
నేడు కారెక్కనున్న మరో హస్తం ఎమ్మెల్యే
ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు విఠల్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది.
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు విఠల్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో విఠల్రెడ్డి పార్టీలో చేరనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే విఠల్రెడ్డి. ఆయన కూడా కూడా టీఆర్ఎస్లోకి చేరడంతో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అభివృద్ధి, ఇచ్చిన హామీల అమలుతో తెలంగాణ సీఎం కేసీఆర్ దూసుకు పోతున్నారని అందుకే ఆ పార్టీలో చేరాలను కుంటున్నట్లు విఠల్ రెడ్డి వెల్లడించారు.