‘ఎంట్రీ ట్యాక్స్’ నా దృష్టికి రాలేదు: గవర్నర్ | i do not know about entry tax, says governor narasimhan | Sakshi
Sakshi News home page

‘ఎంట్రీ ట్యాక్స్’ నా దృష్టికి రాలేదు: గవర్నర్

Published Wed, Apr 1 2015 1:38 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

i do not know about entry tax, says governor narasimhan

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదంగా మారిన వాహనాల ప్రవేశ పన్ను విషయం తన దృష్టికి రాలేదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. రాష్ట్రానికి తిరిగివెళ్లాక దానిపై సమీక్షిస్తానని మీడియాకు చెప్పారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై నివేదికలు అందజేశారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అంతకు ముందు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌తో కూడా నరసింహన్ రెండు గంటల పాటు భేటీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement