మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద గుర్తుతెలియని దుండగులు భక్తులపై కాల్పులు జరిపారు.
మెదక్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద గుర్తుతెలియని దుండగులు భక్తులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఓ కుటంబమే లక్ష్యంగా దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. దుండగులు వాది వద్ద నుంచి 14 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితులు నిజామాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.