిబ్బంది మల్లిసాలకు వచ్చి డెంగీతో చనిపోయారంటూ ఎవ్వరికీ చెప్పవద్దన్నారని అంటున్నారు. దీనినిబట్టి డెంగీ మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న వాదనలకు బలం చేకూరుతోంది. మల్లిసాలలో డెంగీ మృతి నమోదు కావడంతో జగ్గంపేట సీహెచ్సీ, రాజపూడి పీహెచ్సీ వైద్యులు ఆదివారం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లాను చుట్టుముడుతున్న జ్వరాలు ♦ జిల్లావ్యాప్తంగా డెంగీతోపాటు వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ♦ కాకినాడ రూరల్లో అత్యధికంగా 85 డెంగీ కేసులు నమోదు కాగా, కాకినాడ నగరంలో 65 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేటలో డెంగీ విజృంభిస్తోంది. ♦ జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలోని 31, 32, 33, 34 డివిజన్లలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో అక్కడ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన డెంగీ జ్వర పీడితులు 70 మంది చికిత్స పొందుతున్నారు. ♦ జిల్లాలో వివిధ మండలాల్లో 182 కేసులు నమోదయ్యాయి. ♦ అమలాపురం మున్సిపాలిటీలో ఒకరు డెంగీతో బాధ పడుతున్నారు. పదుల సంఖ్యలో వైరల్ జ్వరాల బారిన పడ్డారు. ♦ అల్లవరం మండలం తాడికోన, పెదపేట, వీరమ్మ చెరువుల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ♦ మలికిపురం మండలం గుడిమెళ్లంకలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీతో మృతి చెందారు. ♦ వైరల్ జ్వరాలతో రాజోలు నియోజకవర్గంలోని పలు గ్రామాలు మంచం పట్టాయి. ♦ కె.గంగవరం మండలం యర్రపోతవరంలో డెంగీ జ్వర లక్షణాలు కనిపించడంతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ♦ పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో ఇద్దరు, బిక్కవోలు మండలం కాపవరంలో ఒకరు డెంగీతో చికిత్స పొందుతున్నారు. ♦ సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో విషజ్వరాలు ఉధృతంగా ఉండడంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ♦ రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు వైరల్ జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ♦ తుని మండలం ఎస్.అన్నవరంలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. బాధితులు చికిత్స పొందుతున్నారు. ♦ పిఠాపురం రూరల్ మండలం గోకివాడ, మంగితుర్తి గ్రామాల్లో ఇద్దరికి డెంగీ జ్వరం సోకినట్లు అధికారులు గుర్తించి, కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు. ♦ అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో నెల రోజుల క్రితం ఓ మహిళ డెంగీతో మృతి చెందింది. తాజాగా ఇదే మండలం మొసలపల్లికి కుడుపూడి వెంకటేశ్వరరావు, మాచవరానికి చెందిన అరుణ్బాబు డెంగీ బారిన పడ్డారు. దీంతో ఉలిక్కిపడిన వైద్యాధికారులు బాధితులను అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ముందు చూపేదీ? ఏటా వైరల్ జ్వరాలు, ప్రాణాంతక డెంగీ, మలేరియా జ్వరాలు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో విఫలమవుతున్నారు. గత ఏడాది మన్యంలో మలేరియా, మైదాన ప్రాంతంలో డెంగీ విజృంభించాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. జ్వరాలకు కారణమైన అపరిశుభ్రత, మురుగునీటి నిల్వలను తొలగించే ప్రయత్నం చేశారు. విపత్తు జరిగిన తర్వాత మేల్కొనేలా అధికారుల తీరు ఉంది తప్ప ముందస్తుగా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. నగరాలు, గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. జిల్లాలోని 1,069 పంచాయతీల్లో పాలక మండళ్ల గడువు తీరినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చింది. పాలక మండళ్ల నిర్వహణలోనే అరకొరగా ఉండే పారిశుధ్యం, ప్రత్యేక అధికారుల పాలనతో పూర్తిగా గాడి తప్పింది. పరిస్థితి పూర్తిగా విషమించకముందే ఇప్పటికైనా గ్రామాల్లో డెంగీ జ్వరంపై అవగాహన కల్పించడంతోపాటు, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది. డెంగీ నివారణకు కృషి భానుగుడి (కాకినాడ సిటీ): జిల్లాలో డెంగీ వ్యాధి నివారణకు కృషి చేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంఅండ్హెచ్వో) డాక్టర్ టీఎస్ఆర్ మూర్తి తెలిపారు. తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ వరకూ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 76, గ్రామీణ ప్రాంతాల్లో 182 కలిపి మొత్తం 258 కేసులు నమోదయ్యాయని వివరించారు. కాకినాడ అర్బన్లో 65, రూరల్లో 85 కేసులు నమోదయ్యాయని, మొత్తం కలిపి 150 కేసులతో జిల్లాలోనే కాకినాడ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. పెద్దాపురం అర్బన్లో 9, రూరల్లో 49 కలిపి మొత్తం 58 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. రాజమహేంద్రవరం రూరల్లో 2, రామచంద్రపురం రూరల్లో 33, అర్బన్లో 1, అమలాపురం అర్బన్లో 1, రూరల్లో 10, రంపచోడవరంలో 2, ఎటపాకలో 1 చొప్పున డెగీ కేసులు నమోదయ్యాయన్నారు. ఆగస్టు నెలలో వర్షాలు ఎక్కువగా కురిసి, వాతావరణం మారడంతో డెంగీ కేసులు పెరిగాయని చెప్పారు. వీటిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. జ్వరం వచ్చినప్పుడు ప్రజలు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లాలో డెంగీ నిర్ధారణ పరీక్ష చేసే పరికరాలు కాకినాడ జీజీహెచ్లోనే ఉన్నాయని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని డాక్టర్ మూర్తి సూచించారు. డెంగీ సోకినప్పుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, కన్నుగుడ్డు నొప్పిగా ఉండి కదపలేకపోవడం, ఒంటి మీద దద్దుర్లు వంటి లక్షణాలుంటాయన్నారు. డెంగీ జ్వరం ఎక్కువైతే మలంతో రక్తం పడుతుందని, ముక్కు, నోటి నుంచి నీరు కారుతుందని, వాంతులు అవుతాయని చెప్పారు. నగరపాలక, పురపాలక సంస్థల్లో డెంగీ రిపోర్టు అయిన వార్డుల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. జిల్లాలో 31 మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్ బృందాలు ఏర్పాటు చేశామని, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఇంటింటికీ తిరిగి డెంగీ, మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. డెంగీ దోమ మంచినీటిలో పెరుగుతుందని ఇళ్లలో మంచినీరు నిల్వ ఉంచరాదని, ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగీ దోమ పగటి పూట కుడుతుందని, ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ మూర్తి తెలిపారు. విలేకర్ల సమావేశంలో డీఐఓ డాక్టర్ మల్లిక్, పీఓడీటీటీ డాక్టర్ సత్యనారాయణ, డెమో శ్రీనివాస్, ఏఎంఓ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కరాసవలసలో ఆగని మరణాలు
కరాసవలసలో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఓ వైపు గ్రామంలో జ్వరాల బారిన పడి మంచమెక్కిన వారి సంఖ్య పెరుగుతుండగా...మరోవైపు మృత్యు ఘంటికలూ ఆగడం లేదు. దీంతో గ్రామంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... సాలూరు రూరల్ విజయనగరం : మండలంలోని కరాసవలస గ్రామంలో మరణాలు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన పలువురు పదుల సంఖ్యలో జ్వరాలతో మంచమెక్కుతుంటూ మరోవైపు అదే స్థాయిలో మరణాలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రామజన్ని పోలమ్మ(65) పట్టణంలోని సీహెచ్సీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గడిచిన పది రోజుల వ్యవధిలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికీ గ్రామంలో అనారోగ్యం బారిన పడి మంచమెక్కుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారమే సాక్షిలో మంచం పట్టిన కరాసవలస శీర్షికన కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. సోమవారం పోలమ్మ పరిస్థితి విషమంగా ఉండడం సాలూరు పట్టణంలోని సీహెచ్సీకి తరలించినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మృత్యువాత పడడంతో గ్రామస్తులు మరింత ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పది రోజుల వ్యవధిలో మృతి చెందిన వారి వివరాలు పరిశీలిస్తే చింతాడ పద్మ(28) ఈ నెల 19న మృత్యువాత పడింది. జమ్ము గున్నమ్మ(60), చీకటి మైండ్రు(75), కె.సీతారాం(50), ప్రేమావతి(42), చీకటి లచ్చయ్య(65) కూడా మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి మృతి చెందిన పోలమ్మతో కలసి మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వరుస మరణాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని మరణాలకు అడ్డుకట్ట వేసేలా వైద్య సిబ్బంది, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఎవరి కారణాలు వారివి.... గ్రామానికి చెందిన ఏడుగురు మృతికి జ్వరాలే కారణమని గ్రామస్తులు ఓ వైపు చెబుతుంటే... వైద్యాధికారులు మాత్రం జ్వరాలతో పాటు వేరే కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తుండడంతో గ్రామస్తుల్లో అయోమయం నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దీని లెక్కలు తేల్చితే తప్ప వీరిని భయాందోళనలు వీడేలా లేదు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజారోగ్యంపై అశ్రద్ధ వద్దు సాలూరు రూరల్: ప్రజారోగ్యంపై అధికారులు అశ్రద్ధ వహించరాదని కలెక్టర్ హరిజవహర్ లాల్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని కరాసవలస గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య శిబిరాలను తనిఖీ చేశారు. అనంతరం వైద్య శిబిరంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధతో పని చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో రోడ్లు ఉన్నా కాలువలు లేకపోవడాన్ని గుర్తించి వెంటనే కాలువలు నిర్మించాలని, శ్మశానవాటిక దారి లేదని తెలుసుకుని ప్రతిపాదనలు పంపించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో పందుల సంచారం లేకుండా చూడాలని, జ్వరాలు తగ్గేవరకు వైద్య శిబిరాన్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో చనిపోయిన వారు జ్వరాలతో చనిపోలేదని, ఇతర కారణాల వల్లే మరణించారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
వైద్యుడి అవతారమెత్తిన చాయ్వాలా!
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో లతీఫ్ అనే టీ హోటల్ యజమాని వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రోగులకు సెలైన్లు ఎక్కించాడు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నెల రోజులుగా చెన్నూర్, కోటపల్లి మండలాల్లో వైరల్, డెంగీ జ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. ఓ వైద్యుడు డిప్యూటేషన్పై వెళ్లాడు. ఆరుగురు స్టాఫ్నర్సులకు గాను ఒకరు బదిలీ కాగా, మరొకరు డిప్యూటేషన్పై మరో ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నలుగురు స్టాఫ్నర్సులు, ఇద్దరు వార్డుబాయ్లు ఉన్నారు. వీరంతా మూడు షిఫ్ట్ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి జ్వరంతో వచ్చిన బాలుడికి ఆస్పత్రి ఎదుట ఉండే టీ స్టాల్ యజమాని లతీఫ్ సెలైన్ ఎక్కించాడు. ఇతడికి అంబులెన్స్ ఉండడం, రోగులకు పాలు, టీలు సరఫరా చేస్తుండడంతో ఆస్పత్రి సిబ్బందితో సమానంగా వ్యవహరిస్తుంటాడు. వైద్య సిబ్బందితో ఉన్న చొరవ కారణంగా సెలైన్లు ఎక్కిస్తుంటాడని తెలిసింది. కాగా, ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణను సంప్రదించగా.. సిబ్బంది కొరత వాస్తవమేనని, లతీఫ్ సెలైన్ ఎక్కించలేదని, సెలైన్ బాటిళ్లు ఇవ్వడానికి బెడ్ వద్దకు వెళ్లాడని తెలిపారు.