బంగారం ఆభరణాలపై జీఎస్టీ ప్ర‌భావం ఎంత? | gst rate on gold jewellery 2021 in india | Sakshi
Sakshi News home page

బంగారం ఆభరణాలపై జీఎస్టీ ప్ర‌భావం ఎంత?

Published Sun, May 16 2021 8:52 PM | Last Updated on Mon, May 17 2021 10:07 AM

gst rate on gold jewellery 2021 in india - Sakshi

కరోనా రాకముందు అక్షయ తృతీయ వస్తే చాలు ప్రతి ఒక్కరు బంగారం షాపులకు క్యూ కట్టేవారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది మన దేశంలో సంప్రదాయంగా వస్తుంది. ఈ రోజు బంగారం కొంటే శుభం కలుగుతుందని అనేక మంది భావిస్తూ ఉంటారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి బంగారం షాపులకు వెళ్లి కొనే పరిస్థితి మాత్రం లేదు. దేశంలోని చాలా ప్రాంతాలలో కోవిడ్ కారణంగా లాక్ డౌన్ విధించారు. అందుకే ఈ సారి, బంగారం కొనుగోలు చేసేందుకు ఆభరణాల దుకాణాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

కానీ, ఈ సమయంలో అనేక మంది డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో వివిధ ప్లాట్ ఫామ్ ల ద్వారా డిజిటల్ గోల్డ్ ను మనం కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో గోల్డ్ సిక్కా, ఫోన్‌ప్ గోల్డ్, పేటెమ్ గోల్డ్ వంటి సంస్థలు డిజిటల్ గోల్డ్ ను విక్రయిస్తున్నాయి. షాప్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా సులువుగా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై అనేక ఆఫర్లను అందించడంతో వినియోగదారులు కొనుగులపై ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి దేశం భారత్. ఇక్కడ, మనదేశంలో బంగారంపై విధించే జీఎస్టీ అనేక అపోహలు ఉన్నాయి. దాని గురుంచి తెలుసుకునే ముందు ప్రస్తుతం బంగారం ఎన్ని రకాలో తెలుసుకుందాం. 

బంగారం ప్రధానంగా రెండు రకాలు:

  • నాణేలు, బార్లు లేదా బిస్కెట్లు
  • ప్రాసెస్ చేయబడిన బంగారం ఆభరణాలు

బంగారంపై జీఎస్టీ రేటు 3 శాతం. అది బంగారం నాణేలుగా లేదా ఆభరణాలుగా విక్రయించబడిందా అనే దానితో సంబంధం లేకుండా జీఎస్ టీ రేటు అనేది 3 శాతంగా ఉంటుంది. ఇందులో అన్నీ సేవలు కలిపి మొత్తం మీద 3 శాతం జీఎస్ టీ విధిస్తారు కానీ, బయట వస్తున్నట్లు 5 శాతం మాత్రం కాదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ ధృవీకరించిన ప్రకారం బంగారాన్ని ఆభరణాల రూపంలో విక్రయించినప్పుడు, ఛార్జీలు వసూలు చేయడం యాదృచ్ఛికం. బంగారం అమ్మటప్పుడు 3 శాతం రేటు మాత్రమే వర్తిస్తుంది.

జనాభాలో కొంత మంది రెడీమేడ్ రూపంలో ఆభరణాలను కొనడానికి ఇష్టపడరు. కొన్ని ఏళ్ల నుంచి మొత్తం కుటుంబానికి కావాల్సిన ఆభరణాలను తయారుచేసే స్థానిక వ్యాపారుల( బంగారు-స్మిత్) గురుంచి మీకు తెలుసు. ఇలాంటి సందర్భాల్లో, వినియోగదారులు తమకు నచ్చిన ఆభరణాలను తయారు చేయడానికి బంగారు కడ్డీలు/నాణేలు కొని బంగారు స్మిత్‌కు ఇస్తారు. ఇది ఒక సాధారణ ఉద్యోగ పని లావాదేవీ లాంటిది. ఇప్పుడు వారు కనుక జీఎస్టీ క్రింద నమోదు చేయబడితే అప్పుడు అతను మీ బంగారం నుంచి ఆభరణాలను తయారు చేయడానికి 5% జీఎస్టీ వసూలు చేస్తాడు. 

అలాగే, మరికొందరు పాత బంగారు ఆభరణాలను అమ్మేసి క్రొత్తదాన్ని కొనడం లేదా కొన్నిసార్లు డబ్బు కోసం మార్పిడి చేయడం వంటివి మన దేశంలో సర్వ సాధారణం. అయితే ఇలాంటి బంగారం ఆభరణాల లావాదేవీల మీద ఎటువంటి జీఎస్టీ ప్రభావం ఉండదు అని గుర్తుంచుకోవాలి. అలాగే దేశంలో బంగారు ఆభరణాలను కొనడం, అమ్మడం వంటి వ్యాపారం చేసే సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటిలో డ్రగ్ గోల్డ్, అట్టిక గోల్డ్ వంటి కంపెనీలు చాలా ప్రసిద్ధమైనవి. ఇలాంటి వాటి విషయంలో కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం జీఎస్టీ విధించబడుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అక్షయ తృతీయ వంటి సమయాలలో ఎటువంటి సందేహం లేకుండా బంగారు దుకాణాల వద్ద, డిజిటల్ గోల్డ్ ద్వారా బంగారం కొనుగోలు చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement