మీడియాకు మొహం చాటేసిన రాహుల్ | Rahul gandhi is not interacts with any media in new delhi | Sakshi

మీడియాకు మొహం చాటేసిన రాహుల్

Feb 7 2015 12:49 PM | Updated on Mar 18 2019 9:02 PM

మీడియాకు మొహం చాటేసిన రాహుల్ - Sakshi

మీడియాకు మొహం చాటేసిన రాహుల్

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం వీఐపీ పోలింగ్ బూత్‌ నిర్మాణ్‌ భవన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం వీఐపీ పోలింగ్ బూత్‌ నిర్మాణ్‌ భవన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  హస్తిన కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌ వాలియా..ఆయనను దగ్గరుండి పోలింగ్‌ బూత్‌ వైపు తీసుకెళ్లారు.  ఈ సందర్భంగా రాహుల్ను మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన ఏమాత్రం స్పందించలేదు.

చివరికి మీడియాతో మాట్లాడకుండానే రాహుల్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఇదే పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఓటు వేశారు. ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరవిందర్‌ సింగ్‌ లవ్లీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement