gold coins
-
10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..
నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫారమ్లు 'ధన త్రయోదశి' సందర్భంగా బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి. స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్బాస్కెట్ వంటివి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించనున్నట్లు సమాచారం.ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలును చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యువెలరీకి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేనివారు.. ఇప్పుడు గ్రోసరీ ప్లాట్ఫారమ్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్ మొదలైనవి ఈ యాప్లతో జతకట్టాయి.ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫారమ్ల ద్వారా 24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను కూడా ఈ గ్రోసరీ ప్లాట్ఫారమ్లలో బుక్ చేసుకోవచ్చు. 24 క్యారెట్ల లక్ష్మీ గణేష్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్లు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్లో..ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫారమ్ ద్వారా బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఏ జ్యువెలరీ ఎలాంటి నాణేలను అందిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి యాప్లని తనిఖీ చేయవచ్చు. కస్టమర్లు తప్పకుండా అధికారిక యాప్లను మాత్రమే తనిఖీ చేయాలి. లేకుంటే నకిలీ యాప్లు మోసం చేసే అవకాశం ఉంటుంది. -
బంగారు నాణేలంటూ రూ.40 లక్షలు మస్కా
కర్ణాటక: ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా పురాతన బంగారు నాణేలు దొరికాయని నమ్మించి కాంట్రాక్టర్కు రూ.40 లక్షలు మోసం చేసిన ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా లింగదహళ్లి గ్రామంలో జరిగింది. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకా చీమనహళ్లికి చెందిన కాంట్రాక్టర్ గోవర్ధన్ బాధితుడు. కుమార్, మాదకప్ప అనే ఇద్దరు పునాది తీస్తుండగా బంగారు నాణేలు దొరికాయని గోవర్ధన్ను మభ్యపెట్టారు . ఈయన చన్నగిరి తాలూకాలో కాంట్రాక్ట్ పనులు చేసే సమయంలో వీరిద్దరూ పరిచయమయ్యారు. నిజమేననుకున్న అతడు సెప్టెంబర్ 23న వారికి రూ. 40 లక్షలు ముట్టజెప్పారు. వారు 2.5 కేజీల బరువైన నాణేలను అతనికి ఇచ్చారు. అదృష్టమంటే నాదేననే సంతోషంతో గోవర్ధన్ ఒక బంగారు అంగడికి వెళ్లి వాటిని పరీక్షింపజేశాడు. అవి బంగారు నాణేలు కాదని తేలింది. దీంతో బాధితుడు చన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ నిరంజన్ తెలిపారు. -
ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్
సూపర్స్టార్ రజనీకాంత్ 'జైలర్' హిట్ కావడం మాటేమో గానీ.. నిర్మాత కళానిధి మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్కి రెండు మూడు రెట్లు లాభాలు వచ్చేసరికి ఆయన ఆపడం ఎవరి తరం కావట్లేదు. దీంతో అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!) సాధారణంగా ఏ సినిమా హిట్ అయినాసరే నిర్మాత ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. తెలుగు ప్రొడ్యూసర్స్లో కొందరు మాత్రం హీరోకి లేదా దర్శకుడికి ఖరీదైన కారు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు. 'జైలర్' నిర్మాత కళానిధి మారన్ కూడా అలానే చేశారు. హీరో రజనీ బీఎండబ్ల్యూ, డైరెక్టర్ నెల్సన్-మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్కి ఖరీదైన పోర్సే కార్లని గిఫ్ట్స్గా ఇచ్చాడు. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఓ సినిమా తీయాలంటే హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడితే పని అయిపోదు కదా. ఈ క్రమంలోనే 'జైలర్' కోసం పనిచేసిన 300 మందికి.. నిర్మాత కళానిధి మారన్ తలో గోల్డ్ కాయిన్ చొప్పున ఇచ్చారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) Mr.Kalanithi Maran felicitated more than 300 people who worked for #Jailer with gold coins today. #JailerSuccessCelebrations pic.twitter.com/qEdV8oo6dB — Sun Pictures (@sunpictures) September 10, 2023 -
కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో ఒక నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి 240 బంగారు నాణేలు లభ్యమవగా వాటిని దొంగిలించిన ఆరోపణలపై ఒక ఇన్స్పెక్టర్తో సహా నలుగురు పోలీసులను మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో కూలీలు రామ్కు భయ్డియా అతని మేనకోడలు బవారి తవ్వకాలు చేస్తుండగా వారికి ఒక కాసుల మూట కనిపంచిందని.. చడీ చప్పుడు చేయకుండా ఆ మూటతో సహా గుజరాత్ సరిహద్దులో వారు నివాసముండే సోండ్వా గ్రామానికి చేరుకున్నారని.. వారు 20 నాణేలను తీసుకుని మిగిలినవాటిని వారి ఇంట్లోనే పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ నోటా ఈ నోటా వార్త చేరి మెల్లగా ఊరంతా వ్యాపించింది. ఇదే క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు జులై 19న రామ్కు భయ్డియా ఇంటికి చేరుకున్నారని గ్రామస్తులు తెలపగా నిధిని తవ్వించి మొత్తంగా వారి వద్ద నుండి మొత్తం 239 నాణేలను లాక్కుని తమకి ఒకే ఒక్క నాణెం ఇచ్చారని రామ్కు తెలిపాడు. ఆ మరుసటి రోజే రామ్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరి ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జరీ చేశారు. ఈ మొత్తం తతంగంలో ఇప్పటికింకా ఆ బంగారు నాణేల ఆచూకీ తెలియకపోవడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య -
కేంద్రం బంగారం అమ్ముతోంది.. ఇలా కొనుగోలు చేయండి!
హిందూ పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకనే రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు మింట్ కార్యాలయాల్లో సామాన్యులు బంగారం, వెండి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా ఎవరైనా గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్లను కొనుగోలు చేయాలంటే కేంద్రం ఏర్పాటు చేసిన మింట్ కేంద్రాలను సందర్శించవచ్చు. మింట్ ఔట్లెట్లలో 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాములు ఇలా ఫిజికల్గా, లేదంటే ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. India Government Mint Wishes you a very happy Akshaya Tritya. On this auspicious day of Akshaya Tritiya, don't forget to purchase some gold and pray to Lord Vishnu. Buy now- https://t.co/DcRBC0Ukya#akshayatritiya #BuyGold #auspacious pic.twitter.com/V0HJYLKHLm — India Government Mint (@SPMCILINDIA) April 22, 2023 మింట్ అంటే ఎమిటీ? దేశంలో డబ్బులను తయారు చేసే కేంద్రాలను మింట్ కేంద్రాలు అని పిలుస్తారు. దేశ వ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మింట్ కేంద్రాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే? భారత ప్రభుత్వం, ఆర్బీఐ ఆధ్వర్యంలో మింట్ కార్యాలయాల్లో నోట్లు, కాయిన్స్ తయారవుతాయి. ♦ఢిల్లీలో జవహార్ వాయిపర్ భవన్ జన్ పథ్, న్యూఢిల్లీ ♦నోయిడా డీ-2 సెక్టార్ 1 ♦ముంబైలో షాహిద్ భగత్ సింగ్ రోడ్డు ♦హైదరాబాద్లో ఐడీఏ ఫేజ్ 2, చర్లపల్లి ♦కోల్కతా అలిపోరిలో ఉత్పత్తి కొనసాగుతుంది. మింట్ కేంద్రాల్లో బంగారం, వెండి ఎలా కొనుగోలు చేయాలంటే ఎవరైనా సిల్వర్, గోల్డ్ కొనుగోలు చేయాలంటే పైన పేర్కొన్న కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అయితే www.indiagovtmint.in.లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కొనుగోళ్లను క్యాష్, డెబిట్కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు చెల్లించి మీకు కావాల్సిన మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. బీఐఎస్ హాల్ మార్క్తో సహా కేంద్రం మింట్ అవుట్లెట్లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్ మార్క్ పొందినగోల్డ్ కాయిన్స్ మాత్రమే విక్రయాలు జరుపుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు కాయిన్స్ 24క్యారెట్ల గోల్డ్తో 99.9 శాతం స్వచ్ఛమైందని పేర్కొంది. గోల్డ్పై లోన్ కూడా దశాబ్దాల తర్వాత కూడా బంగారు నాణేలు వాటి మెరుపును కోల్పోవు. వాటి మార్కెట్ విలువ వాటి వయస్సుతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉందని భారత ప్రభుత్వ మింట్ ట్విట్టర్లో పేర్కొంది. బంగారు నాణేలను సులభంగా విక్రయించవచ్చు. లేదా బంగారు రుణాల కోసం తాకట్టుగా ఉపయోగించవచ్చు’ అని వెల్లడించింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు!
రాబోయే అక్షయ తృతీయ పండుగ కోసం టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ ప్రత్యేక బంగారు నాణేలను ఆవిష్కరించింది. చోళ రాజవంశం స్ఫూర్తితో ఈ ప్రత్యేక నాణేలను రూపొందించింది. పరిమితంగా అందుబాటులోకి తెచ్చిన ఈ నాణేలను ఆభరణాల కోసం కాకుండా సేకరణ కోణంలో ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు. చోళ సామ్రాజ్య వైభవం, సాంస్కృతిక శోభను చాటేలా నటరాజ నానయం, వెట్రియిన్ కారిగై నానయం, కరంతై విక్టరీ నానయం, రాజేంద్ర చోళ నానయం పేరుతో ప్రత్యేక నాణేలను తనిష్క్ రూపొందించింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... కాగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలపై పలు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. తనిష్క్ ఏప్రిల్ 24 వరకు బంగారు, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ని కూడా పొందవచ్చు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది. ఈ పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఐశ్వర్యం, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు. అక్షయం అనేది అమరత్వాన్ని సూచిస్తుంది. అక్షయ తృతీయ నాడు మనం సాధించేదేదైనా శాశ్వతంగా నిలిచి ఉంటుందని హిందువుల నమ్మకం. కాబట్టి ఈ రోజున ఇల్లు, ఆస్తి లేదా ఆభరణాలు వంటివి కొంటే అవి శాశ్వతంగా ఉంటాయని, తమకు అదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. ఇదీ చదవండి: నెట్ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు -
అదృష్టం అంటే ఇది.. కిచెన్లో బంగారు నాణేలు.. ఊహించని ధరతో షాక్!
అదృష్టం ఆవగింజంత, దురదృష్టం దబ్బకాయంత అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, యూకేలోని ఓ కుటుంబానికి మాత్రం అది వర్తించలేదు. వారికి అదృష్టం కూడా దబ్బకాయంత పట్టుకుంది. పదేళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇంటిలో భారీ ఎత్తున బంగారు నాణేలు లభించిన వార్త సెప్టెంబరు నెలలో చదివే ఉంటారు! తాజాగా ఆ వార్త తాలూకు మరో విషయం వైరల్గా మారింది. ఇంటి వంటగదిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.శ.1700 ప్రారంభ కాలానికి చెందిన 254 గోల్డ్ కాయిన్స్ బయల్పడిన సంగతి తెలిసిందే. అయితే, వాటిని అమ్మితే సుమారు రూ.2.3 కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) రావొచ్చని అంచనావేశారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రెగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు. 292 ఏళ్ల పూర్వ కాలానికి చెందిన ఈ సంపదను చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్నదానికంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. కాగా, పాతకాలానికి చెందిన ఆ బంగారు సంపదను చిన్న మొత్తాల్లో విక్రయించారని మెట్రో నివేదిక పేర్కొంది. (చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!) -
రాసిపెట్టి ఉండటమంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు!
రాసి పెట్టి ఉండాలే గానీ.. తమకంటూ రావాల్సిన సొమ్ము దానంతట అదే వస్తుందనే సామెత నిజమైంది. పాతబడిన ఇళ్లకు మెరుగులు దిద్దే క్రమంలో ఓ జంటకు ఊహించని రీతితో ఏకంగా రూ.2కోట్లకు పైగా విలువ చేసే బంగారు నాణేలు లభించాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ది టైమ్స్ కథనం ప్రకారం.. నార్త్ యార్క్ షైర్లోని ఎల్లెర్బీ గ్రామంలో ఓ జంటకు పాతబడిన ఇళ్లు ఉంది. దీంతో తమ పాతబడిన ఇంటిని బాగుచేసుకునేందుకు వారు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తమ ఇంట్లోని కిచెన్ను బాగుచేయడం కోసం తవ్వకాలు జరిపారు. అనూహ్యంగా ఒక ప్లేస్లో గునపానికి ఏదో తగిలిన శబ్ధం రావడంతో షాకయ్యారు. మరికాస్త తవ్వగా, ఓ లోహపు క్యాన్ కనిపించింది. క్యాన్ను బయటకు తీసి ఓపెన్ చేసి చూడగా బంగారు నాణేలు కనిపించాయి. దీంతో వారి ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. అయితే, ఆ నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. దాదాపు 264 బంగారు నాణేలు వారికి దొరికాయి. ప్రస్తుతం వాటి విలువ దాదాపు.. ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనుంది. అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించినట్టు సమాచారం. #UK Couple Find Gold Coins Worth Rs 2.3 Crore Buried Under Their Kitchen Floor: Report #News #2022 https://t.co/BHJhZgNrQN — Real News Time (@ErdenSorgul) September 2, 2022 -
ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ!
కార్టజినా: 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్జోస్ మునిగిపోయింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి. ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది! -
గోల్డ్ ఏటీఎంలూ వచ్చేస్తున్నాయ్
సనత్నగర్: నగదు విత్డ్రాయల్స్, జమకు ఉపయోగపడే ఏటీఎంల తరహాలోనే బంగారం కోసం కూడా ఏటీఎంలు దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. గోల్డ్ సిక్కా సంస్థ నెల, నెలన్నర వ్యవధిలో వీటిని ఏర్పాటు చేయనుంది. తొలుత హైదరాబాద్లో (చార్మినార్, సికింద్రాబాద్, అబిడ్స్) మూడు గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఈవో ఎస్వై తరుజ్ గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వీటి నుంచి ఒకేసారి 0.5 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ బంగారాన్ని నాణేల రూపంలో కొనుగోలు చేయవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చని చెప్పారు. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన వివరాలన్నింటితో ప్యూరిటీ సర్టిఫికెట్ కూడా కొనుగోలు సమయంలోనే పొందవచ్చని తరుజ్ వివరించారు. ఒక్కో మిషన్లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల పసిడిని లోడ్ చేయవచ్చని తరుజ్ వివరించారు. భారత్లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చన్నారు. ప్రస్తు తం దుబాయ్, బ్రిటన్లలో మాత్రమే ఏటీఎంల ద్వారా 10 గ్రాములు, 20 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ను కొనుగోలు చేసే సదుపాయం ఉందని చెప్పారు. -
అమెజాన్ బంపర్ ఆఫర్: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్
దివాళీ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. బంగారం, వెండి నాణేలు, టీవీలు, హోమ్ అప్లయన్సెస్ పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. బంగారు నాణేలపై ఆఫర్ ధన్తేరాస్ సందర్భంగా అమెజాన్ ధన్తేరాస్ షాపింగ్ స్టోర్ పేరుతో బంగారు నాణేలపై 20 శాతం డిస్కౌంట్, వెండి నాణేలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే బంగారం, వెండి ఆభరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాదు డైమండ్ ఆభరణాలపై జీరో శాతం మేకింగ్ ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. ఇక ఈ సేల్లో ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, రూపే క్రెడిట్, డెబిట్ కార్డ్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ ధన్తేరాస్ షాపింగ్ స్టోర్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది. స్మార్ట్ఫోన్లపై 40 శాతం, ల్యాప్టాప్లు, టాబ్లెట్లపై 40 శాతం తగ్గింపును అందిస్తోంది. స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లపై కూడా 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది ఆఫర్లు ఎలా ఉన్నాయ్ దాదాపూ నెలరోజులుగా కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగియనుంది. అయితే మరికొన్ని గంటల్లో ముగియనున్న ఈ సేల్లో టీవీలు, హోమ్ అప్లయన్సెస్ 65శాతం డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. మొబైల్,యాక్సెసరీలపై అమెజాన్ 40 శాతం, పురుషులు, మహిళల ఫ్యాషన్లో 80 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిపింది. చదవండి:సేల్స్ బీభత్సం..! గంటలో 5లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి..! -
బంగారం ఆభరణాలపై జీఎస్టీ ప్రభావం ఎంత?
కరోనా రాకముందు అక్షయ తృతీయ వస్తే చాలు ప్రతి ఒక్కరు బంగారం షాపులకు క్యూ కట్టేవారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది మన దేశంలో సంప్రదాయంగా వస్తుంది. ఈ రోజు బంగారం కొంటే శుభం కలుగుతుందని అనేక మంది భావిస్తూ ఉంటారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి బంగారం షాపులకు వెళ్లి కొనే పరిస్థితి మాత్రం లేదు. దేశంలోని చాలా ప్రాంతాలలో కోవిడ్ కారణంగా లాక్ డౌన్ విధించారు. అందుకే ఈ సారి, బంగారం కొనుగోలు చేసేందుకు ఆభరణాల దుకాణాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ, ఈ సమయంలో అనేక మంది డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో వివిధ ప్లాట్ ఫామ్ ల ద్వారా డిజిటల్ గోల్డ్ ను మనం కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో గోల్డ్ సిక్కా, ఫోన్ప్ గోల్డ్, పేటెమ్ గోల్డ్ వంటి సంస్థలు డిజిటల్ గోల్డ్ ను విక్రయిస్తున్నాయి. షాప్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా సులువుగా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై అనేక ఆఫర్లను అందించడంతో వినియోగదారులు కొనుగులపై ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి దేశం భారత్. ఇక్కడ, మనదేశంలో బంగారంపై విధించే జీఎస్టీ అనేక అపోహలు ఉన్నాయి. దాని గురుంచి తెలుసుకునే ముందు ప్రస్తుతం బంగారం ఎన్ని రకాలో తెలుసుకుందాం. బంగారం ప్రధానంగా రెండు రకాలు: నాణేలు, బార్లు లేదా బిస్కెట్లు ప్రాసెస్ చేయబడిన బంగారం ఆభరణాలు బంగారంపై జీఎస్టీ రేటు 3 శాతం. అది బంగారం నాణేలుగా లేదా ఆభరణాలుగా విక్రయించబడిందా అనే దానితో సంబంధం లేకుండా జీఎస్ టీ రేటు అనేది 3 శాతంగా ఉంటుంది. ఇందులో అన్నీ సేవలు కలిపి మొత్తం మీద 3 శాతం జీఎస్ టీ విధిస్తారు కానీ, బయట వస్తున్నట్లు 5 శాతం మాత్రం కాదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ ధృవీకరించిన ప్రకారం బంగారాన్ని ఆభరణాల రూపంలో విక్రయించినప్పుడు, ఛార్జీలు వసూలు చేయడం యాదృచ్ఛికం. బంగారం అమ్మటప్పుడు 3 శాతం రేటు మాత్రమే వర్తిస్తుంది. జనాభాలో కొంత మంది రెడీమేడ్ రూపంలో ఆభరణాలను కొనడానికి ఇష్టపడరు. కొన్ని ఏళ్ల నుంచి మొత్తం కుటుంబానికి కావాల్సిన ఆభరణాలను తయారుచేసే స్థానిక వ్యాపారుల( బంగారు-స్మిత్) గురుంచి మీకు తెలుసు. ఇలాంటి సందర్భాల్లో, వినియోగదారులు తమకు నచ్చిన ఆభరణాలను తయారు చేయడానికి బంగారు కడ్డీలు/నాణేలు కొని బంగారు స్మిత్కు ఇస్తారు. ఇది ఒక సాధారణ ఉద్యోగ పని లావాదేవీ లాంటిది. ఇప్పుడు వారు కనుక జీఎస్టీ క్రింద నమోదు చేయబడితే అప్పుడు అతను మీ బంగారం నుంచి ఆభరణాలను తయారు చేయడానికి 5% జీఎస్టీ వసూలు చేస్తాడు. అలాగే, మరికొందరు పాత బంగారు ఆభరణాలను అమ్మేసి క్రొత్తదాన్ని కొనడం లేదా కొన్నిసార్లు డబ్బు కోసం మార్పిడి చేయడం వంటివి మన దేశంలో సర్వ సాధారణం. అయితే ఇలాంటి బంగారం ఆభరణాల లావాదేవీల మీద ఎటువంటి జీఎస్టీ ప్రభావం ఉండదు అని గుర్తుంచుకోవాలి. అలాగే దేశంలో బంగారు ఆభరణాలను కొనడం, అమ్మడం వంటి వ్యాపారం చేసే సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటిలో డ్రగ్ గోల్డ్, అట్టిక గోల్డ్ వంటి కంపెనీలు చాలా ప్రసిద్ధమైనవి. ఇలాంటి వాటి విషయంలో కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం జీఎస్టీ విధించబడుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అక్షయ తృతీయ వంటి సమయాలలో ఎటువంటి సందేహం లేకుండా బంగారు దుకాణాల వద్ద, డిజిటల్ గోల్డ్ ద్వారా బంగారం కొనుగోలు చేయవచ్చు. -
తీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట
సాక్షి, కొత్తపల్లి: ఉప్పాడ శివారు పాత మార్కెట్ సమీపంలోని తీర ప్రాంతంలో రెండు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. శుక్రవారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు. మహిళలు, చిన్నారులు సైతం దువ్వెనలు, పుల్లలు, జల్లెళ్లలో ఇసుకను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మహిళలకు బంగారం రేణువులు, రూపులు, దిద్దులు, ఉంగారాలలో పాటు బంగారు, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో పెద్దపెద్ద బంగ్లాలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయట పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక మహిళకు లభ్యమైన బంగారు దిద్దులు -
బాబు బంగారం!
సినిమా షూటింగ్ అంటే మినిమమ్ వంద రోజులు యూనిట్ అంతా ట్రావెల్ చేస్తారు. సినిమా భారీతనాన్ని బట్టి రోజులు పెరుగుతాయి. చిన్న సినిమాలంటే ముప్ఫై నలభై రోజుల్లో పూర్తవుతాయి. రోజులు ఎన్నయినా ఒక సినిమా పూర్తయ్యేంతవరకూ కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి షూటింగ్ చివరి రోజు ఒకింత ఎమోషన్ అవుతారు. కొంతమందైతే బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇలా జరుగుతుంటుంది. షూటింగ్ చివరి రోజున అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలు యూనిట్ సభ్యులకు బహుమతులు ఇస్తుంటారు. తాజాగా మరో స్టార్ శింబు కూడా ‘ఈశ్వరన్’ సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు. శింబూకి వివాదస్పద వ్యక్తి అనే పేరుంది. అయితే ఇలాంటి మంచి పనులు చేసి ‘బాబు బంగారం’ అని కూడా అనిపించుకుంటుంటారు. ఇక సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈశ్వరన్’ సంక్రాంతికి విడుదల కానుంది. -
ఇత్తడిని పుత్తడిగా మార్చి..
సాక్షి, పాపన్నపేట(మెదక్): ఇత్తడిని పుత్తడిగా మార్చి ఓ అమాయకుడిని ఏమార్చి రూ. 4 లక్షలతో ఓ మోసగాడు పరారైన సంఘటన పాపన్నపేట మండలం యూసుఫ్పేటలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్పేట గ్రామానికి చెందిన బాజ బుజ్జయ్య అనే వ్యక్తి స్క్రాప్ వ్యాపారం చేసుకొని జీవిస్తున్నాడు. ఇతడికి రమేష్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం పరిచయమయ్యాడు. తనది అనంతపూర్గా చెప్పుకున్న ఆ యువకుడు రగ్గుల వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడు. తన వద్ద విక్టోరియా మహారాణి చిత్రపఠంతో ఉన్న బంగారు నాణేలు ఉన్నాయని, వాటిని అసలు కన్నా తక్కువ ధరకు అమ్ముతానని చెప్పాడు. అవసరమైతే వాటి నాణ్యతను పరిశీలించాలని రెండు నాణేలు శాంపిల్గా ఇచ్చాడు. వాటిని బంగారు దుకాణానికి తీసుకెళ్లిన బుజ్జయ్య అవి నిజమని నిర్ధారించుకున్నాడు. అనంతరం 5 రోజుల తర్వాత తిరిగి వచ్చిన రమేష్ 30 తులాల బంగారాన్ని రూ. 12 లక్షలకు అమ్ముతానని బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా రూ.4 లక్షలు బుజ్జయ్య వద్ద తీసుకొని బంగారు నాణేలు ఇచ్చి వెళ్లిపోయాడు. బుజ్జయ్య వాటిని తీసుకొని బంగారం షాపుకు వెళ్లగా అవి పుత్తడివి కావని, ఇత్తడివని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన బుజ్జయ్య రమేష్కు ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ రావడంతో శుక్రవారం పోలీస్స్టేషలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు వివరించారు. -
రోడ్డు మీద బంగారు నాణేల కలకలం
సాక్షి, బెంగళూరు : రోడ్డు మీద కుప్పులు కుప్పలుగా బంగారు నాణేలు అంటూ ప్రచారం. నిమిషాల్లో ఈ విషయం చుట్టుపక్కల పాకిపోయింది. ఇంకేముంది... బంగారు నాణేలను సొంతం చేసుకునేందుకు జనాలు భారీ ఎత్తున గుమ్మిగూడటంతో కొద్దిసేపు స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుసరిహద్దులోని హోసూరు తాలూకా బాగలూరు– సజ్జాపురం రోడ్డులోని పోలీసు క్వార్టర్స్ సమీపంలోని ఓ పొదలో బంగారు నాణేలు దొరుకుతున్నాయని శుక్రవారం సాయంత్రం ప్రచారం జరిగింది. దీంతో చిన్నాపెద్ద తేడా లేకుండా సుమారు 200 మందికిపైగా చేరుకొని నాణేల కోసం వెతకలాట ప్రారంభించారు. నాణేలు దొరికిన కొంత మంది అక్కడి నుండి వెళ్లిపోగా మిగిలిన వారు గాలింపులు కొనసాగిస్తూ వచ్చారు. దీనితో బాగలూరు– సర్జాపురం రోడ్డులో ట్రాఫిక్ జామ్ తలెత్తింది. విషయం తెలుసుకొన్న బాగలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ సమస్యను క్రమబద్దీకరించారు. నాణేలపై హోసూరు తహసీల్దార్ సెందిల్కుమార్ మాట్లాడుతూ... ప్రజలకు దొరికిన కొద్ది నాణ్యాలను స్వాధీనపరుచుకొని పరిశీలించగా ఇత్తడి నాణేలుగా తెలిసింది. ఇత్తడి నాణేలను చూసి జనాలు బంగారు నాణేలు అనుకున్నారన్నారు. ఈ ఘటన హోసూరు ప్రాతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. -
బయటపడ్డ 1100 ఏళ్ల నాటి బంగారు నాణేలు
జెరూసలేం : వేయి సంవత్సరాల కిందట మట్టి పాత్రలో దాచిన వందలకొద్దీ బంగారు నాణేలను ఇజ్రాయెల్ యువకులు గుర్తించారు. ఈనెల 18న ఈ నిధిని కనుగొన్నారని ఇజ్రాయెల్ పురాతన సంపద అథారిటీ సోమవారం వెల్లడించింది. మధ్య ఇజ్రాయెల్లో జరుగుతున్న తవ్వకాల వద్ద ఈ నిధి టీనేజ్ వాలంటీర్ల కంటపడిందని అధికారులు తెలిపారు. దాదాపు 1100 సంవత్సరాల కిందట ఈ బంగారు నాణేలను భూమిలో పాతిపెట్టిన వ్యక్తి వాటిని తిరిగి తీసుకువెళ్లాలని ఆశించాడని, అందుకు ఆ ప్రాంతంలో ఓడను కూడా సిద్ధం చేశాడని ఇజ్రాయెల్ అధికారి లియత్ నదవ్జివ్ వెల్లడించారు. ఈ సంపదను తిరిగి తీసుకువెళ్లకుండా అతడిని నిరోధించింది ఏమటనేదే మనం అంచనా వేయగలిగిందని చెప్పారు. అమూల్య సంపదను దాచిన సమయంలో ఆ ప్రాంతంలో వర్క్షాపులు ఉండేవని, వాటి యజమాని ఎవరనేది ఇప్పటికీ అంతుబట్టని విషయమని అన్నారు. పురాతన బంగారు నాణేలను కనుగొన్న వాలంటీర్లలో ఒకరైన ఒజ్ కొహెన్ ఇవి అద్భుతంగా ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తవ్వకాల్లో భాగంగా భూమిని తవ్వుతున్న క్రమంలో తాను ఈ బంగారు నాణేలను చూశానని, ఇలాంటి ప్రత్యేక పురాతన సంపదను కనుగొనడం ఉద్వేగంతో కూడిన అనుభవమని చెప్పారు. తొమ్మిదో శతాబ్ధంలో అబ్బాసిద్ కాలిఫేట్ హయాంకు చెందిన 425 నాణ్యమైన 24 క్యారెట్ బంగారు నాణేలు అప్పట్లో చాలా విలువైనవని పురాతన సంపద అథారిటీకి చెందిన నాణేల నిపుణులు రాబర్ట్ కూల్ అన్నారు. ఆ నాణేల విలువతో అప్పట్లో ఓ వ్యక్తి ఈజిప్ట్లో అత్యంత విలాసవంతమైన నగరంలో లగ్జరీ హౌస్ను కొనుగోలు చేయవచ్చని కూల్ అంచనా వేశారు. చదవండి : ఇజ్రాయెల్లో చైనా రాయబారి అనుమానాస్పద మృతి -
హథీరాంజీ మఠంలో బంగారం మాయం!?
సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠంలో బంగారం, వెండి మాయమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాను అధికారులు గుర్తించారు. హథీరాంజీ మఠం అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మఠంలోని కొన్ని బీరువా తాళం చెవులు కనిపించకపోవడంతో సిబ్బంది గుర్రప్ప కుటుంబ సభ్యులను ఆరాతీశారు. వారు ఇంట్లో వెతికి మఠానికి చెందిన కొన్నితాళం చెవులు తీసుకొచ్చారు. అందరి సమక్షంలో అధికారులు బీరువా తెరిచి నగలను పరిశీలించగా.. 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఈక్రమంలో నగల మాయంపై మఠం సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు సమాచారం. అప్రైజర్తో లెక్కకట్టి ఎన్ని నగలు పోయాయో తెలుపుతామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కొందరు పూజారులపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (మహంతు గారి'గది') -
పదేళ్ల శ్రమ.. బంగారు ముద్దలు, నాణేలు
వాషింగ్టన్: వేల కోట్ల విలువైన నిధినిక్షేపాలను ఎక్కడో దాచడం.. దాన్ని చేరుకోవడానికి రెండు గ్రూపులు పోటీ పడటం.. చివరకు హీరో దాన్ని దక్కించుకోవడం.. ఇలాంటి సినిమాలు దాదాపు అన్ని భాషల్లోను వచ్చాయి. సూపర్హిట్ అయ్యాయి కూడా. అయితే అచ్చంగా ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఏకంగా 2 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన నిధిని గుర్తించాడో వ్యక్తి. ఉత్తర అమెరికాలోని రాకీ పర్వత ప్రాంతాల్లో ఈ నిధిని కనుగొన్నాడు. దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి దీనిని గుర్తించాడు. వివరాలు.. న్యూ మెక్సికోకు చెందిన ఫారెస్ట్ ఫెన్ అనే పురాతన వస్తువులు సేకరించే ఓ వ్యక్తి తనకు కిడ్నీ క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఈ నిధి వేటను(ట్రెజర్హంట్) రూపొందించాడు. జబ్బు నయమైన తర్వాత కూడా ఫెన్ ఈ అలవాటును కొనసాగించాడు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఓ రాగి పెట్టెలో బంగారు ముద్దలు, నాణేలు, వజ్రాలు, ప్రీ కొలంబియన్ కాలానికి చెందిన కళాకళాఖండాలు, ఇతర విలువైన వస్తువులను దాచాడు ఫెన్. తర్వాత నిధి వేటకు అవసరమైన క్లూస్ని ‘ది థ్రిల్ ఆఫ్ ది చేజ్’ పేరుతో ప్రచురించాడు. 24 లైన్ల నిగూఢ పద్యంలో నిధి ఉన్న తావుని వర్ణించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి రాకీ పర్వతాల్లో సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో దాగి ఉన్న ఈ నిధిని కనుగొన్నట్లు ఫెన్ తెలిపాడు. సదరు వ్యక్తి నిధిని గుర్తించిన ఫోటొను తనకు పంపినట్లు ఫెన్ ‘ది శాంటా ఫే న్యూ మెక్సికన్’ వార్తాపత్రికకు తెలిపాడు. అయితే నిధిని కనుగొన్న వ్యక్తి పేరును ఫెన్ వెల్లడించలేదు. నిధి ఉన్నవస్తువు బరువు 9 కిలోలు ఉంటే దాని లోపల ఉన్న వస్తువులు మరో 10 కిలోల బరువు ఉంటాయని ఫెన్ తెలిపాడు. గత దశాబ్దంలో పదివేల మంది అన్వేషకులు ఈ నిధి జాడను కనుగొనేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. చాలామంది తమ ఉద్యోగాలను వదిలి పెట్టి.. ప్రమాదకరమైన భూభాగాల్లోకి ప్రవేశించారు. నివేదికలను అనుసరించి కనీసం ఇద్దరు మరణించారు. దాంతో ఫెన్ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేశారనే ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. మరికొందరు ఈ నిధి వేట ఒక బూటకమని కొట్టి పారేశారు. -
ఆలయం వద్ద బయటపడిన బంగారు నాణేలు
తిరుచిరాపల్లి : కేరళలోని పురాతన ఆలయంలో బంగారు నాణేలు లభ్యమయ్యాయి. తిరువనంతపురంలోని జంబూకేశ్వర్ ఆలయం వద్ద బుధవారం తవ్వకాలు చేపట్టగా ఏడడుగుల లోపల ఓ నౌకలో 1.7 కిలోల బరువున్న 505 బంగారు నాణేలు లభించాయి. వీటిలో 504 చిన్న నాణేలు కాగా, ఒక పెద్ద నాణెం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. అరబిక్ బాషలో ముద్రితమైన అక్షరాలున్న ఈ నాణేలు 100 నుంచి 1200 శతాబ్ధానికి చెందినవని భావిస్తున్నారు. నౌకలో దాచిన ఈ నాణేలను తాము గుర్తించామని అధికారులు చెబుతున్నారు. బంగారు నాణేలతో సహా నౌకను పోలీసులకు అప్పగించామని ఎండోమెంట్ అధికారులు తెలిపారు. చదవండి : రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..! -
గుప్తనిధుల కోసం తవ్వకం
హుజూర్నగర్ రూరల్: కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నాణేల నిధి... తన ఇంటిలోని మూలగదిలో వచ్చిచేరిందని, మంత్రగాళ్ల సహాయంతో మేకపోతులను బలిచ్చి రక్తపుధారలు అర్పిస్తే బంగారం తన వశమవుతుందని కలలో వచ్చిన ఆనవాళ్లతో ఓ రైతు తనింటిలో తవ్వకాలు జరపడంతో నాణేలు లభ్యమయ్యాయి. అయితే వాటిని పరీక్షిస్తే.. రాగి, ఇత్తడివిగా తేలాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అమరవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరవరం గ్రామానికి చెందిన సింగతల గురవారెడ్డి తన ఇంట్లో బంగారు నిధి ఉందంటూ ఇద్దరు మంత్రగాళ్ల సహాయంతో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మేకపోతులను బలిచ్చి దేవుడి గదిలో ఒక మూలన గొయ్యి తవ్వాడు. ఈ గొయ్యిలో సుమారు 24.4 కేజీల బరువున్న (662 నాణేలు) బంగారాన్ని పోలిన నాణేలు లభ్యమయ్యాయి. వాటిని ఒకబ్యాగులో సర్ది అటకమీద పెట్టారు. అప్పటికే కొద్దిరోజులుగా మేకపోతులను బలి ఇస్తూ మంత్రగాళ్లు పలుదఫాలుగా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా ఇంట్లో క్షుద్రపూజల అలజడి గమనించిన స్థానికులు గుప్తనిధుల తవ్వకం పసిగట్టి పోలీసులకు సమాచారం అందించారు. కోదాడ డీఎస్పీ సుదర్శన్రెడ్డి, సీఐ కె.భాస్కర్ పోలీసు సిబ్బందితో రాత్రి సమయంలోనే హుటాహుటిన అమరవరం చేరుకుని గురవారెడ్డి ఇంట్లో సోదా చేశారు. గదిలో తవ్వకాలు జరిపిన గొయ్యిని పరిశీలించారు. బంగారు నాణేలుగా భావించి అటకమీద దాచిన నాణేల బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో రాగి, ఇత్తడి నాణేలుగా గుర్తింపు హుజూర్నగర్లోని పుల్లయ్యచారి అనే నిపుణుడితో రసాయన పరీక్షల ద్వారా ఆ నాణేలను పరీక్షించగా అవి రాగి, ఇత్తడివిగా తేలినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్స్టేషన్లో అమరవరంలో స్వాధీనం చేసుకున్న నాణేలను ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. గురవారెడ్డి మరో ఇద్దరితో కలసి కొంతకాలంగా ఇంట్లో ఉన్న గుప్తనిధి తవ్వకాల కోసం పలుదఫాలుగా మేకపోతులను బలిచ్చి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి కూడా మేకపోతును బలిఇచ్చి ఇంట్లో గొయ్యి తవ్వడంతో 24.4 కేజీల (662నాణేలు)బరువున్న బంగారాన్ని పోలిన నాణేలు లభ్యమవడంతో వాటిని అటకపై ఉంచారని, స్థానికుల సమాచారంతో డీఎస్పీ సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నాణాలను స్వా«ధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
తీర్చే మార్గం
పూర్వం బనీ ఇస్రాయీల్ జాతికి చెందిన ఒక వ్యక్తికి వెయ్యి బంగారు నాణేలు అత్యవసరపడ్డాయి. దాంతో తనకు బాగా తెలిసిన ఒక వ్యాపారిని అప్పివ్వమని అభ్యర్థించాడు. ఆ వ్యాపారి అల్లాహ్ పై నమ్మకం ఉంచి అతనికి వెయ్యి బంగారు నాణాలను అప్పుగా ఇచ్చాడు. ఫలానా గడువులోగా తిరిగి ఇచ్చేయాలని షరతు కూడా పెట్టాడు. బంగారు నాణేలను తీసుకుని సముద్ర మార్గాన్ని దాటి తన ప్రాంతానికి వెళ్లిపోయాడు. తీసుకున్న డబ్బుతో అవసరాలు తీర్చుకున్నాడు. అంతలోనే అప్పు తీర్చే గడువు రానేవచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నాణాలను తీసుకుని అప్పు తీర్చే ఉద్దేశంతో ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సముద్ర తీరం దగ్గర నిలబడి పడవ కోసం ఎదురుచూడసాగాడు. ఎంతసేపటికీ పడవ వచ్చే జాడకానరావడం లేదు. ఎలాగైనా ఈ బంగారు నాణేలను ఈరోజు అతనిదాకా చేర్చాలని గట్టి సంకల్పం చేసుకున్నాడు. ఇచ్చిన మాట తప్పుతున్నానని కుమిలిపోసాగాడు. సముద్రం ఒడ్డున పడి ఉన్న ఒక కర్రను అందుకున్నాడు. దాన్ని రెండుగా చీల్చి అందులో అప్పుగా తీసుకున్న వెయ్యి బంగారు నాణాలను నింపాడు. చీల్చిన కర్రను అతికించాడు. ‘‘ఓ అల్లాహ్ రుణాన్ని తీర్చే మార్గం కానరావడం లేదు. కాబట్టి ఈ నాణాలు నా రుణదాత వరకు చేర్చు ప్రభూ’’ అని వేడుకుంటూ నాణేల కర్రను సముద్రంలో వదిలాడు. అటువైపు ఆ రోజు తనవద్ద అప్పు తీసుకున్న వ్యక్తి కోసం వ్యాపారి సముద్రం ఒడ్డున ఎదురుచూడసాగాడు. ఎంతసేపటికీ ఎవ్వరూ వచ్చే జాడకానరాలేదు. అయితే అంతలోనే ఒక కర్ర సముద్రంలో కొట్టుకువచ్చింది. పొయ్యిలో కనీసం కట్టెగానైనా పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంటికి తీసుకువచ్చాడు. కర్రను పొయ్యిలో పెట్టేందుకు కర్రను చీల్చి చూసినప్పుడు; అందులోంచి వెయ్యి బంగారు నాణాలు నేలపై రాలిపడ్డాయి. అందులో ఉన్న ఉత్తరాన్ని చదివాక అతనికి అసలు విషయం అర్థమయ్యింది. తర్వాత కొంతకాలానికి మళ్లీ ఆ వ్యక్తి అప్పు తీర్చే ఉద్దేశంతో వ్యాపారి ఇంటికి వెళ్లాడు. ‘‘దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆరోజు నీకిచ్చిన మాటప్రకారం అప్పు తీర్చే ఉద్దేశంతో సముద్ర తీరానికి చేరుకున్నాను. కానీ పడవలు అందుబాటులో లేకపోవడంతో నీదాకా రాలేకపోయాను. ఇప్పుడు నీ అప్పును నయా పైసాతో సహా చెల్లిస్తున్నాను. అందుకో’’ అంటూ బంగారు నాణేల సంచిని అందించబోయాడు. ‘‘నువ్వు ఆరోజు సముద్రంలో నాకోసం కర్రలో పెట్టి పంపిన నాణాలు నాదాకా చేరాయి. మళ్లీ ఎందుకు’’ అంటూ తిరిగి ఇచ్చేశాడు. ‘‘ఆరోజు నీకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వేరే మార్గంలేక సముద్రంలో కర్రలో పెట్టి వదిలాను. అవి నీకు ఇంకా చేరలేదేమోనని’’ ఆ వ్యక్తి చెప్పాడు. అప్పు తిరిగి ఇచ్చే ఉద్దేశంతో తీసుకుంటే రుణం తీర్చడంలో అల్లాహ్ తోడ్పడతాడన్నది ఈ గాథలో నీతి. రుణదాతలైనా, రుణ గ్రహీతలైనా మంచి మనస్సు కలిగి ఉండాలన్నదే ఇందులోని సందేశం. – ముహమ్మద్ ముజాహిద్ -
మనసు బంగారం
సూర్య లేటెస్ట్ సినిమా ‘యన్జీకే’ షూటింగ్ పూర్తయింది. కొన్ని నెలలుగా తనతో పాటు సినిమా అద్భుతంగా రావడానికి కృషి చేసిన టీమ్ అందర్నీ అభినందించాలని భావించారు సూర్య. ఈ సినిమాకు పని చేసిన దాదాపు 120 మందికి గోల్డ్ కాయిన్స్ను బహుమతిగా అందించారు. దాంతో ‘మీ మనసు బంగారం’ అని సూర్యకు కితాబులు ఇస్తోంది కోలీవుడ్. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య, సాయి పల్లవి జంటగా యస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం ‘యన్జీకే’ (నంద గోపాల కుమార్). పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. -
తవ్వకాల్లో భారీగా బంగారు నాణేలు
ఉత్తర ఇటలీలోని ఓ పాత థియేటర్ తవ్వకాల్లో బంగారు నాణేల నిధిని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతత్వ శాస్త్రవేత్తల అధ్యయనంలో నేలమాళిగలో భద్రపర్చిన వందల కొద్దీ నాణేలను వారు కొనుగొన్నారు. మిలియన్ డాలర్ల విలువైన రోమన్ బంగారు నాణేలు కనిపించడం విశేషం. ఇటలీలోని ఓ ప్రాంతంలో పునాది పనులు చేస్తుండగా వందల సంఖ్యలో రోమన్ బంగారు నాణేలు లభించినట్లు ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. స్విట్జర్లాండ్ సరిహద్దులో ఉత్తర ఇటలీలోని కోమోలోని కాస్సోనీ థియేటర్ బేస్మెంట్ తవ్వకాల్లో 4, 5 వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్య కాలంనాటి 300 నాణేలను తవ్వి తీసామని అధ్యయన వేత్తలు తెలిపారు. క్వింగ్ రాజవంశానికి చెందిన రాతి కూజాలో బంగారు పట్టీతోపాటు, 19 మిలియన్డార్ల విలువైన నాణేలుణ్నాయని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యత వివరాలు సంపూర్ణంగా తెలియనప్పటికీ, పురాతత్వ శాస్త్రానికి నిజమైన నిధిని గుర్తించామని సంస్కృతి మంత్రి అల్బెర్టో బోన్సిసోలీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మంత్రిత్వ శాఖ ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. మిలన్లోని మిబాక్ రిస్టోరేషన్ ప్రయోగశాలకు బదిలీచేసామని వీటి చారిత్రక ప్రాముఖ్యత తెలుసుకోవాల్సి వుందన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు, పునరుద్ధరణకర్తలు వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. వీటిని విలువను అధికారులు స్పష్టం చేయనప్పటికీ, మిలియ న్డాలర్ల విలువ వుంటుందని అంచనా. ఏదో ప్రమాద సమయంలో వీటిని దాచిపెట్టి వుంటారని నాణేల నిపుణులు మారియా గ్రాజియా ఫెచీనిటి తెలిపారు. ఈ నాణేలపై 474 ఏడీ నాటి చక్రవర్తులు హోనోరియాస్, వాలెంటినియమ్ III, లియోన్ I, ఆంటోనియో, లిబియో సెవెరోల గురించి రాసివున్నట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులలో అమర్చేవిధంగానే వీటిని పొందుపర్చినట్టు చెప్పారు. అలాగే ఇది వ్యక్తిగత సంపద కాకపోవచ్చు అని, పబ్లిక్ బ్యాంకువి లేదా డిపాజిట్లు కావచ్చు అని అభిప్రాయపడ్డారు. -
బహుమతుల వర్షం
‘పందెం కోడి 2’ టీమ్పై బహుమతుల వర్షం కురుస్తోందట. రీసెంట్గా హీరోయిన్ కీర్తీ సురేశ్ ఈ సినిమా టీమ్కి గోల్డ్ కాయిన్స్ పంచిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో విశాల్, దర్శకుడు లింగుస్వామి కూడా టీమ్ మెంబర్స్కు గోల్డ్ కాయిన్స్ పంచిపెట్టారట. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సండైకోళి 2’ (పందెం కోడి 2). సూపర్ హిట్ చిత్రం ‘సండైకోళి’కి సీక్వెల్ ఇది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వర్క్ చేసిన టీమ్ అందరికీ (సుమారు 150) ఈ సినిమా గుర్తుగా విశాల్, లింగుస్వామి విడి విడిగా గోల్డ్ కాయిన్స్ అందజేశారట. అంతకుముందు కీర్తీ సురేశ్ ఇచ్చారు. దీంతో బహుమతుల వర్షం కురుస్తోందని చిత్రబృందం ఆనందంగా చెప్పుకుంటున్నారు. -
యూనిట్ అందరికీ బంగారు నాణేలను కానుకగా..
తమిళసినిమా: సహ నటీనటులకు, సాంకేతిక వర్గానికి షూటింగ్ పూర్తి కాగానే బంగారు డాలర్లను కానుకగా అందించే సంప్రదాయానికి ఆనాటి మహానటి సావిత్రి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఎవరూ అలాంటి సంప్రదాయాన్ని పెద్దగా పాటించలేదు. అలాంటిది ఆ మహానటి పాత్రలో జీవించిన యువ నటి కీర్తీసురేశ్ ఆమె గుణగణాలను పుణికిపుచ్చుకున్నారా?అన్నంతగా మహానటి చిత్ర షూటింగ్ పూర్తి కాగానే యూనిట్ అందరికీ బంగారు నాణేలను కానుకగా అందించారు. అదే సంప్రదాయాన్ని తన తాజా చిత్రం సండైకోళి–2 చిత్ర షూటింగ్ ముగింపు రోజునా కీర్తీసురేశ్ కొనసాగించారు. ఆ ఆనందం నుంచి బయట పడకుండానే తాజాగా అదే చిత్ర కథానాయకుడు, నిర్మాత విశాల్, దర్శకుడు లింగుస్వామి యూనిట్ సభ్యులు 150 మందికి విడివిడిగా బంగారు నాణేలను కానుకగా అందించి సంతోషంలో ముంచెత్తారు. ఈ దర్శక నిర్మాతలకు నటి కీర్తీశురేశ్ స్ఫూర్తి అనిపించారేమో. విశాల్ హీరోగా నటిస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సండైకోళి–2. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా విశాల్, దర్శకుడు లింగుస్వామి చిత్ర యూనిట్ సభ్యులకు బంగారు నాణేలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కేరళా రాష్ట్ర వరద బాధితుల సహాయార్థం ఆ రాష్ట్ర ముఖ్యమంతి సహాయనిధికి రూ.2లక్షల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న సండైకోళి–2 చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర సింగిల్ ట్రాక్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రం తమిళం, తెలుగు భాషల్లో అక్టోబరు 18న విడుదలకు ముస్తాబవుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
తంగమాన పొన్ను
...అని పొగుడుతున్నారట కీర్తీ సురేశ్ను ‘సండై కోళి 2’ (పందెం కోడి 2) టీమ్. ఇంతకీ ఆ పొగడ్తకు అర్థం ఏంటో అనుకుంటున్నారా? మరేం లేదు.. బంగారంలాంటి అమ్మాయి అని అర్థం. బంగారు వర్ణమంత అందంగా ఉంటారని ఇలా పొగడ్తల వర్షం కురిపించారని అనుకుంటే పొరబాటే. ఈ పొగడ్తలకు కారణం కీర్తి మేని ఛాయ కాదు మనసు. కీర్తీ సురేశ్కు ఏదైనా సినిమా చేసిన తర్వాత ఆ సినిమాకు పని చేసిన చిత్రబృందానికి ఏదో ఓ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడం అలవాటులా ఉంది. ‘మహానటి’ సినిమాకు పని చేసిన అందరికీ బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ‘సండై కోళి 2’ టీమ్కి అలానే చేశారు. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సండై కోళి 2’. 2005లో సూపర్ హిట్ అయిన ‘సండై కోళి’ చిత్రానికి సీక్వెల్. వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రంలో తన భాగం షూటింగ్ పూర్తి అవ్వగానే తనతో పాటు పని చేసిన టీమ్ అందరికీ గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చారట కీర్తీ. దీంతో టీమ్ అంతా ఫుల్ ఖుష్ అయిందట. నెలల తరబడి తనతో పాటు పని చేసిన టీమ్కి ఇచ్చిన రెస్పెక్ట్ చూస్తుంటే కీర్తీ సురేశ్ నిజంగానే బంగారం అనకుండా ఉండక మానలేరు కదా? -
రోడ్డు కోసం తవ్వుతుండగా లంకెబిందె దొరికింది!!
రాయ్పూర్ : రోడ్డు నిర్మాణ పనుల్లో లంకెబిందె బయటపడింది. ఈ ఘటన చత్తీస్ఘడ్లోని కొండగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళా కూలీ తవ్వకాలు జరుపుతుండగా బంగారు నాణెలతో కూడిన లంకెబిందె దొరికింది. అందులో 57 బంగారు నాణెలు, ఒక వెండి నాణెం, ఓ బంగారు చెవిపోగు లభ్యమైనట్లు జిల్లా కలెక్టర్ నీలకంఠ్ తెలిపారు. కోర్కోటి, బెడ్మా గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం జరుగుతుండగా లంకెబిందె దొరికిందని చెప్పారు. నాణెలు అన్నీ 12-13 శతాబ్దాలకు చెందినవిగా వెల్లడించారు. నాణెలపై ఉన్న లిపిని బట్టి యాదవుల కాలానికి చెందినవిగా తెలుస్తోందని వివరించారు. మహారాష్ట్రలోని విదర్భ కేంద్రంగా యాదవులు పాలించారు. ఛత్తీస్ఘడ్లోని బస్తర్ను కూడా ఆక్రమించారు. రాష్ట్ర పురావస్తు పరిశోధకులు నాణెలను మరింత పరిశోధిస్తారని వివరించారు. -
ఆ ఇంటి గోడల్లో ఎంత బంగారమో..!
క్విమర్ : పాడుబడిందని కూలిస్తే లక్షల సంపద ఇచ్చింది ఆ ఇళ్లు. అదేలా అనుకుంటున్నారా.. ఇళ్లు కూలిస్తే గోడల్లో బంగారు నాణేలు బయపడ్డాయి. అవి కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 600 నాణేలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్లోని బ్రిటానీలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫిరంగీలను దాచడానికి లీజుకు తీసుకున్న ఇళ్లు మున్సిపాలిటీ అధికారులు కూల్చారు. కూల్చే క్రమంలో గోడల్లో కొన్ని బంగారు నాణేలను అధికారులు గుర్తించారు. దీంతో ఆ గోడను పూర్తిగా కూల్చగా దాదాపు 600 బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని పురావస్తు శాఖ అధికారులకు అందించారు. అవి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన నాణేలుగా గుర్తించారు. ఆ నాణేలపై బెల్జియన్ రాజు లియోపోల్డ్-2 బొమ్మ ముంద్రించి ఉంది. దీంతో ఆ నాణేలు 1865-1909వ సంవతర్సం నాటివిగా గుర్తించారు. వెలికితీసిన 600 నాణేల విలువ దాదాపు లక్ష యూరోలతో సమానమని అధికారులు తెలిపారు. కాగా ఫ్రెంచ్ చట్టం ప్రకారం నిధి మొత్తాన్ని కనుగొన్నవారికి సగం,ఇంటి యాజమాన్యులకు సగం ఇవ్వాలని ఉంది. దీంతో యాజమానికి 50శాతం రానుంది. కాగా ఇంటియాజమాని మాట్లాడుతూ.. బంగారు నాణేలను చూసి తానేమి ఆశ్చర్యానికి లోనుకాలేదన్నారు. తమ తాతగారు నాణేలు సేకరించేవారని పేర్కొన్నారు. -
బంగారు బిస్కెట్ల దోపిడీ ముఠా అరెస్టు
సాక్షి, ఒంగోలు క్రైం: రైలులో ప్రయాణిస్తున్న సేలంకు చెందిన బంగారు వ్యాపారిని బెదిరించి బంగారు బిస్కెట్లను దోచుకున్న ముఠాను అరెస్టు చేసినట్లు రైల్వే జీఆర్పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు రైల్వే స్టేషన్లోని జీఆర్పీ పోలీస్స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన షేక్ ఇమ్రాన్ ఫిబ్రవరి 18న చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయపూర్ నుంచి బంగారం కొనుగోలు చేసి సేలంకు కోర్బా ఎక్స్ప్రెస్ రైలులో వెళుతున్నాడు. ఇతని వద్ద గతంలో కారు డ్రైవర్గా పనిచేసిన విజయ్కుమార్ విషయాన్ని సేలంకు చెందిన తన స్నేహితులు ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్ం సోక్రటీస్లకు చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి బంగారాన్ని దోచుకునేందుకు పథకం రచించారు. అందులో భాగంగా కోర్బా ఎక్స్ప్రెస్లో రైలులో ఇమ్రాన్ను విజయవాడ నుంచి అనుసరించారు. రైలు ఒంగోలు రైల్వేస్టేషన్కు రాగానే ఈ ముగ్గురు ఇమ్రాన్ ఉన్న రిజర్వేషన్ బోగీలోకి వెళ్లారు. తాము తమిళనాడు పోలీసులమని చెప్పి, దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నావని సమాచారం వచ్చిందని అందుకే అరెస్టు చేస్తున్నామని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 913 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒంగోలు రైల్వే స్టేషన్రాగానే స్టేషన్లో దించి బయటకు తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధం చేసుకోని ఉన్న కారులో ఎక్కించుకొని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపానికి తీసుకెళ్లి చీకట్లో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వెంటనే షేక్ ఇమ్రాన్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఒంగోలు జీఆర్పీ సీఐ టి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సంబంధంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్, సోక్రటీస్, కారు డ్రైవర్ విజయకుమార్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన 913 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నిందితులు ఉపయోగించిన కారు టీఎన్ 30డీఎన్ 6669ను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దర్యాప్తులోజిల్లా ఎస్సీ పూర్తి సహకారం కేసు దర్యాప్తులో ప్రకాశం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు పూర్తిగా సహకరించారని జీఆర్పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. నిందితులు స్టేషన్లో దిగిన సమయం నుంచి సీసీ పుటేజ్ల ఆధారంగా, నగరంలోని సీసీ కెమేరాల పుటేజ్ల ఆధారంగానూ కేసు దర్యాప్తు కొనసాగింది. ఎస్పీ తన ఐటీ కోర్ సిబ్బందిచేత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాల్డేటాలను సేకరించి నిందితులను పట్టుకోవటంలో పూర్తిగా సహకరించారని అభినందించారు. అదే విధంగా ఒంగోలు జీఆర్పీ పోలీస్స్టేషన్ సిబ్బందిని గుంతకల్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జీఆర్పీ నెల్లూరు డీఎస్పీ జి.ఆంజనేయులు, ఒంగోలు జీఆర్పీ సీఐ టి.శ్రీనివాసరావు, చీరాల ఎస్సై జి.రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఎంజె.కిషోర్ బాబు, కానిస్టేబుళ్లు బి.శ్రీనివాసరావు, ఈపీఎస్ రెడ్డి, ఎస్కే బాషాతో పాటు పలువురు ఉన్నారు. -
30 రోజుల్లో కోటి రూపాయలంటూ...
సాక్షి, హైదరాబాద్ : 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించుకోండి.. అదెలా అంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ.. మల్టిలెవల్ మార్కెటింగ్కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడంటూ వీరు ఈ మల్టిలెవల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తుల నుంచి 6 లక్షల రూపాయల విలువైన గోల్డ్ కాయిన్లను, రూ.1.73 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా మల్టిలెవల్ మార్కెటింగ్ మోసాలు పెరుగుతూ వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే కోట్లు రూపాయలు ఎలా సంపాదించాలో తాము చెబుతామంటూ.. ఈ ముఠాలు అమాయకుల వద్ద నుంచి డబ్బులు గుంజడం, గోల్డ్ కాయిన్లను సేకరించడం వంటివి చేస్తూ ఉన్నారు. కొన్ని మల్టిలెవల్ మార్కెటింగ్ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదంతాలు ఉన్నాయి. -
వారికి బంగారు నాణేలిచ్చిన కీర్తి సురేష్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈసందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ యూనిట్ సభ్యులందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. సావిత్రికి తన సినిమాకు పని చేసిన వారికి బహుమతులు ఇవ్వటం అలవాటు. ఆ అలవాటు సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కొనసాగించింది. మహానటి సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులకు బంగారు నాణేలను గిఫ్ట్ గా ఇచ్చింది. కీర్తి ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్తో యూనిట్ సభ్యులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. ఇటీవల మెర్సల్ సినిమా సమయంలో హీరో విజయ్ కూడా తన యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మహానటి సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
బంగారు నాణేలు కానుకగా ఇచ్చిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్సల్. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తన సినిమాకోసం పనిచేసిన యూనిట్ సభ్యులకు ఏదో ఒక కానుక ఇవ్వటం హీరో విజయ్ కి అలవాటు. అయితే ఈ సారి విజయ్ ఇచ్చిన కానుక కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. తన మెర్సల్ మూవీకి పనిచేసిన దాదాపు 200 మంది సాంకేతిక నిపుణులు, సహాయ సాంకేతిక నిపుణులకు ఇళయదళపతి విజయ్ బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. -
సీనియర్లకు నటుడు 'బంగారు' కానుక
చెన్నై: వంద మంది సీనియర్ సినీ కళాకారులకు నటుడు విజయ్ సేతుపతి తలా ఒక కాసు బంగారం కానుకగా అందించనున్నారు. భారతీయ సినిమా శతాబ్ధి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా 100 మంది సీనియర్ సినీ కళాకారులకు కాసు బంగారంతో కూడిన పతకాలను బహుకరించాలని ఉలగాయుదా ఫౌండేషన్ నిర్ణయించింది. కాగా ఆ బంగారు పతకాలను తానే అందిస్తానని నటుడు విజయ్సేతుపతి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ సినిమా తనకు చాలా చేసిందని, అందుకు ప్రతిఫలంగా ఏదైనా చేయడం తన కనీస బాధ్యతగా పేర్కొన్నారు. అందుకే శతాబ్ధి సినిమా సందర్భంగా కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1న సినిమాకు సంబంధించిన 23 శాఖలలోని సీనియర్ కళాకారులు 100 మందికి పతకాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఫెఫ్సీకి ఒక లేఖను అందించనున్నానని, అందులో శాఖలకు చెందిన ముగ్గురిని ఎంపిక చేసి వారి ద్వారా 100 మంది సీనియర్ కళాకారుల ను గుర్తించి వారికి బంగారు పతకాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ యుగంతో ఫిలిం మూలపడిందని, దీంతో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అయితే హాలీవుడ్ తరువాత అధికంగా ఫిలిం ఉపయోగించింది మన భారతీయ సినిమానేనన్నారు. ఆ విధంగా లక్షలాది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటారన్నారు. వారిలో కొంతమందినైనా అన్వేషించి బంగారు పతకాల పంపిణీ వేడుకకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి వారికి ఈ కానుకలు అందించనున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు. కాగా ఉలగాయుదా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన డైరెక్టర్ ఎస్పీ. జననాథన్ గతంలో భారతీయ సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో బైసెల్ సంస్థతో కలిసి జీవీ.ఫిలింస్ సహకారంతో 75 మంది సీనియర్ సినీ కళాకారులకు కాసు బంగారంతో కూడిన పతకాలను కానుకగా అందజేశారు. ఈసారి భారతీయ సినిమా శతాబ్ధి వేడుక సందర్భంగా విజయ్ సేతుపతి తనవంతు సాయం అందిస్తున్నాడు. -
డాక్టర్లకు గోల్డ్ కాయిన్లు ఇచ్చి..!
తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోడానికి ఫార్మా కంపెనీలు వైద్యులకు బహుమతులు, లంచాలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇటీవల బెంగళూరులో పిల్లల వైద్యుల వార్షిక సదస్సు ఒకటి జరిగింది. దానికి ఒక కంపెనీ సంక్రాంతి కానుక అని చెప్పి.. డిజిటల్ వేయింగ్ స్కేల్స్, బంగారు కాయిన్లు, స్టెతస్కోప్ తదితరాలను బహుమతులుగా ఇచ్చింది. వాటితో పాటే.. తమ సంస్థ ఉత్పత్తి చేసే థైరాయిడ్ మందులు, రోటా వైరస్లకు భారీ ఆర్డర్లు సంపాదించుకుంది. కానీ, వాక్సిన్ల కోసం డాక్టర్లకు లంచాలిచ్చారడాన్ని సదస్సు నిర్వాహకులు ఖండించారు. అలాంటిది ఏమీ లేదని, వాక్సిన్ల కోసం బహుమతులు ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఎవరైనా వాక్సిన్లు భారీమొత్తంలో కొంటే వాళ్లకు మొత్తం ధరలో కొంత కన్సెషన్లు లభిస్తాయని డాక్టర్ కరుణాకర చెప్పారు. తాను 18 ఏళ్లుగా పిల్లల వైద్యుడిగా ఉన్నానని, ఇప్పటివరకు డాక్టర్లకు ఎలాంటి ఇన్సెంటివ్లు ఎవరూ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఫార్మా కంపెనీలు వైద్యులకు ఉచిత బహుమతులు ఇవ్వడాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిషేధించింది. కానీ, సంక్రాంతి కానుకలు ఇవ్వకూడదన్న నిబంధన లేకపోవడంతో దాన్ని సదరు సంస్థ క్యాష్ చేసుకుంది. ఒక గోల్డ్ కాయిన్ తీసుకున్నందుకు ఒక్కో డాక్టర్ 150 చొప్పున థైరాయిడ్, రోటావైరస్ వ్యాక్సిన్లు ఆర్డర్ చేయాల్సి వచ్చింది. 2016లో నిర్వహించిన సదస్సులో కూడా ఇలాగే జరిగింది కానీ, అప్పట్లో ఆ సంస్థ హైదరాబాద్కు చెందిన ఒక ఫార్మా కంపెనీ బ్యానర్ పెట్టుకుంది. ఇవే తరహా వ్యాక్సిన్లు 50 చొప్పున ఆర్డర్ చేసినందుకు ఒక్కో డాక్టర్కు ముత్యాల సెట్లు ఇచ్చారు. వాటితో పాటు 200 వ్యాక్సిన్లు ఆర్డర్ చేసినవారికి ఐఫోన్ 5ఎస్లు కూడా ఇచ్చారు. -
శునక వధతో 'గోల్డెన్' ఛాన్స్!
తిరువనంతపురం: 'వీధి కుక్కలను చంపండి బంగారు నాణేలు పట్టుకెళ్లండి' అంటూ కేరళలో పూర్వ విద్యార్థి సంఘం చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్ 10లోపు ఎక్కువ కుక్కలను చంపిన వారికి గోల్డ్ కాయిన్స్ ఇస్తామని పాలా ప్రాంతానికి చెందిన సెయింట్ థామస్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రకటించింది. కేరళలో వీధి కుక్కలు పెద్ద సమస్యగా మారాయి. గత నాలుగు నెలల్లో వీధి కుక్కల దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 700 మంది వరకు గాయాలపాలయ్యారు. అక్టోబర్ 26న 90 ఏళ్ల వృద్ధుడిని కుక్కలు పీక్కుతినడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో వీధి కుక్కలను వధించే వారిని ప్రోత్సహించేందుకు విద్యార్థుల సంఘం.. బంగారు నాణేలు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. ఎక్కువ కుక్కలను చంపించిన పంచాయతీ ప్రెసిడెంట్, మున్సిపల్ చైర్మన్లకు గోల్డ్ కాయిన్స్ అందజేస్తామని విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి జేమ్స్ పాంబేక్కాల్ తెలిపారు. శునకాల దాడుల నుంచి ప్రజలను కాపాడడమే తమ లక్ష్యమని చెప్పారు. స్వైరవిహారం చేస్తున్న శునకాలను అడ్డుకునేందుకు అవసరమైన ఎయిర్ గన్స్ ను తక్కువ ధరకు ఇస్తామని ఇంతకుముందు ప్రకటించి ఈ సంఘం వార్తల్లో నిలిచింది. కుక్కలను చంపిన వారికి నగదు నజరానా ఇచ్చేందుకు పారిశ్రామికవేత్త ఒకరు ముందుకు వచ్చారు. -
కుక్కలను చంపితే బంగారు నాణేలు!
-
బంగారు నాణేలు.. తవ్వుకునేందుకు జనాల పోటీ!
నది ఒడ్డున ఉన్న ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ కొందరికి బంగారు నాణేలు దొరికియట. ప్రాచీనకాలంలో పాతిపెట్టిన గుప్తనిధికి సంబంధించిన ఆ బంగారు నాణెముల్లో రాజు లేదా దేవుడి ప్రతిమ, మహిళ, నెమలీ ప్రతిమలు ఉన్నాయని, అవి మాకు దొరికాయంటూ కొందరు వాట్సప్లో ఆ ఫొటోలు కూడా పెట్టారు. ఇంకేముంది ఆ నోటా ఈ నోటా ఈ వార్త దావాహనంలా పాకింది. తెల్లారిలేచేసరికి స్థానిక గ్రామస్తులు అంతా ఆ నది ఒడ్డుకు వెళ్లి ఉత్త చేతులతో తవ్వడం మొదులుపెట్టారు. దీంతో ఆ నది ప్రాంతమంతా జాతరలా మారిపోయింది. ఎటుచూసినా ప్రజలు రోజుల తరబడి గుంతలు తవ్వుతూనే ఉన్నారు. బంగారు నాణెలు తమకు దొరకకపోతాయా అన్న ఆశతో గ్రామస్తులు తవ్వుతూనే ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్లోని టాంక్ అనే మారుమూల గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సమీపంలో ఉన్న నది ఒడ్డున బంగారు నాణేలు దొరుకుతున్నాయన్న వదంతులు వచ్చాయి. ఈ బంగారు నాణెలకు సంబంధించిన ఫొటోలు సైతం వాట్సాప్లో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. గ్రామస్తులందరినీ వాకబు చేసినా.. ఎవరూ తమకు బంగారు నాణెం దొరికిందని చెప్పలేదు. ఎవరో దుండగులు కావాలని వదంతులు రేపినట్టు గుర్తించిన పోలీసులు.. వాట్సాప్లో ఫొటోలు పెట్టిన నలుగురు వ్యక్తుల్ని అరెస్టుచేశారు. అయినా.. ఆ నది ఒడ్డున గత మూడు రోజులుగా గ్రామస్తులు తవ్వడం మాత్రం ఆపలేదు. -
ప్రభుత్వ బంగారు కాయిన్ల పట్ల ఆకర్షణ
ముంబై: భారతీయులు బంగారు ఆభరణాల ప్రియులు అన్నది అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బంగారం కాయిన్లు కూడా వారి మనసును గెలుచుకుంటున్నాయి. స్వచ్ఛతకు హామీ, నాణ్యతా ప్రమాణాలు, హాల్ మార్కింగ్, పైగా ప్రభుత్వం అందిస్తున్నవి కావడం సాధారణ బంగారు కాయిన్ల కంటే ‘ఇండియన్ గోల్డ్ కాయిన్’ పట్ల వినియోగదారుల్లో కొనుగోలు ఆసక్తికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో తెలిసింది. దీపావళి సమయంలో, పుట్టిన రోజులు, పెళ్లి సందర్భాల్లో బహుమతులుగా ఇచ్చేందుకు ఎక్కువ మంది ఈ కాయిన్లను కొనుగోలు చేస్తున్నారని ఈ సర్వే పేర్కొంది. గతేడాది నవంబర్ 5న కేంద్రం ఇండియన్ గోల్డ్ కాయిన్లను విడుదల చేసింది. వీటిపై ఒకవైపు అశోకచక్ర, మరోవైపు మహాత్మాగాంధీ చిత్రాలు ఉంటాయి. వీటిలో 2, 5, 10 గ్రాములకు మంచి ఆదరణ ఉంది. వీటిని ప్రభుత్వ రంగ ఎంఎంటీసీతోపాటు విజయా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యస్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు విక్రయిస్తున్నాయి. -
పుష్కరాలకు బంగారు నాణేల విడుదల
విజయవాడ(లబ్బీపేట) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని తనిష్క్ షోరూం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ రోడ్డులోని తనిష్క్లో ఆ షోరూమ్ అధినేత్రి జోగులాంబ ఈ నాణేలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నాణెంలో ఒక వైపు కృష్ణాపుష్కరాల చిహ్నం.. మరోవైపు కృష్ణవేణి చిత్రాలను ముద్రించారు. వీటిని 22 క్యారెట్ల బంగారంతో 2 గ్రాములు, 4 గ్రాముల బరువుతో విడుదల చేశారు. పుష్కరాలను పురస్కరించుకుని శనివారం బంగారు ఆభరణాల కొనుగోలు చేసిన వారికి మజూరీపై 10 శాతం రాయితీ ఇసాత్మని జోగులాంబ తెలిపారు. శ్రావణమాసం రాకను పురస్కరించుకుని శుక్రవారం షోరూమ్లో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. -
జోస్ ఆలుక్కాస్ ఆఫర్లు..
ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ తాజాగా వినియోగదారులకు వజ్రాభరణాల కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. రూ.50,000 ధర కలిగిన వజ్రాభరణాల కొనుగోలుపై ఒక బంగారు నాణేమును, రూ.1,00,000 విలువైన వజ్రాభరణాల కొనుగోలుపై ఒక డైమండ్ పెండెంట్ను ఉచితంగా ఇస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రూ.5,000 నుంచి ప్రారంభమయ్యే వజ్రాభరణాల శ్రేణి.. అంతర్జాతీయ ల్యాబ్ సర్టిఫికేషన్, తిరిగి కొనుగోలు హామీతో లభిస్తాయని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. -
ఆ నాణేలు విజయనగరాధీశులవే..!
‘ఉప్పరపల్లి’ బంగారు నాణేలపై పురావస్తుశాఖ అధికారుల నిర్ధారణ అనంతపురం కల్చరల్: అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. 16వ శతాబ్దానికి చెందిన అరవీడు వంశస్తులు ఈ తరహా నాణేలు వాడారని తెలిపారు. ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీటి వంశస్తుడైన మూడో శ్రీరంగరాయల కాలంలో ఈ తరహా నాణేలు అధికంగా వాడకంలో ఉన్నాయని చారిత్రక ఆధారాలతో చెప్తున్నారు. -
ఆ నాణేలు విజయనగర రాజుల కాలం నాటివి..
- 'ఉప్పరపల్లి' బంగారు నాణేలపై పురావస్తుశాఖ అధికారుల నిర్ధారణ - 16వ శతాబ్దంలో అరవీడు వంశస్తులు వీటిని వాడారని వెల్లడి అనంతపురం : అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. 16వ శతాబ్ధానికి చెందిన అరవీడు వంశస్తులు ఈ తరహా నాణేలు వాడారని తెలిపారు. ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీడు వంశస్తుడైన మూడో శ్రీరంగరాయల కాలంలో ఈ తరహా నాణేలు అధికంగా వాడకంలో ఉన్నాయని చరిత్రాత్మక ఆధారాలతో చెప్తున్నారు. 'సుమారు 52.9 గ్రెయిన్స్ (గ్రాముకన్నా తక్కువ) బరువుగల ఈ నాణేలకు ఒక వైపు వేంకటేశ్వరుడు నిలబడిన విధంగా, మరోవైపు దిగువ భాగాన 'శ్రీవేంకటేశ్వరాయ నమః' అని దేవనాగరి లిపిలో అక్షరాలు కన్పిస్తున్నాయి. ఈ నాణేలు ఇలా బయటపడటం వెనుక అనేక సందేహాలున్నాయి' అని అనంతపురంలోని పురావస్తు మ్యూజియం టెక్నికల్ అసిస్టెంట్ రామసుబ్బారెడ్డి అన్నారు. సాధారణంగా ఇటువంటి నాణేలు బయట పడాలంటే ఆ పరిసర ప్రాంతాలలో చారిత్రక ఆలయాలుగానీ, పురాతన బావులుగానీ, కోటలాంటి ప్రదేశాలుగానీ ఉండాలి. నాణేలు విసిరేసినట్టుగా కాకుండా కుండలలోనో, రాగి పాత్రలలోనో తప్పనిసరిగా ఉంటాయి. ఉప్పరపల్లిలో అలాంటి చిహ్నాలేవీ కనపడకపోవడం మరింత పరిశోధనకు దారి తీస్తోందని వివరించారు. తమ దృష్టికి వచ్చిన నాణెం 'కాయిన్స్ ఆఫ్ విజయనగర' పుస్తకంలోని వివరాలతో సరిపోలినందున ఇది కచ్చితంగా ఆ కాలానికి చెందినదేనని నిర్ధారించారు. దాదాపు 20 నాణేలు దొరికినట్టు గ్రామస్తులు చెబుతున్నా వాటిని వెంటనే కరిగించేయడం లేదా కెమికల్ క్లీనింగ్ చేయించడం వల్ల చారిత్రక విషయాల పరిశోధన కొంత కష్టంగా మారే అవకాశముందన్నారు. -
మీ పొలం బంగారం గాను..
♦ అనంతపురం జిల్లా ఉప్పరపల్లి వద్ద బంగారు నాణేలు లభ్యం ♦ ఎండలోనూ నాణేల వేటలో జనం ♦ కొనుగోలుకు బంగారు వ్యాపారుల క్యూ అనంతపురం రూరల్: ఆ గ్రామం వద్ద వెతుకున్న వారికి వెతుకున్నన్ని బంగారు నాణేలు లభిస్తున్నాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా?! అవును ఇది నిజమే. గ్రామస్తులు రోజూ పిల్లాపాపలతో పొలంలోకి వెళ్లి బంగారు నాణేలను అన్వేషిస్తున్నారు. సాయంత్రానికి బంగారు వ్యాపారులు కూడా కొనుగోలు కోసం ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. ఆ గ్రామమే అనంతపురం నగర శివారులోని ఉప్పరపల్లి. గ్రామానికి చెందిన కురుబ బిల్లే రాముడు పొలంలో నెల కిందట ఓ వ్యక్తికి బంగారు నాణేలు దొరికాయి. ఈ విషయం తెలిసి మిగిలిన వారూ అన్వేషణ మొదలుపెట్టారు. గుంపులు గుంపులుగా వెళ్లి.. ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా నాణేల వేటలో నిమగ్నమవుతున్నారు. ఒక అడుగు లోతు తవ్వితే చాలు 2 నుంచి 3 గ్రాముల బరువు ఉన్న బంగారు నాణేలు బయట పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అనంతపురం పాతవూరుకు చెందిన బంగారం వ్యాపారులు కూడా వాటిని కొనుగోలు చేయడానికి గ్రామం బాట పడుతున్నారు. రోజూ 60 నుంచి 70 నాణేలను గ్రామస్తులు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో నాణేన్ని వ్యాపారులు రూ.3,500కు కొంటున్నారు. నాణేలపై ఒకవైపు దేవతా ప్రతిమలు, మరోవైపు శాసన లిపి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో రాజులు బస చేసేవారని, అందుకే బంగారు నాణేలు లభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. నాణేలు దొరుకుతున్నది వాస్తవమే ఉప్పరపల్లిలో బంగారు నాణేలు దొరుకుతున్న మాట వాస్తవమే. అవి కూడా చిన్న పిల్లలకు దొరికినట్లు మా విచారణలో వెల్లడైంది. వాటిని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ -
బంగారు నాణేలంటూ... భలే మోసం!
అంతర్ రాష్ట్ర ముఠాలోని ముగ్గురి అరెస్ట్ నకిలీ నాణేలు, నగదు, బైక్ స్వాధీనం బాగేపల్లి : నకిలీ బంగారు నాణేలతో వంచనకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులు బాగేపల్లి పోలీసులకు పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కదిరి పట్టణానికి చెందిన కేశవ, కర్ణాటకలోని చింతామణి తాలూకాలోని బురుడుగుంటె గ్రామానికి చెందిన సుధాకర్, శిడ్లఘట్ట తాలూకాలోని బుశెట్టి హళ్లి గ్రామానికి చెందిన సంతోష్ను శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు..వారి నుంచి నకిలీ నాణేలు, బైక్, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు..కర్నూల్ పట్టణానికి చెందిన గోవింద 2015 సెప్టెంబర్ 10న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. ఆ సమయంలో ఓ జంట వారికి పరిచమైంది. తనపేరు ప్రసాద్ అని, భార్యతో కలిసి తిరుమలకు రాగా పర్సు పొయిందని, రూ.500 సహాయం చేయాలని కోరారు. ఈ మేరకు వారితో డబ్బు తీసుకొని 9052721854 సెల్ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లారు. అదే నెల 13న ప్రసాద్.. గోవిందుకు ఫోన్ చేశాడు. తమ అత్త ఇంటిని పునర్ నిర్మిస్తుండగా 4.5 కిలోల బంగారు నాణేలు లభించాయని, రూ. 15 లక్షలు ఇస్తే వాటిని ముట్టచెబుతామని ఆశ పెట్టారు.మరుసటి రోజు గోవిందకు ఫోన్ చేసి కదిరికి పిలిపించారు. అసలైన బంగారు నాణేం గోవిందుకు ఇచ్చి రూ.14 వేలు ఇప్పించుకున్నారు. ఈ నాణేన్ని పరిశీలించుకోవాలని, మీకు అంగీకారమైతే మొత్తం బంగారం ఇస్తామని తెలిపారు. 16, 17 తేదీల్లో ప్రసాద్, రామచంద్రారెడ్డి గోవిందకు ఫోన్ చేశారు. నాణేలు సిద్ధంగా ఉన్నాయని, డబ్బు తీసుకొని వస్తే అప్పగిస్తామన్నారు. 20వ తేదీన గోవింద వారికి ఫోన్ చేసి తన వద్ద 11.50 లక్షలు మాత్రం ఉన్నాయని చెప్పడంతో ఆ మొత్తాన్ని ధర్మవరానికి తీసుకురావాలని సూచించారు. దీంతో గోవింద ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను ముత్తూట్ పైనాన్స్లో తాకట్టు పెట్టి రూ.11.50 లక్షలు తీసుకున్నాడు. అందులోనుంచి రూ. 7 లక్షలు తీసుకొని ధర్మవరం వెళ్లాడు. అక్కడ ఉన్న దుండగులు ఆ మొత్తాన్ని తీసుకున్నారు. మిగతా డబ్బు బాగేపల్లి సమీపంలోని గోళూరు వద్ద ఉన్న వ్యక్తులకు ఇస్తే బంగారు నాణేలు ఇస్తారని చెప్పి పంపారు. గోవింద అదేరోజు మరో రూ.4.50 లక్షలు తీసుకొని గోళూరు వద్దకు వెళ్లాడు. అతను నగదు ఇస్తుండగా పథకం ప్రకారంపోలీసు వేషాల్లో ఉన్న దుండగులు ఆ డబ్బు, నకిలీ నాణేలతో ఉడాయించారు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న గోవింద బాగేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గాలింపు చేపట్టి కేశవ, సుధాకర్, సంతోష్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు మృతి చెందినట్లు తేలింది. ఈ ముఠాలో మంజు, నరసింహ, బాషాలు ఉన్నట్లు నిందితులు వెల్లడించారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులనుంచి నకిలీ బంగారు నాణేలు, బైక్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పసిడి నాణేల విక్రయాల పెంపుపై దృష్టి
ఎస్బీఐ, ఐసీఐసీఐ, పోస్టాఫీసులతో ఒప్పందాలకు ఎంఎంటీసీ కసరత్తు చండీగఢ్: పసిడి డిపాజిట్ పథకంలో భాగంగా ఉన్న ఇండియన్ గోల్డ్ కాయిన్ల విక్రయ మార్కెటింగ్ నెట్వర్క్ పటిష్టతపై ఎంఎంటీసీ దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇండియా పోస్ట్తో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఎంఎంటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వేద్ ప్రకాశ్ శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, రెండు వారాల్లో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం తక్షణం నాణేల అమ్మకానికి దేశ వ్యాప్తంగా 100 నుంచి 150 బ్రాంచీలు ఖరారయ్యే అవకాశం ఉందని వివరించారు. తరువాత అమ్మకానికి సంబంధించిన బ్రాంచీల పెంపుపై కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం సంస్థ 22 ఔట్లెట్ల ద్వారా ‘ఇండియన్ గోల్డ్’కాయిన్ల రిటైల్ విక్రయాలు నిర్వహిస్తోంది. నాణేల విక్రయానికి పంజాబ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్ కార్పొరేషన్తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు కూడా శుక్రవారం సంస్థ తెలిపింది. 24 క్యారట్ల ప్యూరిటీ ఇండియన్ గోల్డ్ కాయిన్ ఒకవైపు అశోకచక్రను కలిగిఉండగా, మరోవైపు మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించడం జరిగింది. 5, 10, 20 గ్రాముల్లో తొలిదశల్లో ఈ కాయిన్లు లభ్యమవుతున్నాయి. -
ధన్తేరస్కు నాణేల మెరుపులు..
న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్లకు శుభప్రదమైన దినంగా భావించే.. ధన్తేరస్లో వినియోగదారులు పసిడి, వెండి నాణేల కొనుగోళ్లకు అధికంగా మొగ్గుచూపారు. ఆభరణాల కొనుగోళ్లు మందగించాయి. ఆశోకచక్రతో కూడిన నాణేలుసహా పసిడి, వెండి నాణేల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా భారీగా ఉన్నట్లు ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా, ఆభరణాల వర్తకులు తెలిపారు. 10 గ్రాముల వరకూ డిమాండ్ ‘10 గ్రాముల వరకూ పసిడి, వెండి నాణాలకు డిమాండ్ కనబడింది. గత ధన్తేరస్తో పోల్చి 10 గ్రాముల పసిడి ధర రూ.1,000 తక్కువగా ఉన్నా, ఆభరణాల డిమాండ్ భారీగా కనిపించలేదు’ అని బొంబాయి బులియన్ అసోసియేషన్, మాజీ ప్రెసిడెంట్ సురేష్ హూండియా పేర్కొన్నారు. పసిడి, వెండి నాణేలకే అధిక డిమాండ్ కనపడిందని జీజేఎఫ్ చైర్మన్ జీవీ శ్రీధర్ చెప్పారు. మొత్తంగా గత ఏడాది తరహాలోనే ఇంచుమించు కొనుగోళ్ల పరిమాణం ఉంది. తక్కువ ధర ఉండడం కొనుగోళ్లకు ఊపునిచ్చిన పరిణామమని ఆయన పేర్కొన్నారు. ధరల ధోరణి ఇదీ... బొంబాయి బులియన్ స్పాట్ మార్కెట్లో పసిడి ధర 24, 22 క్యారెట్ల ధరలు సోమవారం వరుసగా... రూ.25,950, రూ.25,800గా ఉన్నాయి. ఇక వెండి ధర కేజీ రూ.35,980 పలికింది. ఇంకా తగ్గుతుందనే... 10 గ్రాముల పసిడి ధర రూ.22,000 వరకూ పడిపోతుందన్న ఊహాగానం వల్ల భారీ ఆభరణాలకు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వెరసి పసిడి ఆభరణాల డిమాండ్ 30 శాతం వరకూ పడిపోతుందని భావిస్తున్నా. ఆభరణాలకు ఉన్న డిమాండ్ను నాణాల డిమాండ్ ఈ దఫా దాటిపోయింది. - సంతోష్ శ్రీవాస్తవ, ఎండీ, సన్వీ జ్యూవెల్స్ అశోకచక్ర నాణేలకు డిమాండ్.. పర్వదినం సందర్భంగా కొనుగోళ్ల డిమాండ్ భారీగా ఉంది. అయితే ఆభరణాలకన్నా... పసిడి, వెండి నాణేలకు డిమాండ్ బాగా కనిపించింది. గత ఏడాది ధన్తేరస్తో పోల్చితే 25 శాతం పసిడి నాణేల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. వెండి నాణేల అమ్మకాలు రెట్టింపు కావచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 5వ తేదీన ఆవిష్కరించిన అశోకచక్ర నాణేలకు కూడా డిమాండ్ భారీగా ఉంది. నిజానికి గడచిన కొన్ని రోజుల నుంచే పసిడి, వెండి నాణేలకు డిమాండ్ ఉంది. భారీగా తగ్గిన ధరలే దీనికి కారణం. - విపిన్ రైనా, ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ప్రెసిడెంట్ (మార్కెటింగ్) -
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు లభ్యం
-
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు లభ్యం
పశువుల కాపరుల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇల్లెందు: ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పందెం గ్రామం సమీపంలోని పొలంలో లభ్యమైన శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి బంగారు నాణాలను బయ్యూరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలీస్స్టేషన్లో డీఎస్పీ వీరేశ్వర్రావు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఐదు నెలల క్రితం ధర్మసోత్ సుందర్ అనే రైతు తన పొలంలో దుక్కు లు దున్నిన తర్వాత కురిసిన భారీ వర్షానికి ఇత్తడి బిందె బయట పడింది. పశువులకు కాపలాగా వెళ్లిన పెనక నర్సయ్య, బచ్చలి వెంకన్న, ధర్మసోత్ ధను, ఇస్లావత్ లాల్సింగ్లకు ఈ బిందె లభించింది. అందులోని నాణేలను 10 చొప్పున పంచుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట బయటకు రావడంతో పోలీసులు పశువుల కాపర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అన్ని వివరాలు బయటపడ్డారుు. మొత్తం 40 నాణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. నాణాల తూకం 12 తులాలు ఉంటుందని, వాటిపై దేవనాగరి లిపి ఉందని, రాయల కాలం నాటి నాణేలుగా పురావస్తుశాఖ నిపుణులు తెలిపినట్లు డీఎస్పీ వివరించారు. త్వరలో పురావస్తుశాఖ అధికారులు పరిశీలించి వాటిని మ్యూజియంకు తరలించనున్నట్లు చెప్పారు. -
మలబార్ గోల్డ్లో బంగారు నాణేలు చోరీ
కడప : కడప నగరం కోటిరెడ్డి సర్కిల్లోని మలబార్ గోల్డ్ దుకాణంలో 180 బంగారు నాణేలు చోరీ అయ్యాయి. ఈమేరకు మలబార్ గోల్డ్ మేనేజర్ షంషీర్ బుధవారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 138 గ్రాముల బరువుగల వీటి విలువ 3.5లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. వన్ టౌన్ సీఐ రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు నాణేల దిగుమతులపై ఆంక్షల తొలగింపు
ముంబై: బంగారం నాణేలు, మెడల్స్ దిగుమతులకు సంబంధించి బ్యాంకులు, ట్రేడింగ్ హౌస్లపై ఉన్న ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఎత్తివేసింది. కరెంట్ అకౌంట్ లోటు తీవ్రత నేపథ్యంలో ఆగస్టు 2013లో కేంద్ర బ్యాంక్ బంగారు నాణేలు, మెడల్స్ దిగుమతులపై ఆంక్షలను విధించింది. అప్పట్లో దిగుమతులపై విధించిన ఆంక్షల్లో 80:20 నిబంధన ఒకటి. ఈ నిబంధనను 2014 నవంబర్ 28న కేంద్రం తొలగించింది. దీని ప్రకారం కొత్త లాట్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముందు, అప్పటికే దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తప్పనిసరిగా ఎగుమతి చేయాలి. కాగా ఈ నిబంధన రద్దయినప్పటికీ, నవంబర్ 28ని ముందు దిగుమతి చేసుకున్న బంగారం నిల్వలకు సంబంధించి, ఎగుమతుల నిబంధనను (20% తప్పనిసరిగా ఎగుమతి) ఇప్పటికీ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆర్బీఐ తాజాగా పేర్కొంది. -
డిసెంబర్కల్లా రూ. 24,500కు పసిడి!
ముంబై: డిసెంబర్కల్లా 10 గ్రాముల పసిడి ధర రూ. 24,500కు క్షీణించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేశారు. గడచిన శనివారం(1న) ఎంసీఎక్స్లో ఈ ధర రూ. 26,143గా నమోదైంది. అయితే ఇందుకు డాలరుతో మారకంలో రూపాయి ప్రస్తుతమున్న స్థాయిలో నిలకడగా కొనసాగాల్సి ఉన్నదని వివరించారు. సమీపకాలంలో బంగారం ధరలు మరింత బలహీనపడతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వారం లేదా రెండు వారాల్లో పసిడి ధరలు స్థీరీకరణ(కన్సాలిడేషన్) చెందుతాయని మోతీలాల్ ఓస్వాల్ అసోసియేట్ వైస్ప్రెసిడెంట్(కమోడిటీస్) కిషోర్ నార్నే అభిప్రాయపడ్డారు. డిసెంబర్ మధ్యకల్లా 10 గ్రాముల ధర రూ. 24,500కు దిగివస్తుందని అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్(31.1 గ్రాములు) ధర 1,173 డాలర్ల వద్ద ఉంది. ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్ క్వార్టర్లో అనూహ్య వృద్ధిని సాధించడంతో పసిడి ధరలు బలహీనపడ్డాయని నార్నే పేర్కొన్నారు. క్యూ3లో అమెరికా జీడీపీ 3.5% పురోగమించడంతో అక్కడి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై దృష్టిపెట్టే అవకాశముందని చెప్పారు. తద్వారా ఓవైపు డాలరు మరింత బలపడే అవకాశమున్నట్లే మరోపక్క బంగారం ధరలు పతనమయ్యే చాన్స్ ఉందన్నారు. విదేశీ మార్కెట్లలో ఔన్స్ పుత్తడి ధర డిసెంబర్ చివరికి 1,080-1,120 డాలర్ల స్థాయిలో స్ధిరపడవచ్చునని అంచనా వేశారు. కామ్ట్రెండ్ రీసెర్చ్ డెరైక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ సైతం ఇవే అభిప్రాయాలను వెల్లడించారు. దేశీయంగా డిసెంబర్కల్లా 10 గ్రాముల పసిడి ధర రూ. 25,000-25,500కు చేరొచ్చని అంచనా వేశారు. అయితే ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో విదేశీ మార్కెట్లలో బంగారం ఉత్పత్తి తగ్గితే ధరలు నిలబడే అవకాశముందని చెప్పారు. -
బంగారు నాణేలు స్వాధీనం
చెన్నూర్ : మరుగుదొడ్డి నిర్మాణ తవ్వకాల్లో ఇటీవల కూలీలకు లభ్యమైన 34 బంగారు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ శ్రీనివాస్రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని కోటబోగూడ ప్రాంతానికి చెందిన గడుదాసు గట్టయ్య ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం 15 రోజుల క్రితం పట్టణానికి చెందిన కూలీలు పెరుకుల రాజు, సత్యనారాయణ, హరీశ్, గంగన్న, గుంజ్ర రమేశ్ గుంత తవ్వుతుండగా అందులో ఒక డబ్బా కనిపించింది. ఆ డబ్బాను రాజు చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. విషయాన్ని సహచర కూలీలకు చెప్పి అందరూ కలిసి పంచుకున్నారు. ఈ క్రమంలో రాజు గురువారం బంగారు నాణెం అమ్మకానికి తీసుకురాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు చేరుకొని రాజును అదుపులోకి తీసుకొని విచారించగా తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికినట్లు తెలిపాడు. ఇంటి యజమాని గట్టయ్యకు సైతం నాణేల్లో వాటా ఇచ్చామని పేర్కొన్నాడు. ఈ మేరకు రాజు వద్ద ఎనిమిది బంగారు నాణేలు, సత్యనారాయణ, హరీశ్ల వద్ద 24, గంగన్న వద్ద రెండు మొత్తం 34 నాణేలు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. గుంజ్ర రమేశ్, ఇంటి యజమాని గట్టయ్య వద్ద ఉన్న నాణేలనూ త్వరలో స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురు కూలీలు, ఇంటి యజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
సచిన్ బంగారం!
ప్రత్యేక బంగారు నాణేలు విడుదల చేసిన ఈస్టిండియా కంపెనీ లండన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్కు కనకాభిషేకం జరిగింది. అతని ఘనతలను గుర్తు చేస్తూ బ్రిటన్కు చెందిన ఈస్టిండియా కంపెనీ కొత్తగా ప్రత్యేక బంగారు నాణేలను విడుదల చేసింది. ఈ సంస్థ సచిన్ 24 ఏళ్ల కెరీర్ నేపథ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో చేసిన నాణేలు తయారు చేసింది. సచిన్ టెస్టుల సంఖ్యను సూచించే విధంగా ఒక్కో నాణెం 200 గ్రాముల బరువు ఉంది. ఒక్కోటి 12 వేల పౌండ్లు (దాదాపు రూ. 12 లక్షలు) విలువైన 210 నాణేలు మార్కెట్లో ఇప్పుడు అభిమానుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటికి బ్రిటన్ ప్రభుత్వంనుంచి అధికారిక గుర్తింపు, విలువ ఉన్నాయి. నాణెంలో ఒక వైపు సచిన్ బొమ్మ, అతని టెస్టు జెర్సీ నం 187, మాస్టర్ సంతకంతో కూడిన బ్యాట్, స్వస్థలం ముంబైని సూచించే విధంగా ఇండియా గేట్ బొమ్మ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు అని దానిపై రాసి ఉంది. నాణేనికి మరో వైపు బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ బొమ్మ ఉంది. వేర్వేరు కారణాలతో నాణేల విడుదల ఆలస్యమైనా...ఒక దిగ్గజంతో జత కట్టడం సంతోషంగా ఉందని ఈస్టిండియా కంపెనీ సీఈఓ సంజీవ్ మెహతా వెల్లడించారు. -
పచ్చధనం పరవళ్లు
* కోట్లు కుమ్మరిస్తున్న టీడీపీ అభ్యర్థులు * ఓటుకు రూ.1000 చొప్పున పంపిణీ * మిక్సీలు, కుక్కర్లు, గోల్డ్ కాయిన్లూ ఎర * ఏరులై పారుతున్న సారా, మద్యం * ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బృందాల రాక! సాక్షి, కాకినాడ : ఎంతలా ప్రచారం చేసినా తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మడం లేదు. పొర్లుదండాలు పెట్టినా విశ్వసించడం లేదు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిని తప్పించుకోవడానికి చివరకు నోట్ల కట్టలను నమ్ముకుంటున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనేందుకు కోట్లు వెదజల్లుతున్నారు. ఓపక్క మద్యం, నాటుసారా ఏరులై పారిస్తూ, మరోపక్క వివిధ వర్గాలకు గృహోపకరణాలు పంపిణీ చేస్తున్నారు. వన్గ్రామ్ గోల్డ్ కాయిన్లు, వెండి ఆభరణాల పంపిణీ కూడా చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వారి ప్రలోభాల పర్వం కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రజాబలంతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అభ్యర్థులు పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు నుంచే ప్రలోభాలకు తెరతీశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. నోట్ల పంపిణీని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. శుక్రవారం ఈ బృందాలు మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో నాయకులతో సమావేశమైనట్టు సమాచారం. కాగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలతో పాటు ఇంట్లో ఉండే సభ్యులను బట్టి సొమ్ము పంపిణీ చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటే విధిగా ఓట్లు వేస్తారన్న గురి ఉన్న వర్గాలకే పంపిణీ చేస్తున్నా.. నమ్మకం చాలక ‘మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే వేయించా’లంటూ హారతిపై వాగ్దానాలు చేయిస్తున్నారు. పూటకో క్వార్టర్.. ఇక రాత్రుళ్లయితే మద్యంతో పాటు నాటుసారాను విచ్చలవిడిగా పోయిస్తున్నారు. నాయకుల చుట్టూ తిరిగే కార్యకర్తలు, అనుచరులకు రోజూ ఉదయం ఒక క్వార్టర్, సాయంత్రం మరో క్వార్టర్ అందిస్తున్నారు. యువకులకైతే కొన్ని ఎంపిక చేసిన బంక్లలో ఎన్నికలయ్యే వరకు పెట్రోల్ ఉచితంగా పోయిస్తున్నారు. మండపేటలో ఇటీవలే పీఎంపీలు, ఆర్ఎంపీలతో సమావేశమైన టీడీపీ నేతలు వారితో తమ పార్టీకే ఓటు వేసేలా వాగ్దానం చేయించుకొని వన్గ్రామ్ గోల్డ్ కాయిన్లు పంచిపెట్టారు. ముమ్మిడివరంలో డ్వాక్రా సంఘాల యానిమేటర్లు, ఉపాధి మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు హాట్బాక్సులు, మిక్సీలు పంపిణీ చేస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇంటింటికీ చంద్రబాబు, అభ్యర్థుల చిత్రాలు ముద్రించిన విసనకర్రలు పంపిణీ చేస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని బొట్టుబిళ్లలు, చీరలు పంపిణీ చేస్తున్నారు. రామచంద్రపురంలో ఆ పార్టీ అభ్యర్థి కోట్లు కుమ్మరిస్తూ మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. పిఠాపురంలో ఆ పార్టీ అభ్యర్థి ఇంజనీరింగ్ విద్యార్థులను బలవంతంగా ప్రచారంలోకి దింపి, ఇంటింటికీ తిప్పిస్తున్నారు. ఎవరికీ అనుమానం కలగకుండా వారితోనే డబ్బులు, మద్యం పంపిణీ చేయిస్తున్నారని తెలిసింది. పెద్దాపురంలోనూ ఆ పార్టీ అభ్యర్థి ఈ తరహా దిగజారుడు వ్యవహారాలనే నమ్ముకున్నారు. ఇక రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఎంపీ అభ్యర్థులు కోట్లు కుమ్మరిస్తూ ఓటర్లను గంపగుత్తగా కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.500 చొప్పున, మరికొన్ని చోట్ల రూ.1000 నుంచి రూ.2000 చొప్పున పంచుతున్నారు. టీడీపీ ఇలా కోట్లు కుమ్మరిస్తున్నా ఎన్నికల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏదో మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పాయకరావుపేట వద్ద అనుమతి లేకుండా ప్రచార సామగ్రిని తరలిస్తున్న టీడీపీ వాహనాన్ని, డమ్మీ ఈవీఎంలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కె..గంగవరం మండలం ఉండూరులో టీడపీ నాయకుల నుంచి 33 మద్యం కేసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆగ్రా నగరాన్ని ఎవరు నిర్మించారు?
భారతదేశ చరిత్ర 1. ప్రాచీన భారతదేశంలో అత్యధికంగా బంగారు నాణేలు ముద్రించిన రాజవంశం? గుప్తరాజులు 2. హీనయాన బౌద్ధమతశాఖ ఏ దేశాల్లో ప్రాచుర్యం పొందింది? శ్రీలంక, బర్మా, కంబోడియా, చైనా 3. మహాయాన బౌద్ధశాఖకు చెందిన తాత్త్వికులెవరు? నాగార్జునుడు, ఆర్యదేవుడు, అసంగుడు 4. వజ్రయాన బౌద్ధం ఏ శతాబ్దంలో ప్రచారంలోకి వచ్చింది? క్రీ.శ. 7, 8 శతాబ్దాల్లో 5. జైనమత గ్రంథాలను ఏ సదస్సులో ప్రామాణీకరించారు? ఆ సదస్సును ఎక్కడ నిర్వహించారు? మూడో జైనమత సదస్సు క్రీ.శ. 453(వల్లభి)లో జరిగింది 6. శ్వేతాంబర జైనమతం ఎక్కడ బహుళ ప్రజాదరణ పొందింది? మధుర, వల్లభి 7. భారతీయ తాత్త్విక చింతనకు ఆయువు పట్టయిన ‘షడ్దర్శనాలు’ ఏవి? 1. న్యాయ 2. వైశేషిక 3. సాంఖ్య 4. యోగ 5. మీమాంస 6. వేదాంతం 8. పురుషుడు, ప్రకృతి గురించి తెలిపే ‘సాంఖ్యకారిక’ గ్రంథ రచయిత? ఈశ్వర కృష్ణ (క్రీ.శ. 4వ శతాబ్దం) 9. ఇండియన్ నెపోలియన్గా ప్రశంసలందుకున్న గుప్తరాజు? సముద్రగుప్తుడు 10. ‘నీతిసారం’ అనే న్యాయశాస్త్ర గ్రంథ రచయిత? కామందకుడు 11. ప్రసిద్ధ ‘సీ-యూ-కీ’ గ్రంథాన్ని ఎవరు రచించారు? హ్యూయాన్త్సాంగ్ 12. చైనా యాత్రికుడు ‘ఫాహియాన్’ ఏ గుప్తరాజు కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? రెండో చంద్రగుప్తుడు 13. ప్రసిద్ధులైన ‘నవరత్నాలు’ అనే కవి పండితులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? రెండో చంద్రగుప్తుడు 14. ఉపనిషత్తులకు మరో పేరు? వేదాంతాలు 15. ఏ వేదం భారతీయ సంగీత మూలం గురించి వివరిస్తుంది? సామవేదం 16. వేదాంగాలు ఎన్ని? ఆరు 17. బౌద్ధుల పవిత్ర గ్రంథాలు? త్రిపీఠకాలు 18. దక్షిణ కాశీగా పేరొందిన అతి పురాతన, మత విద్యాకేంద్రం? కాంచీపురం 19. ‘బాదామి’ దేనికి ప్రసిద్ధి చెందింది? రాతిని తొలచి చెక్కిన గుహాలయాలు 20. ప్రఖ్యాత త్రిమూర్తి శిల్పం ఎక్కడ ఉంది? ఎలిఫెంటా (మహారాష్ర్ట) 21. ఇటీవల కనుగొన్న ‘బావికొండ బౌద్ధ కేంద్రం’ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం 22. గుప్తుల కాలంలో అధికార భాష? సంస్కృతం 23. భారతదేశ ప్రాచీన పశు వైద్య విజ్ఞాన గ్రంథం ‘హస్తి-ఆయుర్వేదాన్ని’ ఎవరు రచించారు? పాలకాప్యుడు 24. హర్షుడి ఆస్థాన పండితుడు? బాణుడు 25. హర్షుడు రచించిన గ్రంథాలు? రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక 26. హూణులను ఓడించిన గుప్త చక్రవర్తి? స్కంధగుప్తుడు 27. ‘స్వప్న వాసవదత్త’ నాటకకర్త? భానుడు 28. హర్షుని కాలంలో ఏ బౌద్ధమత యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు? హ్యూయాన్త్సాంగ్ 29. ‘కౌముదీ మహోత్సవం’ గ్రంథ రచయిత? వజ్జకుడు 30. హర్షవర్ధనుని రెండో రాజధాని? కనోజ్ 31. అతి ప్రాచీనమైన మూడు సంగమ సదస్సులు ఎక్కడ జరిగాయి? మధురై (తమిళనాడు) 32. అలహాబాద్ ‘ప్రశస్థి’ ఏ గుప్తరాజుకు చెందింది? సముద్రగుప్తుడు 33. బంగారు నాణెంపై ‘వీణవాయిస్తున్నట్లు’ కనిపించే గుప్తరాజెవరు? సముద్రగుప్తుడు 34. ఖగోళ, గణిత శాస్త్రాల్లో, ఎన్నో మౌలిక సమస్యల్ని మొదటిసారిగా ప్రపంచం ముందుకు తీసుకువచ్చిన శాస్త్రవేత్త? ఆర్యభట్టు 35. ‘గుప్తుల శకం’ ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు? మొదటి చంద్రగుప్తుడు. క్రీ.శ. 319-20లో 36. ప్రసిద్ధి గాంచిన ‘తిరుక్కురల్’ తమిళ గ్రంథాన్ని క్రీ.శ. 3వ శతాబ్దంలో ఎవరు రచించారు? తిరువళ్లూర్వార్ 37. కృష్ణ దేవరాయలు ఒరిస్సా గజపతులపై దండయాత్ర చేస్తూ, విజయ స్తంభాన్ని ఎక్కడ ప్రతిష్టించాడు? సింహాచలంలో (విశాఖపట్నం జిల్లా) 38. ఇటలీ యాత్రికుడు ‘నికోల-డి-కోంటీ’ ఏ విజయనగర రాజుకాలంలో విజయనగరం సందర్శించాడు? మొదటి దేవరాయలు 39. ‘ఇనాం’ అంటే? ఉద్యోగులకు జీతం బదులు భూమిని ఇవ్వడం 40. పల్లవుల అధికార భాష? సంస్కృతం 41. ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథ, భువనేశ్వర లింగరాజ ఆలయాలను ఎవరు నిర్మించారు? అనంతవర్మ చోడగాంగరాజు 42. అశోకుని ధర్మ ప్రబోధాలు ప్రాచీన భారతదేశంలో ఏ విధంగా ప్రచారం పొందాయి? శిలాశాసనాల ద్వారా 43. ఉత్తర భారతదేశ ‘నాగర దేవాలయ’ నిర్మాణ వాస్తుశైలి ప్రత్యేకంగా ఎక్కడ కనిపిస్తుంది? ఖజురహో దేవాలయాలు (మధ్యప్రదేశ్), భువనేశ్వర ఆలయాలు (ఒడిశా) 44. స్థానిక స్వపరిపాలన గురించి వివరించే ఉత్తర మేరూర శాసనాన్ని ఏ రాజు వేయించాడు? పరాంతక చోళుడు 45. ఒరిస్సా గజపతుల రాజ్యస్థాపకుడు? కపిలేంద్రుడు 46. ఆగ్రా నగరాన్ని ఎవరు నిర్మించారు? సికిందర్ లోడీ 47. మధురైలో పాండరాజులు నిర్మించిన ‘మీనాక్షి దేవాలయం’ ఏ దేవతకు సంబంధించింది? పార్వతీదేవి 48. మౌంట్ అబూ వద్ద నిర్మించిన ‘జైన దిల్వారా’ దేవాలయాలను ఏ రాజులు నిర్మించారు? విమల, తేజపాలుడు, సిద్ధరాజు 49. ప్రసిద్ధిగాంచిన రోమన్ వర్తక స్థావరం తమిళనాడులో ఏ ప్రాంతంలో ఉంది? అరికమేడు 50. పవిత్ర ‘గాయత్రీమంత్రం’ ప్రస్థావన ఏ వేదంలో ఉంది? రుగ్వేదం 51. ‘గోత్ర’ అనే పదాన్ని ఏ వేదంలో ప్రస్థావించారు? అధర్వణ వేదం 52. వేదకాలం నాటి సాహిత్యాల వరుస క్రమం? సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు 53. కర్మమార్గాన్ని సమర్ధించిన ‘పూర్వ మీమాంస’ వాదాన్ని ప్రతిపాదించినవారు? జైమినీ మహర్షి 54. ‘జ్ఞాన మార్గాన్ని’ సమర్థించిన ‘ఉత్తర మీ మాంస’ వాదానికి మూలపురుషుడు? బాదనారాయణుడు 55. ‘ఇహం, సత్యం, పరం’ మిథ్య అని ప్రతిపాదించిన వారిని ఏమని పిలుస్తారు? లోకాయుత వాదం (చార్వాకులు) 56. జైనమతంలో ‘ఇరవై మూడో తీర్థంకరుడు ఎవరు? అతని చిహ్నం ఏది? పార్శ్వనాథుడు (సర్పం చిహ్నం) 57. 300 ప్రాంతంలో పాటలీపుట్రలో జరిగిన మొదటి జైన సమావేశానికి అధ్యక్షుడెవరు? స్థూలభద్రుడు 58. జైనమత ‘కల్పసూత్రాలు’ ఎవరు రచించాడు? భద్రబాహుడు 59. జైనమతస్థులు పూజించే స్త్రీ దేవత పేరేమిటి? విద్యాదేవి 60. బౌద్ధమత వాస్తులో ‘చైత్య గృహాలు’ దేన్ని సూచిస్తాయి? ప్రార్థన మందిరాలు 61. . 483లో గౌతమ బుద్ధుడు ఎక్కడ నిర్యాణం పొందాడు? కుశీనగరం (ఉత్తరప్రదేశ్) 62. అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు? బుద్ధచరితం, సౌందర నందనం, సారిపుత్ర ప్రకరణం 63. {Mీ.శ. 1వ శతాబ్దంలో కాశ్మీరులోని కుందలవనంలో 4వ బౌద్ధ సదస్సును (సంగీతి) ఏ రాజు నిర్వహించాడు? దానికి అధ్యక్షుడు ఎవరు? కుప్రాణురాజు కనిష్కుడు, వసుమిత్రుడు (అధ్యక్షుడు) 64. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం? భట్టిప్రోలు (గుంటూరు జిల్లా) 65. ‘జాతక కథలు’ అంటే ఏమిటి? బుద్ధుడి పూర్వ జన్మ వృత్తాంతాన్ని వివరించే కథలు 66. తమిళ ఇతిహాసమైన ‘శిలప్పాధికారం’ గ్రంథ రచయిత? ఇలంగో అడిగళ్ 67. ‘ధర్మచక్ర ప్రవర్తనం’ అంటే? బుద్ధుడు మొదటిసారిగా ధర్మాన్ని బోధించడం (సార్నాథ్లో) 68. ‘భాగవత మతశాఖ’ను స్థాపించినవారు? వాసుదేవ కృష్ణుడు 69. ‘సంగం’ అంటే? పండితుల పరిషత్తు 70. ‘తొల్కాకప్పీయం’ రచయిత? తొల్కాకప్పీయర్ 71. జైన మహావీరుడి జన్మస్థలం? కుందగ్రామం 72. బౌద్ధమత ‘మాధ్యమిక తత్త్వ’ సిద్ధాంతకర్త ఎవరు? ఆచార్య నాగార్జునుడు 73. వర్ధమాన మహావీరుడు తన బోధనలను ఏ భాషలో బోధించాడు? అర్థమాగధి 74. మౌర్యుల కాలంలో పరిపాలనా భాష? ప్రాకృతం 75. అశోకుడి కాలంలో పాటలీపుత్రలో జరిగిన మూడో బౌద్ధమత సదస్సుకు అధ్యక్షుడు? మొగ్గలి పుత్త తిస్యుడు 76. ‘ముద్రారాక్షసం’ గ్రంథకర్త? విశాఖదత్తుడు 77. సింధునాగరికత ప్రజలకు ‘ఏ లోహం’ తెలియదు? ఇనుము 78. మౌర్యుల తర్వాత ‘పాటలీపుత్ర’ సింహాసనాన్ని అధిష్టించినవారు? శుంగులు 79. అశోకుడి కాలంలో రెండో బౌద్ధమత సంగీతి’ సదస్సును ఎక్కడ నిర్వహించారు? వైశాలి 80. అజాత శత్రువు కాలంలో నిర్వహించిన మొదటి బౌద్ధమత సదస్సుకు అధ్యక్షుడు ఎవరు? మహాకశ్యపుడు 81. జైన మహావీరుడు ఏ నది ఒడ్డున కైవల్యం పొందాడు? రిజుపాలిక 82. ‘మణిమేఖలై’ గ్రంథకర్త? సిత్త లై సత్తనార్ 83. బౌద్ధ మత సాహిత్యం ఏ భాషలో రాశారు? పాళీభాషలో 84. మగధ తొలి రాజధాని? గిరివ్రజం 85. చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడు? శ్రావణ బెళగొల (కర్ణాటక) -
పసిడిపై మోజు వల్ల ఎన్ని తిప్పలు!
దేశంలోకి బంగారం దిగుమతులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. దిగుమతి సుంకాన్ని పెంచారు. ప్రయోజనంలేదు. ఇప్పుడు మళ్లీ పెంచారు. బంగారం, వెండి ఆభరణాల దిగుమతి సుంకం ప్రస్తుత 10 శాతంగా ఉంది. దానిని 15 శాతానికి పెంచారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆభరణాల విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బంగారు ఆభరణాలపై రుణ నిబంధనలనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠినతరం చేసింది. ఈ చర్యల ద్వారా ఫలితాలు కనిపించే అవకాశాలు తక్కువ. బంగారానికి మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తరతరాలుగా బంగారాన్ని నమ్ముకున్న జాతి మనది. దురదృష్టమేమిటంటే మన దేశంలో బంగారం ఉత్పత్తి నామమాత్రమే. మనం కొత్తగా వాడుకునే బంగారం మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పసిడిపై మోజు ఎన్నో తిప్పలు తెస్తోంది. మనవారు వ్యయప్రయాసలకు ఓర్చి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడి డాలర్లు సంపాదించినా, వాటిలో కొంత మొత్తం బంగారం తినేస్తోంది. అంటే పసిడి కోసం ఖర్చయిపోతోంది. ప్రతి ఏటా మన దేశం 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం 50 బిలియన్ డాలర్ల దాకా ఖర్చవుతోంది. ఫలితంగా కరెంట్ అకౌంట్ లోటు విపరీతంగా పెరిగిపోతుంది. కరెంట్ అకౌంట్ తీవ్రలోటుకు గురి చేస్తున్న బంగారం దిగుమతులు తగ్గించడానికి ప్రభుత్వ తీసుకునే చర్యలు ఏవీ సరైన ఫలితాలను ఇవ్వడంలేదు. బంగారం దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నాయి. పైగా విలువైన విదేశీమారక ద్రవ్యం ఖర్చయిపోతుంది. బ్యాంకులు తాము అమ్మిన నాణేలను తిరిగి కొనుగోలు చేయకూడదని ఆర్బిఐ నిబంధన విధించింది. ఈ నాణేలను తిరిగి కొనుగోలు చేస్తే బంగారం దిగుమతులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు కొంతకాలంగా సూచిస్తున్నారు. ప్రభుత్వం గానీ, రిజర్వు బ్యాంకు గానీ ఇతర రకాల ఆంక్షలు విధిస్తున్నాయిగానీ ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. బ్యాంకుల నుంచి కొనుగోలు చేసిన బంగారు నాణేలను తిరిగి బ్యాంకులు కొనుగోలు చేసుందుకు అనుమతించాలని ఎప్పటి నుంచో వినియోగదారులు కూడా కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రజలు బ్యాంకు ద్వారా సులభంగా నాణేలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిని తిరిగి అమ్మడానికి మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటుగా అమ్మడం వల్ల కొన్ని సందర్భాలలో వారు పూర్తి విలువను పొందలేకపోతున్నారు. బ్యాంకులు గనుక నాణేలు కొంటే వినియోగదారుకు అమ్మడం తేలికవుతుంది. వారు పూర్తి విలువను పొందగలుగుతారు. బ్యాంకులు బంగారం దిగుమతుల కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేశంలో నిరుపయోగంగా ఉన్న వేల టన్నుల బంగారం కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ప్రజల దగ్గర 30 వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా. ఇందులో కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు, ఇతర బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయగలిగితే దిగుమతి అవసరాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆర్బిఐ ఆ ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమీ లేదని ఆర్బిఐ స్పష్టం చేసింది. బంగారం దిగుమతులు తగ్గించుకునేందుకు ఈ అంశాన్ని రిజర్వు బ్యాంకు పునరాలోచించవలసి అవసరం ఉంది.