చౌటుప్పల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఓ విద్యార్థినితో వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పాఠశాలపై దాడిచేసి, సదరు ప్రిన్సిపాల్కు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గణేష్ అనే వ్యక్తి చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్, కరస్పాండెంట్గా పని చేస్తున్నాడు.
కాగా అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో గణేష్ వెకిలిగా ప్రవర్తించాడు. సదరు బాలిక తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దాంతో వారు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్కూలు వద్దకు చేరుకుని గణేష్తో వాగ్వాదానికి దిగారు. అతనికి దేహశుద్ధి చేయటంతోపాటు పాఠశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
విద్యార్థినితో ప్రిన్సిపాల్ వెకిలిచేష్టలు
Published Thu, Jul 16 2015 4:37 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
Advertisement
Advertisement