నేటి నుంచి ‘ఆగ్నేయాసియా’ సదస్సు | Hyderabad is the venue for the Southeast Asian Conference | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘ఆగ్నేయాసియా’ సదస్సు

Mar 18 2019 3:14 AM | Updated on Mar 18 2019 3:14 AM

Hyderabad is the venue for the Southeast Asian Conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆగ్నేయాసియా దేశాల సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ప్రారంభిస్తారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన సివిల్‌ సర్వెంట్లకు ఈ పేమెంట్లు, ఆర్థిక చేకూర్పు, సామాజిక భద్రత అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఎఫ్‌ఓ సంజయ్‌ సక్సేనా, ఆయుష్మాన్‌ భారత్‌ సీఈఓ ఇందూభూషణ్, చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ బి.చంద్రశేఖర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement