సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ఎట్హోం కార్యక్రమం నిర్వహించారు. శీతాకాల విడిది కోసం ఈ నెల 21న నగరానికి వచ్చిన రాష్ట్రపతి సోమవారం ఢిల్లీకి తిరిగి పయనం కానున్నారు. పర్యటన ముగింపు సందర్భంగా ఆయన నిర్వహించిన ఎట్హోం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు. అతిథుల రాకతో రాష్ట్రపతి నిలయంలో సందడి నెలకొంది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కరచాలనం చేస్తున్న తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్. చిత్రంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్
రాష్ట్రపతి నిలయంలో సందడి
Published Mon, Dec 24 2018 2:00 AM | Last Updated on Mon, Dec 24 2018 2:00 AM
Advertisement
Related news by tags
-
రెండు సినిమాల మధ్య మొదలైన క్రికెట్ యుద్ధం
టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్లో సరికొత్త ప్లాన్తో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 'ఆయ్' సినిమాతో పాటు కమిటీ కుర్రోళ్ళు చిత్రాలు ఆగష్టులోనే విడుదల కానున్నాయి. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యులు క్రికెట్లో పోటీ పడ్డారు.ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న 'ఆయ్' సినిమాకు బన్నీ వాస్ నిర్మాతగా ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి నిర్మాతగా నిహారిక కొణిదెల ఉన్నారు. అయితే, వీరిద్దరూ రెండు జట్లగా ఏర్పడి క్రికెట్ పోటీకి సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు టీమ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్కు సంబంధించి బన్నీ వాస్, నిహారిక కొణిదెల మధ్య జరిగిన సరదా చాలెంజ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బన్నీ వాస్ విసిరిన చాలెంజ్ను నిహారిక కొణిదెల స్వీకరించారు. కచ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ కమిటీ కుర్రోళ్ళు టీమ్ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.జూలై 19న సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఈ రెండు సినిమాలు గోదావరి బ్యాక్ డ్రాప్తోనే తెరకెక్కాయి. క్రికెట్, మూవీ లవర్స్ను ఈ మ్యాచ్ ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.ఆయ్ సినిమా గురించిఫన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకోనుంది ఆయ్ చిత్రం. నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తదితరులు ఇందులో ప్రధాన తారాగణంగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు.కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించినిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్షకుల హృదయాలను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమా కూడా ఆగష్టులోనే రిలీజ్ కానుంది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఐశ్వర్య రచిరాజు, మణికాంత పరుశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్ట తదితరులు సినిమాలో నటించారు. యదు వంశీ దరక్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
పవన్ కుమార్ కొత్తూరి, స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ సినిమాతో పవన్ కుమార్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు. ‘సారా సారా’ అంటూ సాగే ఓ మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటకు శివకృష్ణచారి ఎర్రోజు లిరిక్స్ అందించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ సినిమాలో ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి కీలక పాత్రలు పోషించారు. -
'తంగలాన్' విడదలపై ప్రకటన.. రెండు తెలుగు సినిమాలతో పోటీ
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తంగలాన్' విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది. విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి కేఈ జ్ఞానవేల్రాజా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగష్టు 15న తంగలాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బంగారం కోసం అన్వేషణ అందుకోసం జరుగుతున్న పోరాటం ఆసక్తి కలిగించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తంగలాన్లో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు.తంగలాన్ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ ను బ్రిటీష్ వాళ్ల నుంచి తంగలాన్ అనే ఒక తెగ ఎలా కాపాడుకున్నదో ఈ చిత్రంలో చూపించనున్నారు. 19వ శతాబ్దంలో జరిగిన ఘటనలను ఈ సినిమాలో మేకర్స్ చూపించనున్నారు. ఈ మూవీలో విక్రమ్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విక్రమ్ ప్రయోగాత్మక లుక్లో కనిపించనున్నారు.తంగలాన్కు పోటీగా ఆగష్టు 15న రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. రామ్ పోతినేని, పూరీల డబల్ ఇస్మార్ట్ అందరి కంటే ముందుగా ఆగస్టు 15న విడుదల అని తెలియచేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరో పెద్ద సినిమా మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియాల MR. బచ్చన్ ఆగస్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తోంది. -
సోనూ సూద్ను సాయం కోరిన ఏపీ విద్యార్థి.. ఆయన ఏమన్నారంటే?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతి సినిమాతో టాలీవుడ్లో తనదైన ముద్రవేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన జులాయి మూవీతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. అయితే సోనూ సూద్ తెరపై మాత్రమే కాదు.. అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఆయన.. సమాజ సేవలో ఎప్పుడు ముందుంటారు. గతంలో చాలామంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు. సొంతంగా సోనూ ఫౌండేషన్ స్థాపించి సేవలందిస్తున్నారు. చాలామంది పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ అమ్మాయి సోనూ సూద్ను సోషల్ మీడియా ద్వారా సాయం కోరింది. నా చదువుకు హెల్ప్ చేయండి సార్ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు.ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో సోనూ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అంతకుముందు వర్షంలో తడుస్తున్న ఫ్యాన్స్ను అప్యాయంగా పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. I will make sure she gets admission in a college of her choice 🤍👍 https://t.co/uIwQkVwW1M— sonu sood (@SonuSood) July 19, 2024Get ready for your college. Your education won’t stop. 🇮🇳 https://t.co/7HXlgJNQHz— sonu sood (@SonuSood) July 19, 2024 -
విడిపోయినా భర్తతో కలిసే విహారయాత్ర.. నటి ఏమందంటే?
భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా కలిసే ఉన్నామంటోందో బాలీవుడ్ మాజీ జంట. కూతురి కంటే ఏదీ ఎక్కువ కాదంటున్నారు. వారే బుల్లితెర నటి చారు అసోపా.. హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్. చారు-రాజీవ్ 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో జియానా అనే కూతురు పుట్టింది. ఆ మరుసటి ఏడాది ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. గతేడాది విడాకులు తీసుకున్నారు.దూరంగా ఎందుకు పెడతాను?విడిపోయారన్న మాటే కానీ తరచూ కలుసుకుంటూనే ఉన్నారు. కూతురితో కలిసి హాలీడే ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్యే దుబాయ్కు వెళ్లొచ్చారు. దాని గురించి చారు మాట్లాడుతూ.. 'మా ట్రిప్ అద్భుతంగా జరిగింది. జియానా చాలా సంతోషపడిపోయింది. కుటుంబమంతా కలిసి ట్రిప్కు వెళ్లడం ఇదే మొదటిసారి! రాజీవ్.. జియానా తండ్రి. అలాంటప్పుడు నా కూతురికి అతడి కుటుంబాన్ని ఎందుకు దూరంగా ఉంచుతాను? అందుకే అందరం కలిసే వెళ్లాం. అన్నీ మర్చిపోయిరాజీవ్ అమ్మ సుష్మిత అంటే కూడా నాకిష్టం. రాజీవ్తోనూ హ్యాపీగా ఉన్నాను. విడిపోయినంతమాత్రాన మా బంధాలన్నీ తెగిపోయినట్లు కాదు. జియానాను తన కుటుంబానికి దూరంగా ఉంచాలనుకోవడం లేదు. రాజీవ్, నేను మంచి ఫ్రెండ్స్గా కొనసాగుతున్నాం. జియానా ముందు పాత విషయాలన్నీ మర్చిపోయి స్నేహితులుగా కొనసాగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది?' అని చెప్పుకొచ్చింది.చదవండి: లవ్యూ బేబి అంటూ పందిట్లో కన్నీళ్లు.. రెండునెలలకే అడ్డంగా దొరికిన హీరో
Related News by category
Advertisement
Comments
Please login to add a commentAdd a comment