తెలంగాణ శాసనసభ సోమవారం ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సోమవారం ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసుదనాచారి తిరస్కరించారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దాంతో ఈ అంశాన్ని ప్రశ్నోత్తరాల అనంతరం చర్చిద్దామని స్పీకర్ సూచించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు తమ పట్టువీడకుండా వెల్లోకి దూసుకెళ్లి , పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.