కరీంనగర్ క్రైం, న్యూస్లైన్:మానకొండూరు మండలంలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు సామూహిక లైంగికదాడికి దిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వరుసకు అన్న, బాబాయి అయిన ఆ మృగాళ్లు చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఇరవై రోజుల క్రితం గంగిపల్లి పరిధిలోని నూనేపల్లికి చెందిన చిన్నారిని ఆమె తల్లిదండ్రులు ఇంటివద్ద ఉంచి పనికి వెళ్లారు. నిత్యం నీలిచిత్రాలు చూస్తూ జులాయిగా తిరుగుతున్న అదే గ్రామానికి చెందిన పదిహేను, పదహారేళ్ల ఇద్దరు బాలురు చిన్నారిపై కన్నేశారు. వారు ఆమెకు వరుసకు అన్న, బాబాయి అవుతారు.
మధ్యాహ్నం ఇంటివద్ద ఎవరూ లేకపోవడంతో చిన్నారిని ఇంట్లోకి పిలిచారు. వారిని నమ్మి వెళ్లిన చిన్నారిపై ఇద్దరూ లైంగిక దాడికి దిగారు. ఆమె కేకలు వేయకుండా ఒకరు అదిమి పట్టుకొని, మరొకరు లైంగిక దాడికి దిగారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి చేసి పారిపోయారు. ఎవరికీ చెప్పవద్దని చిన్నారిని బెదిరించారు. రెండు రోజుల క్రితం ఆ చిన్నారి కడుపు నొప్పిగా ఉందని తల్లడిల్లింది.
కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో రక్తం రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకుపోయారు. అప్పుడు చిన్నారి తనపై జరిగిన లైంగికదాడి గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తండ్రి సోమవారం మానకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చిన్నారిపై తామే లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ ఎస్సై రాజు తెలిపారు.
చిన్నారిపై సామూహిక లైంగికదాడి
Published Tue, Mar 25 2014 1:56 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement