హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి ప్రధానకార్యదర్శి కూర రాజన్న తదితరులకు వెంటనే కోర్టులో హాజరుపరచాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూర రాజన్నను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచాలని తమ్మినేని విజ్ఞప్తిచేశారు. వారిపై ఎలాంటి కేసులున్నా చట్టప్రకారం విచారించాలని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.