డేరా ఆశ్రమంపై సీపీఎం జెండాలు
Published Wed, Aug 30 2017 1:09 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరాబాబా(గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్)కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఉన్న డేరాబాబా ఆశ్రమ స్థలంలో బుధవారం సీపీఎం నాయకులు జెండాలు పాతారు. డేరాబాబాకు ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన ఆస్తులను ప్రజలకు పంచి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement