30 రోజుల్లో కోటి రూపాయలంటూ... | A Gang That Deals With Multilevel Marketing Busted In Hyderabad | Sakshi
Sakshi News home page

30 రోజుల్లో కోటి రూపాయలంటూ...

Mar 3 2018 2:11 PM | Updated on Mar 3 2018 2:26 PM

A Gang That Deals With Multilevel Marketing Busted In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించుకోండి.. అదెలా అంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ.. మల్టిలెవల్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడంటూ వీరు ఈ మల్టిలెవల్‌ మార్కెటింగ్‌ మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తుల నుంచి 6 లక్షల రూపాయల విలువైన గోల్డ్‌ కాయిన్లను, రూ.1.73 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గత కొన్నేళ్లుగా మల్టిలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలు పెరుగుతూ వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే కోట్లు రూపాయలు ఎలా సంపాదించాలో తాము చెబుతామంటూ.. ఈ ముఠాలు అమాయకుల వద్ద నుంచి డబ్బులు గుంజడం, గోల్డ్‌ కాయిన్లను సేకరించడం వంటివి చేస్తూ ఉన్నారు. కొన్ని మల్టిలెవల్‌ మార్కెటింగ్‌ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదంతాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement